
IND vs AFG: భారత జట్టులోకి యమ డేంజర్గాడు వచ్చేశాడ్రోయ్.. ఇక ఆఫ్ఘాన్కు దిబిడి దిబిడే..!
IND vs AFG: భారత జట్టులోకి యమ డేంజర్గాడు వచ్చేశాడ్రోయ్.. ఇక ఆఫ్ఘాన్కు దిబిడి దిబిడే..!
© 2026 nimisham.in

IND vs AFG: భారత జట్టులోకి యమ డేంజర్గాడు వచ్చేశాడ్రోయ్.. ఇక ఆఫ్ఘాన్కు దిబిడి దిబిడే..!

IND vs AFG టీ20కి సంజు, ఇషాన్కు ఇన్.. దూబే ఔట్?.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే!

IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ తొలి టీ20పై క్లారిటీ.. మ్యాచ్ డేట్పై వీడిన చిక్కుముడి..?

IND vs AFG | భారత్, అఫ్గనిస్థాన్ తొలి టీ20 వాయిదా.. షెడ్యూల్లో మార్పులకు కారణమిదే..!

Ind vs Afg: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గాన్ టీ20 సిరీస్కు స్టార్ పేసర్ దూరం

IND vs AFG: భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా..?

IND Vs AFG: ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్కు బీసీసీఐ అండ.. ఇప్పటివరకు ఎన్ని స్టేడియంలు ఇచ్చారో తెలుసా?

Ind vs Afg: అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్నెస్ సాధించిన స్టార్ ఆల్రౌండర్

Womens Asia Cup 2026 : మహిళల ఆసియాకప్ 2026లో భాగంగా దుబాయ్ వేదికగా హాంగ్కాంగ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత ఓపెనర్ స్మృతి మంధాన (124 ; 64 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో చెలరేగింది. ఈ క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. దీంతో హాంగ్కాంగ్ ముందు 194 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. HUNDRED! 💯 Vice-Smriti Mandhana brings up her second T20I century 🥳 Updates ▶️ | #INDvHK — BCCI Women (@BCCIWomen) September 3, 2026 Rohit Sharma : మీటింగ్కు రాని అజిత్ అగార్కర్.. రోహిత్ శర్మ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక వ్యాఖ్యలు.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ (28; 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు తొలి వికెట్కు శుభారంభాన్ని అందించారు. 7.6 ఓవర్లలో 74 పరుగులు జోడించారు. వేగంగా ఆడే క్రమంలో షఫాలీ ఔటైంది. వన్డౌన్లో వచ్చిన ప్రతీకా రావల్ (10), రిచా ఘోష్ (11), హర్మన్ప్రీత్ కౌర్(10) విఫలమైనప్పటికి కూడా మరో ఎండ్ స్మృతి మంధాన తనదైన శైలిలో దూకుడుగా ఆడింది. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బౌండరీ వరద పారించింది. 57 బంతుల్లోనే సెంచరీ సాధించింది. టీ20ల్లో మంధానకు ఇది రెండో శతకం. సెంచరీ తరువాత కూడా స్మృతి దూకుడుగా ఆడింది. ఆఖరి ఓవర్లో రనౌట్ అయింది. స్మృతి రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. హాంగ్ కాంగ్ బౌలర్లలో మరీనా లాంప్లో రెండు వికెట్లు తీసింది. రుచిత వెంకటేష్, జోయిలీన్ కౌర్లు చెరో ఓ వికెట్ సాధించారు

ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టుకు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నారు. ఐచి-నగోయా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్కు భారత బృందాన్ని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. మొత్తం 768 మంది సభ్యులతో కూడిన భారత బృందంలో 503 మంది క్రీడాకారులు, 246 మంది అధికారులు, సహాయక సిబ్బంది, 19 మంది కంటింజెంట్ సిబ్బంది ఉన్నారు.ఆసియా గేమ్స్ సమయంలో రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు విశ్రాంతి ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్తో భారత్ వైట్బాల్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గంభీర్కు విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో లక్ష్మణ్ భారత పురుషుల జట్టు బాధ్యతలు చేపట్టనున్నారు.లక్ష్మణ్కు సునీల్ జోషి, హృషీకేశ్ కనిత్కర్, శుభదీప్ ఘోష్ సహాయకులుగా వ్యవహరిస్తారు. మహిళల జట్టుకు అమోల్ ముజుందార్ హెడ్ కోచ్గా వ్యవహరించనున్నారు.ఇటీవలే జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లోనూ లక్ష్మణ్ భారత జట్టుకు కోచ్గా వ్యవహరించారు. ఇంగ్లాండ్తో వైట్బాల్ సిరీస్ తర్వాత గంభీర్కు విశ్రాంతి ఇచ్చిన సమయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.ఆసియా గేమ్స్లో భారత పురుషుల, మహిళల జట్లు డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగనున్నాయి. 2022 హాంగ్జౌ ఆసియా గేమ్స్లో రెండు జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. అప్పుడు పురుషుల జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహించగా.. మహిళల జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యం వహించారు.మరోవైపు ఆసియా గేమ్స్లో క్రికెట్ జట్లకు వసతి ఏర్పాట్లపై ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో జపాన్ క్రికెట్ సంఘం సీఈవో నవోకి అలెక్స్ మియాజీ కీలక

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. YS Jagan Mohan Reddy: 'పురుషోత్తపట్నం నుంచి ఉన్న పంపులతో గోదావరి నీటిని ఎత్తి.. పోలవరం ఎడమ కాలువలో వదిలి దాన్ని చూపించి పోలవరం ప్రాజెక్టు నీళ్లు తెచ్చేశాం అంటూ డప్పు కొట్టుకోవడం ఏమిటి?' అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. పోలవరం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు రాకున్నా ప్రచారం మాత్రం వేరే లెవల్ అని తెలిపారు. నీళ్లు పురుషోత్తపట్నానివి.. కాలువ వైఎస్సార్ హయాంలో నిర్మించినది అని పేర్కొన్నారు. క్రెడిట్ కోసం ఆరాటం మాత్రం మీదా? ఇదేం మ్యాజిక్? అని నిలదీశారు. 'సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వరుసగా చేస్తున్న పబ్లిసిటీ ఈవెంట్లన్నీ ప్రజలను మభ్యపెట్టడానికే కదా? మొన్న వెలిగొండ, ఇవాళ పోలవరం ఎడమ కాలువ. మీరు మొదలుపెట్టని.. మీరు పూర్తి చేయని ప్రాజెక్టులకు మీ పేరు చెప్పుకోవడం, మీ అనుకూల మీడియాతో వాటి సృష్టికర్తలు మీరు అన్నట్టుగా భజన చేయించుకోవడం మీకు అలవాటే' అని చంద్రబాబు పబ్లిసిటీపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పురుషోత్తపట్నం పంపుల ద్వారా విడుదల చేస్తామంటున్నది 3,500 క్యూసెక్కుల నీళ్లు. ఈ ప్రాజెక్ట్, ఈ పంపులు కొత్తవికాదు కదా? ఇప్పటికే ఉన్నవే కదా? మరెందుకు ఈ డ్రామా?' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ప్రధాన పనులు వైఎస్సార్ హయాంలోనే పూర్తయితే.. ఇప్పుడు ఆ పనులన్నింటి మీద నిలబడి అంతా నేనే చేశా అని చెప్పుకోవడం చంద్రబాబు మీకే చెల్లింది' అని వైఎస్ జగన్ విమర్శించారు. 'పోలవరం ప్రాజెక్టు విషయంలో 2014-19 మధ్య

బాలీవుడ్ నటి స్వర భాస్కర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర దుమారం రేపాయి. 2018లో విడుదలైన 'పద్మావత్' చిత్రంలోని 'జోహార్' (సామూహిక ఆత్మాహుతి) ఘట్టాన్ని విమర్శిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, కర్ణిసేన వంటి సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఆమె మాట్లాడారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్వర భాస్కర్, శత్రువుల చేతిలో చిక్కకుండా ఉండేందుకు ఆత్మాహుతి చేసుకోవడాన్ని గొప్పగా చిత్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. "ఆత్మహత్య చేసుకోకపోతే నన్ను నేను పిరికిదానిలా భావించాలా? అత్యాచార ఘటనలు పెరుగుతున్న ప్రస్తుత సమాజంలో బాధితులకు మనం ఇలాంటి సందేశమే ఇవ్వాలనుకుంటున్నామా?" అని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో, తాను రాణి పద్మావతిని ఉద్దేశించి 'పిరికిపంద' అనే పదాన్ని వాడలేదని ఆమె వివరణ ఇచ్చారు.ఈ వివాదంపై బీజేపీ తీవ్రస్థాయిలో స్పందించింది. స్వర భాస్కర్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను చదువుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విమర్శించారు. మహిళలు తోటి మహిళలను గౌరవించుకోవాలని, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. మరోవైపు, హిందూ సమాజాన్ని, రాజపుత్ర మహిళలను కించపరిచారంటూ బీహార్కు చెందిన బీజేపీ నేత కృష్ణ కుమార్ సింగ్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.కర్ణిసేన సైతం స్వర భాస్కర్ను తీవ్రంగా హెచ్చరించింది. "హిందూ యోధురాళ్లను, వారి అత్యున్నత త్యాగాలను అవమానిస్తే కర్ణిసేన ఎప్పటికీ క్షమించదు" అని ఆ సంస్థ మహిళా విభాగం అధ్యక్షురాలు కీర్తి రాథోడ్ స్పష్టం చేశారు. కేవలం హిందూ సంప్రదాయాలను

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Minister Konda Surekha targets cm revanth reddy: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వివాదం అంశంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే కొండా సురేఖ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయ్యారు. అంతే కాకుండా.. సీఎం రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు గుప్పించారు. పదేండ్ల పాటు తానే సీఎం అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని, తొలుత చర్యలు ఆయనపై తీసుకొవాలని ఏకీపారేశారు. బీసీ బిడ్డకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయమా అంటూ ఫైర్ అయ్యారు. ఇక తాజాగా.. మరల మీడియా సమావేశంలో కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలతో మా మీద బలవంతంగా మాట్లాడించారన్నారు. ఎవరూ స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడలేదు.. ఫోన్ చేసి పిలిస్తే బలవంతంగా వెళ్లామని వాళ్లే చెబుతున్నారన్నారు. వెనకనుండి మాట్లాడించిన వాళ్ల పేర్లు చెప్పదలుచుకోలేదన్నారు. కానీ ఎవరు చెప్పించారో మాకు తెలుసని కొండాసురేఖ పేర్కొన్నారు. నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడిందన్నారు. తనను వద్దు అని చెప్పే అధికారం నాకు లేదు.. తన జీవితం తన ఇష్టమన్నారు. నేను బీసీ మహిళా మంత్రిని.. నా భర్త మున్నూరు కాపు, నేను పద్మశాలి కులమని, మా కులం ఓట్లు 16 శాతం ఉన్నాయన్నారు. నా మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా నా శాఖను నిర్వహిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఒకపక్క కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేదని గొడవ నడుస్తుందన్నారు. అసలు తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం తప్పని మాట్లాడారు. నన్ను ఏమైనా చేయాలి

