
EPIC Pre Release Event: ఏదో ఓ ముద్దు పెట్టినంత మాత్రానా ఇదేం అడల్ట్ సినిమా కాదు : నాగవంశీ
EPIC Pre Release Event: ఏదో ఓ ముద్దు పెట్టినంత మాత్రానా ఇదేం అడల్ట్ సినిమా కాదు : నాగవంశీ
© 2026 nimisham.in

EPIC Pre Release Event: ఏదో ఓ ముద్దు పెట్టినంత మాత్రానా ఇదేం అడల్ట్ సినిమా కాదు : నాగవంశీ

నేడు కార్తీ సర్దార్ 2 సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఇలా నలుపు తెలుపు చీరలో వచ్చి సందడి చేసింది.

నేడు కార్తీ సర్దార్ 2 సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మాళవిక మోహనన్ ఇలా వైట్ డ్రెస్ లో వచ్చి సందడి చేసింది.

మహేంద్రగిరి వారాహి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. నటి మీనాక్షి గోస్వామి (Minakshi Goswami)ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సుమంత్, ఐశ్వర్య రాజేష్లు నటించిన మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi Pre release event) మూవీ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హీరోలు అక్కినేని అఖిల్, సిద్ధు జొన్నలగడ్డలు హాజరు అయ్యారు.

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన రంభ ఊర్వశి మేనక సినిమా సెప్టెంబర్ 4 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో రంభ ఊర్వశి మేనక పాత్రల్లో నటించిన రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయి మెరిపించారు. ముగ్గురూ ఒకే స్టేజిపై డ్యాన్స్ వేసి అదరగొట్టారు. ఈవెంట్లో ఈ ముగ్గురూ కలర్ ఫుల్ గా సందడి చేశారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి

అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’. యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించారు. సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్ కీలక పాత్రల్లో నటించారు. ఆనంద భారతి, గడ్డం నవీన్, చిట్టిబాబు, గోల్డ్ రెడ్డి ఇతర పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి, దర్శకుడు శ్రీనివాస తేజ ఈ చిత్రం ఘన విజయం సాధించి మూవీ టీమ్కు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుతూ టీమ్కు బెస్ట్ విషెస్ అందించారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ ..‘‘సినీ ఇండస్ట్రీలో గ్లామర్ కంటే టాలెంట్ ముఖ్యమని ఇప్పటికే చాలామంది నిరూపించారు. ఈ సినిమా హీరో శ్రీరామ్లో కూడా మంచి టాలెంట్ ఉంది. డ్యూయెల్ రోల్లో ఆయన పెర్ఫార్మెన్స్ బాగా చేశారు. ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్గా ఉంటుంది. ముఖ్యమంత్రిగా మంచి మెసేజ్ ఇచ్చే పాత్రలో కనిపిస్తాను. దర్శకుడు మైకిల్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. నిర్మాత లక్ష్మణ్ గారు ఇందులో విలన్గా కూడా నటించారు. ఆయన యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇది చాలా మంచి కథ. ట్విస్టులు ఇంటరెస్టింగ్గా ఉంటాయి. కచ్చితంగా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరింతమంది కొత్త నటీనటులు, కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తారు”అని అన్నారు. నిర్మాత అనుముల లక్ష్మణరావు మాట్లాడుతూ..‘‘మా సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తూనే, ఇందులో విలన్ పాత్ర పోషించా. ఫస్టాఫ్లో వైల్డ్ విలన్గా కనిపిస్తా. 20 ఏళ్లు

Panja Re Release: కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోయినా, కాలం గడిచేకొద్దీ వాటికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల విషయంలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లో అలాంటి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సినిమాల్లో ‘పంజా’ కూడా ఒకటి. 2011లో విడుదలైన ఈ యాక్షన్ డ్రామా అప్పట్లో మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ స్టైల్, స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు దాదాపు 15 ఏళ్ల తర్వాత అదే సినిమా మరోసారి థియేటర్లలోకి రావడంతో అభిమానుల సందడి మామూలుగా లేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పంజా’ మూవీని 4Kలో రీమాస్టర్ చేసి థియేటర్లలోకి తీసుకొచ్చారు. తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ మూవీ మంగళవారం రాత్రి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ప్రీమియర్ షోలు నిర్వహించడంతో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ను జై పాత్రలో మరోసారి పెద్ద తెరపై చూసే అవకాశం రావడంతో అభిమానులు థియేటర్లకు భారీగా తరలివచ్చారు. అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే ‘పంజా’ రీ రిలీజ్కు ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యే సమయానికి అన్ని ప్రాంతాలను కలిపి రూ.3 కోట్లకు పైగా ప్రీ సేల్స్ నమోదైనట్లు తెలుస్తోంది. రీ రిలీజ్ సినిమాలకు ఈ రెస్పాన్స్ రావడం అరుదుని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన రీ రిలీజ్ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించే సినిమాగా ‘పంజా’ నిలిచే అవకాశం ఉందనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరో ప్రత్యేకత పవన్ కళ్యాణ్ అభిమానుల సెలబ్రేషన్స్. ఆయన బర్త్ డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు సింగిల్ స్క్రీన్ థియేటర్ల వద్ద అభిమానులు భారీగా సంబరాలు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

థియేటర్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ప్యాకేజ్డ్ మూవీ 'పంజా' జోరు కొనసాగుతూ ఉంది.ఆ ఏరియా, ఈ ఏరియా అని కాకుండా ఆల్ ఏరియాస్ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దర్శనమిస్తున్నాయి. నిన్న ప్రీమియర్స్ ప్రదర్శించడం, అవి కూడా ఫుల్ కావడం కూడా ఒక రికార్డు. డిజాస్టర్ మూవీకి ఈ స్థాయి క్రేజా అని ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన కేవలం 3 గంటల్లోనే హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో 150కి పైగా షోలు పూర్తిగా సోల్డ్ అవుట్ కావడం పవన్ మేనియాకు అద్దం పడుతోంది. నైజాం ఏరియాలో రీ రిలీజ్ మొదటి రోజే 1.2 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ పండితులను సైతం షాక్కి గురిచేసింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 220కి పైగా స్క్రీన్లలో రిలీజవ్వగా ప్రతి థియేటర్ వద్ద 100% ఆక్యుపెన్సీ నమోదు కావడం గమనార్హం. ఈ రీ-రిలీజ్ హంగామా కేవలం థియేటర్ల లోపలే కాదు, బైట కూడా జాతరను తలపిస్తోంది. అభిమానులు బ్యానర్లు, కటౌట్లు, పాలాభిషేకాలు మరియు బాణసంచా కాల్పులతో థియేటర్ కాంప్లెక్స్లను పండగ వాతావరణంగా మార్చేశారు. ‘పాప రాయుడు’ పవర్ ఫుల్ సీన్స్, ఇంటర్వెల్ ఫైట్ అండ్ మేజర్ క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ వస్తున్నప్పుడు థియేటర్లలో ఆడియెన్స్ చేస్తున్న విజిల్స్, కేకలతో హాల్స్ దద్దరిల్లుతున్నాయి. కాలం మారినా, ఏళ్లు గడిచినా 'జై' రోల్ లో పవన్ ప్రదర్శించిన రోల్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుందని చెప్పడానికి రీ రిలీజ్ ఒక ఉదాహరణ. 2011 డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్ల భారీ బడ్జెట్తో విడుదలైన ‘పంజా’, అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రూ. 28 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆశించిన స్థాయిలో వాణిజ్య విజయం సాధించలేకపోయింది. అయితే, కాలక్రమేణా ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా స్టైలిష్ విజువల్స్, యువన్ శంకర్ రాజా అందించిన ఐకానిక్

నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన మలయాళ బ్లాక్బస్టర్ రొమాంటిక్ కామెడీ సినిమా ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ (Bethlehem Kudumba Unit) తెలుగులో సెప్టెంబర్ 4, 2026న విడుదలవుతోంది. మైత్రీ మూవీమేకర్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు) నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు) వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..! దిగొచ్చిన గోల్డ్ భారీగా తగ్గిన బంగారం.. వెండి లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన దృశ్య కావ్యం 'కల్కి 2898 AD' బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైథలాజికల్ సోషియో ఫాంటసీ కథాంశంతో వచ్చి విమర్శకుల ప్రశంసలతో పాటు వేల కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు సీక్వెల్గా 'కల్కి 2' రాబోతోంది. అయితే, ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ షూటింగ్ అప్డేట్పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లోనూ, నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫాంటసీ థ్రిల్లర్ 'ఐయామ్ గేమ్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు నాగ్ అశ్విన్కు 'కల్కి 2' షూటింగ్ గురించి యాంకర్ సుమ నుండి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన ఎంతో చమత్కారంగా, నిజాయితీగా స్పందిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. 'కల్కి 2' సినిమాకు సంబంధించి ఇప్పటివరకు కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తయిందని నాగ్ అశ్విన్ తెలిపారు. మళ్లీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనేది ప్రస్తుతం తనకు కూడా ఒక 'బర్నింగ్ క్వశ్చన్' అని నవ్వుతూ చెప్పారు. "గ్రహాలన్నీ ఒక వరుసలోకి వచ్చి ఓ రౌండ్ కూడా తిరిగేశాయి.. మళ్లీ అవన్నీ సరైన స్థానానికి వచ్చినప్పుడు షూటింగ్ ప్రారంభమవుతుంది" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టుల షూటింగ్స్తో బిజీగా ఉన్నారని, ఆయన డేట్స్ ఖాళీ అయ్యి ఫ్రీ అయిన వెంటనే 'కల్కి 2' చిత్రీకరణను సుదీర్ఘమైన షెడ్యూల్తో లాంగ్ స్ట్రెచ్లో పూర్తి చేస్తామని నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. అలాగే సెప్టెంబర్ 3న విడుదల కానున్న దుల్కర్ సల్మాన్ 'ఐయామ్ గేమ్' మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుందని, ప్రేక్షకులను ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుందని చిత్ర యూనిట్కు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ బేస్ తెలిసిందే. సదరు ఫ్యాన్ బేస్ యొక్క ప్రకంపనలు వరల్డ్ వైడ్ గా 'వైఫె' లా తిరుగుతూనే ఉంటాయి. రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రేపు పవన్ స్టైలిస్ట్ మూవీలో ఒకటైన 'పంజా' 4K వెర్షన్లో భారీ స్థాయిలో రీ రిలీజ్ కాబోతుంది. ఎప్పడు లేని విధంగా ఈ రోజు నైట్ ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మహారాష్ట్రలోని పూణే నగరంలో కూడా ఈ రోజు ప్రీమియర్ ప్రదర్శిస్తుండటం, టికెట్స్ అన్ని అయిపోవడం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తుంది. పూణేలోని ప్రధాన థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి, బాణాసంచా కాల్చుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఐటీ నిపుణులు, విద్యార్థులు పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుని థియేటర్లను హౌస్ఫుల్ చేస్తుండటంతో మహారాష్ట్ర బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో మరోసారి రుజువవుతోంది. దాదాపు 15 ఏళ్ల క్రితం నాటి సినిమా కూడా రీ-రిలీజ్ వేళ కొత్త సినిమాను తలపించేలా పూణే నగర వీధుల్లో మారుమోగిపోతుండటం పవర్ స్టార్కి ఉన్న తిరుగులేని మాస్ ఫాలోయింగ్కి సజీవ నిదర్శనం తెలుగు స్టేట్స్ లాగానే రీ రిలీజ్ ఈ స్థాయిలో వేడుకలా మారడం కూడా నిజంగానే ఒక అరుదైన విషయం. మరి ఈ నేపథ్యంలో తొలి రోజు ఏ మేర కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి. 2011 డిసెంబర్ 9న కోలీవుడ్ దర్శకుడు విష్ణువర్ధన్ మేకింగ్లో 33 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా అప్పట్లోనే సరికొత్త స్టైలిష్ గ్యాంగ్స్టర్ లుక్తో అభిమానులను అలరించింది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, దాదాపు 40 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆంధ్ర, నైజాం ప్రాంతాల్లోనే 15.86 కోట్ల షేర్ రాబట్టగా, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.50 కోట్లు, ఓవర్సీస్లో 1.75

సుమన్త్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం మహేంద్రగిరి వారాహి విడుదల తేదీ మరియు ప్రీరిలీజ్ ఈవెంట్ వివరాలు అధికారికంగా ఖరారయ్యాయి. ఈ భక్తిరస మిస్టరీ థ్రిల్లర్ మూవీ ప్రీరిలీజ్ వేడుకను సెప్టెంబర్ 6న అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు. అనంతరం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దివ్య దృశ్యాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉండాలని చిత్ర బృందం స్పష్టం చేసింది. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక వినూత్నమైన డివోషనల్ మిస్టరీ కథాంశాన్ని ఎంచుకున్నారు. కథ ప్రకారం 150 ఏళ్ల నాటి ఒక రాజకుటుంబపు శాపం మరియు వారాహి అమ్మవారి శక్తి చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. సుమన్త్ ఇందులో ఒక నమ్మకం లేని ఇన్వెస్టిగేటర్ మరియు ఆర్కియాలజిస్ట్ పాత్రలో కనిపిస్తూ ఈ శాపం వెనుక ఉన్న రహస్యాలను చేధించడానికి ప్రయత్నిస్తారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ మరియు బ్రిడ్జ్ ఫిల్మ్స్ పతాకాలపై మధు కలిపు మరియు లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలోని ప్రధాన తారాగణం మరియు సాంకేతిక నిపుణుల వివరాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. వారాహి మాత పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి గోస్వామి మరియు మాళవిక నాయర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో పాటు హీరో సిద్ధూ జొన్నలగడ్డ ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన మెరుపు పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ మరియు రాజీవ్ కనకాల వంటి ప్రముఖ నటులు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే చాలా భిన్నంగా మరియు ఆకట్టుకునేలా సాగుతున్నాయి. చిత్ర యూనిట్ ఆలయ సందర్శనలు చేయడం మరియు థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించడం ద్వారా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫలితంగా ట్రైలర్ హైప్ మరియు వినూత్న ప్రమోషన్లతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో తెలుగు ఆడియెన్స్ గురించి దుల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ (I am Game). మెగా బ్లాక్బస్టర్ ‘లోకా చాప్టర్ 1: చంద్ర’ తర్వాత వే ఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్పై వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘RDX’ ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోగా, ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ 3న గ్రాండ్గా విడుదల చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్కు విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ‘‘నా ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కిన అత్యంత భారీ చిత్రమిది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలతో మాట్లాడినప్పుడు కూడా ఇది ఒక పెద్ద స్ట్రెయిట్ తెలుగు సినిమా లాగే ఉందని వారు ప్రశంసించారు. ట్రైలర్లో సినిమాలోని అన్ని అంశాలను చూపించలేదు.. థియేటర్లలో చూసినప్పుడు ఇందులో ఉండే ఒక ప్రత్యేకమైన ఎలిమెంట్ మీ అందరినీ తప్పకుండా సర్ప్రైజ్ చేసి విపరీతంగా ఎంటర్టైన్ చేస్తుంది. తెలుగు ప్రేక్షకులు సినిమాను ప్రేమించే విధానం, హీరోలను ఆదరించే తీరు మాటల్లో చెప్పలేనిది. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి.. ఏ స్టార్ పేరు చెప్పినా.. ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్స్ మ్యాజికల్గా ఉంటుంది. ఇతర భాషల నుంచి వచ్చిన నన్ను కూడా మీ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ సినిమాకు నేనే స్వయంగా తెలుగులో డబ్బింగ్

తమిళ సినీ పరిశ్రమలో థియేటర్, ఓటీటీ వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో సెప్టెంబర్ 1 నుంచి కార్యకలాపాలు స్తంభించనున్నాయి. కొత్త తమిళ సినిమాల విడుదలలు పూర్తిగా నిలిపివేయడంతో పాటు షూటింగ్లు, నిర్మాణానంతర పనులు కూడా ఆపాలని నిర్మాతల సంఘాలు ప్రకటించాయి. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ కీలక ప్రకటన చేశాయి. ఆగస్టు 22న చెన్నైలోని సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చాయి. దీంతో సెప్టెంబర్ ప్రారంభం నుంచే తమిళ సినీ పరిశ్రమ కార్యకలాపాలపై పెను ప్రభావం పడే పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదానికి ప్రధాన కారణం థియేటర్లలో విడుదలైన సినిమాలకు 8 వారాల ఓటీటీ గడువు తప్పనిసరి చేయాలన్న డిమాండ్. తమిళనాడు థియేటర్ యజమానుల సంఘం, డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ ఈ నిబంధనను సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించాయి. సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత 8 వారాలు పూర్తయ్యే వరకు ఓటీటీలో విడుదల చేయబోమని నిర్మాతలు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరుతున్నాయి. అలాంటి హామీ ఇచ్చిన సినిమాలను మాత్రమే థియేటర్లలో ప్రదర్శిస్తామని స్పష్టం చేశాయి. నిర్మాతలను సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ నిబంధన విధించడాన్ని నిర్మాతల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ సినిమాల విడుదలలు నిలిపివేయడం ద్వారా తమ అభ్యంతరాన్ని తెలియజేయాలని నిర్ణయించాయి. నిర్మాతల వాదన ప్రకారం తమిళనాడులో ప్రతి సంవత్సరం 250కి పైగా సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. వాటిలో అత్యధిక చిత్రాలు ఆశించిన ఆదాయం సాధించలేక నిర్మాతలకు ఆర్థిక నష్టాలను మిగులుస్తున్నాయని వారు చెబుతున్నారు. దీంతో పెట్టుబడిని తిరిగి పొందడంలో ఓటీటీ హక్కులు కీలకంగా మారాయని నిర్మాతల సంఘాలు పేర్కొంటున్నాయి. 8 వారాల గడువును తప్పనిసరి చేస్తే ఓటీటీ ఒప్పందాలపై ప్రభావం పడుతుందని వారి వాదన. ఇదిలా ఉండగా, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఇలాంటి ఏకపక్ష నిబంధన లేదని నిర్మాతలు

