విశాఖపట్నంలో ఆర్టీసీ 8 ఏసీ బస్ బేలు.. మంత్రి కీలకప్రకటన
విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభంకావడంతో ప్రయాణికులతో సందడి వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి భోగాపురానికి ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.. వీరి కోసం ఆర్టీసీ ఏరో ఎక్స్ప్రెస్ వే బస్సుల్ని నడుపుతోంది. విశాఖ నుంచి భోగాపురానికి ప్రతి అరగంటకు ఒక బస్సును నడిపేలా ప్లాన్ చేశారు.. అయితే విశాఖపట్నంలో ప్రయాణికుల కోసం సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ అంశంపై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు.విశాఖపట్నంలో ఎనిమిది ప్రాంతాల్లో బస్ బేలు నిర్మించబోతున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే బస్ బేలలో ఏసీ సౌకర్యం, మొబైల్ ఛార్జింగ్ సదుపాయం ఉండేలా చూస్తామన్నారు. మంత్రి విశాఖపట్నం హుడా పార్క్ నుంచి ఏరో ఎక్స్ప్రెస్ బస్సులో భోగాపురం విమానాశ్రయం వరకు ఆర్టీసీ అధికారులతో కలిసి ప్రయాణం చేశారు. ఏరో ఎక్స్ప్రెస్ బస్సులు నిర్ణీత సమయం ప్రకారం నడుస్తున్నాయన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.ఈ బస్సుల్లో ప్రస్తుతం ప్రయాణ సమయం 1.40 గంటలు పడుతోందని.. రాబోయే రోజుల్లో ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు మంత్రి. ఈ బస్సుల్లో ప్రస్తుతం 30శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని.. రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతందన్నారు. ఎయిర్పోర్ట్కు వెళ్లే ప్రయాణికులకు లగేజీకి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయని.. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామన్నారు. పర్యావరణహిత, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని.. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన రవాణా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.విశాఖపట్నం నుంచి ఎలక్ట్రిక్ బస్సులో విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. అక్కడ ఏర్పాటు చేసిన బస్స్టాండ్, చార్జింగ్ స్టేషన్ను పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి విశాఖపట్నం నుంచి విమానాశ్రయానికి కల్పించిన ఆర్టీసీ రవాణా సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి అరగంటకు ఒక ఎలక్ట్రిక్ బస్సును నడుపుతున్నట్లు