Triple Century: బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో సెప్టెంబర్ 2వ తేదీ నిలిచిపోతుంది. సౌతాఫ్రికాలోని పోచెఫ్స్ట్రూమ్ మైదానంలో బంగ్లాదేశ్ ఏ జట్టు కెప్టెన్ తౌహీద్ హృదోయ్ చారిత్రాత్మక త్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. విదేశీ గడ్డపై ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ బాదిన తొలి బంగ్లాదేశ్ బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికా ఏ జట్టుతో జరిగిన రంజీ స్థాయి ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో రైట్ హ్యాండ్ బ్యాటర్ తౌహీద్ హృదోయ్ క్రీజులో పాతుకుపోయి ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ ఏకంగా 450 బంతుల్లో త్రిపుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్లో 25 ఫోర్లు, 6 భారీ సిక్సర్ల సాయంతో మైదానం నలుమూలలా బాండరీల వర్షం కురిపించాడు. ఒక విదేశీ పర్యటనలో బంగ్లాదేశ్ బ్యాటర్ ఈ స్థాయి స్కోరు సాధించడం క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. బంగ్లాదేశ్ ఏ జట్టు మొదట్లోనే తీవ్ర కష్టాల్లో పడింది. ఓపెనర్లు మహముదుల్ హసన్ జోయ్, పర్వేజ్ హుస్సేన్ ఇమాన్, మహమ్మద్ నయీమ్ వికెట్లను త్వరత్వరగా కోల్పోయి జట్టు ఒత్తిడిలో కూరుకుపోయింది. ఆ క్లిష్ట సమయంలో కెప్టెన్ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్న తౌహీద్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వికెట్ కీపర్ జాకిర్ అలీతో కలిసి ఐదో వికెట్కు 292 బంతుల్లో 151 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జాకిర్ అలీ 94 పరుగుల వద్ద ఔటై తృప్తిలో సెంచరీ చేజార్చుకున్నా తౌహీద్ మాత్రం ఏకాగ్రత కోల్పోలేదు. first ever Bangladeshi Batsman to scored Triple-Hundred for Bangladesh "A" that's at South Africa 🥵 What an innings* Take a bow Hridoy! #SAavsBANa జాకిర్ అలీ అవుటైన తర్వాత ఆల్రౌండర్ మహమ్మద్ సైఫుద్దీన్తో కలిసి ఆరో వికెట్కు ఏకంగా 185 పరుగులు జత చేశాడు. సౌతాఫ్రికా పేసర్ల బౌన్స్, స్వింగ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ను కొండంత స్కోరు వైపు నడిపించాడు. గతంలో
సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే కేవలం భారీ విజువల్స్, వందల కోట్ల బడ్జెట్, స్టార్ కాస్టింగ్ మాత్రమే ఉంటే సరిపోదని మరోసారి రుజువైంది. బలమైన కథ, గుండెలను తాకే భావోద్వేగాలు ఉంటే చిన్న చిత్రాలు కూడా ప్రపంచ స్థాయి బాక్సాఫీస్ను షేక్ చేయగలవని అనేక సినిమాలు నిరూపించాయి. మన దగ్గర వచ్చిన 'హనుమాన్' వంటి చిత్రాలు అల్ప బడ్జెట్తో వచ్చి ఊహించని వసూళ్లు సాధించినట్లే, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఒక చైనీస్ ఫ్యామిలీ డ్రామా భారీ సంచలనం సృష్టిస్తోంది. అదే 'డియర్ యూ' (Dear You). హాంగ్చున్ లాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం చైనీస్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర తిరగరాస్తోంది. 2026 ఏప్రిల్ 30న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సుమారు 14 మిలియన్ డాలర్ల బడ్జెట్తో (మన భారతీయ కరెన్సీలో రూ. 132 కోట్లు) రూపుదిద్దుకుంది. అయితే ఈ చిన్న బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్ వద్ద రాబట్టిన వసూళ్లు చూసి గ్లోబల్ ట్రేడ్ వర్గాలు సైతం నోరెళ్లబెడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా చైనాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా 300 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. అంటే ఇండియన్ రూపాయిల్లో ఈ వసూళ్లు దాదాపు రూ. 2,849 కోట్లకు పైగానే ఉండటం విశేషం! పెట్టిన పెట్టుబడికి ఏకంగా ఇరవై రెట్లకు పైగా లాభాలను తీసుకొచ్చి 2026లో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద సంచలనాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. చైనీస్ భాషలో 'డియర్ యూ' అంటే 'అమ్మమ్మకు ప్రేమలేఖ' అనే ఆత్మీయ భావం వస్తుంది. అప్పులు, కుటుంబ సమస్యల్లో కూరుకుపోయిన ఒక యువకుడు, థాయ్లాండ్లో కోటీశ్వరుడిగా స్థిరపడ్డాడని భావిస్తున్న తన తాతను వెతికేందుకు బయలుదేరడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. తీరా అక్కడికి వెళ్లాక దశాబ్దాల క్రితం నాటి ఒక హృదయవిదారక రహస్యం బయటపడుతుంది. వలసల నేపథ్యం, మానవ అనుబంధాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ

భారత పేస్ బౌలర్ ఆకిబ్ నబీ ఇంగ్లండ్ కౌంటీల్లో అరంగేట్రం చేశాడు. కౌంటీ చాంపియన్షిప్లో భాగంగా యార్క్షైర్తో మ్యాచ్ సందర్భంగా సర్రే జట్టు తరఫున ఎంట్రీ ఇచ్చాడు. కాగా కౌంటీ చాంపియన్షిప్ డివిజన్ వన్-2026లో భాగంగా లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో సర్రే- యార్క్షైర్ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన సర్రే తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. యార్క్షైర్ బ్యాటింగ్కు దిగింది. రంజీల్లో దుమ్ములేపాడు జమ్మూ కశ్మీర్కు చెందిన 29 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్ జట్టు తొలిసారి రంజీ టైటిల్ గెలవడంలో అతడిదే కీలక పాత్ర. గత రెండు సీజన్లలో కలిపి వందకు పైగా వికెట్లు తీసి ఆకిబ్ నబీ తానేంటో నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో భారత్-ఎ తరఫున ఇటీవలే అరంగేట్రం చేసిన ఆకిబ్.. శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా వైదొలగగా.. అతడి స్థానంలో సెలక్టర్లు నబీని ఎంపిక చేశారు. అయితే, లంకతో రెండు టెస్టులు ఆడిన భారత తుదిజట్టులో మాత్రం నబీకి చోటు దక్కలేదు. కివీస్ టూర్ సన్నాహకాల్లో భాగంగా ఇక టీమిండియా తదుపరి టెస్టు సిరీస్లో న్యూజిలాండ్తో తలపడేందుకు అక్కడికి వెళ్లనుంది. కివీస్ టూర్లో బౌన్సీ పిచ్లపై నబీ సేవలను వాడుకోవాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఆ సన్నాహకాల్లో భాగంగానే అతడు ఇంగ్లండ్ కౌంటీల్లో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం చేసినట్లు వార్తలు వచ్చాయి. కాగా ఆకిబ్ నబీ సర్రే తరఫున యార్క్షైర్తో పాటు.. హోవ్ వేదికగా సస్సెక్స్తో.. సర్రే సొంతమైదానంలో గ్లామోర్గాన్ జట్టుతో జరిగే మ్యాచ్లలో పాల్గొననున్నాడు. ఇదిలా ఉంటే.. సర్రే తరఫున ఆకిబ్ నబీ తాజాగా అరంగేట్రం చేయగా.. భారత ఆటగాడు రాహుల్ చహర్ కూడా తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇదే జట్టులో ఉన్న భారత ఆల్రౌండర్ మహిపాల్ లామ్రోర్

Anakapalle: నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే! Anakapalle: పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని ఎమ్మెల్యే బొబ్బిలి RVSKK రంగారావు (బేబీ నాయన) దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే బేబీ నాయన పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, అనకాపల్లి ప్రాంతం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని శ్రీ నూకాంబిక అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీధర్, టెంపుల్ డైరెక్టర్లు పొలిమేర ఆనంద్ కుమార్, మారిశెట్టి శంకర్రావు, కాండ్రేగుల రాజు, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ మీడియా కోఆర్డినేటర్ ఎస్. భానుచందర్ (అఖి)తో పాటు పలువురు ముఖ్య నాయకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తమ స్థానాలను కోల్పోయారు. స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. ఇటీవల జరిగిన శ్రీలంక పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తమ స్థానాలను కోల్పోయారు. మరోవైపు, యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శనతో ర్యాంకింగ్స్లో మెరుగైన స్థానాన్ని సాధించాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో మూడు ఇన్నింగ్స్ల్లో కేవలం ఒకే ఒక్క అర్ధశతకం సాధించిన శుభ్మన్ గిల్.. తాజాగా ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు కోల్పోయి.. తొమ్మిదో స్థానంలో నిలిచాడు. వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఏడో స్థానంతో భారత్ తరఫున బ్యాటర్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ 11వ స్థానంలో నిలిచాడు. శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల్లో కలిపి రెండు శతకాలతో బాదిన దేవదత్ పడిక్కల్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో అదరగొట్టాడు. ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి 54వ స్థానానికి చేరుకున్నాడు. లంక గడ్డపై భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా పడిక్కల్ నిలిచాడు. బౌలింగ్ విభాగంలోనూ భారత్కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానాన్ని కోల్పోయి.. మూడో స్థానానికి పడిపోయాడు. మోకాలి గాయం కారణంగా బుమ్రా జూలై మధ్య నుంచి ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ తొలి స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ రెండో స్థానంలో నిలిచాడు. సెప్టెంబర్ మధ్యలో అఫ్గానిస్థాన్తో జరిగే టీ20 సిరీస్కు బుమ్రా ఎంపికైనప్పటికీ, అతడి ఫిట్నెస్ ఆధారంగానే తుది జట్టులో ఆడటం ఆధారపడి ఉంటుంది. ఇది భవిష్యత్ లో రిలీజ్ అయ్యే అతడి ఐసీసీ