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఆగస్ట్ 21న విడుదలయ్యేందుకు ఈ చిత్రం సిద్ధమైంది. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’ (Ameer Log). రమణా రెడ్డి సోమ (Director Ramana Reddy Soma) దర్శకత్వం వహించారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా.. ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్గా రిలీజ్ చేయబోతోంది. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రమణా రెడ్డి సోమ మాట్లాడుతూ.. ‘అమీర్ లోగ్’ సినిమాను ఇప్పటికి చాలా సార్లు చూశాం. కచ్చితంగా హిట్టు బొమ్మ అనే ఫీల్నే ఇస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదని చెప్పగలను. అలాంటి ఓ గొప్ప అటెంప్ట్ నేను చేసినందుకు సంతోషంగా ఉంది. ప్రీమియర్లకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే మేం హిట్ కొట్టేశాం, మేం అనుకున్నది సాధించేశామనేది అర్థమైంది. మలయాళంలో తీసినట్టుగా మన దగ్గర రావడం లేదని అంటుంటారు కదా.. ఇకపై హైదరాబాద్ ఎరా స్టార్ట్ అయింది. ఆగస్ట్ 21న నైజాంలో స్టార్ట్ అయ్యే సౌండ్.. అన్ని వుడ్లకు చేరుకుంటుందని అన్నారు. నిర్మాత మాధవి రెడ్డి సోమ మాట్లాడుతూ.. నన్ను ముందు నిలబెట్టి నడిపిస్తోన్న నా భర్త రమణకు థాంక్స్. ఆయనే రైటర్, డైరెక్టర్, నిర్మాతగా అన్నీ పనులు చూసుకున్నారు. ఆయన ఈ ‘అమీర్ లోగ్’ సినిమాను అందమైన పెయింటింగ్గా తీర్చిదిద్దారు. ఈ సినిమా చూసి బయటకు వెళ్లేటప్పుడు ప్రతీ ఒక్కరూ ఏదో ఒక ఎమోషన్ను ఇంటికి తీసుకెళ్తారని తెలిపారు. కో ప్రొడ్యూసర్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. అమెరికా నుంచి రీసెంట్గానే వచ్చాను. అమెరికాలో కూడా

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 21న రీ-రిలీజ్ కావాల్సిన ముఠా మేస్త్రి సినిమా విడుదల వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని త్వరలోనే తెలియచేస్తారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎ. కోదండ రామిరెడ్డి తెరకెక్కించిన సినిమా 'ముఠా మేస్త్రి'. ప్రముఖ నిర్మాతలు కె.సి. శేఖర్ బాబు, శివప్రసాద్ రెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. మీనా, రోజా హీరోయిన్లుగా నటించిన 'ముఠా మేస్త్రి'కి రాజ్ - కోటి సంగీతం అందించారు. 1993 జనవరి 17న విడుదలైన ఈ సినిమా శతదినోత్సవం జరుపుకోవడమే కాకుండా మ్యూజికల్ హిట్ గానూ నిలిచింది. రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకున్న 'ముఠా మేస్త్రి' చిత్రాన్ని చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 21న విడుదల చేయాలని భావించారు. అయితే అనుకున్న విధంగా ఫైనల్ 4కె అవుట్ పుట్ అందకపోవడంతో ఈ సినిమా రీ-రిలీజ్ ను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇప్పటికే విడుదలైన 'ముఠామేస్త్రి' రీ-రిలీజ్ ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని, మరింత భారీగా, మరింత మెరగ్గా, మరితం గ్రాండియర్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. మ్యాడ్ కాంబో.. కార్తీక్ సుబ్బరాజ్తో వరుణ్ తేజ్! రెండో పెళ్లికి సిద్దమైన మొగలిరేకులు సీరియల్ నటి శిరీష

మెగాస్టార్ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. థియేటర్లలో రచ్చ చేద్దాం అని వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్కి బిగ్ షాక్ ఇస్తూ 'ముఠా మేస్త్రి' 4K రీ-రిలీజ్ వాయిదా పడింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ మాస్ బ్లాక్బస్టర్ మూవీ 'ముఠా మేస్త్రి'. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సృష్టించిన సునామీ, ఆ మాస్ మేనియా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ ఆల్టైమ్ క్లాసిక్ను 4K క్వాలిటీలో, అత్యుత్తమ 5.1 ఆడియో సౌండింగ్తో థియేటర్లలోకి మళ్ళీ తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇటీవల విడుదలైన రీ-రిలీజ్ ట్రైలర్కు కూడా మెగా ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో మేస్త్రి మాస్ జాతరను మళ్ళీ రిపీట్ చేసేందుకు అంతా సిద్ధమవుతున్న సమయంలో, మేకర్స్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఈ రీ-రిలీజ్ను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 4K క్వాలిటీ రీ-మాస్టరింగ్ వర్క్కు సంబంధించి ఫైనల్ క్వాలిటీ అవుట్పుట్ రావడంలో సాంకేతిక జాప్యం జరిగిందని మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా మేకర్స్ ఫ్యాన్స్కు ఒక ఎమోషనల్ నోట్ రాశారు. "ముఠా మేస్త్రి అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అది తరతరాల మెగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ఒక పవర్ ఫుల్ మాస్ క్లాసిక్" అని కొనియాడారు. ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా, అభిమానులకు అత్యుత్తమ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, నాణ్యత విషయంలో తాము ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల మెగా అభిమానులు కొంత నిరాశకు గురైనప్పటికీ, చిరంజీవి రేంజ్కి తగ్గట్లుగా ముఠా మేస్త్రి రీ-రిలీజ్ గ్రాండ్గా ఉండబోతోందని మేకర్స్ హామీ ఇచ్చారు. త్వరలోనే రీ-రిలీజ్ చేయడానికి కొత్త తేదీని అధికారికంగా ప్రకటిస్తామని తెలియజేశారు. బిగ్గర్, బెటర్, గ్రాండర్ ఎక్స్పీరియన్స్తో మేస్త్రి మళ్ళీ థియేటర్లలోకి రాబోతున్నాడు

Irumudi : రవితేజ, ప్రియభవాని శంకర్ జంటగా తెరకెక్కిన సినిమా ‘ఇరుముడి’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో డివోషనల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై మరింత హైప్ నెలకొంది. ఇరుముడి సినిమా రేపే ఆగస్టు 21న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అయితే సినిమా మీద హైప్ భారీగానే ఉన్నా రవితేజ గత సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమాకు థియేటరికల్ బిజినెస్ తక్కువగానే జరిగింది. ఇరుముడి సినిమా థియేటరికల్ బిజినెస్ డీటెయిల్స్.. నైజాం – 7 కోట్లు ఆంద్ర – 8 కోట్లు సీడెడ్ – 2.5 కోట్లు రెస్టాఫ్ ఇండియా – 2 కోట్లు ఓవర్సీస్ – 2 కోట్లకు అమ్ముడయినట్టు సమాచారం. ఇరుముడి సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 21.5 కోట్లకు థియేటరికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 45 కోట్లు గ్రాస్ వసూలు చేయాలి. 50 కోట్లు గ్రాస్ వసూలు చేస్తే ఈ సినిమా హిట్ అయినట్టే. ఈ సినిమాకు ఉన్న హైప్, ఈ వారం పెద్ద సినిమాలు ఏమి లేకపోవడం కలిసొచ్చి ఈజీగానే 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. Also See : Irumudi Pre Release Event : రవితేజ ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు.. ఇక ఇరుముడి సినిమాకు ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ అన్ని కలిపి దాదాపు 18 కోట్లకు అమ్ముడయినట్టు సమాచారం. గమనిక : ఈ సమాచారం అంతర్జాలం, పలు సోషల్ మీడియా అకౌంట్స్, పలు టాలీవుడ్ సంస్థల వ్యక్తుల నుంచి సేకరించరించినది. దీనిని 10 టీవీ ధృవీకరించట్లేదు

కింగ్ నాగార్జున ఎవర్గ్రీన్ క్లాసిక్స్లో ఒకటైన ‘గీతాంజలి’ చిత్రం రీ రిలీజ్కు సిద్ధమైంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ క్లాసిక్ లవ్స్టోరీ ఇప్పుడు మరోసారి థియేటర్లలో తన మ్యాజిక్ను చూపించడానికి రాబోతోంది. కింగ్ నాగార్జున (King Nagarjuna) ఎవర్గ్రీన్ క్లాసిక్స్లో ఒకటైన ‘గీతాంజలి’ (Geethanjali 4K) చిత్రం రీ రిలీజ్కు సిద్ధమైంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ క్లాసిక్ లవ్స్టోరీ ఇప్పుడు మరోసారి థియేటర్లలో తన మ్యాజిక్ను చూపించడానికి రాబోతోంది. ఆగస్టు 29న నాగార్జున బర్త్డే (Nagarjuna Birthday Special) సందర్భంగా.. ఒక రోజు ముందుగానే అంటే ఆగస్ట్ 28న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో 4K ఫార్మాట్లో ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ కానుంది. అదే రోజు రక్షాబంధన్ కూడా కావడంతో ఈ రీ-రిలీజ్కు మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఈ రీ రిలీజ్ స్పెషల్ ఏంటంటే.. ఇప్పటి వరకు తెలుగు హీరోల సినిమాలు రీ రిలీజ్ విషయంలో ఒక్క భాషకే పరిమితమవగా.. ‘గీతాంజలి’ మాత్రం తెలుగు, తమిళ రెండు భాషల్లో రిలీజ్ అవుతూ సరికొత్త రికార్డును క్రియేట్ చేయబోతోంది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్పై బూర్లె శివ ప్రసాద్ ఈ ఎవర్గ్రీన్ క్లాసిక్ను లేటెస్ట్ 4K టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘గీతాంజలి’ అంటే.. ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తొచ్చేది అందమైన ప్రేమకథ, మనసును తాకే సంగీతం, అద్భుతమైన విజువల్స్, గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్. మాస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతం ఈ సినిమాకు మరో బలంగా నిలిచి ఈ సినిమాను క్లాసిక్గా మార్చింది. నాగార్జున సరసన గిరిజ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మణిరత్నం తనదైన స్టోరీటెల్లింగ్తో ఒక అందమైన కవితలా తెరకెక్కించారు. కింగ్ నాగార్జునను ఎంతో చార్మింగ్గా, ఎమోషనల్గా చూపించిన ఈ సినిమా ఆయన కెరీర్లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిందంటే అతిశయోక్తి కానే కాదు. ఈసారి 4K ఫార్మాట్లో ఈ సినిమాను చూడటం ఈ రీ-రిలీజ్లో ప్రధాన ఆకర్షణ కానుంది. ఇటీవల వచ్చిన

