
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
CM Revanth reddy visits medaram in mulugu: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ల ఆరోపణలు, సవాళ్ల పర్వం కొనసాగుతుంది. నేతలు పరస్పరంపదునైన వాగ్బాణాలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడకు వెళ్లిన, ఏ సభలో మాట్లాడిన బీఆర్ఎస్ పై విరుచుకు పడుతున్నారు. తాజాగా.. సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారం పర్యటించారు. సమ్మక్క సారాలమ్మను దర్శించుకున్నారు.ఆ తర్వాత మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డికి ఆప్యాయంగా రాఖీ కట్టి తన అభిమానంను చాటుకున్నారు.
ఈ నేపథ్యంలో ములుగుజిల్లాలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు చెందిన నేతలకు తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు టార్గెట్ గా ఆరోపణలు చేశారు.
రక్తం పంచుకుని పుట్టుకున్న మంత్రి సీతక్కను తోడబుట్టిన చెల్లెలిలా చూసుకుంటున్నామని అన్నారు. మరోపక్క.. సొంత చెల్లికి న్యాయం చేయలేనోడు.. 2 కోట్ల మందికి ఆడబిడ్డలకు ఏం చేస్తాడని కవిత విషయంలో.. కేటీఆర్ ను సీఎం ఏకీపారేశారు.
ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లిని మెడపట్టి బయటకు నెట్టేశారన్నారు. కొడుకు దుర్మార్గం చేస్తుంటే దౌడ మీద కొట్టాల్సిన తండ్రి ఫాంహౌజ్లో పడుకున్నాడని.. వీళ్లు తెలంగాణకు పట్టిన శనీశ్వరులంటూ విమర్శలు గుప్పించారు.
Read more: Bandi Sanjay: కాంగ్రెస్ ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
కొడుకు దుర్మార్గం చేస్తుంటే దౌడ మీద కొట్టాల్సిన తండ్రి ఫాంహౌజ్లో పడుకున్నాడని.. వీళ్లు తెలంగాణకు పట్టిన శనీశ్వరులు!.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్, కేసీఆర్ లపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో రక్తం పంచుకుని పుట్టుకున్న సీతక్కను తోడబుట్టిన చెల్లెలిలా చూసుకుంటున్నామని అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