ఢిల్లీ వేదికగా కొండా సురేఖ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. తన పైన హైకమాండ్ చర్యలకు సిద్దం అవుతున్న వేళ కొండా సురేఖ నేరుగా సీఎం రేవంత్ తో అమీ తుమీకి సిద్దం అయ్యారు. తన పైన చర్యలు తీసుకునే ముందే రేవంత్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ చీఫ్ ఖార్గేతో భేటీ అయిన కొండా ఆ తరువాత ఈ వ్యాఖ్యలు చేసారు. బీసీ కార్డు తెర మీదకు తీసుకొచ్చారు. తన పైన వేటు వేస్తే ఆ వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయాలతోనూ సురేఖ సిద్దం అయినట్లు తెలుస్తోంది.కొండా సురేఖ ఢిల్లీ కేంద్రంగా మరో సంచలనానికి కారణమయ్యారు. సీఎం రేవంత్ తో పాటుగా కేబినెట్ మంత్రులను టార్గెట్ చేసారు. తాను తప్పు చేయలేదని.. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను తాను బాధ్యత ఎలా వహిస్తానని ప్రశ్నిస్తున్నారు. తనకు అసలు నోటీసులు ఇవ్వటమే తప్పు అని తేల్చి చెప్పారు. రాహుల్ పదే పదే మహిళలు స్వతంత్రంగా బతకాలని చెబుతూ ఉంటారని.. ఇప్పుడు చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. బీసీ అయిన తన పైనే చర్యలు ఉంటాయా.. రేవంత్ పైన వ్యాఖ్యలు చేస్తన్న ఇతర వర్గాలకు చెందిన వారి పైన ఉండవా అంటూ ప్రశ్నించారు. తానే పదేళ్లు సీఎంగా ఉంటానని రేవంత్ ఎలా చెబుతారని సురేఖ నిలదీసారు. పరకాల సీటు రేవంత్ ఎలా ప్రకటిస్తారని.. ఇది క్రమశిక్షణా రాహిత్యం కింద కు రాదా అని అడుగుతున్నారు. ముఖ్యమంత్రిగా తానే ఉంటానని చెబుతున్న రేవంత్ పైన ర్యలు ఉండవా అంటూ ప్రశ్నిస్తున్నారు.నా కంటే ముందు రేవంత్ పై చర్యలు తీసుకోవాలి - ఢిల్లీలో సురేఖ సంచలనం..!!వేటు వేస్తే ఆ వెంటనే.. యాక్షన్ ప్లాన్ సిద్దంతన బిడ్డ ను రెచ్చగొడితే స్పందించిందని .. ఇదే విషయాన్ని తాను రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్ కు లేఖ ద్వారా వివరించానని చెప్పుకొచ్చారు. కాగా.. ఇదే సమయంలో కొండా సురేఖ తనతో

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Jagga reddy Strong counter on brs ktr: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల ఫిరంగులు పేలుతున్నాయి. ఒకరిపై మరోకరు పదునైన విమర్శనాస్త్రాల్ని సంధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పాలనపై బీఆర్ఎస్ చార్జీషీట్ విడుదల చేసింది. దీనిలో కేటీఆర్ కాంగ్రెస్ పాలనను ఉతికి ఆరేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కిండ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అని కొనియాడారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం లో స్వేచ్ఛ లేదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన లో ఉద్యోగాలు భర్తీ జరగలేదన్నారు. 70 వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం అదించిందని చెప్పారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లో స్వేచ్ఛ వచ్చిందన్నారు. కాంగ్రెస్ పాలన లో పోలీసుల నిర్బంధాలు లేవన్నారు. పద్దతి లేని కుటుంబం పద్దతిగల కుటుంబం పై మాట్లాడుతుందని కేటీఆర్ పై సెటైర్ లు వేశారు. అసలు.. రాహుల్ పై మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు కేటీఆర్ అంటూ ఏకీపారేశారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ 194 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన నేపథ్యంలో ఆ జట్టు ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్ గాయంపై వివాదం మొదలైంది. మ్యాచ్ సందర్భంగా కాలి పిక్కకు గాయమైన ఇమామ్.. రెండు ఇన్నింగ్స్లలోనూ బ్యాటింగ్కు రాకపోవడంపై పాకిస్థాన్ సెలక్షన్ కమిటీలోని సీనియర్ సభ్యుడు ఆకిబ్ జావేద్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) విచారణ జరుపుతుందని వెల్లడించారు. పాకిస్థాన్ నాలుగు సభ్యుల సెలక్షన్ ప్యానెల్లో ఉన్న ఆకిబ్ జావేద్.. కండరాల గాయం కారణంగా ఆటగాడు రెండు ఇన్నింగ్స్లలోనూ బ్యాటింగ్కు దూరంగా ఉండటం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గాయాలు క్రికెట్లో సహజమేనని, గతంలో ఆటగాళ్లు గాయాలతోనూ కట్టులు కట్టుకుని బ్యాటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. అయితే ఇమామ్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని, ఇది ఆందోళన కలిగించే అంశమని అన్నారు. లార్డ్స్ టెస్టు తొలి రోజు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇమామ్ ఎడమ కాలి పిక్కకు గాయమైంది. దీంతో మ్యాచ్లో మిగిలిన భాగానికి అతడు దూరమయ్యాడు. అయితే నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు ఇమామ్ మైదానంలోని అవుట్ఫీల్డ్లో కనిపించాడు. కాలికి భారీగా కట్టు కట్టుకుని షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన అతడు నడిచేటప్పుడు కుంటుతూ కనిపించడం చర్చకు దారితీసింది. లార్డ్స్ టెస్టు కోసం తుది జట్టు ఎంపిక విషయంలో సెలెక్టర్లు, జట్టు యాజమాన్యం మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలపైనా ఆకిబ్ జావేద్ స్పందించారు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉబైద్ షాను జట్టులోకి తీసుకోవాలని తాను సూచించినట్లు తెలిపారు. వికెట్ కీపర్-బ్యాటర్ ఘాజీ ఘోరీకి అవకాశం ఇవ్వాలని, మహమ్మద్ రిజ్వాన్ స్థానంలో అతడిని ఆడించాలని తాను అభిప్రాయపడినట్లు చెప్పారు. అయితే తుది జట్టు ఎంపికలో తన సూచనలు పూర్తిగా అమలు కాలేదని పేర్కొన్నారు. హెడ్డింగ్లీ, లార్డ్స్లో జరిగిన తొలి రెండు టెస్టుల్లో పాకిస్థాన్

ఛాతీలో నొప్పి లేదా మంట వస్తే చాలామంది గ్యాస్ సమస్యగా భావిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇదే తరహా లక్షణాలు గుండె సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. గ్యాస్ నొప్పి, గుండెపోటు లక్షణాల మధ్య తేడాను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంటర్నెట్ డెస్క్: ఛాతీలో మంట, నొప్పి లేదా అసౌకర్యం కనిపించినప్పుడు చాలామంది దాన్ని గ్యాస్ సమస్యగా భావిస్తుంటారు. ముఖ్యంగా అజీర్తి, కడుపు ఉబ్బరం, వికారం వంటి లక్షణాలు ఉంటే గ్యాస్ట్రిక్ సమస్యేనని అనుకుంటారు. అయితే ఇలాంటి లక్షణాలు కొన్ని సందర్భాల్లో గుండెకు సంబంధించిన సమస్యల్లోనూ కనిపించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఛాతీలో అసౌకర్యం కలిగినప్పుడు కారణాన్ని నిర్ధారించకుండా నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని సూచిస్తున్నారు. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడు సాధారణంగా పొట్ట పైభాగంలో అసౌకర్యం, ఛాతీ కింది భాగంలో నొప్పి లేదా మంట కనిపించవచ్చు. కడుపు ఉబ్బినట్లు అనిపించడం, తేన్పులు రావడం, అజీర్తి వంటి సమస్యలు కూడా ఉండొచ్చు. అయితే కేవలం లక్షణాలను బట్టి ఇది గ్యాస్ సమస్యేనని ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. గుండెకు రక్తప్రసరణ తగ్గినప్పుడు ఛాతీలో బిగుతుగా, భారంగా లేదా ఒత్తిడిగా అనిపించవచ్చు. కొందరిలో ఛాతీ నొప్పితో పాటు వికారం, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో గుండె సమస్య లక్షణాలు అజీర్తి లేదా గ్యాస్ సమస్యను పోలి ఉండే అవకాశం ఉంది. అందుకే ఛాతీ నొప్పిని కేవలం గ్యాస్ అని భావించి ఇంట్లోనే ఉండిపోవడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగేకొద్దీ గుండె సంబంధిత సమస్యలపై జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర వంటి అంశాలు ఉన్నవారు ఛాతీ సంబంధిత లక్షణాలను తేలిగ్గా తీసుకోకూడదు. ఛాతీలో కొత్తగా లేదా తీవ్రమైన నొప్పి రావడం, నొప్పి తగ్గకుండా కొనసాగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లటి చెమటలు, మూర్ఛ

దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2026లో సౌత్ జోన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. నార్త్ జోన్తో జరిగిన రెండో సెమీఫైనల్లో సౌత్జోన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్పోర్ట్స్ డెస్క్: హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో దులీప్ ట్రోఫీ 2026లో సౌత్ జోన్ జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-2 వేదికగా నార్త్ జోన్తో జరిగిన రెండో సెమీఫైనల్లో సౌత్ జోన్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 182 పరుగుల లక్ష్యాన్ని సౌత్ జోన్ 43.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్లు కోల్పోయి 267 స్కోరుతో బుధవారం ఆటను కొనసాగించిన నార్త్ జోన్.. 297 పరుగులకే ఆలౌటైంది. అనంతరం181 పరుగుల లక్ష్యాన్ని సౌత్ జోన్ 43.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు రికీ భుయ్ (42), నారాయణ్ జగదీశన్ (43) శుభారంభం అందించారు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన కెప్టెన్ తిలక్ వర్మ (51*) రెండో ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీతో రాణించాడు. రవిచంద్రన్ స్మరన్ (32*) తిలక్ వర్మకు సపోర్టుగా నిలిచి.. జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తొలి ఇన్నింగ్స్లో నార్త్ జోన్ 195 పరుగులకే ఆలౌటైంది. సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ (116 నాటౌట్; 250 బంతులు) శతకంతో మెరవడంతో తొలి ఇన్నింగ్స్లో సౌత్ జోన్ 312 పరుగులు చేసి.. 117 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండు ఇన్నింగ్స్ల్లోనూ అదరగొట్టిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. తొలి సెమీ ఫైనల్లో సెంట్రల్ జోన్పై 4 వికెట్ల తేడాతో ఈస్ట్ జోన్ గెలిచిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 6 నుంచి చెపాక్ స్టేడియంలో దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది. తుదిపోరులో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్తో సౌత్ జోన్ తలపడనుంది

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Minister Konda Surekha sensational comments on cm revanth reddy: మంత్రి కొండా సురేఖ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో ఏఐసీసీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. అంతే కాకుండా తన వ్యక్తిగత పనుల కోసమే ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం తనను పిలవలేదని కాసేటికి క్రితం చెప్పారు. అయితే.. తాజాగా.. మంత్రి కొండా సురేఖ చిట్ చాట్ లో మీడియాతో మాట్లాడారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చర్యలు తీసుకునేముందు సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఆయన .. పదేళ్ల పాటు తానే సీఎం అని చెప్పుకుంటున్నారని అన్నారు. మంత్రులు, నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారని ఢిల్లీ వేదికగా తిరుగుబావుట ఎగురవేశారు. తనను రాజీనామా చేయమని ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం చెప్పలేదన్నారు. అంతే కాకుండా వివాదాలల్లో.. బీసీ బిడ్డకు ఒక న్యాయం, ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా?.. అంటూ ఫైర్ అయ్యారు. పలువురు మంత్రులపై అనేక ఆరోపణలు ఉన్నాయని, వాటికి ఏం సమాధానం చెబుతారు?.. ఏం చర్యలు తీసుకుంటారు?.. అంటూ మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ అధిష్టానంపై తన ధిక్కార స్వరం వినిపించారు. అంతే కాకుండా తన వివాదంకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ కు అన్ని విషయాల్ని రాతపూర్వకంగా తెలియజేసినట్లు మంత్రి కొండాసురేఖ తెల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ లో మంత్రి కొండాసురేఖ వ్యాఖ్యలు ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో హీట్ ను పెంచేశాయి. ఇప్పటి వరకు తెలంగాణలో సీఎం రేవంత్ పై మండిపడిన మంత్రి కొండా

Sachin vs Virat: భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల మధ్య పోలిక ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే వీరిద్దరి వన్డే కెరీర్ తొలి ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వస్తాయి. ఒకరు సెంచరీ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తే, మరొకరు సెంచరీల వర్షం కురిపించారు. క్రికెట్ దేవుడిగా కొలిచే సచిన్ టెండూల్కర్ 1989లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేశారు. ఆశ్చర్యకరంగా తన మొదటి మ్యాచ్లో సచిన్ డకౌట్గా వెనుతిరిగారు. ఆ తర్వాత నుంచి ఏకంగా ఐదేళ్ల పాటు అంటే 1989, 1990, 1991, 1992, 1993 సంవత్సరాల్లో ఒక్క వన్డే సెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు. మూడంకెల స్కోరు సాధించడానికి సచిన్ చాలా కాలం పాటు వేచి చూడాల్సి వచ్చింది. సచిన్ తన వన్డే కెరీర్లోని 76వ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాపై తొలి సెంచరీ సాధించి సెంచరీల ఖాతాను ఓపెన్ చేశాడు. ఆ తర్వాత నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా సచిన్ రికార్డుల వేట మొదలుపెట్టారు. తన కెరీర్ పూర్తయ్యే సమయానికి వన్డేల్లో ఏకంగా 49 సెంచరీలు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్ మొత్తంలో 100 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. సచిన్ వన్డే కెరీర్ తొలి ఐదేళ్లలో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోతే, విరాట్ కోహ్లీ మాత్రం అదే సమయంలో విధ్వంసం సృష్టించాడు. 2008లో అరంగేట్రం చేసిన కోహ్లీ తన తొలి ఐదేళ్లలోనే ఏకంగా 13 వన్డే సెంచరీలు బాదేశాడు. తొలి ఏడాది 2008లో సెంచరీ చేయకపోయినప్పటికీ 2009లో ఒకటి, 2010లో మూడు, 2011లో నాలుగు, 2012 నాటికి ఐదు సెంచరీలు సాధించి రన్ మెషిన్గా పేరు తెచ్చుకున్నాడు. సచిన్ నెలకొల్పిన 49 వన్డే సెంచరీల రికార్డు సుమారు 11 సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఉంది. 2023 నవంబర్లో న్యూజిలాండ్పై జరిగిన మ్యాచ్లో కోహ్లీ తన
5/5దులీప్ ట్రోఫీ 2026/27 సీజన్లో సౌత్ జోన్ ఫైనల్కు దూసుకెళ్లింది. నార్త్ జోన్తో జరిగిన సెమీ ఫైనల్లో కెప్టెన్ తిలక్ వర్మ అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును ముందుండి నడిపించాడు. ఏడు వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని అందించి, టైటిల్ పోరుకు అర్హత సాధించేలా చేశాడు. సెప్టెంబర్ 6 నుంచి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఫైనల్లో ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్ జోన్తో సౌత్ జోన్ తలపడనుంది.మ్యాచ్ చివరి రోజు 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ జోన్కు కెప్టెన్ తిలక్ వర్మ (79 బంతుల్లో 51 నాటౌట్) అండగా నిలిచాడు. మొదటి ఇన్నింగ్స్లో కీలకమైన సెంచరీ (116 నాటౌట్)తో జట్టును ఆదుకున్న తిలక్, రెండో ఇన్నింగ్స్లోనూ అదే బాధ్యతాయుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. రవిచంద్రన్ స్మరణ్ (32 నాటౌట్)తో కలిసి నాలుగో వికెట్కు అబేధ్యంగా 80 పరుగులు జోడించి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు.అంతకుముందు నాలుగో రోజు ఆట ప్రారంభించిన నార్త్ జోన్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని భావించింది. అయితే, సౌత్ జోన్ పేసర్ ఎండీ నిధీశ్ వారి ప్రణాళికలను దెబ్బతీశాడు. వరుస విరామాల్లో వికెట్లు తీసి నార్త్ జోన్ పతనాన్ని శాసించాడు. చివరి మూడు వికెట్లను పడగొట్టి, ఇన్నింగ్స్లో మొత్తం 5 వికెట్లు (5/56) సాధించాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అతనికి ఇది 10వ ఐదు వికెట్ల ప్రదర్శన. దీంతో నార్త్ జోన్ రెండో ఇన్నింగ్స్లో 297 పరుగులకు ఆలౌట్ అయింది.లక్ష్య ఛేదనలో సౌత్ జోన్కు ఓపెనర్ రికీ భుయ్ (42) దూకుడైన

ICC Rankings 2026: ప్రపంచ క్రికెట్లో భారత జట్టు తన అజేయ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం వన్డే, టీ20 ఫార్మాట్లలో టీమిండియా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. టెస్టుల్లో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ, మరో విజయం సాధిస్తే మూడో స్థానానికి చేరే అవకాశం స్పష్టంగా ఉంది. పాకిస్థాన్ జట్టు విషయానికొస్తే వన్డేల్లో మాత్రమే ఐదో స్థానంలో నిలిచి టాప్-5లో చోటు దక్కించుకుంది. టెస్టుల్లో ఎనిమిదో స్థానానికి పడిపోగా, టీ20ల్లో ఆరో స్థానానికి పరిమితమైంది. వ్యక్తిగత బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. వన్డేల్లో ఓపెనర్ శుభ్మన్ గిల్ మొదటి స్థానంలో నిలవగా, విరాట్ కోహ్లీ మూడో స్థానంలో, రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నారు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో యువ కిరటం ఇషాన్ కిషన్ అగ్రపీఠాన్ని కైవసం చేసుకోగా, అభిషేక్ శర్మ మూడో స్థానంలో, తిలక్ వర్మ ఆరో స్థానంలో నిలిచారు. టెస్టుల్లో రిషభ్ పంత్ ఏడో స్థానంలో, శుభ్ మన్ గిల్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నారు. పాకిస్థాన్ నుంచి కేవలం బాబర్ ఆజమ్ మాత్రమే టెస్టుల్లో 10వ ర్యాంక్, వన్డేల్లో 6వ ర్యాంక్లో స్థానం సంపాదించుకున్నాడు. బౌలింగ్, ఆల్రౌండర్ విభాగాల్లో మనోళ్ల హవా బౌలింగ్, ఆల్రౌండర్ విభాగాల్లోనూ భారత్ అత్యంత బలంగా కనిపిస్తోంది. టెస్టు బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానంలో కొనసాగుతుండగా, టీ20ల్లో వరుణ్ చక్రవర్తి ఎనిమిదో ర్యాంక్లో ఉన్నాడు. టెస్టు ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా మొదటి స్థానంలో, వాషింగ్టన్ సుందర్ ఆరో స్థానంలో నిలిచి సత్తా చాటారు. టీ20 ఆల్రౌండర్లలో హార్దిక్ పాండ్యా ఐదో ర్యాంక్ను దక్కించుకున్నాడు. పాకిస్థాన్ బౌలర్లలో నోమాన్ అలీ టెస్టుల్లో 8వ ర్యాంక్, అబ్రార్ అహ్మద్ వన్డే, టీ20ల్లో రెండో స్థానంలో నిలిచారు. ఇంగ్లాండ్తో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో ఘోరంగా ఓడిపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్ర నిర్ణయాలు తీసుకుంది. జట్టు