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ బహుజన చక్రవర్తిగా కీర్తి పొందిన చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి రూపొందించిన యానిమేషన్ మూవీ “సర్దార్ సర్వాయి పాపన్న”. ఈ సినిమాను వి.జి.మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. దీపక్ న్యాతి నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు వహిస్తున్నారు. ఈ యానిమేషన్ మూవీ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – మేము ఆహ్వానించగానే మా కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని ఈ నెల 21న రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని మా ఆర్కే ఫిలింస్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. పన్నుల దోపిడీ నుంచి పేద ప్రజలను కాపాడిన వీరుడు సర్దార్ పాపన్న. బడుగు, వెనకబడిన కులాల వారిని ఒక్కటి చేసి పోరాడం సాగించాడు, 30 కోటలను జయించాడు. గోల్కొండ కోటపై కూడా తిరుగుబాటు చేశాడు. అలాంటి ధీరుడిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. నేను పాతికేళ్ల కిందట సర్వాయి పాపన్న సినిమా రూపొందించాను. అప్పటికి ప్రజల్లో ఆయన గురించి అవగాహన లేదు. ఈ రోజు పల్లె పల్లెనా సర్దార్ పాపన్న విగ్రహాలు ఉన్నాయి. ఆయన చరిత్ర గురించి తెలిసింది. ఆ ధీరుడి నేపథ్యంతో సినిమా రూపొందించిన వెంకటేష్ గౌడ్ ను అభినందిస్తున్నా. సర్దార్ సర్వాయి పాపన్న సినిమాకు పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా అన్నారు. దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్

Toxic Pre Release Event : కెజిఎఫ్ తర్వాత చాలా గ్యాప్ తో యశ్ నుంచి రాబోతున్న ‘టాక్సిక్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. టాక్సిక్ సినిమా ఆగస్టు 26న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ తో హైప్ నెలకొంది. 1980 పీరియాడిక్ లో గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రానుంది. టాక్సిక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఇటీవల బెంగళూరులో ఘనంగా నిర్వహించగా ఇప్పుడు ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగనున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు. యశ్ టాక్సిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఆగస్టు 22 శనివారం నాడు సాయంత్రం 6 గంటల నుంచి జరగనుంది. Also See : Iswarya Menon : ఓనం వచ్చేస్తుంది.. చీరలో ఐశ్వర్య మీనన్.. ఎంత ముద్దుగా ఉందో.. దీంతో యశ్ ని చూడటానికి మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులతో పాటు అభిమానులు కూడా భారీగా హాజరు కాబోతున్నారు. ఇక ఈ సినిమాలో నయనతార, రుక్మిణి వసంత్, తార సుతారియా, హ్యూమా ఖురేషి, కియారా అద్వానీ.. ఇలా అయిదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. యశ్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. It's Time. He's Coming!💥💥💥Hyderabad is about get Intoxicated!❤️🔥#ToxicTheMovie Pre-Release Event📍Malla Reddy University, Hyderabad22nd August | 5 PM Onwards#ToxicOn26thAug KVN Productions (@KvnProductions) August 19, 2026

ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో పాత సినిమాలను తిరిగి థియేటర్లలో ప్రదర్శించే రీరిలీజ్ ట్రెండ్ విపరీతంగా ఊపందుకుంది. హిట్ లేదా ఫ్లాప్ అనే తేడా లేకుండా వరుసగా పాత చిత్రాలు విడుదలవుతున్న ఈ సమయంలో మెగాస్టార్ చిరంజీవి గతంలో రాసిన ఒక లేఖ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుమారు 35 ఏళ్ల క్రితం అంటే 1989-90 కాలంలో రీరిలీజ్ల విషయమై అభిమానులకు ఆయన రాసిన లేఖతో ఈ అంశంపై ఫుల్ క్లారిటీ వచ్చింది. పాత సినిమాలు మళ్లీ రావడం వల్ల హీరో ఇమేజ్ పాడవుతుందన్న అభిమానుల భయాందోళనలకు అప్పట్లోనే ఆయన ఎంతో స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఆ సమయంలో ఏడాదికి నాలుగైదు సినిమాలు మాత్రమే వస్తుండటం, అదే సమయంలో సెకండ్ రన్ మరియు థర్డ్ రన్ పేరిట పాత చిత్రాలు ప్రదర్శితం కావడంపై అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన చిరంజీవి, రుద్రనేత్ర, కొండవీటి దొంగ, లంకేశ్వరుడు వంటి భారీ చిత్రాల నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుందని వివరించారు. ముఖ్యంగా తెరపై రెండు మూడు నిమిషాలు కనిపించే సన్నివేశాల చిత్రీకరణ కోసం 3 నుండి 4 రోజుల పాటు ప్రత్యేక షూటింగ్ పనులు అవసరమవుతాయని ఆ లేఖలో పేర్కొన్నారు. విదేశీ పర్యటనలు మరియు నాటి సినీ పరిశ్రమ సంక్షోభం కూడా కొత్త సినిమాల ఆలస్యానికి కారణాలని తెలిపారు. రీరిలీజ్ అంశంపై మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి, పాత సినిమాలు సెకండ్ రన్ లో ఆడటం వల్ల ఇమేజ్ పెరుగుతుందే తప్ప దెబ్బతినదని విశ్లేషించారు. దీంతో అప్పట్లో సరిగ్గా ఆడని చిత్రాలు కూడా కాలం మారిన తర్వాత కొత్త దృక్పథంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని స్పష్టం చేశారు. 16 ఏళ్ల వయస్సులో తీయించుకున్న ఫోటోను 26 ఏళ్ల వయస్సులో చూసుకుంటే అసహ్యం వేయదని, ఆశ్చర్యం మరియు ఆనందం మాత్రమే కలుగుతాయని ఉదాహరణగా చెప్పారు. ఇదిలా ఉండగా కాలక్రమంలో ప్రేక్షకుల ఆలోచనా విధానం మారడం వల్ల పాత
తెలుగు సినీ పరిశ్రమలో ‘ గీతాంజలి ’ ఒక ట్రెండ్ సెట్టర్. ప్రేమకథా చిత్రాల చరిత్రను ‘గీతాంజలి’కి ముందు, తర్వాత అని విభజించవచ్చంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. రెండు జీవితాల భావోద్వేగాల ప్రయాణాన్ని వెండితెరపై ఒక దృశ్య కావ్యంగా మలిచి, ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత ముద్ర వేసిన ఈ అద్భుత ప్రేమకావ్యం సరికొత్త హంగులతో మరోసారి వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతోంది. అక్కినేని నాగార్జున పుట్టినరోజు(ఆగస్టు 29) కానుకగా ఈ అపురూప చిత్రాన్ని 4K అల్ట్రా హెచ్డీ డిజిటల్ టెక్నాలజీతో ఆగస్టు 28న తెలుగు, తమిళ భాషల్లో రీ రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.* తిరుమలలో నయనతార గుండు కొట్టించుకుందా?లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఏకైక చిత్రంగా ‘గీతాంజలి’ చరిత్రలో నిలిచిపోయింది. 1989లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, అప్పటి ట్రెండ్ను పూర్తిగా మార్చివేసి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చింది. ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతున్న ఇద్దరు వ్యక్తులు అనుకోని పరిస్థితుల్లో పరిచయమై, మిగిలి ఉన్న క్షణాలను ఎంతో ఆనందంగా, స్వచ్ఛమైన ప్రేమతో ఎలా గడిపారనేది ఈ కథలోని అసలు జీవం. విషాద నేపథ్యమున్నా, ఎక్కడా కన్నీళ్లతో కుంగిపోకుండా జీవితాన్ని ఉల్లాసంగా ఎలా ఆస్వాదించాలో చూపించిన విధానం సినీ ప్రేమికులను ఇప్పటికీ కట్టిపడేస్తుంది.ప్రకాష్ అనే సున్నితమైన యువకుడి పాత్రలో నాగార్జున ఒదిగిపోయిన తీరు ఆయన కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచింది. చలాకీతనంతో పాటు లోతైన భావాలను పలికించిన గీతాంజలి పాత్రలో గిరిజ శెట్టర్ నటన అనితరసాధ్యం. వీరిద్దరి మధ్య సాగే చిలిపి సంభాషణలు, కెమిస్ట్రీ సినిమాను అజరామరంగా మార్చేశాయి. ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక బృందం భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమమైనదిగా నిలిచింది. ఇళయరాజా ఆయన స్వరపరిచిన ప్రతి పాట, అందించిన నేపథ్య సంగీతం శ్రోతల మనస్సులలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. పొగమంచు దుప్పట్లు కప్పుకున్న ఊటీ అందాలను, కథలోని మూడ్ను పీసీ శ్రీరామ్ తన కెమెరా ఫ్రేమ్లలో బంధించి ప్రతి దృశ్యాన్ని

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరోసారి థియేటర్లలో మాస్ జాతర మొదలుకానుంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులకు మరోసారి థియేటర్లలో మాస్ జాతర మొదలుకానుంది. చిరంజీవి కెరీర్లో మాస్ ఎంటర్టైనర్గా నిలిచిన ‘ముఠామేస్త్రీ’ (muta mestri) ఇప్పుడు సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వింటేజ్ సినిమాల రీ రిలీజ్లకు వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను 4K వెర్షన్లో రీ రిలీజ్ చేయనున్నారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ముఠామేస్త్రీ’ 1993లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు చిరంజీవి మాస్ ఇమేజ్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. కూలీ నాయకుడిగా మెగాస్టార్ చేసిన పాత్ర, ఆయన మేనరిజమ్స్, యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ డైలాగ్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులో మీనా, రోజా కథానాయికలుగా నటించారు. రాజ్-కోటి అందించిన సంగీతం అప్పట్లో విశేషంగా ఆదరణ పొందింది. పాటల్లో చిరంజీవి డ్యాన్స్, ఆయన ఎనర్జీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులకు అప్పటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసేలా 4K వెర్షన్ను సిద్ధం చేస్తున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందే ఈ సినిమాతో సెలబ్రేషన్స్ మొదలుపెట్టనున్నారు. ఆగస్టు 21న ‘ముఠామేస్త్రీ’ 4K వెర్షన్ను థియేటర్లలో విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ను మంగళవారం విడుదల చేశారు

వెంకటేశ్ గౌడ్ లింగంపల్లి రూపొందించిన యానిమేషన్ మూవీ 'సర్దార్ సర్వాయి పాపన్న' ఈ నెల 21న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించారు. బహుజన చక్రవర్తిగా కీర్తి పొందిన చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి రూపొందించిన యానిమేషన్ మూవీ 'సర్దార్ సర్వాయి పాపన్న'. ఈ సినిమాను వి.జి.మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. దీపక్ న్యాతి నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు వహిస్తున్నారు. ఈ యానిమేషన్ మూవీ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, 'పన్నుల దోపిడీ నుంచి పేద ప్రజలను కాపాడిన వీరుడు సర్దార్ పాపన్న. బడుగు, వెనకబడిన కులాల వారిని ఒక్కటి చేసి పోరాడం సాగించాడు, 30 కోటలను జయించాడు. గోల్కొండ కోటపై కూడా తిరుగుబాటు చేశాడు. అలాంటి ధీరుడిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. నేను పాతికేళ్ల కిందట 'సర్వాయి పాపన్న' సినిమా రూపొందించాను. అప్పటికి ప్రజల్లో ఆయన గురించి అవగాహన లేదు. ఈ రోజు పల్లె పల్లెనా సర్దార్ పాపన్న విగ్రహాలు ఉన్నాయి. ఆయన చరిత్ర గురించి తెలిసింది. ఆ ధీరుడి గురించి సినిమా రూపొందించిన వెంకటేష్ గౌడ్ ను అభినందిస్తున్నాను' అని అన్నారు. దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి మాట్లాడుతూ, 'సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి సందర్భంగా ఈ రోజు మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నాం. పాపన్న గురించి అనేక గ్రంథాల్లో సమాచారం సేకరించి ఈ సినిమాను రూపొందించాను. 'బాహుబలి'లా మా సినిమా కూడా అలాంటి భారీ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇస్తుందని నమ్ముతున్నాం' అని అన్నారు. ఈ

ఈ మధ్య కాలంలో అంటే దగ్గర దగ్గరగా ఒక దశాబ్దం అనుకోండి, ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే పాజిటివ్ వైబ్రేషన్ తెచ్చుకున్న మూవీ ఏదైనా ఉంది అంటే 'ఇరుముడి' అని చెప్పవచ్చు. పైన చెప్పుకునే ఆ మాట పాతది అయిపోయిందంటే సదరు వర్డ్ ఎంతగా అభిమానుల్లో, ప్రేక్షకులో నానుతూ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నెల 21 న రిలీజ్ కి సిద్దమవుతుండటంతో వాళ్ళందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తూ ఉన్నారు. కొంత మంది అయ్యప్ప స్వామి భక్తులైతే ఇరుముడికి చెప్పులు లేకుండా వెళ్తామనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్లంతా ఇరుముడి విషయంలో టెన్షన్ గా ఉన్నారు. ఇటీవల హైదరాబాద్లోని శిల్పకళావేదికలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసింది. సాధారణంగా ఏ సినిమా ప్రమోషన్స్ అయినా పాజిటివ్ వైబ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్తో సాగిపోతుంటాయి, కానీ ఈ వేడుక మాత్రం సరికొత్త రచ్చకు దారితీసింది. రవితేజ, అజయ్ ఘోష్ చేసిన బూతు సంభాషణలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగానే నెటిజన్లు, ముఖ్యంగా రవితేజ అభిమానులు, అయ్యప్ప స్వామి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'ఇరుముడి' అనే పేరుకి అయ్యప్ప స్వామి భక్తుల దృష్టిలో ఎంతో పవిత్రమైన అర్థం ఉంది. సినిమాలో హీరో అయ్యప్ప స్వామి మాల ధరించి, ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. ఇటువంటి పవిత్రమైన సినిమా వేడుకలో, పబ్లిక్ స్టేజ్ మీద వేలాది మంది ప్రేక్షకులు మరియు కుటుంబాలు చూస్తుండగా అలాంటి అసభ్య పదాలను వాడడం సమంజసం కాదని ఫైర్ అవుతున్నారు. ఈ రకమైన అనుచిత సంభాషణలు భవిష్యత్తు ఈవెంట్లలో పునరావృతం కాకూడదని, సినిమా వేదికలపై నటీనటులు క్రమశిక్షణతో మాట్లాడాలనే విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. సినిమాకి మంచి బజ్ వస్తున్న సమయంలో ఈ వివాదం రావడం కొంతమందికి మైలేజ్ ఇచ్చినా, సాంప్రదాయ ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసిందనే అభిప్రాయాలు

సినిమా ఈవెంట్స్లో సెలబ్రిటీలు నోరు జారడం, అసభ్యపదాలను ఉపయోగించడం ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చూశాం. వాటిపై రకరకాల విమర్శలు, చర్చలు కూడా జరిగాయి. సినిమా ఈవెంట్స్లో సెలబ్రిటీలు నోరు జారడం, అసభ్యపదాలను ఉపయోగించడం ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చూశాం. వాటిపై రకరకాల విమర్శలు, చర్చలు కూడా జరిగాయి. తాజాగా ఇలాంటి పరిణామం ‘ఇరుముడి’ (Irumudi) సినిమా ప్రీ రిలీజ్ వేదికగా జరిగింది. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రమిది. ఈ వేడుకలో రవితేజ(Raviteja), అజయ్ ఘోష్ (Ajay Ghosh) చేసిన పదప్రయోగాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అజయ్ ఘోష్ స్పీచ్లో వినిపించిన రెండు అభ్యంతరకరమైన పదాలపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘మాస్ జాతర’ షూటింగ్ టైమ్లో జరిగిన ఓ సరదా సంభాషణను గుర్తు చేసుకుంటూ అక్కడ మాట్లాడుకున్న మాటల్లో రెండు పదాలను ఈ వేదికపై ఫ్లోలో అనేశారు అజయ్ ఘోష్. వేదిక ముందు కూర్చొని ఉన్న రవితేజను ఈ సినిమాలో ఆయనకు కూతురిగా నటించిన నక్షత్ర కొన్ని ప్రశ్నలు అడిగింది. అందులో ఒకటి ‘నాకు నిక్ నేమ్ పెట్టమంటే ఏమని పెడతారు'.. అని అడగగా 'ముదురు ము...' అని రవితేజ నవ్వుతూ అన్నారు. మామూలుగా సినిమా వేడుకల్లో ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ సినిమా టైటిల్ ‘ఇరుముడి’ కావడం, అయ్యప్ప స్వామి భక్తుడి నేపథ్యంలో సాగే కథ కావడంతో చర్చ మొదలైంది. ‘ఇరుముడి’ అనేది అయ్యప్ప భక్తులకు ఎంతో పవిత్రమైన పదం. ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప స్వామి మాలధారణలో కనిపిస్తున్నారు. అంతే కాకుండా చిత్రంలో భక్తి అంశాలతోపాటు తండ్రీకూతుళ్ల అనుబంధం, క్రైమ్ మిస్టరీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కిందని మేకర్స్ ఇప్పటికే చెప్పారు. పవిత్రమైన టైటిల్ పెట్టి, భక్తి ప్రాధాన్యం ఉన్న సినిమా ప్రచార కార్యక్రమంలో ఇలాంటి పదప్రయోగాలు చేయడం ఎంత వరకూ కరెక్ట్ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు అజయ్ ఘోష్

‘ఉప్పెన’తో సంచలన విజయం అందుకుని, ఆ తర్వాత రామ్చరణ్తో ‘పెద్ది’ వంటి భారీ హిట్తో స్టార్ డైరెక్టర్గా మారిన బుచ్చిబాబు సానా, మాస్ మహారాజా రవితేజపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బుచ్చిబాబు, రవితేజతో సినిమా చేయాలనే తన కోరికను బహిరంగంగా వెల్లడించి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ.. "నేను ఇండస్ట్రీకి రాకముందు, ఒక రచయితగా నా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు రాసుకున్న మొట్టమొదటి కథ రవితేజ గారి కోసమే. ఆయన ఎనర్జీని, యాటిట్యూడ్ను దృష్టిలో పెట్టుకుని ఆ స్క్రిప్ట్ సిద్ధం చేశాను. ఇప్పటికీ ఆ కథ నా దగ్గర ఉంది. భవిష్యత్తులో తప్పకుండా ఆ కథను ఆయనకు పూర్తిగా వినిపిస్తాను. రవితేజ గారితో సినిమా చేయాలనేది నా చిరకాల కోరిక" అని అన్నారు. బుచ్చిబాబు మాటలకు అక్కడున్న మాస్ మహారాజా అభిమానులు కేరింతలు, చప్పట్లతో హోరెత్తించారు.సుకుమార్ శిష్యుడిగా తొలి చిత్రం ‘ఉప్పెన’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు, రెండో సినిమా ‘పెద్ది’తో రామ్చరణ్కు కెరీర్లోనే ఒక మైలురాయి లాంటి విజయాన్ని అందించారు. దీంతో టాలీవుడ్లో ఆయన మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా మారారు. ఆయన దర్శకత్వంలో పనిచేసేందుకు అగ్ర హీరోలు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవికి బుచ్చిబాబు ఒక కథ వినిపించారని, ప్రాజెక్ట్ దాదాపు ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో తాను ఎంతో ఇష్టపడే రవితేజతో
రవితేజ , శివ నిర్వాణ కాంబినేషన్లో రూపొందిన డివోషనల్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ‘ఇరుముడి’ ఆగస్టు 21న గ్రాండ్గా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ చేసిన ప్రసంగం సభను ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తడమే కాకుండా, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫ్లోలో ఆయన రవితేజ వ్యక్తిగత ఆస్తులు, ఆయనకున్న ఫిలాసఫీ గురించి బయటపెట్టిన విశేషాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.* చివరి 40 నిమిషాలు సీట్లో కూర్చోలేరు.. ‘ఇరుముడి’పై అంచనాలు పెంచేసిన శివ నిర్వాణశంకరపల్లిలో 26 ఎకరాల మామిడి తోట.. రూ. వందల కోట్ల విలువ!రవితేజ దూరదృష్టిని ప్రస్తావిస్తూ అజయ్ ఘోష్ ఒక ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. గతంలో వారిద్దరూ కలిసి ‘మాస్ జాతర’ షూటింగ్ చేస్తున్న సమయంలో శంకరపల్లి సమీపంలోని ఒక 26 ఎకరాల మామిడి తోటలో రైల్వే స్టేషన్, ఇంటి సెట్స్ వేశారని గుర్తుచేశారు. ఆ తోట రవితేజదేనని, ఎప్పుడో కెరీర్ ప్రారంభంలో కేవలం రూ. 12 లక్షలకు కొనుగోలు చేయగా, ప్రస్తుతం దాని విలువ వందల కోట్లకు చేరిందని వెల్లడించారు. ఈ క్రమంలో రవితేజలోని తాత్విక కోణాన్ని వివరిస్తూ.. ‘‘సెట్లో ఓ వ్యక్తి ఆశ్చర్యపోతూ 'ఈ తోట విలువ ఇప్పుడు వందల కోట్లు అంట కదా సార్' అని అడిగితే.. దానికి రవితేజ చాలా తేలికగా నవ్వుతూ 'ఇవన్నీ ఇక్కడే ఉంటాయి.. మనమే పోతాం. ఇవి ఉన్నాయని సంతోషించాలి కానీ, ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలి' అని బదులిచ్చారట. రవితేజలో కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు, జిడ్డు కృష్ణమూర్తి లాంటి ఒక గొప్ప తాత్వికుడు కూడా కనిపిస్తాడు’’ అని అజయ్ ఘోష్ ప్రశంసించారు.ఇండస్ట్రీ ఎవడబ్బా సొత్తు కాదుపరిశ్రమలో ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా స్వశక్తితో అగ్రస్థానానికి చేరిన చిరంజీవి, రవితేజలను చూసి తాను ఎంతో నేర్చుకున్నానని అజయ్ ఘోష్ పేర్కొన్నారు. రవితేజ హిట్లు, ఫ్లాపులతో

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Irumudi Pre Release Event Speech: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఇరుముడి' ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన 'మల్లెపూల పల్లకి' పాట ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'మల్లెపూల పల్లకి' సాంగ్ అయ్యప్ప భక్తుల్లో అత్యంత ప్రత్యేకమైన స్థానం ఉన్న ఒరిజినల్ 'మల్లెపూల పల్లకి' పాటలోని భక్తి భావాన్ని అలాగే ఉంచుతూ.. 'ఇరుముడి' కోసం సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ దీనికి మోడరన్ మ్యూజికల్ టచ్ ఇచ్చారు. పవర్ఫుల్ బీట్స్, డప్పు రిథమ్స్తో పాటను చాలా ఎనర్జిటిక్గా తీర్చిదిద్దారు. ఒరిజినల్ పాటకు తన వాయిస్తో ప్రాణం పోసిన డప్పు శ్రీను, ఈసారి కూడా తన గాత్రంతో రా, డివోషనల్ ఫీల్ను తీసుకువచ్చారు. అయ్యప్ప స్వామి భక్తుడి గెటప్లో రవితేజ వేసిన మాస్ డ్యాన్స్ మూవ్స్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రముఖుల మాటలు.. ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరో రవితేజ మాట్లాడుతూ.. "ఇది ఒక మంచి ఎమోషనల్ రైడ్. ఇందులో నటించిన ప్రతి ఒక్కరి క్యారెక్టర్ మైండ్లో ఉండిపోతుంది. ముఖ్యంగా సాయికుమార్ గారిని ఒక డిఫరెంట్ వేలో చూస్తారు. బల్లగుద్ది చెబుతున్నా.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆసక్తికరమైన గ్లింప్స్, మెలోడీతో పాటు ఎనర్జిటిక్ సాంగ్స్తో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. ‘ఇరుముడి’లోని భక్తి భావానికి మరింత ఎనర్జీని జోడిస్తూ మేకర్స్ మోస్ట్ అవైటెడ్ ‘మల్లెపూల పల్లకి’ పాటను విడుదల చేశారు. గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో లాంచ్ చేసిన ఈ పాట.. అందరికీ సుపరిచితమైన అయ్యప్ప భక్తి గీతానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చింది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో రవితేజ మాట్లాడుతూ.. “మా ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేష్, ఎడిటర్ ప్రవీణ్ పూడి, డీఓపీ విష్ణు శర్మ ఈ సినిమాను ఎంతో ఓన్ చేసుకుని పనిచేశారు. అందరూ తమ సొంత సినిమా అనుకుని పనిచేశారు. విష్ణు శర్మ ఎక్స్ట్రార్డినరీ కెమెరామెన్. నాకు, శివ నిర్వాణకు తోడుగా తను కూడా పరిగెత్తాడు. ఫెంటాస్టిక్ వర్క్ ఇచ్చాడు. తనతో మళ్లీ పని చేయాలని ఉంది. జీవీ ప్రకాష్ కుమార్ సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఈ సినిమా ఒక మంచి ఎమోషనల్ రైడ్. నేను చెప్పడం కంటే సినిమా చూసిన తర్వాత మీరే చెబుతారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారని అన్నారు. ప్రతి క్యారెక్టర్కు ఇంపార్టెన్స్ ఉంటుంది. స్వాసిక నటన చూస్తే మీకు భయమేస్తుంది. అంత అద్భుతంగా చేసింది. నిజంగా కొన్ని క్యారెక్టర్స్ మీ మైండ్లో ఉండిపోతాయి. ఆగస్టు 21న సినిమా చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. ఇందులో ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో మీరు ఒక డిఫరెంట్ సాయికుమార్ గారిని చూస్తారు. సినిమా గురించి చాలా మాట్లాడుకుంటారు. జీవీ ప్రకాష్ బ్రహ్మాండమైన పాటలు ఇచ్చారు. నక్షత్ర ఫ్యూచర్లో

మెగాస్టార్ సూపర్ హిట్ చిత్రాల్లో శంకర్దాదా ఎంబీబీఎస్ ఒకటి. ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేసింది. లింగం మామయ్యా అంటూ చిరు చేసిన కామెడీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి ఈ మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. చిరు పుట్టినరోజు కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శంకర్దాదా ఎంబీబీఎస్ రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ మూవీకి జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించారు. 2004లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మరోసారి ఫ్యాన్స్ను అలరించేందుకు వస్తోంది. ఈ మూవీలో చిరంజీవి సరసన సోనాలి బింద్రే హీరోయిన్గా మెప్పించింది. ఈ చిత్రంలో శ్రీకాంత్, వేణు మాధవ్ కీలక పాత్రల్లో నటించారు. ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) ‘వణక్కం జెన్జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే (ఫొటోలు) హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బర్త్ డే వైబ్స్.. ఫోటోలు 'డార్క్ చాక్లెట్' సినిమా మొదటి పాట లాంచ్ (ఫొటోలు) బాక్ల్ డ్రెస్లో మైండ్ బాక్ల్ చేస్తున్న కృతిశెట్టి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ SBI నుంచి మరో కొత్త స్కీం.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఇక పండగే నిన్ను సూటిగా ఒక్కటే అడుగుతున్నా.. లోకేష్ కు ఇచ్చిపడేసిన మహిళా మిస్టరీ మర్డర్.. 15 నిమిషాల్లో 27 కత్తిపోట్లు..! మంత్రి ఇలాకాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు మద్యం సరఫరా

సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విడుదలకు ముందే రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్తో దూసుకెళ్తోంది. ‘కరుప్పు’ విజయంతో సూర్య మార్కెట్ మరింత బలపడటంతో ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా ప్రీ-రిలీజ్ విలువ నమోదైనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి అడ్వాన్స్ బుకింగ్స్పైనే పడింది. తమిళనాడులో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో కాకపోయినా మోస్తరు స్థాయిలో కొనసాగుతున్నాయి. సాక్నిల్క్ గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు ఈ చిత్రం తమిళనాడులో రూ.7.23 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ను నమోదు చేసింది. ‘కరుప్పు’ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన నేపథ్యంలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. థియేట్రికల్ బిజినెస్ రూ.90 కోట్లు ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ మొత్తం సుమారు రూ.215 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇందులో థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులు ఉన్నాయి. తమిళనాడు థియేట్రికల్ హక్కుల విలువ రూ.45 కోట్లు కాగా, తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లు, కర్ణాటకలో రూ.5 కోట్లు, ఇతర ప్రాంతాల్లో రూ.5 కోట్లు, ఓవర్సీస్లో రూ.15 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. దీంతో మొత్తం థియేట్రికల్ బిజినెస్ రూ.90 కోట్లకు చేరింది. ఓటీటీ, శాటిలైట్, సంగీత హక్కులతో కూడిన నాన్-థియేట్రికల్ బిజినెస్ విలువ రూ.125 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. థియేటర్ల పరంగా ఈ చిత్రం విజయవంతం కావాలంటే ప్రపంచవ్యాప్తంగా కనీసం రూ.175 కోట్ల గ్రాస్ను సాధించాల్సి ఉంటుంది. ఆగస్టు 14న రాబోతోంది.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య, మమితా బైజు జంటగా నటించారు. రాధికతో పాటు పలువురు ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, వినోదం ప్రధాన అంశాలుగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. కర్నూలులో వైఎస్ జగన్కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు) 'అగధ' మూవీ

ఈ వీకెండ్ లో ఏడు సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో నాలుగు స్ట్రయిట్ సినిమాలు కాగా మూడు అనువాద చిత్రాలు. ఆగస్ట్ సెకండ్ వీకెండ్ థియేటర్లలో స్ట్రయిట్ సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు సైతం సందడి చేయబోతున్నాయి. నాలుగు డైరెక్ట్ తెలుగు సినిమాలు వస్తుంటే, వాటికి దీటుగా మూడు అనువాద చిత్రాలు రాబోతున్నాయి. సూర్య హీరోగా సితార ఎంటర్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి తెరకెక్కించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' అందులో ఒకటి. మరొకటి ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లో స్వర్గీయ ఆర్.బి. చౌదరి నిర్మించిన 'మకుటం'. ఈ మూవీ కోసం తొలిసారి హీరో విశాల్ దర్శకుడి అవతారమెత్తాడు. ఈ రెండు అనువాద చిత్రాలతో పాటే ఇంగ్లీష్ సినిమా 'ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్' తెలుగులో వస్తోంది. శుక్రవారం వస్తున్న సినిమాల్లో అందరూ దృష్టి సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' మీదనే ఎక్కువగా ఉంది. గత కొంతకాలంగా సరైన విజయం లేక సతమతమౌతున్న సూర్యకు ఈ యేడాది 'కరుప్పు8 రూపంలో మంచి విజయం లభించింది. ఆ వెనుకే 'విశ్వనాథ్ అండ్ సన్స్' రావడం సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు కలిసి వచ్చిన అంశం. యూత్ ను 'ప్రేమలు' చిత్రంతో మెస్మరైజ్ చేసిన మమిత బైజు నాయికగా నటించిన ఈ సినిమాలో రాధిక, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ దీనికి సంగీతం సమకూర్చాడు. ఈ సినిమాతో పాటే వస్తున్న విశాల్ 'మకుటం' చిత్రానికీ జీవీ ప్రకాశ్ కుమారే సంగీత దర్శకుడు. ఇందులో అంజలి, దుషార విజయన్ కథానాయకులుగా నటించారు. ఇక ఈ వీకెండ్ లో వస్తున్న మరో అనువాద చిత్రం 'ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్'. డేవిడ్ రాబర్ట్ ఈ ఎడ్వంచర్ థ్రిల్లర్ కు దర్శకత్వం వహించారు. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నిర్మించిన 'ది ఎండ్

అక్కినేని నాగార్జున(Nagarjuna), గిరిజ శెట్టర్ జంటగా నటించిన క్లాసిక్ చిత్రం ‘గీతాంజలి’ (Geethanjali) మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్కినేని నాగార్జున(Nagarjuna), గిరిజ శెట్టర్ జంటగా నటించిన క్లాసిక్ చిత్రం ‘గీతాంజలి’ (Geethanjali) మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ ఎవర్గ్రీన్ ప్రేమకథను ఆగస్టు 28న 4Kలో రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. (Geethanjali Re Release) ‘గీతాంజలి’ తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రేమకథా చిత్రం. ప్రేమ, భావోద్వేగాలు, అనుబంధాలను మణిరత్నం తనదైన శైలిలో తెరకెక్కించారు. నాగార్జున, గిరిజ శెట్టర్ మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన సంగీతం మరో ప్రత్యేకత. సినిమాలోని పాటలు అప్పట్లో ఎంతగా హిట్ అయ్యాయో.. ఇప్పటికీ అంతే ఆదరణ పొందుతున్నాయి. ప్రేమకథకు ఇళయరాజా సంగీతం మరింత అందాన్ని తీసుకొచ్చింది. పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేకమైన విజువల్ ఫీల్ను తీసుకొచ్చింది. బి. లెనిన్, వి.టి. విజయన్ ఎడిటింగ్, తోట తరణి ఆర్ట్ డైరెక్షన్ సినిమాను మరింత అందంగా తీర్చిదిద్దాయి. ఇప్పుడు ఈ క్లాసిక్ చిత్రం 4K క్వాలిటీతో మరోసారి థియేటర్లలోకి వస్తుండటంతో నాగార్జున అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అప్పట్లో థియేటర్లలో ‘గీతాంజలి’ని చూసిన వారికి ఇది పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేయనుంది. అదే సమయంలో కొత్త తరం ప్రేక్షకులకు ఈ క్లాసిక్ ప్రేమకథను పెద్ద తెరపై ఆస్వాదించే అవకాశం లభించనుంది. ఆగస్టు 28న ‘గీతాంజలి’ 4Kలో రీ-రిలీజ్ కానుండటంతో కింగ్ నాగార్జున అభిమానులు, మణిరత్నం సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంచి ప్రేమకథలకు కాలంతో సంబంధం లేదని మరోసారి నిరూపించేందుకు ‘గీతాంజలి’ సిద్ధమవుతోంది. స్పా సెంటర్ లో నటికి ఏం జరిగిందంటే.. Raviteja

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సినీ కార్మికుల పిల్లల కోసం త్వరలోనే కార్పొరేట్ స్థాయి పాఠశాలను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ పాఠశాల నిర్మాణం కోసం స్థలాన్ని కూడా ఎంపిక చేశామని ఆయన వెల్లడించారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా నవీన్ యాదవ్ ఈ కీలక వివరాలను పంచుకున్నారు. ఇదిలా ఉండగా, 2025 అక్టోబర్లో జూబ్లీహిల్స్లో జరిగిన సినీ కార్మికుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక హామీలు ఇచ్చారు. కృష్ణానగర్ సమీపంలో 3 నుండి 4 ఎకరాల విస్తీర్ణంలో నర్సరీ నుండి 12వ తరగతి వరకు ఉచిత విద్యాసంస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కార్మికుల కుటుంబాలకు ఆరోగ్య బీమా, గృహ వసతి మరియు వెల్ఫేర్ ఫండ్ వంటి పథకాలను అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో 2025 నవంబర్లో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సినీ కార్మికులు కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై దాదాపు 25000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నవీన్ యాదవ్ కుటుంబానికి చిత్రపురి హౌసింగ్ సొసైటీ మరియు సినీ పరిశ్రమతో గత 40 ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ మాట్లాడుతూ ‘విశ్వనాథ్ & సన్స్’ దర్శకుడు వెంకీ అట్లూరి తమ కుటుంబ మిత్రుడని గుర్తు చేసుకున్నారు. వెంకీ తండ్రి అట్లూరి సుబ్బారావు రియల్టర్గా, నిర్మాతగా ఎంతో కృషి చేశారని కొనియాడారు. సినీ కార్మికులకు ఎలాంటి సహాయం కావలసి వచ్చినా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఫలితంగా ప్రభుత్వం ఎంపిక చేసిన స్థలంలో త్వరలోనే స్కూల్ నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. సూర్య, మమితా బైజు నటించిన ‘విశ్వనాథ్ &

సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మమితా బైజు, రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్కి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్...(ఫొటోలు) ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు) హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు) ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు) ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు) కారుతో తొక్కేసి మెడికో ప్రియాంకను చంపి పరార్.. పూర్తి CCTV ఫుటేజ్? కొత్త కరెన్సీ వచ్చేస్తోంది.. 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో కేంద్రం ట్రయల్ ఒక్క ఉద్యోగం లేని టెసారా కంపెనీలో కోట్ల డబ్బు ఎలా..? భారతి సిమెంట్స్ వద్ద హై టెన్షన్.. TDP గూండాల బీభత్సం

MLA Naveen Yadav : సూర్య నటించిన విశ్వనాథ్ & సన్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగుంది. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ ఈవెంట్ కి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హాజరయ్యారు. Also See : Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య బోనాలు స్పెషల్ ఫొటోలు.. ఫ్యామిలీతో పండగ సెలబ్రేషన్స్.. ఈ ఈవెంట్లో నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. వెంకీ అట్లూరి మా ఫ్యామిలీ ఫ్రెండ్. వాళ్ళ నాన్న అట్లూరి సుబ్బారావు అంకుల్ ఒక రియల్టర్, ప్రొడ్యూసర్. హార్డ్ వర్కింగ్ పర్సన్. అంకుల్ లాగానే వెంకట్ అన్న కూడా మంచి సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఎదుగుతున్నాడు. మాకు, సినీ ఫీల్డ్ కి 40 ఏళ్ళ అనుబంధం ఉంది. ఇక్కడ కార్మికులకు మా నాన్న ఎంతో సపోర్ట్ చేసారు. మా అన్న చిత్రపురి హోసింగ్ సోసిటీ లో వైస్ ప్రసిడెంట్ గా ఉన్నారు. మా బావ రాహుల్ నిర్మాతగా ఉన్నారు. మొన్న బై ఎలక్షన్స్ లో సినిమా వాళ్లు నాకు సపోర్ట్ గా ఉండి నిలబడ్డారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సినిమా కార్మికుల పిల్లల కోసం ఒక మంచి స్కూల్ కట్టాలని నాకు చెప్పారు. దాని కోసం ఒక ల్యాండ్ కూడా చూసాము. త్వరలోనే ఆ స్కూల్ వర్క్ మొదలవుతుంది. సినిమా వాళ్లకు ఎవరికి ఏదైనా సపోర్ట్ కావాలంటే నా దగ్గరకు రావొచ్చు అని అన్నారు

సూర్య 'విశ్వనాధ్ & సన్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ ఇక్కడ చూసేయండి.. సూర్య, మమిత బైజు జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కిన విశ్వనాధ్ & సన్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఘనంగా జరుగుతుంది. ఈ వార్తకు సంబంధించిన

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘పళ్ళబురుసు’. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘పళ్ళబురుసు’ (Pallaburusu). ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాను చూడాలనే ఆసక్తిని కలిగించింది. ఈ చిత్రం ఆగస్ట్ 14న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకకు కింగ్ నాగార్జున (King Nagarjuna) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియోస్కు ఇది 50వ సంవత్సరం. నాన్న ప్రారంభించిన ఈ సంస్థలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించాం. జాతీయ అవార్డులు అందుకున్న సినిమాలను కూడా రూపొందించాం. ఈ 50వ సంవత్సరం సందర్భంగా మా టీమ్ అంతా కలిసి కొన్ని సరికొత్త నిర్ణయాలు తీసుకున్నాం. అందులో భాగంగా డిస్ట్రిబ్యూషన్ను విస్తరించాం. నాన్న సినిమాలు చేసిన రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండేదో, ఆ పద్ధతిని మళ్లీ తీసుకురావడంతో పాటు దాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇటీవలే డిస్ట్రిబ్యూషన్ను ప్రారంభించాం. అది చాలా విజయవంతంగా సాగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై ఎన్నో మంచి సినిమాలు చేశాం. ఇకపై మరింత వేగంగా, మరింత బలంగా సినిమాలు చేయాలని, మరింతమంది కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఈ సినిమాలను ప్రారంభించాం. మొన్ననే ‘లెనిన్’ను రిలీజ్ చేశాం. ఇప్పుడు ‘పళ్ళబురుసు’ను విడుదల చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ‘రంభ, ఊర్వశి, మేనక’ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. ఆ తర్వాత మరో రెండు సినిమాలు కూడా

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Panchali Panchabhartruka Movie Pre Release Event: డా.రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పాంచాలి పంచభర్తృక’. సరీ ఫర్, రోల్ రిడా, రాజ్ పవన్, జెమినీ సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్ బ్యానర్స్పై వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రాజ్ పవన్ శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మణ్యం సంయుక్తంగా నిర్మించారు. ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం.. ఈ నెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ హైదరాబాద్లో ప్రీరిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ గంగ సప్తశిఖర మాట్లాడుతూ.. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. ఒకవేళ సినిమా నచ్చకపోతే రాయల్ థ్రోన్ బ్యానర్ ఇన్ స్టా పేజికి టికెట్ పెడితే.. డబ్బులు రిటర్న్ ఇస్తామన్నారు. ఆడియన్స్ మెచ్చిన ఏ సినిమా అయినా ఫెయిల్ కాదన్నారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ నటిస్తున్నప్పుడు తనను ఇంతలా వాడుకున్న దర్శకుడు తానేని కితాబిచ్చారని గుర్తు చేసుకున్నారు. ఈ మూవీ 50కి పైగా నటీనటులు వివిధ పాత్రల్లో కనిపిస్తారని.. ఒక ఈవీవీ, జంధ్యాల, అనిల్ రావిపూడి సినిమాలా తమ సినిమాలో ఫ్రేమ్ నిండా ఆర్టిస్టులు ఉంటారని చెప్పారు. ఈ నెల 14న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నామని.. అమెరికాలో కూడా పెద్ద సంఖ్యలో విడుదల అవుతోందన్నారు. నటుడు థర్డీ ఇయర్స్ పృథ్వీ మాట్లాడుతూ.. తన కెరీర్ రాజేంద్ర ప్రసాద్ ఆ ఒక్కటీ అడక్కు మూవీతో మొదలైందని గుర్తు చేసుకున్నారు

నటుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాను ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేసేందుకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ప్రీ-రిలీజ్ వేడుక తేదీ మరియు వేదికను నిర్మాతలు అధికారికంగా ఖరారు చేశారు. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్య సరసన మమితా బైజు కథానాయికగా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లను వేగవంతం చేస్తూ భారీ ఈవెంట్ను నిర్వహించనున్నారు. ఈ ప్రీ-రిలీజ్ వేడుకను ఆగస్టు 11న సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్లోని శ్రీ కోటల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహించనున్నారు. దీంతో నగరంలోని సూర్య అభిమానులు ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఈవెంట్కు సూర్యతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు మరియు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం అందుతోంది. ఈ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా చిత్ర బృందం వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఫలితంగా సినిమాపై ఉన్న క్రేజ్ ఒక్కసారిగా రెట్టింపు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు నిర్మాతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వేదిక వద్ద అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతాపరమైన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సూర్యకు ఉన్న ప్రత్యేక క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా విజయం సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి

Vishwanath And Sons : సూర్య, మమిత బైజు జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వనాధ్ & సన్స్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, పలు సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు నెలకొల్పారు. విశ్వనాధ్ & సన్స్ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా సౌత్ మొత్తం రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ కూడా ప్రతి రాష్ట్రంలో చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు చెన్నై, కేరళ కొచ్చిలో ఈవెంట్స్ నిర్వహించగా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తాజాగా ప్రకటించారు. విశ్వనాధ్ & సన్స్ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసుఫ్ గూడ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరగనుంది. రేపు ఆగస్టు 11న సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఈవెంట్ జరగనుంది. మూవీ యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. Also See : Farnaz Shetty : టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న కొత్త హీరోయిన్.. ఫర్నాజ్ శెట్టి ఫొటోలు.. విశ్వనాధ్ & సన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా చేయనున్నారు. తెలుగులో కూడా సూర్యకు అభిమానులు చాలామంది ఉన్నారని తెలిసిందే. రేపు విశ్వనాధ్ & సన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీగా సూర్య అభిమానులు తరలిరానున్నారు. ఈ ఈవెంట్ కి మూవీ టీం మొత్తం హాజరవనుంది. గెస్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ వస్తారని సమాచారం

Nikhil Siddhartha : నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకోవడంతో వరుస పెట్టి భారీ పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నాడు. త్వరలో స్వయంభు సినిమాతో రాబోతున్నాడు నిఖిల్. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియో నిర్మాణంలో భువన్, శంకర్ నిర్మాతలుగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సంయుక్త, నభా నటేష్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాజుల కాలం కథతో పీరియాడిక్ యాక్షన్ సినిమాగా, తిరుపతి దగ్గర జరిగిన ఓ రాజుల కాలం సంఘటన ఆధారంగా ఈ స్వయంభు సినిమా తీస్తున్నట్టు నిఖిల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ సినిమాలో నిఖిల్ ఓ యోధుడిగా కనిపించబోతున్నాడు. ఇందులో సంయుక్త కూడా యుద్దాలు చేయబోతుంది. ఈ సినిమా ప్రస్తతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. Also See : Nandamuri Deepika : బోనాలు పండగలో సందడి చేసిన ఎన్టీఆర్ వదినమ్మ.. నందమూరి దీపిక ఫొటోలు.. అయితే ఇంకా స్వయంభు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించలేదు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లేస్ మాత్రం ఫిక్స్ చేసేసాడు. నిఖిల్ ఇటీవల తను ఇంటర్వ్యూ ఇచ్చిన ఓ వీడియో బైట్ ని షేర్ చేయగా.. ఓ అభిమాని సినిమా తిరుపతి బ్యాక్ డ్రాప్ కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో పెట్టండి, వేంకటేశ్వరస్వామి బ్లెస్సింగ్స్ ఉంటాయని కామెంట్ చేసాడు. దీంతో నిఖిల్ రిప్లై ఇస్తూ.. అక్కడికి కచ్చితంగా వస్తాము అని కామెంట్ చేసాడు. దీంతో నిఖిల్ స్వయంభు సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం తిరుపతిలో ఉండబోతుందని తెలుస్తుంది

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా, యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'విశ్వనాథ్ & సన్స్'. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్పై చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఆగస్టు 11వ తేదీన హైదరాబాద్లో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్స్ వేదికగా ఈ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి హీరో సూర్య ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. తన సినిమా ప్రమోషన్ల కోసం సూర్య హైదరాబాద్ రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ సినిమాలో సూర్యకు జోడీగా 'ప్రేమలు' చిత్రంతో భారీ క్రేజ్ సంపాదించుకున్న మమిత బైజు కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.భారీ తారాగణంతో తెరకెక్కుతున్న 'విశ్వనాథ్ & సన్స్' సినిమాలో రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్, నాజర్, యోగి బాబు వంటి సీనియర్ నటులతో పాటు భావని శ్రీ, కాళి వెంకట్, రఘుబాబు, వైవా హర్ష కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.'సార్' వంటి బ్లాక్బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం, సూర్య వంటి స్టార్ హీరో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్పై మొదటి నుంచీ