
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

మహిళలు ధరించే దుస్తులు వారి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమని, వాటిని సాకుగా చూపి లైంగిక వేధింపులకు పాల్పడటాన్ని ఏమాత్రం సహించలేమని ఢిల్లీ హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఒక యువతిని లైంగికంగా వేధించిన కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ, నిందితుడిని దోషిగా నిర్ధారించింది.సాజిద్ అలీ అనే వ్యక్తి ఒక యువతిని కొంతకాలంగా వెంబడించడం, అసభ్యకరంగా మాట్లాడటంతో పాటు ఆమెను భౌతికంగా తాకుతూ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసింది. అయితే, ఆ తీర్పును సవాలు చేస్తూ బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది.ఈ అప్పీల్పై విచారణ చేపట్టిన జస్టిస్ చంద్రశేఖరన్ సుధ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం, నిందితుడిని దోషిగా ఖరారు చేసింది. బాధితురాలు జీన్స్ ధరించడంపై నిందితుడి తరఫు న్యాయవాది అడిగిన ప్రశ్నలను విచారణ సందర్భంగా కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. "ఒక మహిళ ఎలాంటి దుస్తులు ధరించాలనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం. సమాజం, ఇరుగుపొరుగు వారు, నిందితుడు లేదా కోర్టులోని న్యాయవాది కూడా ఆమె దుస్తుల గురించి నిర్దేశించే హక్కు లేదు. అది వారి పరిధిలోని అంశం కాదు" అని జస్టిస్ సుధ ఘాటుగా వ్యాఖ్యానించారు.బాధితురాలిని మానసికంగా కృంగదీయడానికి, నైతికంగా కించపరచడానికే దుస్తుల గురించి అసంబద్ధమైన ప్రశ్నలు వేశారని కోర్టు అభిప్రాయపడింది. స్థానిక సంప్రదాయాలు లేదా మతం పేరుతో మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై ఆంక్షలు విధించడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రతులను ఢిల్లీలోని అన్ని జిల్లా కోర్టులకు, జ్యుడీషియల్