రాత్రి భోజనంలో అన్నం తినాలా? చపాతీ తినాలా? లేక జొన్న రొట్టె తింటే ఆరోగ్యానికి మంచిదా? బరువు తగ్గాలని ప్రయత్నించేవారు, షుగర్ గురించి జాగ్రత్త పడేవారు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునేవారు ఈ విషయంలో ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మరి దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో.. రాత్రి భోజనంలో ఏం తినడం మంచిదో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా చాలామంది రాత్రి భోజనంలో అన్నం తింటుంటారు. అన్నం శరీరానికి శక్తిని అందించే కార్బోహైడ్రేట్లకు మంచి వనరు. అయితే అన్నం ఎంత మోతాదులో తింటున్నామన్నది చాలా ముఖ్యం. పెద్ద ప్లేట్ నిండా అన్నం తీసుకొని, కూర లేదా ప్రోటీన్ తక్కువగా తీసుకోవడం కంటే, అన్నం పరిమాణాన్ని తగ్గించి కూరగాయలు, పప్పు, పెరుగు లేదా ఇతర ప్రోటీన్ ఆహారాలతో కలిపి తినడం మంచిది. ముఖ్యంగా రాత్రి భోజనం చాలా ఆలస్యంగా తినే అలవాటు ఉన్నవారు పరిమాణంపై మరింత శ్రద్ధ పెట్టాలి. గోధుమ పిండితో తయారు చేసే చపాతీ కూడా రాత్రి భోజనానికి మంచి ఎంపిక. చపాతీలో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఉన్న ఆహారం కడుపు నిండిన భావనను ఎక్కువసేపు కలిగించడంలో సహాయపడుతుంది. అయితే చపాతీపై ఎక్కువ నెయ్యి లేదా వెన్న రాయకుండా, కూరగాయలు, పప్పు వంటి పోషకమైన ఆహారాలతో కలిపి తీసుకోవడం మంచిది. సాధారణంగా జొన్నను ఎక్కువగా పాలిష్ చేయకుండా తీసుకుంటే శరీరానికి అవసరమైన ఫైబర్, కొన్ని ఖనిజాలు, ఇతర పోషకాలు అందుతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. 100 గ్రాముల జొన్నలో సుమారు 10.22 గ్రాముల ఫైబర్ 9.97 గ్రాముల ప్రోటీన్, అలాగే మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. జొన్నలోని ఫైబర్ కారణంగా ఇది కడుపు నిండిన అనుభూతిని ఎక్కువసేపు కలిగిస్తుంది. అందుకే రాత్రి భోజనంలో అన్నం పరిమాణాన్ని తగ్గించాలనుకునేవారికి జొన్న రొట్టె మంచి ఎంపిక. అయితే రాత్రి భోజనంలో ఏం తింటున్నాం అన్నదానికంటే మొత్తం ప్లేట్ ఎలా ఉందన్నది ముఖ్యం. అన్నం లేదా రొట్టెతో

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. CPS Pension Issue: ముప్పై నుంచి ముప్పై ఐదేళ్ల పాటు తమ జీవితంలోని అత్యంత విలువైన సమయాన్ని ప్రభుత్వ సేవకే అంకితం చేసిన ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత సీపీఎస్ వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. రిటైర్మెంట్ అనంతరం ప్రశాంతంగా, గౌరవంగా బతకాలన్న ప్రతి ఉద్యోగి ఆశలను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) అట్టడుగుకు తొక్కిపారేస్తోంది. ఐదేళ్ల పాటు పదవిలో ఉండి దిగిపోయే ఎంపీలు, ఎమ్మెల్యేలకు వేలల్లో పెన్షన్లు, అలవెన్సులు కల్పించుకుంటున్న పాలకులు... జీవితాంతం ప్రజాసేవలో తరించిన ఉద్యోగికి మాత్రం రిటైర్మెంట్ తర్వాత కనీస అవసరాలు తీర్చలేని పెన్షన్ ఇస్తూ చీకటిలోకి నెట్టేస్తున్నారు. ఇటీవల పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో వెలుగుచూసిన ఒక ఘటన సీపీఎస్ ఉద్యోగుల పాలిట ఎంతటి నరకమో కళ్లకు కడుతోంది. ఏపీ ప్రభుత్వం ప్రతినెలా పేదలు, వృద్ధులకు ఇచ్చే సామాజిక భద్రతా పెన్షన్ నెలకు రూ. 4,000 కాగా, సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్ అయిన ఒక సీపీఎస్ ఉద్యోగి చేతికి వస్తున్న నెలవారీ పెన్షన్ కేవలం రూ. 3,882 మాత్రమే... ఏ సమస్యా లేకుండా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే సామాజిక పింఛను కంటే, ముప్పై ఏళ్లు చెమటోడ్చి సేవ చేసిన ఉద్యోగికి వచ్చే పింఛను తక్కువగా ఉందంటే... ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగి అదృష్టవంతుడా...లేక దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడా అనేది నిర్ణయించే విచక్షణ పాలకులకే వదిలేయాలని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎదురైన ఈ దారుణమైన పరిస్థితిని ఉదాహరణగా చూపిస్తూ తెలంగాణలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రేపు తమకు కూడా రిటైర్మెంట్ తర్వాత ఇదే

India T20I Squad for Afghanistan Series: రింకు సింగ్ భారత్ తరపున ఫినిషర్గా అద్భుతంగా రాణించాడు. కానీ ఆ తర్వాత భారత జట్టు నుంచి తొలగించబడ్డాడు. అనంతరం, అతను అకస్మాత్తుగా జింబాబ్వే సిరీస్కు ఎంపికయ్యాడు. ఇప్పుడు మరోసారి జట్టు నుంచి తప్పించారు. జింబాబ్వేతో జరిగిన సిరీస్లో 12, 25 పరుగులు చేసిన రింకు సింగ్కు అవకాశం లభించగా, ఇప్పుడు అతడిని టీ20 జట్టు నుంచి తొలగించారు. అయితే, ఆ తర్వాత రింకు సింగ్ యూపీ టీ20 లీగ్లో మంచి ఫామ్ను కనబరిచాడు. అతను మీరట్ తరపున 7 మ్యాచ్లలో 42.25 సగటుతో 19 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 219 కాగా, అతను 15 సిక్సర్లు కొట్టాడు. అయినప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్లో టీమిండియా అతనికి అవకాశం ఇవ్వలేదు. ఫినిషర్ పాత్రను పోషించే నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ టీ20 జట్టులోకి తిరిగి వచ్చారు. అక్షర్ పటేల్, శివమ్ దుబే కూడా జట్టులో ఉన్నారు. అందువల్ల, రింకుకు టీమ్ ఇండియాలో స్థానం సంపాదించడం కష్టంగా ఉంది. రింకు సింగ్ టీమ్ ఇండియా తరపున 48 టీ20 మ్యాచ్లలో 36.94 సగటుతో 702 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 156.34గా ఉంది. అయినప్పటికీ, అతను జట్టులో తన స్థానాన్ని పదిలపరచుకోలేకపోయాడు

Babar Azam: ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శనపై సెలెక్షన్ కమిటీ చీఫ్ ఆఖిబ్ జావేద్ తీవ్రంగా స్పందించాడు. కెప్టెన్ బాబర్ అజామ్, హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ అవసరమైన నిర్ణయాలు తీసుకోకపోవడంతోనే జట్టు కూర్పులో మార్పులు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. పాకిస్థాన్ తొలి రెండు టెస్టుల్లో ఓడిపోయి సిరీస్ను 0-2తో కోల్పోయిన తర్వాత ఏకంగా ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేసింది. మూడో టెస్టుకు కొత్త ఆటగాళ్లను చేర్చడంతోపాటు కోచింగ్ బృందంలోనూ మార్పులు చేసింది. కెప్టెన్, కోచ్ కఠిన నిర్ణయాలు తీసుకోలేనప్పుడు బోర్డు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఆఖిబ్ తెలిపాడు. ముఖ్యంగా పేస్ బౌలింగ్లో ఉబైద్ షాకు అవకాశం ఇవ్వాలని తాను సూచించినా ఆ నిర్ణయం అమలు కాలేదని చెప్పాడు. దీంతో కీలక పర్యటనలో జట్టు పోటీ ఇవ్వలేకపోవడం పరిస్థితిని తీవ్రంగా మార్చిందని వివరించాడు. ఆఖిబ్ ప్రకారం.. పాకిస్థాన్ జట్టులో ఉబైద్ షా, అదనపు వికెట్ కీపర్, పేస్ ఆల్రౌండర్ వంటి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. సుమారు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల ఉబైద్ను ఆడించాలని బాబర్, సర్ఫరాజ్కు సూచించినట్లు వెల్లడించాడు. ప్రస్తుత పేసర్లలో ఒకే తరహా వేగం ఉండటంతో బౌలింగ్ విభాగంలో వైవిధ్యం అవసరమని చెప్పాడు. Viral Video: ఏం క్యాచ్ గురూ.. సూపర్మ్యాన్ కూడా చేతులెత్తేయాల్సిందే.. బౌండరీ లైన్లో ఒంటి చేత్తో..! లార్డ్స్ టెస్టు ముగిసిన తర్వాత పాకిస్థాన్ ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేసింది. మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ ఆఘా, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, మహమ్మద్ అవైస్ జఫర్, ఖుర్రమ్ షహ్జాద్ ఈ జాబితాలో ఉన్నారు. వారి స్థానాల్లో సైమ్ అయూబ్, అబ్దుల్లా ఫజల్, అరాఫత్ మిన్హాస్ తదితరులను చేర్చారు. Team India: 24 గంటల్లోనే మరో గాయం.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..? ఇదే సమయంలో హెడ్ కోచ్ సర్ఫరాజ్

అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్కు భారత స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులోకి వచ్చాడు. అటు యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా చోటు దక్కించుకున్నాడు. దీంతో ఓపెనింగ్ జోడీపై ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల ఈ యువ సంచలనం బ్యాటింగ్ చూడటానికి రెండు కళ్లు సరిపోవు. భారీ షాట్లతో బౌలర్లను బెంబేలెత్తించే వైభవ్.. అత్యంత పిన్న వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 13 నుంచి టీమిండియా.. అఫ్గానిస్థాన్లో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించిన జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అటు వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో ఉన్నాడు. దీంతో అఫ్గానిస్థాన్తో సిరీస్లో భారత ఓపెనింగ్ జోడీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన సంజును జట్టు నుంచి తప్పించి వైభవ్కు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు అభిషేక్ శర్మ-వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఇంగ్లండ్పై నిరాశపరిచిన వైభవ్.. జింబాబ్వేపై చెలరేగాడు. అయితే అఫ్గాన్ సిరీస్లో సంజు రాకతో వైభవ్ సూర్యవంశీకి షాక్ తగిలే అవకాశం ఉంది. ఎప్పటిలాగే సీనియర్ ప్లేయర్లు సంజు శాంసన్-అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తే.. వైభవ్ సూర్యవంశీ బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది. అక్కడ సంజు లేదా అభిషేక్ విఫలమైతేనే వైభవ్కు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు, దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున వైభవ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6 నుంచి ఫైనల్ మ్యాచ్లో ఆడనున్నారు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. ఆ వెంటనే అఫ్గానిస్తాన్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇషాన్ కిషన్ ఈస్ట్ జోన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ ఇద్దరూ అఫ్గాన్ సిరీస్ కల్లా సిద్ధంగా ఉంటారా? లేదా? అనేది

Secunderabad: ప్రభుత్వ వైఫల్యాలపై సికింద్రాబాద్లో బీఆర్ఎస్ నిరసన ర్యాలీ ఈ వార్తకు సంబంధించిన

కాంగ్రెస్పై బీఆర్ఎస్ చార్జ్షీట్ విడుదల కేటీఆర్ తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు రైతులు, నిరుద్యోగుల మోసంపై ఫైర్ BRS Charge Sheet: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఒక ప్రత్యేక చార్జ్షీట్(BRS Charge Sheet)ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లతో కలిసి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వెయ్యి రోజుల పీడనగా మారిందని, ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోందని విమర్శించారు. ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ACB సోదాలు.. 15 ఏళ్ల తర్వాత రైడ్.. కీలక పత్రాలు స్వాధీనం అభివృద్ధి శూన్యం.. అప్పుల మయం: కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ సెటైర్లు వేస్తూ "అసమర్థత ప్రో మ్యాక్స్, అవినీతి అల్ట్రా మ్యాక్స్, అరాచకం ఐమ్యాక్స్" తరహాలో ఉందంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఈ శతాబ్దపు అతిపెద్ద మోసంగా అభివర్ణించిన ఆయన, రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోయినా రూ. 4.50 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. పేదల భూములను నిషేధిత జాబితాలో చేర్చి 30 శాతం కమీషన్లు దండుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టే విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులు పోటీ పడుతున్నారని, తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం కుక్కలు చింపిన విస్తరిలా మార్చేసిందని కేటీఆర్ దుయ్యబట్టారు. రైతాంగానికి కుచ్చుటోపీ.. రుణమాఫీ, రైతుబంధుపై విమర్శలు: రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. రూ. 50 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్టువేసి, కేవలం రూ. 20 వేల కోట్లు మాత్రమే చేసి 70 శాతం మంది రైతులకు కుచ్చుటోపీ పెట్టారని

ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ గాయం వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది. మ్యాచ్ మధ్యలో కాలి కండరాలు పట్టేయడంతో అతను రెండు ఇన్నింగ్స్లలోనూ బ్యాటింగ్కు రాలేదు. ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) విచారణకు ఆదేశించడంతో పాక్ క్రికెట్లో కలకలం రేగింది.లార్డ్స్లో జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్థాన్ 194 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి తర్వాత పాక్ సెలక్షన్ కమిటీ సభ్యుడు ఆకిబ్ జావేద్ ఈ విషయంపై స్పందించాడు. "కేవలం కండరాలు పట్టేసిన గాయంతో ఒక ఆటగాడు రెండు ఇన్నింగ్స్లలో ఎలా బ్యాటింగ్కు రాలేకుండా ఉంటాడు? ఈ విషయంపై కచ్చితంగా విచారణ జరుగుతుంది" అని ఓ స్థానిక టీవీ ఛానెల్తో అన్నాడు. "గతంలో ఆటగాళ్లు ఫ్రాక్చర్లతో కూడా జట్టు కోసం మైదానంలోకి వచ్చారు. ఇది చాలా తీవ్రమైన విషయం, విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం" అని స్పష్టం చేశాడు.మరోవైపు, పీసీబీ విచారణను ఎదుర్కోవడానికి ఇమామ్ న్యాయవాది సహాయం తీసుకునే అవకాశం ఉందని పీటీఐ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. ఈ పరిణామంతో ఇమామ్ తీవ్ర ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. సిరీస్లో వరుస ఓటముల నేపథ్యంలో పీసీబీ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇమామ్తో పాటు మరో ఆరుగురు ఆటగాళ్లను, హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్ను వెంటనే ఇంగ్లండ్ నుంచి వెనక్కి పిలిపించింది.సెప్టెంబర్ 9న బర్మింగ్హామ్లో ప్రారంభం కానున్న ఆఖరి టెస్టుకు వైట్-బాల్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్, బౌలింగ్ కోచ్

చైనా మాస్టర్స్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్కు ఆదిలోనే షాక్ తగిలింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో కెనడాకు చెందిన విక్టోర్ లాయ్ చేతిలో లక్ష్య వరుస గేముల్లో ఓటమి పాలయ్యాడు. ఇంటర్నెట్ డెస్క్: చైనా మాస్టర్స్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్కు ఆదిలోనే షాక్ తగిలింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో కెనడాకు చెందిన విక్టోర్ లాయ్ చేతిలో లక్ష్య వరుస గేముల్లో ఓటమి పాలయ్యాడు. 14-21, 7-21 తేడాతో లాయ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఈ ఓటమితో 2026లో విక్టోర్ లాయ్తో లక్ష్య సేన్ హెడ్-టు-హెడ్ రికార్డు 1-3కు పడిపోయింది. ఈ ఏడాది లక్ష్యపై లాయ్కు ఇది వరుసగా మూడో విజయం కావడం గమనార్హం. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లోనూ లక్ష్యసేన్కు నిరాశే ఎదురైంది. రెండో రౌండ్లో అమెరికాకు చెందిన గారెట్ టాన్ చేతిలో ఓడిపోయాడు. చైనా మాస్టర్స్లో తొలుత లక్ష్యసేన్ ఫ్రాన్స్కు చెందిన అలెక్స్ లానియర్తో తలపడాల్సి ఉంది. అయితే ఢిల్లీలో టైటిల్ సాధించిన అనంతరం లానియర్ టోర్నీ నుంచి వైదొలగడంతో.. లక్ష్యకు మరోసారి విక్టోర్ లాయ్తో తలపడే అవకాశం వచ్చింది. ఈసారి కూడా ఫలితం లక్ష్యకు అనుకూలంగా రాలేదు. ఇదిలా ఉంటే.. మరో భారత స్టార్ కిదాంబి శ్రీకాంత్ మాత్రం చైనా మాస్టర్స్లో శుభారంభం చేశాడు. రౌండ్ ఆఫ్ 32లో చైనీస్ తైపీకి చెందిన చి యు-జెన్ను 21-16, 21-15తో వరుస గేముల్లో ఓడించి రౌండ్ ఆఫ్ 16లోకి దూసుకెళ్లాడు. 2023 సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్లో శ్రీకాంత్ను తొలి రౌండ్లోనే ఓడించిన యు-జెన్పై ఈసారి భారత షట్లర్ పైచేయి సాధించాడు. తొలి గేమ్లో ఆధిపత్యం ప్రదర్శించిన శ్రీకాంత్.. రెండో గేమ్లోనూ ప్రశాంతంగా ఆడి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. ఇక మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ అదరగొట్టింది

టీమిండియాలోకి తిరిగి రావాలని ఎదురుచూస్తున్న ఆల్రౌండర్ కృనాల్ పాండ్యకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో అతడు చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఇంటర్నెట్ డెస్క్: టీమిండియాలోకి తిరిగి రావాలని ఎదురుచూస్తున్న ఆల్రౌండర్ కృనాల్ పాండ్యకు మరోసారి నిరాశే ఎదురైంది. సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్థాన్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు మంగళవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. జట్టులో ప్లేయర్లను వరుస గాయాలు వెంటాడుతుండటంతో కృనాల్కు అవకాశం దక్కుతుందంటూ వార్తలు వచ్చాయి. ఐదేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడని అభిమానులు ఆశించారు. కట్ చేస్తే.. జట్టులో కృనాల్కు చోటు దక్కలేదు. ఈ క్రమంలో అతడు చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. కృనాల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ఆశ ఇంకా సజీవంగానే ఉంది’ అన్నట్లు ఓ పోస్ట్ చేశాడు. దానికి ఫింగర్ క్రాస్(HOPE) ఎమోజీతో పాటు భారత జెండా ఎమోజీని జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. కృనాల్ పాండ్య చివరిసారిగా 2021లో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు. టీ20ల్లో భారత్కు 19 మ్యాచ్లు ఆడిన అతడు 10 ఇన్నింగ్స్ల్లో 124 పరుగులు చేశాడు. బౌలింగ్లో 15 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత అనూహ్య కారణాల వల్ల కృనాల్ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ఐపీఎల్లో ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న అతడిని.. జాతీయ జట్టులోకి తీసుకుంటారని భావించారు. అయితే వాషింగ్టన్ సుందర్కు ఫిట్నెస్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. అతడు ఒకవేళ సుందర్ అందుబాటులోకి రాలేకపోతే.. కృనాల్ పేరును పరిశీలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వంద కాదు 200 శాతం క్లారిటీ.. ఆటగాళ్ల ఫిట్నెస్పై బీసీసీఐ సంచలన నిర్ణయం! ఇదేం విచిత్రం.. ఫీల్డింగ్ కోచ్ కోసం లింక్డిన్లో పాకిస్థాన్ ఓపెన్ హైరింగ్!

బీసీసీఐ టీమ్ ఇండియా స్క్వాడ్ను ప్రకటించింది. అఫ్గానిస్థాన్తో జరగబోయే 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును వెల్లడించింది. సెప్టెంబర్ 13 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లు అన్నీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగుతాయి. అయితే ఈసారి ఎంపిక చేసిన జట్టులో అనూహ్య మార్పులు కనిపించాయి. ఇటీవలే జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో ఆడిన ఎనిమిది మంది ఆటగాళ్లను అఫ్గానిస్థాన్ సిరీస్ నుంచి బీసీసీఐ తప్పించింది. వారి స్థానంలో సీనియర్లు, గాయాల నుంచి కోలుకున్న ప్లేయర్లు తిరిగి జట్టులోకి వచ్చారు. ఈ మార్పులతో జట్టు స్వరూపమే పూర్తిగా మారిపోయింది. కొత్తగా వచ్చిన ఆటగాళ్లు చేరడంతో పాత వాళ్లకు చోటు దక్కలేదు. జట్టు నుంచి బయటకు వెళ్లిన 8 మందిలో యంగ్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ కూడా ఉన్నాడు. జింబాబ్వే సిరీస్లో 3 మ్యాచ్లలో 5 వికెట్లు తీసి మంచి ఫామ్లో ఉన్నా అతడిని పక్కన పెట్టారు. తొలి, మూడో టీ20ల్లో తొలి బంతి కే వికెట్ తీసి మయాంక్ మెరిసాడు. మరోవైపు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, ఆల్రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయాల నుంచి కోలుకుని మళ్లీ స్క్వాడ్లోకి వచ్చారు. జింబాబ్వే సిరీస్ ఆడి ఇప్పుడు అఫ్గాన్ సిరీస్కు ఎంపిక కాని 8 మంది ఆటగాళ్ల జాబితా ఇదే.. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమ్ ఇండియా ఈ సిరీస్ ఆడనుంది. తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్

ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో ఇప్పటికే 0-2తో వెనుకబడిన పాకిస్థాన్కు మరో షాక్ తగిలింది. మూడో టెస్టులోనైనా పరువు దక్కించుకోవాలని చూస్తున్న ఆ జట్టుకు కెప్టెన్ బాబర్ ఆజమ్ అనారోగ్యానికి గురికావడం కొత్త తలనొప్పిగా మారింది. ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో ఇప్పటికే 0-2తో వెనుకబడిన పాకిస్థాన్కు మరో షాక్ తగిలింది. మూడో టెస్టులోనైనా పరువు దక్కించుకోవాలని చూస్తున్న ఆ జట్టుకు కెప్టెన్ బాబర్ ఆజమ్ అనారోగ్యానికి గురికావడం కొత్త తలనొప్పిగా మారింది. బాబర్కు జ్వరం వచ్చినట్లు సమాచారం. దీంతో కీలక మ్యాచ్కు ముందు పాక్ శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే బాబర్ ఆరోగ్యంపై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని పాక్ జట్టు మేనేజర్ నవీద్ అక్రమ్ చీమా తెలిపారు. బాబర్కు జ్వరం ఉన్నప్పటికీ.. ఫిట్గానే ఉన్నాడని, త్వరగా కోలుకుంటాడని వెల్లడించారు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బాబర్ ఆజమ్ బ్యాట్తో పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 8 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో కేవలం 6 పరుగులకే పెవిలియన్కు చేరాడు. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఏకంగా 194 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక తొలి టెస్టుకు గాయం కారణంగా బాబర్ దూరమయ్యాడు. అతడి స్థానంలో సల్మాన్ అలీ అఘా పాక్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. రెండో టెస్టులో బాబర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కాగా మూడో టెస్టుకు ముందు మళ్లీ అనారోగ్యం పాలవ్వడం చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ కూడా జాతీయ సెలక్షన్ కమిటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. టెస్టు జట్టు, కోచింగ్ సిబ్బందిలో పీసీబీ భారీ మార్పులు చేయడాన్ని నిరసిస్తూ ఆయన తన రాజీనామాను సమర్పించినట్లు సమాచారం. అయితే మిస్బా రాజీనామాను పీసీబీ ఇంకా ఆమోదించలేదని తెలుస్తోంది. అంతేకాకుండా లాహోర్లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కన్సల్టెంట్గా ఉన్న బాధ్యతల నుంచి కూడా తప్పుకోవాలని మిస్బా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇలా ఓవైపు వరుస ఓటములు.. మరోవైపు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. AP JAC Amaravati Protest: తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలను తీవ్రం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేపట్టగా.. ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ ప్రభుత్వ ఉద్యోగులు భారీ నిరసనలకు దిగారు. న్యాయమైన సమస్యలు, పెండింగ్ బకాయిల పరిష్కారం కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మొదటి దశ ఉద్యమ కార్యాచరణకు నేటి నుంచి శ్రీకారం చుట్టారు. తమ నిరసనలో భాగంగా మంగళవారం నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు సార్... తమ డబ్బులు తమకు ఇవ్వండి అనే నినాదంతో ఉద్యమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని గ్రామ సచివాలయాలు దగ్గర నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో, అన్ని తహసీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, వెటర్నరీ డిపార్ట్మెంట్ ఉద్యోగులు, అన్ని ఆర్టీసీ డిపోల్లో, వివిధ కార్యాలయాల ఉద్యోగులు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల ఉద్యోగులు, మున్సిపాలిటీ ఉద్యోగులు, కార్మిక శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఉద్యోగులు, జిల్లా స్థాయిలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఉద్యోగులు, జిల్లా స్థాయి వివిధ శాఖల కార్యాలయాల ఉద్యోగులు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. వేలాది మంది ఉద్యోగులు తమ సెల్ఫోన్లలో "సీఎం సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి" అని కామన్ డీపీగా పెట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమంలో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతూ నిరసనలు చెబుతున్నారు. ఉద్యోగులందరూ తమ వాట్సాప్ డీపీగా ,స్టేటస్లుగా “సీఎం సార్... మా

ట్రై సిరీస్లో భాగంగా సౌతాఫ్రికా వరుస విజయాలతో దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా విండ్హక్ వేదికగా మంగళవారం జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్లో దక్షిణాఫ్రికా 43 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఓపెనర్ లుహాన్ ప్రిటోరియస్ (51 బంతుల్లో 94; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా, డెవాల్డ్ బ్రెవిస్ (41) మూడో మ్యాచ్లోనూ అదరగొట్టాడు. జోర్డాన్ హెర్మన్ (28) పర్వాలేదనిపించాడు. జింబాబ్వే బౌలర్లలో వెస్లే మధవెరె 3 వికెట్లు తీయగా, బ్రాడ్ ఎవన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 17.4 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సికందర్ రజా (45) టాప్ స్కోరర్గా నిలవగా, ఇన్నోసెంట్ కాయా (18), నైమూరి (27) పర్వాలేదనిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో జోర్న్ ఫోర్టున్ 4 వికెట్లు తీయగా, డాన్ జాసన్ 3 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింట గెలిచి పట్టికలో టాప్లో ఉండగా, జింబాబ్వే మూడింటిలో రెండు ఓడి మూడో స్థానంలో ఉంది. ఇక నమీబియా 2 మ్యాచ్ల్లో ఒక గెలుపు, ఒక ఓటమితో రెండో స్థానంలో ఉంది. Read: మెస్సీ కంటతడి బాధ కలిగించింది: క్రిస్టియానో రొనాల్డో ట్రేడిషనల్ శారీలో బిగ్బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు పవన్ కళ్యాణ్ బర్త్

Sanju Samson: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 13 నుంచి 3 మ్యాచ్ల టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు దాదాపు మెయిన్ ప్లేయర్లతో కూడిన 15 మంది సభ్యుల పవర్ఫుల్ జట్టును ఎంపిక చేశారు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్న ఈ జట్టులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సంజూ శామ్సన్ మళ్లీ స్థానం సంపాదించుకోవడం. ఈశాన్ కిషన్తో పాటు ఆయనను స్పెషలిస్ట్ వికెట్ కీపర్గా జట్టులోకి తీసుకున్నారు. జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో సంజూ శామ్సన్ పేరు లేకపోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సంజూ పట్ల జట్టు యాజమాన్యం అన్యాయంగా వ్యవహరిస్తోందని, ఆయనను జట్టు నుంచి తొలగించారని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆరోపణలు చేశారు. అయితే ఆ సమయంలోనే బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ ఆయనను జట్టు నుంచి తప్పించలేదని, బిజీ షెడ్యూల్ కారణంగా పనిభారాన్ని తగ్గించేందుకే విశ్రాంతినిచ్చామని స్పష్టం చేశాయి. ఇప్పుడు అఫ్గానిస్థాన్ సిరీస్కు ఆయనను నేరుగా ఎంపిక చేయడంతో బోర్డు చెప్పిన మాట నిజమేనని రుజువైంది. జింబాబ్వే పర్యటన నుంచి శామ్సన్కు విశ్రాంతి ఇవ్వడానికి ఆయన పాత యూకే టూర్ ప్రదర్శన కూడా ఒక కారణంగా నిలిచింది. ఐర్లాండ్తో జరిగిన 2 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆయన కేవలం 5 పరుగులు మాత్రమే చేశారు. అందులో ఒక ఇన్నింగ్స్లో పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యారు. ఇక ఇంగ్లండ్ పర్యటనలోని 5 మ్యాచ్ల టి20 సిరీస్లో ఆయనకు కేవలం 2 మ్యాచ్లలోనే అవకాశం లభించగా, మొదటి మ్యాచ్లో 1 పరుగు, చివరి మ్యాచ్లో 27 పరుగులు మాత్రమే చేయగలిగారు. మిగిలిన మ్యాచ్లలో ఆయన స్థానంలో యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకున్నారు. నిరాశపరిచిన యూకే పర్యటన తర్వాత లభించిన చిన్నపాటి విరామం సంజూ శామ్సన్కు మానసికంగా రీఛార్జ్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడింది. ఆ విరామం తర్వాత ఇప్పుడు

బాలీవుడ్ స్టార్ జంట అజయ్ దేవగన్, కాజోల్ నివసించే ముంబై జుహూలోని లగ్జరీ బంగ్లా ‘శివశక్తి’ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. సుమారు రూ.60 కోట్ల విలువైన ఈ రాజప్రసాదం ఆధునిక శైలికి, సాంప్రదాయ డిజైన్లకు ప్రతీకగా నిలుస్తుంది. నటి కాజోల్ తన ఇంట్లోని మెట్లమార్గం వద్ద దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఈ ఇంట్లోని ఇంటీరియర్ ప్రత్యేకతలపై మీడియాలో మళ్లీ ఆసక్తి నెలకొంది. ఈ బంగ్లాలో ప్రధాన ఆకర్షణ చెక్కతో రూపొందించిన విశాలమైన మెట్లమార్గం. దీనికి అనుబంధంగా పైకప్పు నుంచి నీటి బిందువుల తరహాలో వేలాడే వెలుగుల శ్రేణి ఫోటోషూట్లకు సరైన బ్యాక్డ్రాప్గా మారింది. మొదటి అంతస్తులోని లాబీ మెరిసే తెల్లటి మార్బుల్ ఫ్లోరింగ్తో నిర్మించారు. సీలింగ్ నుంచి ఫ్లోర్ వరకు ఉన్న పెద్ద గ్లాస్ విండోస్ సహజమైన వెలుతురును ఇంటికి అందిస్తాయి. లివింగ్ రూమ్లో ఐవరీ సోఫాలు, ఆరు సీట్ల డైనింగ్ టేబుల్ లగ్జరీ లుక్ను ఇస్తాయి. మినిమలిస్టిక్ థీమ్కు భిన్నంగా రెడ్ లెదర్ సోఫాలతో కూడిన లాంజ్ ఏరియా కుటుంబ సభ్యుల కలయికలకు ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ఆధ్యాత్మికతకు, వ్యక్తిగత అభిరుచులకు అద్దం పట్టేలా నిర్మించిన ఈ నివాసం సెలబ్రిటీ హోమ్ల్లో ఒక ప్రత్యేక ముద్ర వేసింది. ఇదీ చదవండి: సెప్టెంబర్లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే.. ట్రేడిషనల్ శారీలో బిగ్బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు పవన్ కళ్యాణ్

దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్లో ఈస్ట్ జోన్ ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ సెంట్రల్ జోన్ను నాలుగు వికెట్ల తేడాతో మట్టికరిపించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.159 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్ జోన్కు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (43 బంతుల్లో 43) మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే, సెంట్రల్ జోన్ బౌలర్ హర్ష్ దూబే నాలుగు వికెట్లు పడగొట్టి ఈస్ట్ జోన్పై ఒత్తిడి పెంచాడు. ఈ దశలో సంయమనంతో ఆడిన కెప్టెన్ ఇషాన్ కిషన్ (41 బంతుల్లో 39 నాటౌట్) జట్టుకు విజయాన్ని ఖరారు చేశాడు. అతనికి మహమ్మద్ షమీ (8 నాటౌట్) సహకరించాడు.అంతకుముందు, సెంట్రల్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్లో కేవలం 158 పరుగులకే కుప్పకూలింది. ఈస్ట్ జోన్ బౌలర్లు ముకేశ్ కుమార్ 4 వికెట్లతో, మహమ్మద్ షమీ 3 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను దెబ్బతీశారు. కాగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇరు జట్లు 266 పరుగుల వద్ద సమానంగా నిలవడం విశేషం. ఈ విజయంతో, గత ఏడాది ఛాంపియన్ను టోర్నీ నుంచి నిష్క్రమింపజేసి, ఈస్ట్ జోన్ ఫైనల్కు దూసుకెళ్లింది

IND vs AFG: అఫ్గానిస్థాన్తో సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీ వేదికగా ప్రారంభం కానున్న మూడు టి20ల సిరీస్ కోసం భారత సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గత జింబాబ్వే పర్యటనలో ఆడిన 8 మంది ఆటగాళ్లను ఈ సిరీస్ నుంచి తప్పించడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో ఎదురైన ఘోర పరాభవం వల్ల పాకిస్థాన్ జట్టు ఏకంగా 7 మంది ఆటగాళ్లపై వేటు వేసింది. కానీ టీమిండియాలో జరిగిన ఈ 8 మార్పుల వెనుక కారణం ఏమాత్రం శిక్ష కాదని తెలుస్తోంది. జింబాబ్వే పర్యటనలో సీనియర్లకు విశ్రాంతినివ్వడంతో ఎక్కువ మంది యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. అయితే అఫ్గానిస్థాన్తో జరిగే సిరీస్ కోసం సీనియర్ ప్లేయర్లు తిరిగి రావడంతో, గత సిరీస్లో ఆడిన చాలామంది కుర్రాళ్లు బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. జింబాబ్వే సిరీస్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న యంగ్ పేసర్లు మయూంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మలు ఈ సిరీస్కు ఎంపిక కాలేదు. వీరితో పాటు ఆల్రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే, హర్ష్ దూబే కూడా తమ స్థానాలను కాపాడుకోలేకపోయారు. వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రన్ సింగ్తో పాటు ఫినిషర్ బాధ్యతలు నిర్వర్తించే రింకూ సింగ్ను కూడా ఈ సిరీస్ నుంచి పక్కన పెట్టడం గమనార్హం. అఫ్గానిస్థాన్ జట్టుపై పూర్తి ఆధిక్యత సాధించాలనే లక్ష్యంతో భారత సెలెక్టర్లు సీనియర్లతో కూడిన ప్రధాన జట్టును ఎంపిక చేశారు. వేగవంతమైన బౌలింగ్ విభాగంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాలు తిరిగొచ్చారు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ ఇచ్చారు. వీరితో పాటు సంజూ శామ్సన్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డిల పునరాగమనంతో జట్టు కలయిక పూర్తిగా మారిపోయింది. అఫ్గానిస్థాన్ టి20 సిరీస్ కోసం భారత జట్టు

అఫ్గానిస్థాన్తో జరగనున్న టీ20 సిరీస్కు బీసీసీఐ ఇవాళ భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా ఉండనున్నాడు. స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు బీసీసీఐ ఇవాళ(మంగళవారం) భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా ఉండనున్నాడు. ఇక వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్లను ఎంపిక చేసింది. జింబాబ్వేతో సిరీస్కు దూరమైన సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్కు వైభవ్ సూర్వవంశీ కూడా ఎంపికయ్యాడు. అయితే స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు. ఇక బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలను ఎంపిక చేసినప్పటికీ వారు కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక అఫ్గానిస్థాన్తో భారత్ సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 13న, రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 17న జరగనున్నాయి. ఈ మూడు టీ20లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఈ సిరీస్ ద్వారా అఫ్గానిస్థాన్ భారత్ లో టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం. శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్*, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా*, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా* గమనిక: స్టార్ గుర్తు ఉన్నవాళ్లు జట్టులోకి ఎంపికైనప్పటికీ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్తోనే పాండ్య.. కానీ, కెప్టెన్గా కాదు! ఆ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ను నమ్మోచ్చు: హర్షా భోగ్లే

దులీప్ ట్రోఫీ 2026 సీజన్లో ఈస్ట్ జోన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో ఈస్ట్జోన్ 4 వికెట్ల తేడాతో సెంట్రల్ జోన్పై విజయం సాధించింది. స్పోర్ట్స్ డెస్క్: దులీప్ ట్రోఫీ (Duleep Trophy2026) ఫైనల్కు ఈస్ట్ జోన్ జట్టు దూసుకెళ్లింది. తొలి సెమీ ఫైనల్లో భాగంగా జరిగిన మ్యాచ్లో సెంట్రల్ జోన్పై ఈస్ట్ జోన్ వికెట్ల తేడాతో విజయం సాధించింది. 159 పరుగుల టార్గెట్ని ఇషాన్ కిషన్ జట్టు 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (40), కెప్టెన్ ఇషాన్ కిషన్ (39) రాణించారు. అభిమన్యు ఈశ్వరన్ 24, కుమార్ కుశాగ్ర 22 పరుగులు చేశారు. షమి (8*) విన్నింగ్ షాట్ కొట్టాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో హర్ష్ దూబే 4 వికెట్లు తీయగా, సారాంశ్ జైన్, యశ్ ఠాకూర్ చెరొక వికెట్ పడగొట్టారు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్లో 45/3 స్కోరుతో ఇవాళ(మంగళవారం) ఆటను కొనసాగించిన సెంట్రల్ జోన్ 158 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అమన్ మోఖడే (41) రాణించగా..అర్షద్ ఖాన్ (25), హర్ష్ దూబె (24), రింకు సింగ్ (20) పరుగులు చేశారు. ముకేశ్ కుమార్ 4, మహ్మద్ షమి 3 వికెట్లతో సత్తాచాటారు. అభిజిత్, అనుకుల్ రాయ్, కౌనైన్ ఖురేషీ ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో ఇరుజట్లూ 266 పరుగులకు ఆలౌటయ్యాయి. సెప్టెంబరు 6 నుంచి చెపాక్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది. నార్త్ జోన్, సౌత్ జోన్ మధ్య జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుతో ఈస్ట్ జోన్ ఫైనల్లో తలపడనుంది

స్వదేశంలో అఫ్గానిస్తాన్ జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు బీసీసీఐ మంగళవారం టీమిండియా జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా ఉండనున్నాడు. ఇక స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వనుండగా, జింబాబ్వేతో టీ20 సిరీస్కు విశ్రాంతినిచ్చిన సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక బుమ్రాను ఎంపిక చేసినప్పటికీ, అతడు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డితో పాటు వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలు ఎంపికైనప్పటికీ, వీరు కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక అఫ్గానిస్తాన్తో టీమిండియా సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 13న, రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 17న జరగనున్నాయి. ఈ మూడు టీ20లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఆఫ్గన్తో టీ20 సిరీస్ కోసం సెలెక్టర్లు ప్రధాన బౌలర్లను చోటివ్వగా.. గాయం నుంచి కోలుకున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్క్వాడ్లోకి వచ్చాడు. రవి బిష్ణోయ్ రెండో స్పిన్నర్గా స్థానం సాధించాడు. బుమ్రా, హర్షిత్, వరుణ్ రాకతో ఇంగ్లండ్ గడ్డపై ఆడిన ప్రసిధ్ కృష్ణ, సూర్యాన్ష్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్ జట్టులో చోటు కోల్పోయారు. అయితే జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ బుమ్రా, నితీశ్, సుందర్, రాణాలు ఈ సిరీస్లో ఆడతారా? లేదా?అనేది ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుందని సెలెక్టర్లు పేర్కొన్నారు. ఇక ఆఫ్గన్తో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన జట్టునే ఆసియా గేమ్స్కు పంపనున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు మార్పులు మినహా దాదాపు ఇదే జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. ఇక ఆసియా క్రీడలు జపాన్లోని ఐచీ-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. India Squad for Afghanistan T20: ఆఫ్ఘనిస్థాన్తో త్వరలో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ సిరీస్కు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్గా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఎంపికయ్యాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణాల ఎంపిక ఫిట్నెస్ క్లియరెన్స్ ఆధారంగా ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. భారత పూర్తి జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా మొదటి టీ20: సెప్టెంబర్ 13, 2026 (ఆదివారం) రెండవ టీ20: సెప్టెంబర్ 15, 2026 (మంగళవారం) మూడవ టీ20: సెప్టెంబర్ 17, 2026 (గురువారం) గమనిక: ఈ మూడు మ్యాచ్లు కూడా ఢిల్లీ వేదికగానే జరగనున్నాయి

అఫ్గానిస్థాన్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. సెప్టెంబర్ 1న ప్రకటించిన ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా కొనసాగుతున్నారు. వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నారు. భారత జట్టులో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ ఉన్నారు. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాకు అవకాశం లభించింది. అయితే నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, అర్ష్దీప్, హర్షిత్ రాణాల ఎంపిక ఫిట్నెస్ క్లియరెన్స్కు లోబడి ఉంటుందని బీసీసీఐ తెలిపింది. అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్లో మూడు మ్యాచ్లు జరగనున్నాయి. మూడు మ్యాచ్లకు ఢిల్లీ ఆతిథ్యమివ్వనుంది. తొలి టీ20 సెప్టెంబర్ 13న ఆదివారం, రెండో మ్యాచ్ సెప్టెంబర్ 15న మంగళవారం, మూడో టీ20 సెప్టెంబర్ 17న గురువారం జరగనుంది. ఈ సిరీస్లో యువ ఆటగాళ్లకు కూడా సెలక్షన్ కమిటీ ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ఎంపికపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు సీనియర్ ఆటగాళ్లైన బుమ్రా, అర్ష్దీప్, అక్షర్ పటేల్ల అనుభవం జట్టుకు బలంగా మారనుంది. మూడు మ్యాచ్లు ఢిల్లీలోనే జరగనున్న నేపథ్యంలో స్వదేశంలో అఫ్గానిస్థాన్ను ఎదుర్కొనేందుకు భారత జట్టు సిద్ధమవుతోంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో కొత్త కాంబినేషన్తో బరిలోకి దిగనున్న టీమిండియా ప్రదర్శనపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది