
Akhilesh Yadav | రీట్వీట్ చేయనందుకు మేనల్లుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మాయావతి.. ఎస్పీలోకి ఆహ్వానించిన అఖిలేష్
Akhilesh Yadav | రీట్వీట్ చేయనందుకు మేనల్లుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మాయావతి.. ఎస్పీలోకి ఆహ్వానించిన అఖిలేష్
© 2026 nimisham.in

Akhilesh Yadav | రీట్వీట్ చేయనందుకు మేనల్లుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మాయావతి.. ఎస్పీలోకి ఆహ్వానించిన అఖిలేష్

భాగ్యశ్రీ బోర్స్ ని చూస్తే చాలు 'అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా అని పాడని వాళ్ళు ఉండరు. అలాంటిది అభిమానుల గుండెలో ఎంతటి కవిత్వం తన్నుకొస్తూ ఉంటుందో చెప్పక్కర్లేదు. కళ్ళతోనే తన క్యారక్టర్ భావజాలం మొత్తాన్ని చెప్పేసే ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా అఖిల్ అక్కినేని తో కలిసి 'లెనిన్' తో విజయాన్ని అందుకుంది. భాగ్యశ్రీకి తొలి విజయం కూడా.. లెనిన్ విజయం తర్వాత భాగ్యశ్రీ కి టాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తాయని అందరూ భావించారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా ఏ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఈ ఆలస్యానికి వెనుక ప్రధాన కారణం భాగ్యశ్రీ స్క్రిప్ట్ ఎంపికలో చూపిస్తున్న జాగ్రత్తలేనని, తొందరపడి సినిమాలు ఒప్పుకోవడం కంటే, బలమైన క్యారెక్టర్స్ ఉన్న ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోందట. ఇండస్ట్రీ వర్గాల్లో తాజాగా వినిపిస్తున్న ప్రకరాం రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త ప్రాజెక్ట్స్ లో చరణ్ కి జోడిగా భాగ్యశ్రీ కనిపించబోతుందనే సమాచారం అయితే వినిపిస్తూనే ఉంది. అదే జరిగితే టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ పోస్ట్ కొన్ని సంవత్సరాల పాటు ఖాళీ లేనట్టే. విడదీయాలని చూస్తే రోడ్డుపైనే కొడతాం.. ఫిల్మ్ ఫెడరేషన్, రఘు వర్గానికి సుమలత వార్నింగ్.! సందీప్ సరోజ్, సాత్విక జంటగా ప్రారంభమైన ‘వేట’.!

అక్కినేని వారసులుగా నాగ చైతన్య, అఖిల్ హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. నాగార్జున టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరో. రీసెంట్ గా వీరు ముగ్గురూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తమ కెరీర్, ఫ్యామిలీలో ఉన్న అనుబంధం ఇతర విశేషాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య, అఖిల్ ఇంత వరకు కలసి ఫుల్ లెన్త్ మూవీ చేయలేదు. మనం మూవీలో అఖిల్ కొన్ని నిమిషాల పాటు తళుక్కున మెరుస్తాడు అంతే. ఆ మూవీలో నాగార్జున, చైతు పూర్తి స్థాయిలో నటించారు. అక్కినేని అన్నదమ్ముల కాంబోలో ఫుల్ లెన్త్ మూవీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో అఖిల్, చైతూకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ తండ్రి సినిమాల్లో దేనిని రీమేక్ చేయడనికి ఇష్టపడతారు అని ప్రశ్నించగా.. అఖిల్, చైతూ ఇద్దరూ ఒకే సినిమా పేరు చెప్పారు. ఆ సినిమా ఏంటంటే.. హలో బ్రదర్. నాగార్జున డ్యూయెల్ రోల్ లో నటించిన హలొ బ్రదర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 90వ దశకంలో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఇది కూడా ఒకటి. రమ్యకృష్ణ, సొందర్య హీరోయిన్లుగా నటించారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఉంటుంది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు చైతూ, అఖిల్ ఇద్దరూ చెప్పారు. అయితే అఖిల్, చైతూ హలో బ్రదర్ రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అనే లెక్కలు అప్పుడే అభిమానుల్లో మొదలయ్యాయి. అది 32 ఏళ్ళ నాటి సినిమా. ఆ తరహా ఎంటర్టైన్మెంట్ కి, కథలకు ఎప్పుడో కాలం చెల్లింది. అలాంటి కథలతో ఇప్పుడు సినిమాలు చేస్తే వర్కౌట్ కావు సరికదా.. హలో బ్రదర్ లాంటి క్లాసిక్ మూవీ పరువు తీసినట్లు అవుతుంది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఇప్పటి ట్రెండ్

కింగ్ నాగార్జున తన సినీ ప్రయాణంలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ప్రస్తుత తరం హీరోలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కింగ్ నాగార్జున (Nagarjuna) తన సినీ ప్రయాణంలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ప్రస్తుత తరం హీరోలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన ఇద్దరు కుమారులు నాగచైతన్య (Naga Chaitanya), అఖిల్తో (Akhil) కలిసి ‘వెరైటీ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్కు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా 90వ దశకానికి, ఇప్పటి సినీ పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గురించి మాట్లాడారు. "నా సినీ ప్రయాణంలో నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలు నా కెరీర్ను పూర్తిగా మార్చేశాయి. అలాంటి నిర్ణయాల్లో ‘గీతాంజలి’ (Geethanjali) సినిమా ఒకటి. 90వ దశకంలో ఇతర హీరోలు పెద్దగా ముందుకు రాని సమయంలో దర్శకుడు మణిరత్నంతో కలిసి ‘గీతాంజలి’ సినిమా చేయడం నేను తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. ఆ నిర్ణయమే నా కెరీర్కు ఒక కొత్త దిశను చూపించింది. ఒక హీరోగా నేను ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి కథలను ఎంచుకోవాలి అనే విషయంలో ‘గీతాంజలి’ నాకు ఎంతో నేర్పింది. అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు నా కుమారులు నాగచైతన్య, అఖిల్ కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. కెరీర్లో ఎప్పుడూ సేఫ్ జోన్లోనే ఉండకుండా.. కొత్త కథలు, విభిన్నమైన పాత్రలు చేయడానికి ప్రయత్నించాలి. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే సినిమాలు చేయాలనే తపన ఉండాలి. అయితే 90లతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పట్లో ప్రయోగాత్మక సినిమాలు చేయడం కొంత సులభంగా ఉండేది. సినిమా ఫలితం ఆశించిన విధంగా రాకపోయినా మరో సినిమాతో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉండేది. ఆ రోజుల్లో వరుసగా ఏడు సినిమాలు ప్లాప్ అయినా హీరోలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఒక్క పరాజయం ఎదురైనా ప్రేక్షకులు

సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రావడం కెరీర్కు ఎంతవరకు ఉపయోగపడుతుందో, అదే సమయంలో ఎలాంటి ప్రెజర్ ను తీసుకొస్తుందో హీరో అఖిల్ అక్కినేని(akhil Akkineni) తన ఎక్స్పీరియెన్స్లతో వివరించాడు. తాను, తన అన్న నాగచైతన్య(naga Chaitanya) తరచూ నెపోటిజం డిస్కషన్స్ లో భాగమవుతుంటామని, ఈ విషయాన్ని తాము అంగీకరించామని చెప్పాడు. అయితే స్టార్ కిడ్గా ఉండటం పూర్తిగా అనుకూలమైన అంశం కాదని, అది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా తన లాంచ్ టైమ్ లో వచ్చిన హైప్ ఒక యంగ్ యాక్టర్ కు అంచనా వేయలేనంతగా ఉందని గుర్తుచేసుకున్నాడు. సౌత్ లో స్టార్ కిడ్స్ సినిమాల్లోకి వస్తున్నారంటే ఆడియన్స్లో సహజంగానే భారీ ఆసక్తి ఏర్పడుతుందని అఖిల్ పేర్కొన్నాడు. అంతటి అంచనాలను కెరీర్ ప్రారంభంలోనే ఎదుర్కోవడం అంత ఈజీ కాదని చెప్పాడు. అయితే మరోవైపు ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల ఒక ఫెయిల్యూర్ తర్వాత తిరిగి నిలబడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండటం తనకు కనిపించే ప్రధాన ప్రయోజనమని వివరించాడు. ఒక సినిమా రిజల్ట్ ఆశించిన విధంగా లేకపోయినా మరో ప్రయత్నం చేసే ఫ్రీడమ్ స్టార్ కిడ్స్కు ఉంటుందని అన్నాడు. ఇక సోషల్ మీడియా ట్రోలింగ్ను కూడా సినీ లైఫ్ లో భాగంగానే చూడాలని అఖిల్ భావిస్తున్నాడు. అయితే ఎదురయ్యే ప్రతి విమర్శకు స్పందించకుండా, నిజంగా అవసరమైన సందర్భాల్లో మాత్రమే తాను మాట్లాడతానని తెలిపాడు. కానీ విమర్శలు హద్దులు దాటిన సందర్భాల్లో తన ఫ్యామిలీ మొత్తం ఒకటిగా నిలబడిన సందర్భాలు ఉన్నాయని వెల్లడించాడు. పబ్లిక్ ఫిగర్గా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న సిస్టమ్ను అర్థం చేసుకుని, ప్రశంసలతో పాటు విమర్శలను కూడా స్వీకరించడం నేర్చుకోవాల్సిందేనని అఖిల్ చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి
రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని సమయం తెలుగులో కాపీ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఆయన సినిమా రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు, స్పెషల్ స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో సినిమా, ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించిన వార్తలు, సినిమా రివ్యూలు రాశారు. క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. రాజశేఖర్ జేఎన్టీయూ-హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.... ఇంకా చదవండి

సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకులకు వరుస విజయాలు సాధించడం చాలా అవసరం. సరైన విజయం లేకపోతే అభిమానుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇటీవలే అక్కినేని అఖిల్ లెనిన్ సినిమాతో మంచి విజయం సాధించి తన కెరీర్ను మళ్లీ బలమైన బాటలో నిలబెట్టారు. ఇప్పుడు అదే రీతిలో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా కనక రాజు చిత్రంతో సంచలన విజయాన్ని అందుకుని మళ్లీ ఫామ్లోకి వచ్చారు. గత కొంతకాలంగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న వరుణ్ తేజ్ ఈ విజయంతో పెద్ద ఊరట చెందారు. వరుసగా వచ్చిన పరాజయాలు మెగా బ్రాండ్ ఇమేజ్పై కొంత ప్రభావం చూపినప్పటికీ ఆయన ధైర్యంగా ముందుకు సాగారు. కొరియన్ కథాంశం ప్రేరణతో తెరకెక్కిన కనక రాజు సినిమాతో ఇప్పుడు వరుణ్ తేజ్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. ప్రేక్షకులను మెప్పించడంలో ఈ చిత్రం విజయవంతమైంది. ప్రారంభ మూడు రోజుల్లోనే ఈ సినిమాకు అత్యంత భారీ స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయని సమాచారం అందుతోంది. దీంతో ఈ హారర్ కామెడీ డ్రామా చిత్రం వేగంగా 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. థియేటర్లలో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం వరుణ్ తేజ్ కెరీర్కు ఎంతో ప్లస్ పాయింట్గా మారింది. ఫలితంగా అటు అఖిల్ ఇటు వరుణ్ తేజ్ ఇద్దరూ ఒకే సమయంలో విజయాలు సాధించడం పట్ల అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో ఒక్క మంచి విజయం హీరోలకు మరో ఐదారు ఏళ్ల పాటు మంచి అవకాశాలను తెచ్చిపెడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. నాని తన కెరీర్ను చిన్నగా ప్రారంభించి ప్యారడైజ్ చిత్రంతో 200 కోట్ల క్లబ్లో చేరిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మెగా

బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అయ్యగారు అఖిల్ అక్కినేని ‘లెనిన్’ ఇప్పుడు తెలుగు జీ5 లోనూ అద్భుతమైన రికార్డు సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అయ్యగారు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ‘లెనిన్’ (Lenin) ఇప్పుడు తెలుగు జీ5 (Zee5)లోనూ అద్భుతమైన రికార్డు సృష్టించింది. కేవలం ఒక్క వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేయటం విశేషం. థియేట్రికల్గా బ్లాక్ బస్టర్ అనంతరం ఓటీటీలోకి వచ్చిన ‘లెనిన్’పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి, ఈ హిస్టరీకి, ఈ ఆదరణకు కారణంగా చెప్పుకోవచ్చు. అఖిల్ కెరీర్లో మూడేళ్ల గ్యాప్ తర్వాత జూలై 10న థియేటర్లలో విడుదలైన ‘లెనిన్’ సినిమా.. ఆయన కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ను సాధించింది. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల వసూళ్లతో మేకర్స్కు లాభాలను తెచ్చిపెట్టింది. ప్రేక్షకుల ఆదరణతో ‘లెనిన్’ మంచి కమర్షియల్ సక్సెస్గా నిలిచింది. అఖిల్ అక్కినేనికి ‘లెనిన్’ ఓ సినిమా మాత్రమే కాదు. సినిమాలకు సుదీర్ఘ విరామం తర్వాత అఖిల్ కెరీర్లో కీలక సమయంలో ఈ చిత్రం విడుదలైంది. థియేటర్లలో సాధించిన విజయంతో.. అఖిల్ కెరీర్లోనే కొత్త కమర్షియల్ హై ను మూవీ అందుకుంది. ఇప్పుడు థియేటర్ల నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ వరకు ‘లెనిన్’ ప్రయాణం కొనసాగుతోంది. తెలుగు జీ5లోనూ ప్రేక్షకులు ఈ సినిమాను ఆసక్తిగా చూస్తుండటంతో, ‘లెనిన్’ విజయవంతమైన జోరు మరింత ముందుకు సాగుతోంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెనిన్’లో యాక్షన్, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు పల్లెటూరి నేపథ్యం ప్రధానంగా కనిపిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో పాత్రల మధ్య సంఘర్షణ, వ్యక్తిగత సంబంధాలు, దాగి ఉన్న రహస్యాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలను ఆసక్తికరంగా కథను ముందుకు నడిపాయి. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా.. ప్రమోద్ పంజు, రాంకీ, ఈశ్వరీరావు, శివాజీ, బ్రహ్మాజీ, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించి సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ

వివిధ భాషా చిత్రాలకు సంబంధించిన సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ మంచి విజయం సాధించడంతో.. మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా హాజరైన చిరంజీవి చిత్రబృందపై ప్రశంసలు కురిపించారు. ‘లెనిన్' విజయంతో జోరు మీదున్న అఖిల్ అక్కినేని తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. డైరెక్టర్ పవన్ సాదినేని చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఈ కాంబోపై అధికారిక ప్రకటన రానుంది. ‘బలగం’ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘పళ్ళబురుసు’ ట్రైలర్ను నాగార్జున విడుదల చేశారు. తెలంగాణ గ్రామీణ నేపథ్య కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 14న విడుదల కానుంది. అల్లరి నరేశ్ నటిస్తోన్న కామెడీ జానర్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ విడుదలైంది. చంద్ర మోహన్ చింతాడ తెరకెక్కించిన ఈ మూవీ గ్యాప్ లేకుండా నవ్విస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి. Jani Master: తప్పులు జరిగాయి.. దయచేసి క్షమించండి త్రిషను డిప్యూటీ సీఎంగా ఎప్పుడు చేస్తారు? మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు Dhanush Vs Vijay: ధనుష్పై.. విజయ్ సర్కారు నిఘా

గత నెలలో థియేటర్లకు వచ్చిన అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటించిన ‘లెనిన్’ (Lenin,) సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7 నుంచి జీ5 ఓటీటీ (ZEE5) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘లెనిన్’.. కేవలం రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటినట్లు మేకర్స్ తెలిపారు. థియేటర్లలో బ్లాక్బస్టర్ టాక్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అఖిల్ నటనకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జీ5లో ‘లెనిన్’కు మంచి వ్యూస్ వస్తున్నాయి. ఓటీటీలోనూ అదే జోరు.. సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీలోకి వచ్చింది. జీ5లో స్ట్రీమింగ్ మొదలైన రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్ను అందుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సినిమా మీద ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి ఇది నిదర్శనమని మేకర్స్ చెబుతున్నారు. ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో ‘లెనిన్’ ఓటీటీలో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. రాయలసీమ బ్యాక్డ్రాప్లో కథ.. చిత్తూరు జిల్లా రామచంద్రపురం గ్రామంలో జరిగే ద్రౌపదమ్మ తిరునాళ్ల నేపథ్యంలో ‘లెనిన్’ కథ సాగుతుంది. స్నేహం, ద్రోహం, కోపం, పగ, ప్రతీకారం వంటి అంశాలను కలిపి దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఈ కథను తెరకెక్కించారు. లెనిన్కు ప్రాణ స్నేహితుడే ఎందుకు ద్రోహం చేశాడు? ఆ ద్రోహం వల్ల లెనిన్ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అసలు లెనిన్ జైలుకు ఎందుకు వెళ్లాడు? రామచంద్రపురంలో జరిగిన కురుక్షేత్రంలో చివరికి ఎవరు గెలిచారు? అనేది సినిమా

అఖిల్ అక్కినేని నటించిన తాజా గ్రామీణ యాక్షన్ డ్రామా 'లెనిన్' ఓటీటీలో సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఆగస్టు 7న జీ5 వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ చిత్రం, కేవలం 48 గంటల్లోనే 10 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ మార్కును అధిగమించింది. అఖిల్ కెరీర్లో ఇది ఒక కీలక మైలురాయిగా నిలవడంతో పాటు, డిజిటల్ ప్లాట్ఫామ్పై సినిమాకు ఉన్న ఆదరణను స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది జూలై 10న థియేటర్లలో విడుదలైన లెనిన్ చిత్రం, అఖిల్ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ను సొంతం చేసుకుంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి కమర్షియల్ హిట్గా నిలిచింది. నాగార్జున అక్కినేని, నాగ వంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. దీంతో ఓటీటీ ప్రేక్షకులు లెనిన్ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సినిమా విడుదల తర్వాత హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ప్రత్యేక డ్రోన్ షోలతో చిత్రబృందం ప్రచారాన్ని హోరెత్తించింది. ఈ భారీ ప్రమోషన్లు డిజిటల్ ప్లాట్ఫామ్పై సినిమాకు వ్యూయర్షిప్ పెరగడానికి ప్రధాన కారణమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జీ5 సంస్థ ఈ సినిమాను తమ ప్లాట్ఫామ్లో అత్యంత వేగంగా ఆదరణ పొందుతున్న చిత్రాలలో ఒకటిగా పేర్కొంది. ఇప్పటికే తేహ్రాన్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలు ఇటువంటి రికార్డులను అందుకున్నాయి. తాజా గణాంకాలతో లెనిన్ చిత్రం ఆ జాబితాలో చేరి తన హవాను కొనసాగిస్తోంది. భవిష్యత్తులో ఈ చిత్రం మరిన్ని రికార్డులను అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, ఇతర దక్షిణాది భాషల ప్రేక్షకుల నుండి కూడా ఈ చిత్రానికి విశేష స్పందన లభిస్తోంది. సినిమాలోని మాస్ అంశాలు, తమన్ సంగీతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మొత్తానికి లెనిన్ చిత్రం థియేటర్ల

అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఎట్టకేలకు లెనిన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక లెనిన్ ప్రమోషన్స్ లో అఖిల్ చాలా మెచ్యూర్డ్ గా కనిపించాడు. అలాగే మాట్లాడాడు. అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఎట్టకేలకు లెనిన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక లెనిన్ ప్రమోషన్స్ లో అఖిల్ చాలా మెచ్యూర్డ్ గా కనిపించాడు. అలాగే మాట్లాడాడు. అతడిలోని పరిపక్వత చూసి ఫ్యాన్స్ సైతం సంతోషించారు. అందుకే తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. లెనిన్ తో వచ్చిన హిట్ ని గుర్తుపెట్టుకొని ప్రేక్షకులు తనను ఎలా చూడాలనుకుంటున్నారో అలా మారుతున్నాడు. అయితే, గత కొన్ని రోజులుగా ఆయన చేయబోయే తదుపరి చిత్రం గురించి సోషల్ మీడియాలోనూ, ఫిల్మ్ నగర్ వర్గాల్లోనూ రకరకాల వార్తలు, ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా పవన్ సాధినేని దర్శకత్వంలో అఖిల్ సినిమా చేస్తున్నాడు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీంతోఅభిమానుల్లోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు పవన్ సాధినేని. దీని తరువాత సావిత్రి, సేనాపతి లాంటి సినిమాలు చేశాడు. అవేమీ ఆశించిన ఫలితాలను అందుకోలేదు. ప్రస్తుతం ఆయన దుల్కర్ సల్మాన్ తో ఆకాశంలో ఒక తార సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇక దీని తరువాత అఖిల్ తోనే సినిమా అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఇప్పటికే పవన్.. అఖిల్ కి కథ వినిపించాడని, కథ నచ్చడంతో అయ్యగారు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు పుకార్లు వచ్చాయి. దీంతో అఖిల్ పీఆర్ టీమ్ రంగంలోకి దిగి అసలు నిజం చెప్పింది. 'అఖిల్ అక్కినేని ఇప్పటివరకు తన తదుపరి ప్రాజెక్ట్ను అధికారికంగా సంతకం చేయలేదు. కాబట్టి ఈ విషయమై ప్రచారంలో ఉన్న ఎలాంటి రూమర్లను నమ్మవద్దని, వాటిని సోషల్ మీడియాలో షేర్

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇటీవల వచ్చిన లెనిన్ తో కెరీర్ లో తొలిసారి సాలిడ్ హిట్అందుకున్నాడు. ఈ సినిమాతో ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరాడు అఖిల్. దాంతో ఇప్పడు అదే జోష్ తో అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఇకపై గ్యాప్ రాకూడదని వరుస ప్రాజెక్ట్లను సెట్ చేస్తూ జెట్ స్పీడ్ లో సినిమాలు చేయాలని చూస్తున్నాడు అఖిల్. ఈ నేపథ్యంలో టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాదినేనితో చేతులు కలపనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘సేనాపతి’, ‘దయా’ వంటి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లు, సినిమాలతో తన మార్కు చూపించిన దర్శకుడు పవన్ సాదినేని, ప్రస్తుతం దుల్కర్ సల్మాన్తో ‘ఆకాశంలో ఒక తార‘ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అఖిల్ అక్కినేని కాంబినేషన్లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు కథను సిద్ధం చేసినట్లు సమాచారం. అఖిల్ అక్కినేని మరియు పవన్ సాదినేని కలయికలో రానున్న ఈ చిత్రం చాలా వైవిధ్యంగా ఉండబోతోందని సమాచారం. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది