
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.
మహిళలకు రూ.5కే ఆటో ప్రయాణం| Tirupati Auto Driver Ajith ₹5 Ride For Women| Vijay Fan

బెంగళూరు: ఓ ఆటో డ్రైవర్ తన భార్య చనిపోయి ఎనిమిదేళ్లు గడిచినా ఆమెను తలచుకుంటూ ఓ ఆచారాన్ని కొనసాగిస్తున్నాడు. తన ఆటోను పూలతో అలంకరించి, భార్య ఫొటోను తన పక్కన ఉంచుకుంటున్నాడు. ఇన్స్టాగ్రామ్ యూజర్ సూరజ్ ఎస్ కురుప్ ఈ భావోద్వేగ ఘటనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. వృద్ధుడైన ఆటో డ్రైవర్ను చూసిన ఆయన, ఆటో ముందు భాగంలో చక్కగా అమర్చిన పూలను గమనించారు. వీడియోలో సూరజ్ తన కెమెరాను డ్రైవర్ వైపు తిప్పి, ఆ పూలు ఎవరి కోసం? అని అడిగారు. డ్రైవర్ నవ్వుతూ తన భార్య ఫొటో వైపు చూపించాడు. ఆమె ఎనిమిదేళ్ల క్రితమే చనిపోయిందని వివరించాడు. తనకు ఓ కుమారుడు, కుమార్తె, ఆరుగురు మనవళ్లు ఉన్నారని ఆయన తెలిపారు. ఇంట్లో ఉండకుండా ఇప్పటికీ ఆటో ఎందుకు నడుపుతున్నారని సూరజ్ అడిగారు. ఇంట్లో కూర్చుంటే ఆలోచనల ప్రవాహం ఎక్కువగా ఉంటుందని డ్రైవర్ వివరించాడు. అందుకే ప్రతిరోజూ ఆటో నడుపుతూ, దారిలో ఎదురయ్యే వారితో మాట్లాడుతూ తనను తాను పనిలో నిమగ్నం చేసుకుంటున్నానని చెప్పాడు. పూలు, తన భార్య ఫొటో ఆయన రోజువారీ జీవితంలో భాగంగానే కొనసాగుతున్నాయి. వాటి ద్వారా ఆమె ఉనికిని తనకు దగ్గరగా ఉంచుకుంటున్నాడు. ఈ సాధారణ సంభాషణ వీడియోను చూసిన వారిని భావోద్వేగానికి గురిచేసింది. భార్య చనిపోయి అన్నేళ్లు గడిచినా ఆమె కోసం పూలు కొని, వాటిని అలంకరిస్తున్న దానిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇదీ చదవండి: 120 అడుగుల ఎత్తు నుంచి పడిపోయినా బతికాడు.. కొంతమంది దీనిని ఎన్నటికీ చెక్కుచెదరని ప్రేమకు అందమైన ప్రతీకగా అభివర్ణించారు. మరికొందరు, మరణం తర్వాత కూడా ఇంతే బలంగా నిలిచే ప్రేమ తమ జీవితంలో కూడా ఉండాలని కోరుకునేలా ఈ కథ ఉందని పేర్కొన్నారు. తనకు సమీపంలోనే ఆ డ్రైవర్ నివసిస్తున్నారని ఓ యూజర్ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం ఇదే విధంగా ఆయన తన ఆటోను శుభ్రం

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana Autos Bandh: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో మరో వర్గం కూడా భారీ ఆందోళనకు సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం.. తమ జీవనాధారంపై పొట్టకొట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుండడంతో ఆటో కార్మికులకు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగనున్నారు. గతంలో పలమార్లు హెచ్చరించినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈసారి సమ్మె చేపట్టనున్నారు. దీంతో రేపు అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు బంద్ కానున్నాయి. హైదరాబాద్తో సహా అన్ని జిల్లాల్లో ఆటోలు నిలిచిపోనున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ఈ బంద్లో ఏడున్నర లక్షల ఆటోలు పాల్గొనున్నాయి. రోడ్డుపై ఒక్క ఆటో కూడా కనిపించదు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి నేరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఆటో కార్మికులు ఈ బంద్ చేపడుతున్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు పైన స్పష్టత ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీటర్ ఛార్జీలు పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఆర్ధిక సహాయం అందించకపోవడంతో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆటో కార్మికులు ఆందోళన చేపడుతున్నారు. వీరి ఆందోళనలకు స్కూల్ వాహనాల కార్మికులు కూడా తోడయ్యారు. ఆటో కార్మికులతోపాటు తాము బంద్లో పాల్గొంటామని స్కూల్ వ్యాన్ల యజమానులు ప్రకటించారు. ఈసీఐఎల్లో ర్యాలీ తెలంగాణలో ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి నుంచి నిర్వహించనున్న ఆటో, స్కూల్ వ్యాన్ల బంద్ సందర్భంగా బీఆర్టియూ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని ఈసీఐఎల్ కేబుల్ బ్రిడ్జి నుంచి మల్లాపూర్ చౌరస్తా వరకు ర్యాలీ

హైదరాబాద్లో కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహించడంతో పాటు ఆటో రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ)గా మార్చేందుకు ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. జీహెచ్ఎంసీ ఆటో కార్మికులకు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే కాకుండా, పెరిగిపోతున్న ఇంధన ధరల భారం నుంచి ఉపశమనం అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ కార్యక్రమం ఆటో డ్రైవర్ల వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ నూతన విధానం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించింది. దీనిద్వారా హైదరాబాద్ పరిధిలోని దాదాపు 18,766 ఆటో రిక్షాలకు నేరుగా లబ్ధి చేకూరనుంది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూనే రవాణా వ్యవస్థను ఆధునీకరించేందుకు ఇది ఎంతో తోడ్పడనుంది. ఈ పథకం కింద పాత ఆటోలను ఈవీ రెట్రోఫిట్మెంట్ (మార్పిడి) చేసుకోవడానికి లేదా సరికొత్త ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సాయం అందించనుంది. అర్హులైన ప్రతి ఆటో యజమానికి రూ. 1.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆటో డ్రైవర్లు రోజువారీ ఇంధనం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల వారి నికర ఆదాయం క్రమంగా తగ్గిపోతోంది. ఈ నిర్ణయంతో ఆటోల నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గి, వారి కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పలు ఆటో డ్రైవర్ సంఘాలు సానుకూలంగా స్వాగతిస్తున్నాయి. ఈ రకమైన సబ్సిడీ పథకం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడమే కాకుండా, కాలుష్యంతో ఇబ్బందిపడుతున్న నగరవాసులకు స్వచ్ఛమైన గాలి లభించే అవకాశాలు మెరుగుపడతాయని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు విధానం, అర్హత నిబంధనలు అమలు మార్గదర్శకాలను