
© 2026 nimisham.in


ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) చైర్మన్గా మోహిత్ జైన్ ఎన్నికయ్యారు. బెన్నెట్ కోల్మన్ అండ్ కో లిమిటెడ్ (బీసీసీఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పబ్లిషింగ్), బోర్డు... న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) చైర్మన్గా మోహిత్ జైన్ ఎన్నికయ్యారు. బెన్నెట్ కోల్మన్ అండ్ కో లిమిటెడ్ (బీసీసీఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పబ్లిషింగ్), బోర్డు సభ్యుడిగా ఉన్న మోహిత్ జైన్ 2026-27 సంవత్సరానికి గాను ఏబీసీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 43 ఏళ్ల తర్వాత బీసీసీఎల్కు చెందిన ప్రతినిధి మరోసారి ఏబీసీ చైర్మన్ పదవిని చేపట్టినట్లయింది. ప్రింట్ మీడియా రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న మోహిత్ జైన్.. ప్రచురణ, వ్యాపార కార్యకలాపాలు, పరిశ్రమ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కెమికల్ ఇంజనీరింగ్తో పాటు ఎంబీఏ చదివిన జైన్.. 2021-22లో ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) అధ్యక్షుడిగా సేవలందించారు. రెండు దశాబ్దాలకు పైగా ఐఎన్ఎ్సతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రపంచ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ గ్లోబల్ సూపర్వైజరీ బోర్డులోనూ మోహిత్ జైన్ మూడేళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ దక్షిణాసియా విభాగం బోర్డు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కాగా, ఏబీసీ డిప్యూటీ చైర్మన్గా విక్రమ్ సఖుజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉక్రెయిన్పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

నటి నిత్యామీనన్ ఇటీవలే తన సొంత నిర్మాణ సంస్థ ‘కేయూరి ప్రొడక్షన్స్’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నటి నిత్యామీనన్ (Nithya Menen) ఇటీవలే తన సొంత నిర్మాణ సంస్థ ‘కేయూరి ప్రొడక్షన్స్’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. డీకే, విక్రమ్ కె.కుమార్తో కలిసి తొలుత ఆమె ఫాంటసీ డార్క్ కామెడీ మూవీ నిర్మిస్తున్నారు. తాజాగా ఇందులో నిర్మించబోయే మొదటి చిత్రం గురించి అప్డేట్ ఇచ్చారు ఆమె. ఈ సినిమాకు డీకే దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. గతంలో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లియో విజన్, హీరోయిన్ నిత్యామేనన్కు చెందిన కేయురి ప్రొడక్షన్స్ కలిసి 'ప్రొడక్షన్ నెం.5' అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నట్లు చెప్పారు. ఇంకా పేరు ఖరారు చేయని ఈ మూవీలో నిత్యామేనన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అభిమానులకు విభిన్నమైన సినిమాటిక్ అనుభూతి అందించేలా ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచుతుందని, త్వరలోనే టైటిల్ టీజర్ను విడుదల చేస్తామని అన్నారు. ‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాతో అందరూ ప్రేమలో పడతారు’ అని పేర్కొన్నారు. కాగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు

తెలంగాణ క్రిటికల్ మినరల్స్ రంగంలో కీలక అడుగులు పడుతున్నాయి. మోనాష్, ఐఐటీ హైదరాబాద్, సింగరేణి భాగస్వామ్యులుగా ఏర్పడి పరిశోధనలు చేయనున్నాయి. హైదరాబాద్, సెప్టెంబరు 1: తెలంగాణలో క్రిటికల్ మినరల్స్ పరిశోధనలో కీలక అడుగులు పడుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్సిటీ ఇందుకోసం ముందుకొచ్చింది. మోనాష్-ఐఐటీ హైదరాబాద్- సింగరేణి మూడు సంస్థలూ కలిసి త్రిముఖ భాగస్వాములుగా ఏర్పడి క్రిటికల్ మినరల్స్ రంగంలో పరిశోధనలు చేస్తాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇకపై ఖనిజ అన్వేషణ, వెలికితీత, శుద్ధి సాంకేతికతలపై ప్రత్యేక దృష్టి పెడతామని ఆయన వివరించారు. వ్యర్థాల నుంచి క్రిటికల్ మినరల్స్ రికవరీ చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ పరిశోధనలు సఫలమైతే ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్ల ముడి పదార్థాల కొరతను అధిగమించగలమని పేర్కొన్నారు. క్రిటికల్ మినరల్స్ పరిశోధన, ఆవిష్కరణలకు తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దుతామని భట్టి విక్రమార్క అన్నారు. అలాగే ఐఐటీ హైదరాబాద్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బలోపేతానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వాణిజ్య స్థాయిలో విస్తరించే సాంకేతికతల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నామన్నారు

Raaz Actress: ఒకప్పుడు భయంకరమైన లుక్తో ప్రేక్షకులను వణికించిన ‘రాజ్’ సినిమా నటి మాలినీ శర్మ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్కు దూరంగా ఉంటున్న మాలినీ శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్గా మారారు. ఆమెను గుర్తుపట్టిన అభిమానులు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్, మెసేజ్లు చేయడంతో ఆమె కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఇంతకాలం మాలినీ శర్మ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? 2002లో విక్రమ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మూవీ ‘రాజ్’ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బిపాషా బసు, డినో మోరియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో మాలినీ శర్మ దెయ్యం పాత్రలో హల్చల్ చేసింది. పెద్దగా డైలాగ్స్ లేకపోయినా, ఆమె లుక్, హావభావాలు, భయపెట్టే స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల ఒంట్లో వణుకు పుట్టించాయి. దీంతో ఆ సినిమా చూసిన చాలామందికి మాలినీ శర్మ పోషించిన దెయ్యం పాత్ర ఇప్పటికీ గుర్తుండిపోయింది. అయితే ‘రాజ్’ తర్వాత మాలినీ శర్మ కెరీర్ మాత్రం ఊహించిన స్థాయిలో కొనసాగలేదు. మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఆమె, సినిమాల్లోకి రాకముందు పలు మ్యూజిక్ వీడియోల్లోనూ కనిపించారు. ‘ఆప్కే ప్యార్ మే’ వంటి పాటల్లో కనిపించి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘క్యాట్స్’ అనే టీవీ సిరీస్లో కూడా నటించారు. కానీ బాలీవుడ్లో ఎక్కువకాలం కొనసాగకుండా ఆమె క్రమంగా సినిమాలకు దూరమయ్యారు. సినీ ప్రపంచానికి దూరమైన తర్వాత మాలినీ శర్మ తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నారు. సినిమా షూటింగ్స్, కెమెరాలు, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన లైఫ్ స్టైల్ ను గడుపుతున్నారు. ప్రస్తుతం పూణే సమీపంలోని సహ్యాద్రి కొండల్లో ‘ది స్లో లోకల్’ అనే ఫామ్స్టేను నిర్వహిస్తున్నారు. ప్రకృతి మధ్య ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఈ ఫామ్స్టే ఒక ప్రత్యేక అనుభూతిని అందించేలా ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో మాలినీ శర్మకు సంబంధించిన కొన్ని

కిర్గిజ్ రాజధాని బిష్కెక్లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. ఐదేళ్లు దాటుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి తక్షణమే ముగింపు పలకాలంటూ పుతిన్ ముందే భారత్ తన శాంతి వైఖరిని అత్యంత స్పష్టంగా పునరుద్ఘాటించింది. అంతులేని యుద్ధం నుంచి యుద్ధం ముగింపు వైపు అడుగులు వేయడం మానవాళి శ్రేయస్సుకు అత్యవసరమని మోదీ తేల్చిచెప్పారు. గతంలో 2022 సమర్కాండ్ ఎస్సీఓ సదస్సులో ఇది యుద్ధాల యుగం కాదని చెప్పిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. 2025 డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన వార్షిక సదస్సు తర్వాత 2026లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి భేటీ ఇదే కావడం విశేషం. గాంధీ, బుద్ధుడు నడయాడిన భారత భూమి నుంచి ఎల్లప్పుడూ శాంతి సందేశమే ప్రపంచానికి వెళ్తుందని రష్యా అధ్యక్షుడికి ప్రధాని నేరుగా వివరించారు. శాంతి వైపు వేసే ప్రతి అడుగు మానవాళిలో కొత్త ఆశను నింపుతుందని మోదీ స్పష్టం చేశారు. దీంతో ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చలకు మరియు శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లవేళలా మద్దతు ఇస్తుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి వెల్లడించారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లోని సంఘర్షణల వల్ల అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం మరియు భారతీయ నావికుల భద్రత తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భేటీలో మోదీ వ్యాఖ్యలపై స్పందించిన పుతిన్, భారత్ మరియు రష్యాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనియాడారు. ఫలితంగా 2026 మొదటి ఆరు నెలల్లో రెండు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగిందని రష్యా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రక్షణ, ఇంధనం, ఎరువులు, అంతరిక్షం మరియు వినూత్న రంగాలు సహా ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై రెండు దేశాల అధినేతలు సుదీర్ఘంగా చర్చించారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12–13

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం సడన్గా ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మరియు రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో సాయంత్రం లేదా రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య సమావేశం కానున్నారు. రాబోయే సెప్టెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీకి తీవ్ర రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. గాంధీభవన్ వర్గాల్లో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ మరియు క్రమశిక్షణ నివేదిక అంశాలపైనే పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. గత కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్లో మంత్రివర్గ మార్పులు మరియు చేర్పుల వ్యవహారం తీవ్రంగా వేడెక్కింది. దీనికితోడు మంత్రి కొండా సురేఖపై పీసీసీ డిసిప్లినరీ కమిటీ తయారు చేసిన నివేదిక ఇప్పటికే ఏఐసీసీకి చేరింది. సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు మరియు దానిపై సురేఖ స్పందించిన తీరు పార్టీలో వివాదాస్పదమైంది. ఈ ఘటనల ఆధారంగా ఆమెను మంత్రివర్గం నుండి తొలగించడంతో పాటు పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని స్థానిక రిపోర్టులు చెబుతున్నాయి. ఈ కీలక భేటీ కోసం సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మరియు మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హస్తినకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటన ಮುగించుకుని తిరిగి రాగానే ఈ భేటీ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కూడా సమావేశమై మెట్రో రైల్, విమానాశ్రయం మరియు ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సు వంటి అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గ మార్పులలో కొండా సురేఖ స్థానంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. స్పీకర్

తెలంగాణా ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే పనిలో ఉంది. ఈ క్రమంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని తలపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలను తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించే క్రమంలో డిసెంబర్ నెలలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనుంది. పారిశ్రామిక ప్రగతి సాధిస్తే రాష్ట్ర పురోగతి సాధ్యం అవుతుందని తెలంగాణా సర్కార్ భావిస్తోంది.ప్రజాభవన్లో వార్రూమ్ ఏర్పాటు చేసి రోజువారీ పురోగతి సమీక్షఈ క్రమంలో ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో డిసెంబరు 7, 8, 9 తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజాభవన్లో వార్రూమ్ ఏర్పాటు చేసి రోజువారీ పురోగతిని సమీక్షించాలని, వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి సీనియర్ అధికారులను బాధ్యులుగా నియమించాలని చెప్పారు.తెలంగాణా రాష్ట్రానికి మేఘ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు!తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు ప్రపంచానికి చెప్పేలా ప్లాన్ఈమేరకు ప్రజాభవన్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, సీఎస్ సంజయ్ జాజు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. గ్లోబల్ సమ్మిట్ -2026కు లోగో రూపొందించాలని, అడ్వైజరీ, ఎగ్జిక్యూటివ్ కమిటీలను త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించే కార్యక్రమాలు రూపొందించాలన్నారు.బ్రాండ్ తెలంగాణా.. 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్!విదేశీ దౌత్యవేత్తలు, కేంద్ర మంత్రులు, ప్రముఖులకు ఆహ్వానంఅంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రచారం కోసం అక్టోబరు మొదటి లేదా రెండో వారంలో ఢిల్లీలో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. విదేశీ దౌత్యవేత్తలు, కేంద్ర మంత్రులు, ప్రముఖులను ఆహ్వానించాలని, హైదరాబాద్ ప్రధాన కూడళ్లలో హోర్డింగులు ఏర్పాటు చేయాలని చెప్పారు. అదే సమయంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ 25వ వార్షికోత్సవంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణను గ్లోబల్ గ్రీన్ హబ్గా తీర్చిదిద్దాలని అన్నారు.గ్రీన్ టెక్నాలజీలో అగ్రస్థానంరాష్ట్రాన్ని దక్షిణ కొరియా, జపాన్ స్థాయికి తీసుకెళ్లాలని, సుస్థిర గ్రీన్

స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదితి శంకర్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆమె అనుపమ కాంట్రవర్సీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదితి శంకర్ (Aditi Shankar).. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. హీరో కార్తి సరసన ‘విరుమన్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత ‘మావీరన్, ‘నేసియప్పా’ చిత్రాల్లో నటించి మెప్పించారు. తాజాగా అర్జున్ దాస్ సరసన ఆమె నటించిన రొమాంటిక్ డ్రామా ‘వన్స్మోర్’ ఈ నెల 27న గ్రాండ్గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి శంకర్, ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) - ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram) కాంట్రవర్సీపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై అదితి శంకర్ పూర్తిస్థాయిలో అనుపమకు మద్దతుగా నిలిచారు. ‘‘అనుపమ చూపించిన ధైర్యానికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. చాలామంది తమకు జరిగిన అన్యాయాన్ని, బాధను మనసులోనే దాచుకుని కుమిలిపోతారు. కానీ అనుపమ ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి వాస్తవాలను బయటకు మాట్లాడింది. ఆమె చెప్పిన విషయాలపై కొందరిలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ, ఆమె మాటల్లో నాకు పూర్తి నిజాయితీ కనిపించింది. ఈ క్రమంలో ఆమె ఎలాంటి మానసిక క్షోభను అనుభవించిందో నేను అర్థం చేసుకోగలను. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొనే భావోద్వేగ సంఘర్షణలను ఓపెన్గా మాట్లాడి అందరికీ అవగాహన కల్పించింది. ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల చాలామందికి ఒక స్పష్టత వచ్చిందని నమ్ముతున్నాను’’ అని అదితి పేర్కొన్నారు. అలాగే చిత్రసీమలో తన కెరీర్ ప్రయాణంపై వస్తున్న కామెంట్లపై కూడా ఆమె స్పందించారు. చిత్రపరిశ్రమలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా కేవలం నాలుగు సినిమాలు మాత్రమే ఎందుకు చేశారని చాలామంది అడుగుతున్నారని చెబుతూ.. సంఖ్య కంటే కంటెంట్ ముఖ్యమని స్పష్టం చేశారు. ‘‘మనం

సినిమా ఇండస్ట్రీలో పాతనీరు వెళ్లిపోయి కొత్తనీరు రావడం కామన్.. అచ్చం అలాగే సీనియర్ దర్శకుల ప్లేస్ను యంగ్ డైరెక్టర్లు భర్తీ చేస్తూ వాళ్ల మేకింగ్కు వారసులుగా మారుతున్నారు. సీనియర్లు మెల్లగా వేరే జోనర్స్కు షిఫ్ట్ అవుతుంటే.. ఆ గ్యాప్ను ఫిల్ చేస్తూ కుర్రాళ్లు తమదైన స్టైల్తో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నారు. మరి టాలీవుడ్లో ఏ సీనియర్ డైరెక్టర్ ప్లేస్ను ఏ యంగ్ డైరెక్టర్ రీప్లేస్ చేస్తున్నారో చూద్దామా..? ఫ్యామిలీ ఎమోషన్స్, క్యూట్ పంచ్లు అనగానే త్రివిక్రమ్ గుర్తుకొస్తారు.. సింపుల్ కథలతో మ్యాజిక్ చేయాలంటే ఈయనే. ఈ ప్లేస్ను వెంకీ అట్లూరి భర్తీ చేస్తున్నారిప్పుడు. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ని త్రివిక్రమ్ గానీ తీశారా అనేంతగా తీసారు వెంకీ. త్రివిక్రమ్ నెక్ట్స్ ఎన్టీఆర్ సినిమాతో ప్యాన్ ఇండియాకు వెళ్తున్నారు.. దాంతో ఆ స్థానానికి సరైన వారసుడిగా వెంకీ అట్లూరి సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు యాక్షన్, కామెడీ టైమింగ్తో ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన శ్రీను వైట్ల కొంతకాలంగా ఫామ్లో లేరు. సరిగ్గా అదే టైమ్లో ఆ లోటు భర్తీ చేస్తూ అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చారు. తన మార్క్ కామెడీ, యాక్షన్తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్స్తో శ్రీను వైట్ల స్టైల్ను కంటిన్యూ చేస్తూ ఆయన సీటును అనిల్ పర్ఫెక్ట్గా సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు విలక్షణ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుకు నాగ్ అశ్విన్ పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్గా కనిపిస్తున్నారు. కల్కి లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఫాంటసీని జోడించారు నాగీ. తన అద్భుతమైన విజన్తో సరికొత్త సినిమాలు తీస్తూ సింగీతం గారికి వారసుడిగా ప్రూవ్ చేసుకుంటున్నారు నాగ్ అశ్విన్. చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్! యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు! వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్టాప్లు పేలుతున్నాయ్గా Trisha Krishnan: లగ్జరీ ఇళ్లు.. కార్లు

అల్లు అరవింద్ కి చెందిన గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమయ్యారు. పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీకి అల్లు అరవింద్ నిర్మాత. ఆ తర్వాత వీరి కాంబోలో జానీ, జల్సా లాంటి చిత్రాలు వచ్చాయి. జల్సా మాత్రమే సూపర్ హిట్ అయింది. జల్సా మూవీ విషయంలో ఆసక్తికర సంఘటన జరిగింది. దీని గురించి ప్రముఖ నిర్మాత ఎస్ కె ఎన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు. నేను ఇండస్ట్రీకి వచ్చింది అల్లు శిరీష్ వల్లే. నేను సినిమాలకు సంబంధించి ఫ్యాన్ పేజీలు నడిపేవాడిని. నా ట్యాలెంట్ చూసి నువ్వు ఇండస్ట్రీకి వస్తే బావుంటుంది అని శిరీష్ ప్రోత్సహించారు. ఆ విధంగా ఇండస్ట్రీకి వచ్చాను. అల్లు శిరీష్ హోమ్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ లోనే నాకు పీఆర్వోగా అవకాశం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ జల్సా సినిమాకి పీఆర్వోగా పని చేశాను. ఆ సినిమాకి నేను, శిరీష్ కలసి పబ్లిసిటీ కోసం వర్క్ చేశాం. ఆ మూవీలో పవన్ కళ్యాణ్ కాలు పైకి ఎత్తే పోస్టర్ ఉంటుంది. అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అని అనిపించింది. దానిని వైరల్ చేద్దాం అని అనుకున్నాం. కానీ అల్లు అరవింద్ గారికి ఆ పోస్టర్ అస్సలు నచ్చలేదు. అలా కాలు ఎత్తడం చూడడానికే ఇబ్బందిగా ఉంది. దానిని తలగించండి అని చెప్పారు. నేను కలగజేసుకుని.. లేదు సార్ ఇది బాగా వైరల్ అవుతుంది చూడండి అని చెప్పా. ఆ విధంగా అల్లు అరవింద్ గారిని ఒప్పించి ఆ పోస్టర్ ని పెట్టాను. ఆ పోస్టర్ ఎంత సంచలనం సృష్టించిందో చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఐకానిక్ స్టిల్స్ లో అది కూడా ఒకటి. సినిమా కూడా సూపర్ హిట్ అయింది. దీనితో నాకు అల్లు అరవింద్ గారి దగ్గర, ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఏర్పడింది. ఆ

'విజువల్ ఎఫెక్ట్స్' లేకుండా ప్రస్తుతం తెలుగు సినిమా సాగడం లేదు. ఇక ఫాంటసీ మూవీస్ లో గ్రాఫిక్స్ తప్పనిసరి. 'విజువల్ ఎఫెక్ట్స్' లేకుండా ప్రస్తుతం తెలుగు సినిమా సాగడం లేదు. ఇక ఫాంటసీ మూవీస్ లో గ్రాఫిక్స్ తప్పనిసరి. వీఎఫ్ఎక్స్ కారణంగా పలు సినిమాల బడ్జెట్ పెరుగుతోంది. వీటివల్లే కొన్ని చిత్రాల రిలీజ్ డేట్స్ తారుమారవుతున్నాయి. వీఎఫ్ఎక్స్ కారణంగానే రెండు ఫాంటసీ పిక్చర్స్ నత్త నడకన పయనిస్తున్నాయట. ఆ రెండు సినిమాలేవో? అభూతకల్పనలతో తెరకెక్కే చిత్రాలకు గ్రాఫిక్స్ మాయాజాలం అత్యంత అవసరం. 'వీఎఫ్ఎక్స్' వర్క్ సవ్యంగా సాగితే అనుకున్న సమయానికే సినిమాలను రిలీజ్ చేయవచ్చు. అందులో ఓ సారి జాప్యం చోటు చేసుకుంటే చాలు- విడుదల తేదీలను వాయిదా వేసుకుంటూ పోవలసిందే. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన విశ్వంభర (Vishwambhara) చిత్రం వాస్తవానికి గత యేడాది సంక్రాంతి సంబరాలకే రావలసింది. ఆ సమయంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం తాము బరి నుండి తప్పుకుంటున్నామని ప్రకటించారు మేకర్స్. తరువాత వేసవికి వస్తుందని, ఆ పై దసరాకు రానుందని టముకు సాగింది. కానీ, 'విశ్వంభర' ఇప్పటికీ వెలుగు చూడలేదు. కారణమేంటంటే- 'విశ్వంభర' కోసం ఇంతకు ముందు చేయించిన గ్రాఫిక్ వర్క్ అంత ఎఫెక్ట్ గా లేకపోవడంతో మొత్తం మళ్ళీ రిపీట్ చేయవలసి వచ్చిందట. అందువల్లే 'విశ్వంభర' పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు అక్టోబర్ 16న రిలీజ్ కానుందని తెలుస్తోంది. 'విశ్వంభర'లాగే నాగచైతన్య హీరోగా కార్తిక్ వర్మ దండు (Karthik Varma Dandu) దర్శకత్వంలో బీవీయస్.యన్. ప్రసాద్ నిర్మిస్తోన్న వృషకర్మ (Vrushakarma) కూడా విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఆలస్యమవుతోందని సమాచారం. ఈ సినిమా మిథికల్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతోంది. కాబట్టి గ్రాఫిక్ వర్క్ అత్యవసరం. అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో వీఎఫ్ఎక్స్ రూపొందించాలని మేకర్స్ భావించారు. అందువల్ల రాజీ పడకుండా విజువల్ ఎఫెక్ట్స్ సిద్ధం

ఇటీవల తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడి కలకలం రేపింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). అతను తనను మానసికంగా ఎలా వేధించాడో చెప్పింది. మొత్తం తన కంట్రోల్ లో ఉంచుకోవాలని తనకు నరకం చూపించాడని చెప్పింది. ఆమె తాజా ఇంటర్వ్యూ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ ఇంటర్వ్యూలోని అనేక అంశాలను జాతీయ మీడియా కూడా కవర్ చేసింది. ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు తమిళ కుర్ర హీరో, మాజీ సూపర్ స్టార్ విక్రమ్ కొడుకు అనేది గుసగుస. ఆమె డైరెక్ట్ గా ధృవ్ విక్రమ్ (Dhurvu Vikram) పేరు చెప్పలేదు కానీ వాళ్ళు రెండేళ్లు డేటింగ్ లో ఉన్నారు అనేది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అందుకే ఆమె తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి అలాంటి షాకింగ్ విషయాలు చెప్పేసరికి ఆమె ఇంటర్వ్యూ అంత వైరల్ అయింది. ఇప్పుడు ఇంకో విషయం బయట పెట్టింది. ఇద్దరూ పెళ్లి చేసుకొని గంపెడు పిల్లలను కనాలకుందట. 11 మంది పిల్లలను కనాలని ఆమెకి ఇంతకుముందు కోరిక ఉండేదట. కానీ బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ షిప్ తర్వాత పిల్లలను కనాలనే కోరిక కూడా పోయింది అని చెప్పింది

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఎంతో ఇష్టంగా, అత్యంత ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క భగీర కన్నుమూసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఎంతో ఇష్టంగా, అత్యంత ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క భగీర కన్నుమూసింది. ఈ చేదు వార్తను తట్టుకోలేకపోయిన ఎన్టీఆర్, సోషల్ మీడియా వేదికగా తన పెట్ డాగ్ను గుర్తుచేసుకుంటూ ఎంతో హృదయవిదారకమైన పోస్ట్ షేర్ చేశాడు. నాలుగేళ్ల పాటు తన జీవితంలో భాగమై ఎనలేని సంతోషాన్ని, అనుబంధాన్ని పంచిన భగీర ఇక లేడనే విషయాన్ని ఆయన అత్యంత తీవ్రమైన భావోద్వేగంతో వ్యక్తపరిచాడు. ఎన్టీఆర్.. భగీరని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.. "నా ప్రపంచంలోకి ఒక తోడుగా అడుగుపెట్టి, ఎంతో నిశ్శబ్దంగా నా కుటుంబంలో ఒకడిగా మారిపోయావు. ఈ నాలుగేళ్ల కాలంలో నీ ప్రేమ, నమ్మకం, అల్లరితో పాటు నువ్వు మాత్రమే ఇవ్వగలిగే ప్రశాంతతతో నా రోజులను నింపేశావు. నువ్వు లేని లోటు నా హృదయాల్లో చాలా పెద్ద శూన్యాన్ని మిగిల్చింది. కానీ నువ్వు నాపై చూపించిన ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉంటుంది. నన్ను ఎంచుకుని, నాతో పాటు నడిచి ఈ నాలుగేళ్ల ప్రయాణాన్ని ఎంతో అందంగా మార్చినందుకు చాలా థ్యాంక్స్ భగీర. నీ ఆత్మకు శాంతి కలగాలి మై లిటిల్ వన్.. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం" అంటూ రాసుకొచ్చాడు.ఎన్టీఆర్ చేసిన ఈ ఎమోషనల్ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జంతువులపై ఎన్టీఆర్ చూపించే ప్రేమను, ఆ జంతువుతో ఆయనకున్న గాఢమైన అనుబంధాన్ని చూసి అభిమానులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తారక్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం పూర్తి అయ్యాక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. మొదటి నుంచి

తమిళ వర్సటైల్ యాక్టర్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ ఆయన పరువును తీయడానికే కంకణం కట్టుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలో ఏ వారసుడు తీసుకురాని వివాదాలను ధృవ్ తెచ్చిపెడుతున్నాడు. తమిళ వర్సటైల్ యాక్టర్ విక్రమ్ (Vikram) కొడుకు ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) ఆయన పరువును తీయడానికే కంకణం కట్టుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలో ఏ వారసుడు తీసుకురాని వివాదాలను ధృవ్ తెచ్చిపెడుతున్నాడు. హీరోగా లాంచ్ అయిన దగ్గర నుంచి ఈ కుర్రాడు చేసినవి కొన్ని సినిమాలే అయినా, వివాదాలు మాత్రం లెక్కలేనన్ని ఎదుర్కొంటున్నాడు. ఇక ఈమధ్య నటి అనుపమ పరమేశ్వరన్తో బ్రేకప్, ధృవ్ ఎంత టాక్సిక్ అని ఆమె చెప్పిన విధానం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. ఇటీవలే ఈ బ్రేకప్ విషయంపై ధృవ్ స్పందిస్తూ.. ప్రేమించిన వారికి బలం ఇవ్వాలి, ట్రోల్స్ వలన నేను కూడా బాధపడ్డాను అని చెప్పాడు. అయితే ఈ వివాదం ముగియకముందే, సినిమా చేస్తానని చెప్పి డబ్బులు తీసుకుని నిర్మాతలను మోసం చేశాడంటూ మరో వివాదం రగులుకుంది. ఇది పాతదే అయినా మరోసారి వైరల్ గా మారింది. గతంలో ధృవ్ విక్రమ్పై తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో నీలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో ధృవ్తో ఒక సినిమా ఓకే చేసి.. రూ. 1 కోటి అడ్వాన్స్ తీసుకున్నాడు. దీంతో మేకర్స్ పాటలు, సెట్లు, నటీనటుల ముందస్తు ఖర్చుల కోసం నిర్మాతలు భారీగా డబ్బులు వెచ్చించారు. కానీ షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి తమకు చెప్పకుండా ధృవ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో కరణ్ దర్శకత్వంలో ఓ సినిమాను #DV4 గా అనౌన్స్ చేశాడు. లెక్క ప్రకారం రమేష్ వర్మతో చేయాల్సిన చిత్రమే #DV4 కావాలని, మైత్రీ మూవీస్ ప్రాజెక్ట్ #DV5 అవ్వాలని నిర్మాతలు స్పష్టం చేశారు. ఇక ఈ విషయంపై

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Sardar Sarvai Papanna Goud Jayanti: తెలంగాణ మట్టి బానిసత్వాన్ని భరించదని, అణచివేతను అసలే సహించదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 17వ శతాబ్దంలోనే అణచివేతపై తిరుగుబాటు చేసి, బహుజనులను ఏకం చేసి గోల్కొండ కోటను సాధించిన వీర యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చూపిన బాటలోనే నేటి ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలిపారు. హైదరాబాద్లోని సచివాలయం ఎదుట, ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. అనంతరం సచివాలయం ప్రాంగణంలో నిర్వహించిన పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సామాన్యులు సైతం కలలు కనే ఉన్నత స్థానాలకు ఎదగొచ్చని నాడే సర్వాయి పాపన్న నిరూపించారని భట్టి విక్రమార్క కొనియాడారు. 'కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి' అనే లక్ష్యంతో చిన్న చిన్న కోటలను గెలుచుకుంటూ ముందుకు సాగిన గొప్ప ధీరుడని, ఆయన ఆత్మగౌరవ పోరాటం మనందరికీ నిత్య స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా బహుజనులు, దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని, ఇటీవలే నెక్లెస్ రోడ్లో సావిత్రీబాయి పూలే, జ్యోతిరావు పూలే విగ్రహాలను కూడా ఆవిష్కరించుకున్నామని గుర్తుచేశారు. ఈ రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాలు ఎవరి దగ్గరా 'దేహీ' అని అడగకుండా, స్వశక్తితో తల ఎత్తుకొని బతికేలా ఆర్థికంగా నిలబెట్టడమే ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం తెలిపారు. అందులో భాగంగానే ఒక్కో ఇంటికి రూ.5 లక్షల సాయంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

మ్యాన్ ఆన్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్తో డ్రాగన్(Dragon) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. మ్యాన్ ఆన్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్తో డ్రాగన్(Dragon) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా, దీని తర్వాత ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీడెడ్, ఆంధ్రా బాక్సాఫీస్ వద్ద మాస్ రికార్డులను తిరగరాసిన ఆ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది. ఈ సారి ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాను కేవలం ఫ్యామిలీ లేదా రొటీన్ మాస్ ఎలిమెంట్స్ తో కాకుండా సోషియో-ఫాంటసీ, పౌరాణిక కలయికతో లార్జర్ దాన్ లైఫ్ స్కేల్ లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ చిత్రంలో కుమారస్వామిగా ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ టైటిల్ కాకుండా మరో టైటిల్ ని కూడా మేకర్స్ రిజిస్టర్ చేయించినట్లు టాక్ నడుస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కోసం గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ తో పాటు దేవసేనాపతి అనే రెండు పవర్ ఫుల్ టైటిల్స్ ను ప్రొడక్షన్ హౌస్ రిజిస్టర్ చేయడం విపరీతమైన చర్చకు దారితీసింది. గాడ్ ఆఫ్ వార్ వైరల్ అయినా కూడా దేవసేనాపతి టైటిల్ చాలా బావుందని, దాన్ని ఫైనల్ చేయమని

'అరవింద సమేత' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక భారీ మైథలాజికల్ ఫిల్మ్ కోసం చేతులు కలిపిన సంగతి తెలిసిందే. దేవతల సైన్యానికి అధిపతి 'కుమారస్వామి' కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. మొదటి నుంచి ఈ మూవీకి 'గాడ్ ఆఫ్ వార్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే తాజాగా మేకర్స్ రెండు టైటిల్స్ రిజిస్టర్ చేయించడం విశేషం. ఈ భారీ ప్రాజెక్ట్ ను హారిక & హాసిని క్రియేషన్స్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో 'గాడ్ ఆఫ్ వార్', 'దేవసేనాపతి' అనే రెండు టైటిల్స్ ను ఎన్టీఆర్ ఆర్ట్స్ రిజిస్టర్ చేయించడం ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో ప్రాజెక్ట్ కోసమే ఈ టైటిల్స్ రిజిస్టర్ చేయించారని అర్థమవుతోంది. మరి ముందు నుంచి ప్రచారం జరుగుతున్న 'గాడ్ ఆఫ్ వార్' టైటిల్ ను ఫైనల్ చేస్తారా? లేక 'దేవసేనాపతి' వైపు మొగ్గుచూపుతారా? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. గ్లోబల్ మార్కెట్ టార్గెట్ గా రూపొందనున్న మూవీ కాబట్టి, అన్ని భాషల వారికి ఈజీగా రీచ్ అయ్యేలా 'గాడ్ ఆఫ్ వార్' టైటిల్ వైపే మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది. లక్ష రూపాయలతో తీసిన చెత్త సినిమా, 20 కోట్లు కలెక్ట్ చేసింది.. ఎలాగంటే? తెలుగు హీరోయిన్ ట్విషా శర్మ ది హత్యా.. ఆత్మహత్యా!.. ది గ్రేట్ సిబిఐ ఏం చెప్పిందంటే

విక్టరీ వెంకటేష్(venkatesh)తో ఆదర్శ కుటుంబం(Aadarsa Kutumbam) సినిమాను తెరకెక్కిస్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas).. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టారు. అక్టోబర్ 2న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ పూర్తిగా ఎన్టీఆర్(NTR)తో చేయాల్సిన మైథలాజికల్ ప్రాజెక్ట్పై దృష్టి పెట్టాల్సి ఉంది. డ్రాగన్(Dragon) షూటింగ్లో ఎన్టీఆర్కు గాయమైన నేపథ్యంలో ఆ సినిమా షూటింగ్ ఆలస్యమైనప్పటికీ, 2027 జూన్లోనే రిలీజ్ చేయాలనే టార్గెట్తో టీమ్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. డ్రాగన్ రిలీజ్ వరకు ఎన్టీఆర్ అదే లుక్ను కొనసాగిస్తూ ప్రమోషన్స్లోనూ పాల్గొనాల్సి ఉంటుంది. దీంతో జూన్ 2027 వరకు ఆయన త్రివిక్రమ్ ప్రాజెక్ట్కు పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఆ తర్వాత కొత్త లుక్లోకి మారేందుకు కూడా ఎన్టీఆర్కు కొన్ని వారాల టైమ్ అవసరమవుతుంది. ఈ గ్యాప్లో త్రివిక్రమ్ మరో సినిమాను త్వరగా పూర్తి చేస్తారా? అనే డిస్కషన్ మొదలైంది. అయితే పదినెలల్లో ఓ ప్రాజెక్ట్ను పూర్తి చేసే డైరెక్టర్ గా త్రివిక్రమ్కు ట్రాక్ రికార్డ్ లేదు. అందుకే ఎన్టీఆర్ రాక కోసం వేచి చూస్తూనే, ఈలోపు మైథలాజికల్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను మరింత పక్కాగా పూర్తి చేయడమే త్రివిక్రమ్ ప్లాన్గా కనిపిస్తోంది. కథ, క్యారెక్టర్ డిజైన్, భారీ సెట్స్, విజువల్ ట్రీట్మెంట్ వంటి అంశాలపై ఆయన ఎక్కువ టైమ్ కేటాయించే అవకాశముంది. గాడ్ ఆఫ్ వార్(God Of War) అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్(Harika Haasinee Creations) బ్యానర్ నిర్మించనుంది. ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న ఈ భారీ సినిమా కోసం ఈ వెయిటింగ్ పీరియడ్ కీలకంగా మారనుంది

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ తొలి సినిమా అర్జున్ రెడ్డి రీమేక్ అదిత్య వర్మతో వెండితెరకు పరిచయమయి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొంతకాలంగా మలయాళ నటి అనుపమ పరమేశ్వరన్, ధృవ్ విక్రమ్ ప్రేమలో ఉన్నట్టు పుకార్లు షికార్లు చేసాయి. కానీ ఇటీవల ధృవ్ తో విడిపోయి పరోక్షంగా అతనిపై సెన్సేషన్ కామెంట్స్ చేసింది అనుపమ. దాంతో ధృవ్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ ఓ రేంజ్ లో జరిగింది. ఇటీవల తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్పై తమిళ యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్ స్పందించారు. తమిల్ మీడియాతో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ నేను సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడే ఇలాంటి విమర్శలు, ట్రోలింగ్స్ ఎదురవుతాయని తనకు ముందుగానే తెలుసు. ఎలాంటి విమర్శలు అయిన సరే తట్టుకోవాలని నాకు తెలుసు. అయితే కొన్నిసార్లు కొన్ని మాటలు ఎంతో మానసిక ఒత్తిడికి, తలనొప్పులకు గురిచేస్తాయి. ఇటీవల అలంటి సంఘటనలు జరిగిన మాట వాస్తవమే. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రేమించే వారిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మనం నిజాయితీగా ఉన్నంతకాలం ఎంతటి విమర్శలైనా కొట్టుకుపోతాయి. ముఖ్యంగా కష్టసమయాల్లో తనవెంటే ఉంటూ నిరంతరం ప్రోత్సహించిన అభిమానుల మద్దతే తనకు కొండంత బలాన్ని ఇచ్చిందని’ అన్నారు. అయితే ఈ కామెంట్స్ అనుపమనుద్దేశించి అన్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ధృవ్ మాటలు సొషల్ మీడియాలో వైరల్ గా మారాయి

మరణశిక్ష పడిన ఖైదీలకు ఉరిశిక్ష వేసే పద్ధతిని రద్దు చేసి, దానికి ప్రత్యామ్నాయంగా తక్కువ బాధ కలిగించే పద్ధతులను (విషపు ఇంజెక్షన్, కాల్చిచంపడం వంటివి) అమలు చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన పిటిషన్ను అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని సెక్షన్ 354(5) CrPC / BNSS 393(5) ప్రకారం ఉరి తీయడం ద్వారా మరణశిక్ష విధించే పద్ధతి చెల్లుబాటు అవుతుందని, గతంలో 3-జడ్జిల బెంచ్ (దీనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు) ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించడానికి పెద్ద బెంచ్కు పంపాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే, ఈ తీర్పు అంతిమం కాదని, భవిష్యత్తులో శాస్త్రీయ లేదా వైద్యపరమైన ఆధారాలు వచ్చి ప్రత్యామ్నాయ పద్ధతులు మెరుగైనవి అని రుజువైతే ఈ అంశాన్ని మళ్లీ రాజ్యాంగబద్ధంగా సమీక్షించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. అలాగే, ఉరిశిక్ష కంటే తక్కువ వేదన కలిగించే ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే స్వేచ్ఛ కేంద్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది

సనత్ నగర్ టిమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు… ప్రజా ప్రభుత్వం వ్యవసాయం, మహిళా సంక్షేమంతో పాటు విద్య, వైద్యాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంది మన బిడ్డలను ప్రపంచంలోనే గొప్ప స్థానాల్లో చూడాలని నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నాం నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ, జపాన్ దేశాల్లోనూ అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈరోజుల్లో ప్రైవేటు వైద్యం అత్యంత ఖరీదుగా మారింది అందుకే పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టిమ్స్ ను ప్రతంభించుకున్నాం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కోసం రూ.2700 కోట్లు ఖర్చు చేశాం సీఎంఆర్ఎఫ్ కోసం రూ. 2526 కోట్లు ఖర్చు చేశాం ఇప్పటి వరకు రూ. 5226 కోట్లు పేదల ఆరోగ్యం కోసం ఖర్చు చేశాం రెండేళ్లలో రూ.21,800 కోట్లు వైద్య ఆరోగ్య శాఖ కోసం ఖర్చు చేశాం ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థకు చేరితే…. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలని ప్రయత్నించలేదు టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్ ఆసుపత్రికి కేవలం టెంకాయకొట్టి వదిలేశారు మేం అధికారంలోకి వచ్చాక సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్, వరంగల్ ఆసుపత్రులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నాం ఇవన్నీ పూర్తయితే 10 వేల పడకల ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయి 2027, డిసెంబర్ 9 వరకు ఉస్మానియా, ఎల్బీ నగర్, అల్వాల్, వరంగల్ ఆసుపత్రులను పూర్తి చేస్తాం ఒక్కో ఆసుపత్రికి ఒక్కో డైరెక్టర్ ను నియమించి పర్యవేక్షిస్తాం కార్పొరేట్ తరహాలో ఆసుపత్రుల నిర్వహణ ఉండేలా చర్యలు తీసుకుంటాం ఆసుపత్రికి వచ్చే రోగుల అటెండెంట్ లు ఉండేదుకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తాం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా సమయాన్ని కేటాయించే సూపర్ స్పెషాలిటీ వైద్యులకు ప్రోత్సహకాలను అందిచేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నా పేదలకు వైద్యం అందించేందుకు ప్రజా ప్రభుత్వం ఉంది.. మా రేవంతన్న ఉన్నాడు అనేలా ప్రజలకు నమ్మకం

గత కొన్ని వారాలుగా తన వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై యువ నటుడు ధ్రువ్ విక్రమ్ తొలిసారి బహిరంగంగా స్పందించాడు. తన సహనటి అనుపమ పరమేశ్వరన్ గతంలో ఓ రెండేళ్ల సంబంధంలో తాను ఎదుర్కొన్న నియంతృత్వం, నార్సిసిజం గురించి మాట్లాడిన తర్వాత, ఆ వ్యాఖ్యలు ధ్రువ్ను ఉద్దేశించేనని పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే ధ్రువ్ మౌనం వీడాడు.‘ఇండియా టుడే తమిళ్’ నిర్వహించిన ఒక రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన్న ధ్రువ్ను.. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఈ ప్రచారాన్ని ఎలా ఎదుర్కొంటున్నారని ప్రశ్నించగా.. "నిజం చెప్పాలంటే, ఈ ప్రచారం నన్ను ప్రభావితం చేయలేదని నేను చెప్పలేను. కచ్చితంగా దాని ప్రభావం నాపై పడింది. కానీ, ఇలాంటి సమయంలో వాస్తవానికి కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. మనం ఎవరో, మన విలువేంటో తెలుసుకోవాలి. మనం ప్రేమించే వారిని, మనకు ముఖ్యమైన ప్రతి ఒక్కరినీ కాపాడుకోవాలి" అని ఆయన అన్నారు.బయటివారి అభిప్రాయాల ప్రభావం తనపై ఎక్కువగా ఉండదని చెబుతూ, "మీరు నిజానికి కట్టుబడి ఉన్నప్పుడు, మిమ్మల్ని ఏది నిలబెడుతుందో మీకు తెలిసినప్పుడు, బయటివారి విమర్శలు ఓ స్థాయిని దాటి వెళ్లలేవు. మనకు తెలియకుండానే మనం ఒంటరి సైన్యంలా మారతాం. మనకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకుని, మన అంతర్గత బలాన్ని కాపాడుకుంటాం" అని ధ్రువ్ వివరించాడు.ప్రముఖుల జీవితాల్లో ఇలాంటి పరిశీలన సర్వసాధారణమే అయినా, తన ప్రియమైన వారిని కాపాడుకోవడం, వ్యక్తిగత హద్దులు గీసుకోవడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నాడు. అయితే, ఈ సంభాషణలో ఆయన ఎక్కడా అనుపమ

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(anupama parameswaran) రీసెంట్ గా తన గత రిలేషన్ గురించి చేసిన కామెంట్స్ కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. సుమారు రెండేళ్ల పాటు కొనసాగిన ఆ రిలేషన్లో తాను ఎమోషనల్గా, ఫిజికల్గా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే రిలేషన్ లో ఉన్న వ్యక్తి పేరును అనుపమ ఎక్కడా ప్రస్తావించలేదు. గతంలో ఆమెకు ధృవ్ విక్రమ్(Dhruv vikram)తో ఉన్న రిలేషన్షిప్ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొందరు ఈ కామెంట్స్ ను అతడితో ముడిపెట్టారు. దీంతో ధృవ్ పర్సనల్ లైఫ్ ఒక్కసారిగా చర్చలోకి వచ్చింది. ఈ పరిణామాలపై ధృవ్ విక్రమ్ తాజాగా రియాక్ట్ అవుతూ, తన వ్యక్తిగత విషయాలపై ఇంతటి స్థాయిలో చర్చ జరగడం అసౌకర్యంగా అనిపిస్తోందని చెప్పినట్లు తెలుస్తోంది. తాను సాధారణంగా పర్సనల్ లైఫ్ ను బహిరంగంగా మాట్లాడే వ్యక్తిని కాదని, అయినప్పటికీ ప్రస్తుతం తనపై అనవసరమైన ఫోకస్ పెరిగిందనే భావనను వ్యక్తం చేశారు. ప్రతి డిస్కషన్ కు, ప్రతి ఊహాగానానికి రియాక్ట్ అవడం కంటే తన పని, కెరీర్పైనే దృష్టి పెట్టాలని ఆయన సూచించినట్లు సమాచారం. మరోవైపు, అనుపమ తన గత రిలేషన్ తనపై చూపిన ప్రభావాన్ని బహిరంగంగా వివరించినప్పటికీ, ఆమె కామెంట్స్లో ధృవ్ విక్రమ్ పేరు డైరెక్ట్ గా ప్రస్తావనకు రాలేదు. అంతేకాకుండా ఆ సంబంధాన్ని పెళ్లి దిశగా తీసుకెళ్లకుండా తానే ఆపుకున్నానని ఆమె వెల్లడించారు. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న వివాదంలో సోషల్ మీడియా ఊహాగానాలదే ప్రధాన పాత్రగా కనిపిస్తోంది

ఇంటర్నెట్ డెస్క్: ధ్రువ్ విక్రమ్ తన వ్యక్తిగత జీవితంపై జరుగుతోన్న ప్రచారం, ఎదురవుతోన్న విమర్శలపై స్పందించారు. నటి అనుపమ పరమేశ్వరన్ ఇటీవల చేసిన వ్యాఖ్యల అనంతరం తనపై (Dhruv Vikram) వస్తున్న వార్తల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. నటి పేరు ప్రస్తావించనప్పటికీ.. బ్రేకప్ గురించి ధ్రువ్ విక్రమ్ మాట్లాడారు. ‘‘నా బ్రేకప్ తర్వాత ఎదురైన కష్టకాలం నన్ను వ్యక్తిగతంగా ఎంతో ప్రభావితం చేసింది. కానీ, నా కుటుంబం, అభిమానులు అందించిన కొండంత ధైర్యం వల్లే నేను దాని నుంచి బయటకు రాగలిగాను. సినీ పరిశ్రమలోకి వచ్చేటప్పుడే నా వ్యక్తిగత జీవితంపై అందరూ దృష్టి పెడతారని తెలుసు. ఆ సమయంలో మా అమ్మ నాకు ఎప్పటికప్పుడు ధైర్యాన్నిచ్చింది’’ అని తెలిపారు. ‘‘నిజం చెప్పాలంటే, ఈ ప్రచారం నన్ను అస్సలు ప్రభావితం చేయలేదని నేను చెప్పలేను. కానీ, ఇలాంటి సమయంలో మనల్ని మనం ఎక్కువ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనమేమిటో, దేనికోసం నిలబడ్డామో తెలుసుకోవాలి. మనకు నచ్చిన వారిని, మన ప్రాణంగా భావించే ప్రతి విషయాన్ని కాపాడుకోవాలి. మన ప్రవర్తన నిజాయతీగా ఉన్నప్పుడు, ఈ విమర్శలు మనల్ని ఏం చేయలేవు’’ అని అన్నారు. తాను సోషల్ మీడియాలో తక్కువ సమయం గడుపుతానని ధ్రువ్ తెలిపారు. ‘‘నాకు ఎడిటింగ్ చేయడం, వీడియోలు తీయడం అంటే చాలా ఇష్టం. వీడియోలను షూట్ చేసి మ్యూజిక్కి తగ్గట్టుగా కట్ చేస్తుంటాను. వాటిని సోషల్ మీడియాలో పంచుకోను కానీ, అది నాకు చాలా ఇష్టమైన పని. సినిమాలు విడుదలయ్యేటప్పుడు ప్రమోషన్స్ ఉన్నప్పుడు మాత్రమే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను. మిగిలిన సమయాల్లో పుస్తకాలు చదవడం, సంగీతం వినడంలో మునిగిపోతాను’’ అని చెప్పారు. ఇక అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన రిలేషన్ గురించి చెప్పిన మాటలు వైరలైన విషయం తెలిసిందే. గతంలో రెండేళ్ల పాటు ఒక వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నరకం అనుభవించినట్లు చెప్పారు
సినీ పరిశ్రమలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై వచ్చే రూమర్లు, వివాదాలు ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటాయి. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు, యంగ్ హీరో ధృవ్ విక్రమ్, టాలెంటెడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మధ్య నడిచిన ప్రేమాయణం, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొన్నాళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరు ఇటీవల బ్రేకప్ చెప్పేసుకున్నారన్న వార్తలు, తన పార్టనర్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుపమ చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలోనే వీరి బ్రేకప్కి ధ్రువ్ కారణమంటూ వేళ్లన్నీ ఆయన వైపే చూపిస్తున్నాయి.* యానిమేషన్లో రామాయణం.. ‘మెగా 158’ మేకర్స్తో అనిల్ రావిపూడి సరికొత్త ప్రయోగం!తనపై వస్తున్న ఆరోపణలు, సోషల్ మీడియాలో జరుగుతోన్న ట్రోలింగ్పై ధృవ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. "చిన్న వయసులోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడే ఇక్కడ వ్యక్తిగత విషయాలపై పరిశీలనలు, విమర్శలు సర్వసాధారణమని నాకు తెలుసు. అలాగని ఇవి నన్ను అస్సలు బాధించలేదని, నాపై ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పలేను. అయితే జీవితంలో మనం ప్రేమించే వ్యక్తులకు అండగా నిలవడం, వారిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మనం నిజాయితీ మార్గంలో ఉన్నప్పుడు, మన విలువలు స్పష్టంగా ఉన్నప్పుడు కాలక్రమేణా ఈ దుష్ప్రచారాలు, విమర్శలన్నీ సమసిపోతాయి" అని పేర్కొన్నారు. కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన అభిమానుల మద్దతే ముందుకు నడిపిస్తోందని తెలిపారు.అనుపమ వ్యాఖ్యలతో రాజుకున్న వివాదంఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ తన గత సంబంధం గురించి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. ఎవరి పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, దాదాపు రెండేళ్ల పాటు ఓ టాక్సిక్ రిలేషన్షిప్లో తీవ్ర మానసిక క్షోభను అనుభవించానని ఆమె వెల్లడించారు. అవతలి వ్యక్తి తన ప్రతి చిన్న విషయాన్ని, కెరీర్ నిర్ణయాలను నియంత్రించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ అనుభవాల వల్ల తీవ్రమైన ఆందోళన, పానిక్ అటాక్స్, అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Dhruv Vikram:అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ రిలేషన్షిప్, బ్రేకప్ గురించి కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల ఓ రెండేళ్ల రిలేషన్షిప్లో తాను మానసిక వేధింపులు, నియంత్రణను ఎదుర్కొన్నట్లు అనుపమ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. అయితే ఆమె తన మాజీ ప్రియుడి పేరును మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఆ రిలేషన్షిప్ ధ్రువ్ విక్రమ్తోనేనా అంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలు, చర్చలపై ధ్రువ్ విక్రమ్ స్పందించారు. ఇటీవల ఓ రౌండ్టేబుల్ కార్యక్రమంలో పాల్గొన్న ధ్రువ్ విక్రమ్ను వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చలు తనను ఎంతవరకు ప్రభావితం చేశాయని ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆయన.. ఇలాంటి విషయాలు తనను అసలు ప్రభావితం చేయలేదని చెప్పడం నిజం కాదని తెలిపారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. తాను ఎవరో, తన విలువలు ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలని ధ్రువ్ అన్నారు. తనకు ముఖ్యమైన వ్యక్తులు, విషయాలను కాపాడుకోవడంపైనే దృష్టి పెడతానని తెలిపారు. నిజం ఏమిటో తనకు తెలుసు కాబట్టి బయట నుంచి వచ్చే విమర్శలు ఒక స్థాయికి మించి తనను ప్రభావితం చేయలేవని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రపంచాన్ని తాను కాపాడుకుంటూ, అంతర్గతంగా బలంగా ఉండేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. మరోవైపు సోషల్ మీడియాలో తాను ఎక్కువగా యాక్టివ్గా లేకపోవడానికి గల కారణాలపై కూడా ధ్రువ్ స్పందించారు. తనకు ఫొటోలు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకుడిగా పరిచయం అవుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘RaPo23’ కోసం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఈ సినిమా కోసం ఇటీవల పుదుచ్చేరి శివార్లలో రామ్ ఏకంగా 24 గంటల పాటు నిర్విరామంగా షూట్ చేశారు. విశేషం ఏమిటంటే రామ్ కేవలం డైరెక్టర్గా కెమెరా వెనుక ఉండటమే కాకుండా హీరోగా కూడా నటిస్తున్నారు. పుదుచ్చేరిలో ఈ సినిమా కోసం భారీ సెటప్ వేశారు. దాదాపు 9 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్లో రామ్ నటుడిగా తనపై ఉన్న బాధ్యతతో పాటు, దర్శకుడిగా సినిమా ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తూ శ్రమిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘RaPo23’ ప్రస్తుతం అందరిలో హాట్ టాపిక్గా మారింది. అయితే అనూహ్యంగా కురిసిన వర్షాల కారణంగా పుదుచ్చేరి షెడ్యూల్కు తాత్కాలికంగా బ్రేక్ పడటంతో యూనిట్ హైదరాబాద్కు తిరిగి వచ్చింది. మిగిలిన షూటింగ్ను అదే భారీ సెటప్లో పూర్తి చేసేందుకు త్వరలోనే టీమ్ మళ్లీ పుదుచ్చేరి వెళ్లనుంది. హీరోగా, దర్శకుడిగా ఒకేసారి రెండు బాధ్యతలు తీసుకున్న రామ్.. ఇంత కఠినమైన షూటింగ్ షెడ్యూల్స్లోనూ డెడికేషన్ తో పని చేస్తున్న తీరు ‘RaPo23’పై ఆసక్తిని మరింత పెంచుతోంది. కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాపో సినిమాటిక్స్ బ్యానర్పై భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. డార్క్, ఇంట్రెస్టింగ్ నియో-నోయిర్ బ్యాక్డ్రాప్లో సాగే సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ తిరునవుక్కరసు (తిర్రు) కెమెరామెన్గా పనిచేస్తున్నారు. యాక్షన్ పార్ట్ను విక్రమ్ మోర్, పీటర్ హెయిన్ కలిసి హ్యాండిల్ చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ సినిమా కథకు, భారీ స్కేల్కు తగ్గట్టుగా ప్రత్యేకమైన సెట్స్ను రూపొందిస్తున్నారు. సినిమా కాస్ట్, క్యారెక్టర్స్, తదుపరి షెడ్యూల్స్కు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ రాబోయే రోజుల్లో వెల్లడించనున్నారు

తమిళ వర్సటైల్ యాక్టర్ నటుడు విక్రమ్ తనయుడు, యంగ్ హీరో ధృవ్ విక్రమ్ పేరు ఈమధ్య సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన విషయం తెల్సిందే. అందాల భామ అనుపమ పరమేశ్వరన్- ధృవ్ ప్రేమాయణం ఎంత ఫేమస్ అయ్యిందో .. వారి బ్రేకప్ మరింత ఫేమస్ అయ్యింది. తమిళ వర్సటైల్ యాక్టర్ నటుడు విక్రమ్ తనయుడు, యంగ్ హీరో ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) పేరు ఈమధ్య సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన విషయం తెల్సిందే. అందాల భామ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)- ధృవ్ ప్రేమాయణం ఎంత ఫేమస్ అయ్యిందో .. వారి బ్రేకప్ మరింత ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా అనుపమ.. ధృవ్ పెద్ద టాక్సిక్ అబ్బాయి అని.. రెండేళ్ళు నరకం చూపించాడు అని చెప్పుకొచ్చింది. దీంతో కొన్నిరోజులుగా వీరిద్దరి మధ్య జరిగిన ప్రతి విషయం గురించి చర్చ మొదలయ్యింది. ఇంత జరిగినా కూడా ధృవ్ ఈ బ్రేకప్ పై నోరు మెదపలేదు. తాజాగా తన వ్యక్తిగత జీవితంపై గత కొంతకాలంగా వస్తున్న విమర్శలు, ట్రోలింగ్పై తాజాగా స్పందించాడు. ఇండస్ట్రీలో ఒక నటుడిగా కొనసాగుతున్నప్పుడు వ్యక్తిగత విషయాలపై పరిశీలనలు, విమర్శలు సహజమేనని, అయితే అలాంటి వ్యాఖ్యలు తనను ప్రభావితం చేయలేదని చెప్పలేనని అతను బహిరంగంగా అంగీకరించాడు. ఈ సందర్భంగా ధృవ్ విక్రమ్ మాట్లాడుతూ.. "నేను చాలా చిన్న వయసులోనే ఈ సినీ పరిశ్రమను నా వృత్తిగా ఎంచుకున్నప్పుడు, ఇక్కడ మన వ్యక్తిగత విషయాలపై తీవ్రమైన విమర్శలు, పరిశీలనలు ఉంటాయని నాకు ముందే అర్థమైంది. ఇవి నన్ను ఎప్పుడూ ప్రభావితం చేయలేదని నేను చెప్పలేను. కానీ మనం ప్రేమించే వ్యక్తులను ఎల్లప్పుడూ బలంగా కాపాడుకోవడం చాలా ముఖ్యం. మనం నిజాయితీగా, సత్యం వైపు నిలబడినప్పుడు, మనల్ని నడిపించే సూత్రాలు స్పష్టంగా ఉన్నప్పుడు, ఇలాంటి విమర్శలన్నీ కాలక్రమేణా మాయమవుతాయి'అని ఎమోషనల్ వ్యాఖ్యలు చేశాడు. తన ప్రయాణంలో ఎదురైన ఒడుదొడుకుల్లో అభిమానులు,మద్దతుదారులు అందించిన ప్రోత్సాహమే తనను

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం, సినిమాలు రాజకీయాలని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సినిమా గా పవన్ బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ నుంచి చివరగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం వచ్చింది. నెక్స్ట్ పవన్ ఓజీ2 మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీలో కొందరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు అని చెప్పడం కరెక్ట్. వీరిద్దరి మధ్య అంత అద్భుతంగా బాడింగ్ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ కి వీరాభిమానులకు కొదవ లేదు. సెలెబ్రిటీలే పవన్ అని అమితంగా అభిమానిస్తుంటారు. వారిలో బండ్ల గణేష్ ఒకరు. బండ్ల గణేష్ స్టేజీ ఎక్కితే చాలు.. పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని చాటుతూ వీరావేశంతో ఊగిపోతారు. అనేక సందర్భాల్లో తాను పవన్ కళ్యాణ్ కి భక్తుడు అని బండ్ల గణేష్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్, త్రివిక్రమ్ మధ్య గతంలో విభేదాలు తలెత్తాయి. త్రివిక్రమ్ ని బండ్ల గణేష్ తిట్టిన ఆడియో క్లిప్స్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఆడియో క్లిప్స్ మాత్రమే కాదు.. త్రివిక్రమ్ ని ఉద్దేశిస్తూ పరోక్షంగా బండ్ల గణేష్ అప్పట్లో ట్వీట్స్ కూడా చేశారు. ఆవేశాలు చల్లారాక త్రివిక్రమ్ తో బండ్ల గణేష్ రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేశారు. ఒకే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చిన్న చిన్న కోపతాపాలు ఉంటాయి. అది సహజం. ఆ తర్వాత మళ్ళీ కలిసిపోతాం కదా అని ఆ మధ్యన బండ్ల గణేష్ చెప్పే ప్రయత్నం చేశారు. ఇటీవల బండ్ల గణేష్ తన కుమార్తె వివాహానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఇన్వైట్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో త్రివిక్రమ్ పెళ్ళికి హాజరవుతారా కారా అనే సందేహం ఉండేది. ఆ అనుమానాలు పటాపంచలు చేస్తూ త్రివిక్రమ్ బండ్ల గణేష్ కుమార్తె పెళ్ళికి

Trivikram – Bandla Ganesh : ఒకరు పవన్ కళ్యాణ్ కి భక్తుడు. ఇంకొకరు పవన్ కళ్యాణ్ కి ఆప్త మిత్రుడు. పవన్ ఫ్యాన్స్ కి ఈ ఇద్దరూ కావాల్సినవాళ్ళే. కానీ కొన్నాళ్ల క్రితం ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ ఓ వివాదం అయితే నెలకొంది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు అంటే ఒకరు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మరొకరు నిర్మాత, నటుడు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ఎంత క్లోజ్ అనేది అందరికి తెలిసిందే. ఇక బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ స్పీచ్ లతో, ఆయన నా దేవుడు అంటూ వైరల్ అయ్యారు. కొన్నాళ్ల క్రితం ఓ పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ కు బండ్ల గణేష్ ని ఆహ్వానించకపోవడంతో ఫ్యాన్స్ తో ఫోన్ లో మాట్లాడుతూ.. త్రివిక్రమ్ వల్లే అంటూ తిట్టారు. త్రివిక్రమ్ ని బండ్ల గణేష్ తిట్టిన ఆడియో క్లిప్ అప్పట్లో తెగ వైరల్ అయింది. సోషల్ మీడియాలో కూడా బండ్ల గణేష్ త్రివిక్రమ్ కి కౌంటర్ గా గతంలో కొన్ని ట్వీట్స్ వేశారు. దాంతో బండ్లన్న – త్రివిక్రమ్ మధ్య గ్యాప్ ఏర్పడింది. Also See : Bellamkonda Sreenivas : భార్య బర్త్ డే.. పార్టీ నుంచి స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్.. కొన్ని రోజుల క్రితం బండ్ల గణేష్ ఈ వివాదంపై స్పందిస్తూ.. ఒకే ఇండస్ట్రీలో ఉన్నాం, కోపతాపాలు ఉండవా. ఒక మాట అనుకుంటాం. మళ్లీ కలిసిపోతాం అని అన్నారు. అయితే ఇప్పుడు పూర్తిగా కలిసిపోయారు అని తెలుస్తుంది. బండ్ల గణేష్ కూతురు జనని వివాహం ఆగస్టు 16న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. త్రివిక్రమ్ పెద్ద పుష్పగుచ్చం తీసుకొని జనని పెళ్లి కి

‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాపై ప్రేమను కురిపిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు: కథానాయకుడు సూర్య తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. ప్రతిభ గల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించారు. రాధిక శరత్కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ఆగస్టు 14, 2026న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రధాన తారాగణం అద్భుతమైన నటన, వెంకీ అట్లూరి రచనలోని బలం, సాంకేతిక నిపుణుల పనితీరు.. ఇలా అన్ని అంశాలు చక్కగా కుదిరి ‘విశ్వనాథ్ & సన్స్’ను గొప్ప చిత్రంగా మలిచాయి. అందుకే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తూ, వసూళ్ళ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం, హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకోవడంతో పాటు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొనడం విశేషం. ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ కథ విన్నప్పటి నుంచే, ఈ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైంది. ఇలాంటి సమయంలో ఒక కుటుంబ కథా చిత్రం చేసి, దానిని విజయవంతం చేసినందుకు చిత్ర బృందం మొత్తానికి అభినందనలు. నేను సూర్య గారితో ఒక సినిమా చేయాలి. ఆయనకు నచ్చే కథ ఇంకా చెప్పలేకపోయాను(నవ్వుతూ). త్వరలోనే మేమిద్దరం కలిసి పని చేస్తామని నమ్ముతున్నాను. నా సతీమణి

ఈ తరహా చిత్రాలను, అమ్ముడైన టికెట్లు, కలెక్షన్లతో కొలవలేం. ప్రేక్షకులు ఎంతగా నవ్వారు, ఎంతగా భావోద్వేగానికి గురయ్యారు, సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం. ''ఈ తరహా చిత్రాలను, అమ్ముడైన టికెట్లు, కలెక్షన్లతో కొలవలేం. ప్రేక్షకులు ఎంతగా నవ్వారు, ఎంతగా భావోద్వేగానికి గురయ్యారు, సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం. ఇది నాకు ఒక ప్రత్యేకమైన భావోద్వేగ ప్రయాణం' అని సూర్య (Suriya) అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'విశ్వనాథ్ & సన్స్’ (Viswanath & Sons) వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రంలో మమిత బైజు కథానాయికగా నటించగా, రాధిక శరత్కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతంగా ఆడుతోంది. సక్సెస్ లో భాగంగా చిత్రబృందం సెలబ్రేషన్స్ నిర్వహించింది. సూర్య మాట్లాడుతూ 'వ్యక్తిగత అనుబంధాలతో కూడిన కుటుంబ కథలు చాలా ముఖ్యమైనవి. త్రివిక్రమ్ సర్ మొదటి నుంచి ఇలాంటి కథలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఇకపై కూడా ఈ తరహా కథలతో మరిన్ని సినిమాలు వస్తాయని నేను భావిస్తున్నాను. ఇలాంటి విజయాలను కేవలం అమ్ముడైన టికెట్ల సంఖ్యతో లెక్కలు కట్టలేం. ప్రేక్షకులు సినిమాలో నవ్విన నవ్వులు, పెట్టిన కన్నీళ్లను లెక్కల్లో చూపించగలమా? సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగా మాట్లాడుకుంటున్నారు, ఎంతగా కనెక్ట్ అవుతున్నారు అనేదే నాకు ముఖ్యం ఇదొక భావోద్వేగ ప్రయాణం. ఈ అద్భుతమైన కథను, చక్కని పాత్రలను రాసి ప్రేక్షకులను మెప్పించిన వెంకీ అట్లూరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు రెట్టింపు స్థాయిలో వసూళ్లు రావడం, తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలు వేయడం చాలా ఆనందంగా ఉంది. నేను తమిళనాడు నుంచి వచ్చాను. వెంకీ, వంశీ గారు తెలుగువారు. మమితా కేరళ నుంచి, రవీనా మహారాష్ట్ర నుంచి వచ్చారు. మేమంతా

స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. ఇప్పటికే కరువు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న సూర్య. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో సూర్యతో పాటు మమితా బైజు, రాధిక శరత్కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ గెస్ట్ గా హాజరయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "ఈ కథ విన్నప్పటి నుంచే, ఈ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైంది. ఇలాంటి సమయంలో ఒక కుటుంబ కథా చిత్రం చేసి, దానిని విజయవంతం చేసినందుకు చిత్ర బృందం మొత్తానికి అభినందనలు. నేను సూర్య గారితో ఒక సినిమా చేయాలి. ఆయనకు నచ్చే కథ ఇంకా చెప్పలేకపోయాను(నవ్వుతూ). త్వరలోనే మేమిద్దరం కలిసి పని చేస్తామని నమ్ముతున్నాను. నా సతీమణి సూర్య గారికి పెద్ద ఫ్యాన్. సూర్య గారితో సినిమా చేయమని రిక్వెస్ట్ కాదు, డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా సినిమా షూటింగ్ లకు పెద్దగా వెళ్ళరు. అలాంటిది సూర్య గారి మీద అభిమానంతో ఈ సినిమా సెట్ కి వెళ్ళి, సూర్య గారితో ఫోటో దిగారు. ఆడవాళ్లు అంత గమ్మున ఇష్టపడరు. కానీ, ఇష్టపడితే మాత్రం జీవితాంతం వదిలిపెట్టరు. అలాంటి హీరోలు అతికొద్ది మంది ఉంటారు. అందులో సూర్య గారు ఒకరు. ఇండియాలో ఇద్దరే హీరోలకు వయసు వెనక్కి వెళ్తుంది. ఒకళ్ళు సూర్య గారు, ఇంకొకళ్ళు మహేష్ బాబు గారు. గజినీలో సూర్య గారు పోషించిన సంజయ్ రామస్వామి పాత్ర.. తమిళ ప్రేక్షకులకు

ఈ తరహా చిత్రాలను, అమ్ముడైన టికెట్లు, కలెక్షన్లతో కొలవలేం. ప్రేక్షకులు ఎంతగా నవ్వారు, ఎంతగా భావోద్వేగానికి గురయ్యారు, సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం. ''ఈ తరహా చిత్రాలను, అమ్ముడైన టికెట్లు, కలెక్షన్లతో కొలవలేం. ప్రేక్షకులు ఎంతగా నవ్వారు, ఎంతగా భావోద్వేగానికి గురయ్యారు, సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం. ఇది నాకు ఒక ప్రత్యేకమైన భావోద్వేగ ప్రయాణం' అని సూర్య (Suriya) అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'విశ్వనాథ్ & సన్స్’ (Viswanath & Sons) వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రంలో మమిత బైజు కథానాయికగా నటించగా, రాధిక శరత్కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతంగా ఆడుతోంది. సక్సెస్ లో భాగంగా చిత్రబృందం సెలబ్రేషన్స్ నిర్వహించింది. సూర్య మాట్లాడుతూ 'వ్యక్తిగత అనుబంధాలతో కూడిన కుటుంబ కథలు చాలా ముఖ్యమైనవి. త్రివిక్రమ్ సర్ మొదటి నుంచి ఇలాంటి కథలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఇకపై కూడా ఈ తరహా కథలతో మరిన్ని సినిమాలు వస్తాయని నేను భావిస్తున్నాను. ఇలాంటి విజయాలను కేవలం అమ్ముడైన టికెట్ల సంఖ్యతో లెక్కలు కట్టలేం. ప్రేక్షకులు సినిమాలో నవ్విన నవ్వులు, పెట్టిన కన్నీళ్లను లెక్కల్లో చూపించగలమా? సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగా మాట్లాడుకుంటున్నారు, ఎంతగా కనెక్ట్ అవుతున్నారు అనేదే నాకు ముఖ్యం ఇదొక భావోద్వేగ ప్రయాణం. ఈ అద్భుతమైన కథను, చక్కని పాత్రలను రాసి ప్రేక్షకులను మెప్పించిన వెంకీ అట్లూరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు రెట్టింపు స్థాయిలో వసూళ్లు రావడం, తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలు వేయడం చాలా ఆనందంగా ఉంది. నేను తమిళనాడు నుంచి వచ్చాను. వెంకీ, వంశీ గారు తెలుగువారు. మమితా కేరళ నుంచి, రవీనా మహారాష్ట్ర నుంచి వచ్చారు. మేమంతా

హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా కుటుంబ కథా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' విజయోత్సవ వేడుకలు శనివారం రాత్రి హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి, హీరో సూర్యపై ప్రశంసల జల్లు కురిపించాడు.ఈ వేడుకలో సూర్య మాట్లాడుతూ.. "కుటుంబ కథా చిత్రాల ప్రాముఖ్యతను ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ మరోసారి నిరూపించింది. తొలి రోజుతో పోలిస్తే వసూళ్లు రెట్టింపు కావడం సంతోషకరం. తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఇంతటి అద్భుతమైన కథను, పాత్రలను రూపొందించిన దర్శకుడు వెంకీ అట్లూరికి నా ప్రత్యేక ధన్యవాదాలు" అని పేర్కొన్నాడుఅనంతరం త్రివిక్రమ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "భారతీయ చిత్ర పరిశ్రమలో వయసు తగ్గుతున్నట్లు కనిపించే అరుదైన కథానాయకులు ఇద్దరే ఉన్నారు. ఒకరు సూర్య, మరొకరు మహేశ్ బాబు. సూర్యతో సినిమా చేయాలని నా భార్య ఎప్పటి నుంచో కోరుతోంది. త్వరలోనే ఆయనతో కలిసి పని చేస్తానని ఆశిస్తున్నాను. సూర్య, కార్తీ ఇప్పుడు భాషా, ప్రాంతీయ భేదాలు దాటి తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు" అని కొనియాడాడు.ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మామితా బైజు కథానాయికగా నటించగా, రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. నటీనటులు, సాంకేతిక బృందం నుంచి అద్భుతమైన సహకారం లభించిందని, సూర్య తన నటనా ప్రతిభతో సినిమాను మరో
తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్ గా నటించింది. రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. దీనికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "ఫస్ట్ ఈ కథ విన్నప్పటి నుంచే ఈ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైంది. ఇలాంటి టైంలో కస్టపడి ఒక కుటుంబ కథా చిత్రం చేసి, దానిని సక్సెస్ ఫుల్ చేసినందుకు టీమ్ మొత్తాన్ని అభినందిస్తున్నాను. నేను సూర్య గారితో ఒక సినిమా చేయాలి. ఆయనకు నచ్చే కథ ఇంకా చెప్పలేకపోయాను. త్వరలోనే మేమిద్దరం కలిసి పని చేస్తామని నమ్ముతున్నాను. నా భార్య సూర్యకి పెద్ద ఫ్యాన్. ఆమె సూర్యతో సినిమా చేయమని రిక్వెస్ట్ కాదు, డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా తను సినిమా షూటింగ్ లకు పెద్దగా వెళ్ళరు. అలాంటిది సూర్య మీద అభిమానంతో ఈ సినిమా సెట్ కి వెళ్ళి, కలిసి ఫోటో దిగారు. బేసిక్ గా ఆడవాళ్లు అంత గమ్మున ఇష్టపడరు. కానీ, ఇష్టపడితే మాత్రం జీవితాంతం వదిలిపెట్టరు. అలాంటి హీరోలు అతికొద్ది మంది ఉంటారు. అందులో సూర్య ఒకరు. నాకు తెలిసి ఇండియాలో ఇద్దరు హీరోలకు వయసు వెనక్కి వెళ్తుంది. ఒకరు సూర్య, ఇంకొకరు మహేష్ బాబు'' అని నవ్వుతూ అన్నారు.''గజినీ'లో సూర్య పోషించిన సంజయ్ రామస్వామి పాత్ర.. తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరైన పాత్ర. కొన్ని పాత్రలు మనతో పాటు

భారతదేశంలో వయసు వెనక్కి వెళ్లే హీరోలు ఇద్దరే ఇద్దరు ఉన్నారని అన్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సక్సెస్ మీట్లో ఆయన స్పీచ్ వైరల్ అవుతోంది. భారతదేశంలో వయసు వెనక్కి వెళ్లే హీరోలు ఇద్దరే ఇద్దరు ఉన్నారని అన్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). తాజాగా ఆయన సూర్య (Suriya) హీరోగా నటించిన ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons) సక్సెస్ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 14న విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల సక్సెస్ఫుల్గా రన్ అవుతూ థియేటర్లలో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఆదివారం సక్సెస్ సెలబ్రేషన్స్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ వెంకీ తనకు చెప్పినప్పటి నుంచి ఇది తన మనసుకు ఎంతో దగ్గరైన కథ అని త్రివిక్రమ్ పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఇంత చక్కగా సినిమా తీసి విజయం సాధించినందుకు చిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. సూర్యతో కలిసి కచ్చితంగా ఒక సినిమా చేయాలనుకుంటున్నానని, ఆయనకు నచ్చే కథ చెప్పడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. సూర్యతో సినిమా చేయాలని తన భార్య నుంచి ఒక డిమాండ్ ఉందని తెలిపారు. సాధారణంగా సితార బ్యానర్లో జరిగే షూటింగ్లకు రాని తన భార్య, సూర్యను కలవడానికి స్వయంగా సెట్కి వచ్చి ఫొటో తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. భారతదేశంలో వయసు వెనక్కి వెళ్లే హీరోలు ఇద్దరే ఇద్దరని, ఒకరు సూర్య అయితే మరొకరు మహేష్ బాబు అని కొనియాడారు. ‘గజిని’ చిత్రంలోని సంజయ్ రామస్వామి క్యారెక్టర్ తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పాత్ర అని, అలాంటి

ఇండియాలో మహేష్ బాబు (Mahesh Babu) తర్వాత సూర్య (Suriya) మాత్రమే! దిగ్గజ దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) పోలిక ఇది. భారతదేశంలోని అందరి హీరోల్లో ఒకే ఒక్క విషయంలో మహేష్ బాబు నంబర్ వన్ అయితే, ఆ తర్వాత స్థానం సూర్యదే అంటున్నారు త్రివిక్రమ్. అయితే అది సినిమాల్లో కాదు, గ్లామర్ విషయంలో. “ఇండియాలో ఏ హీరోకైనా వయసు ముందుకెళ్తుంది. కానీ దేశంలోని హీరోలందర్లో వయసు వెనక్కు వెళ్లే హీరో మహేష్ బాబు. ఆ తర్వాత స్థానం సూర్యదే. వీళ్లిద్దరికే వయసు వెనక్కు వెళ్తుంది. రోజులు గడిచేకొద్దీ వీళ్లు మరింత అందంగా తయారవుతుంటారు.” ఇలా సూర్యను పొగడ్తల్లో ముంచెత్తారు త్రివిక్రమ్. ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ (Vishwanath And Sons) సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన త్రివిక్రమ్, తన భార్య సూర్యకు పెద్ద ఫ్యాన్ అనే విషయాన్ని బయటపెట్టారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కే సినిమాల షూటింగులకు ఆమె సాధారణంగా వెళ్లరంట. కేవలం సూర్య కోసం ఆమె ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సినిమా షూటింగ్ వెళ్లి, సూర్యతో ఫొటోదిగి వచ్చారంట. సితార బ్యానర్ కు త్రివిక్రమ్ భార్య సహ-నిర్మాత అనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని కూడా బయటపెట్టారు త్రివిక్రమ్. గతంలో సూర్యతో సినిమా చేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యానని, ఈసారి కచ్చితంగా సూర్యతో సినిమా చేస్తానని ప్రకటించారు

తెలంగాణ ప్రజల అవసరాలే పరమావధిగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలు, విద్యార్థులు, రైతులు సహా అన్ని వర్గాలకూ సంక్షేమం అందుతోందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు. ఖమ్మం: తెలంగాణ ప్రజల అవసరాలే పరమావధిగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలు, విద్యార్థులు, రైతులు సహా అన్ని వర్గాలకూ సంక్షేమం అందుతోందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో కాలయాపన చేసిందని విమర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని భట్టి చెప్పుకొచ్చారు. విద్యా రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రైతు భరోసాతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు అండగా నిలుస్తూ వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana Fee Reimbursement: స్వాతంత్ర్య దినోత్సవం వేళ తెలంగాణ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని అందజేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులకు విద్యా బోధనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్త కూడదనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం రూ. 2,400 కోట్ల నిధులు ముందస్తుగానే బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు రేవంత్ ప్రకటించారు. విద్యార్థులు ఎవరినీ ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా, డబ్బులు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోనే స్కాలర్ షిప్ సొమ్మ జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు సాధించాలంటే కేవలం డిగ్రీలు ఉంటే సరిపోవని, టెక్నికల్ స్కిల్స్ కడా ఎంతో సీఎం రేవంత్ విద్యార్థులకు సూచించారు. 10వ తరగతి పూర్తైన వెంటనే విద్యార్థులు ITI కోర్సుల ద్వారా వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకోవచ్చని సీఎం చెప్పారు. నర్సింగ్ విద్య అభ్యసించిన వారికి జపాన్, జర్మనీ, కొరియా తదితర విదేశాలలో లక్షల రూపాయల ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. యువతలో తగిన నైపుణ్యం, సామర్థ్యం ఉంటే.. వారిని విదేశాలకు పంపించి మంచి ఉద్యోగావకాశాలు కల్పించే బాధ్యతను తనదేనని రేవంత్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యా రంగానికి ప్రాధాన్యతనిచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్వాన్స్ ఫీజు రీయింబర్స్మెంట్లను అందించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ చొరవలో భాగంగా, ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ల మొదటి విడతగా రూ.250 కోట్లను నేరుగా బ్యాంకుల్లో జమ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని అర్హులైన పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు

సూర్య హీరోగా నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం ఆగస్టు 14న విడుదలైన తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరి రైటింగ్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కుటుంబ భావోద్వేగాలు, చమత్కారమైన సంభాషణలు మరియు సహజమైన సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. వెంకీ అట్లూరి రాసిన స్క్రీన్ప్లే మరియు సంభాషణల శైలి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్కును గుర్తు చేస్తోందని సినీ ప్రేమికులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గుల్టే వంటి ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఆయనను న్యూ-ఏజ్ త్రివిక్రమ్గా అభివర్ణిస్తూ కథనాలు ప్రచురించాయి. నటుడిగా కెరీర్ ప్రారంభించి 'తొలిప్రేమ' చిత్రంతో దర్శకుడిగా మారిన వెంకీ అట్లూరి 'సార్', 'లక్కీ భాస్కర్' సినిమాలతో భారీ విజయాలు సాధించారు. లక్కీ భాస్కర్ చిత్రానికి గాను ఆయన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ స్క్రీన్ప్లే పురస్కారాన్ని దక్కించుకోవడం విశేషం. తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంలో ఒలింపిక్ పిస్టల్ షూటర్గా సూర్యను చూపించడంతో పాటు వయసు వ్యత్యాసం ఉన్న ప్రేమ కథను కుటుంబ బంధాలతో చాలా సున్నితంగా తెరకెక్కించారు. ఈ తమిళ-తెలుగు ప్రాజెక్ట్లో సూర్య, మమితా బైజుల మధ్య ఉన్న కెమిస్ట్రీ మరియు రాధికా శరత్కుమార్ నటన ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. దీంతో ఈ చిత్రంలో వెంకీ అట్లూరి ప్రదర్శించిన రైటింగ్ నైపుణ్యంపై చిత్ర పరిశ్రమలో విస్తృత చర్చ జరుగుతోంది. దర్శకుడు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, త్రివిక్రమ్ శైలి నుండి తాను ప్రేరణ పొందినట్లు స్పష్టం చేశారు. ప్రీ-రిలీజ్ వేడుకలో సూర్య సైతం వెంకీ అట్లూరి మేకింగ్లో త్రివిక్రమ్ ఫ్యామిలీ వ్యాల్యూస్ మరియు హ్యూమర్ కనిపిస్తాయని వ్యాఖ్యానించారు. ఈ రకమైన సహజ సిద్ధమైన స్క్రీన్ప్లేతో బాక్సాఫీస్ వద్ద సినిమా కలెక్షన్ల పరంగా కూడా మంచి ఓపెనింగ్స్ సాధిస్తోంది. నటుడు కార్తి సైతం వెంకీ

– అక్రమ విద్యుత్ ఉచ్చుల మూలాలపై సమగ్ర దర్యాప్తు – వందేళ్లలో ఇలాంటి సంఘటనా ఎక్కడా జరగలేదు – డీఎఫ్ఓ సిద్ధార్ద్ విక్రమ్ సింగ్ బూర్గంపహాడ్, ఆగస్టు 13 : వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి విధి నిర్వహణలో చెరువుసింగారం వెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ ప్రాణాలు కోల్పోయారని… ఈ ఘటనను అటవీ శాఖ అత్యంత సీరియస్ గా తీసుకుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ అన్నారు. గురువారం చెరువు సింగారం బీట్ పరిధిలోని నకిరిపేట అటవీప్రాంతాన్ని ఆయన అటవీ అధికారులతో కలిసి పరిశీలించారు. అటవీ సిబ్బంది ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి అక్రమ చర్యలను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ముసలిమడుగు సెక్షన్ పరిధిలో చెరువుసింగారం బీట్ లో సంఘటనా స్థలంలో అణువణువునా పరిశీలించారు. అక్రమ విద్యుత్ ఉచ్చు ఏర్పాటు చేసిన ప్రాంతం, విద్యుత్ సరఫరా జరిగిన విధానం, సంబంధిత విద్యుత్ లైన్లు, అక్రమంగా విద్యుత్ తీసుకున్న మార్గం, పరిసర ప్రాంతాల పరిస్థితులను పరిశీలించారు. ఈ ఘటన కేవలం వన్యప్రాణుల వేటకు సంబంధించిన నేరంగా మాత్రమే కాకుండా ప్రాణాంతకమైన అక్రమ విద్యుత్ వినియోగం, అటవీ ప్రాంతాల్లో విద్యుత్ భద్రత, ఫీల్డ్ స్థాయి పర్యవేక్షణ, అంతరశాఖల సమన్వయానికి సంబంధించిన అంశంగా పరిగణించారు. అక్రమ విద్యుత్ కనెక్షన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఏ విద్యుత్ లైన్ నుంచి సరఫరా జరిగింది, ఎలాంటి విధానంలో విద్యుత్ను అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లారు, అక్రమ కనెక్షన్ ఎంతకాలంగా ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించి ఫీల్డ్ సిబ్బందికి ఎప్పుడైనా సమాచారం అందిందా, అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లపై అవసరమైన పర్యవేక్షణ తనిఖీలు జరిగాయా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని డీఎఫ్ఓ స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో అక్రమ విద్యుత్ ఉచ్చును ఏర్పాటు చేసిన వ్యక్తులు ఎవరు, వారికి విద్యుత్ సరఫరా ఎలా అందింది, ఈ

లార్ గిబ్బన్ కోతితో విక్రమ్ వీడియో వైరల్ కావడంతో తమిళనాడు అటవీశాఖ విచారణ చేపట్టింది. తాజాగా విక్రమ్కు నోటీసులు జారీ చేసి మూడు రోజుల్లో వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. తమిళ స్టార్ హీరో విక్రమ్ (Vikram) ప్రస్తుతం ఓ అరుదైన వన్యప్రాణికి సంబంధించిన వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇటీవల విక్రమ్ లార్ గిబ్బన్ ( Lar Gibbon) కోతితో విక్రమ్ ఉన్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వివాదం మరింత ముదిరింది. దీంతో ఈ విషయం తమిళనాడు అటవీశాఖ దృష్టిన పడింది. లార్ గిబ్బన్ను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? దాన్ని పెంచేందుకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. తాజాగా ఈ కేసులో విక్రమ్కు అటవీశాఖ నోటీసులు జారీ చేశారు. లార్ గిబ్బన్కు సంబంధించిన పూర్తి వివరాలను మూడు రోజుల్లోగా అటవీశాఖకు సమర్పించాలని అధికారులు విక్రమ్ను ఆదేశించారు. ఆ కోతి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి చెందినది, విక్రమ్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల వద్దకు ఎప్పుడు తీసుకువచ్చారు వంటి వివరాలను ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే లార్ గిబ్బన్ను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు ఎలాంటి అనుమతులు తీసుకున్నారు? దానికి సంబంధించిన పత్రాలు ఏమిటి? కోతి కొనుగోలు, బదిలీ, పెంపకానికి సంబంధించిన రికార్డులు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలపై కూడా అధికారులు వివరాలు కోరినట్లు తెలుస్తోంది

అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) చేసిన కామెంట్లు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన పాయింట్లు ఈ కింద చదవండి… ఈ మాటలన్నీ అనుపమ పరమేశ్వరన్ చెప్పింది కానీ ఆ బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పలేదు. ఆమె మాటలను బట్టి ఆమె ఎవరితో రిలేషన్ షిప్ లో ఉందో, అతను ఎవరో ఇట్టే అర్థం అయిపోతోంది. బైసన్ అనే చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సినిమా హీరో ధృవ్ విక్రమ్ (హీరో విక్రమ్ కొడుకు)తో డేటింగ్ చేసింది. వారిద్దరూ ఒక పబ్ లో లిప్ టు లిప్ కిస్ పెట్టుకుంటున్న వీడియో కూడా బయటికి వచ్చింది. ఈ సినిమా 2025లో విడుదల అయింది. అంతకు ఏడాది ముందు నుంచే వీరి డేటింగ్ షురూ అయింది. ఇక ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన “డ్రాగన్” చిత్రం కూడా గతేడాదే విడుదల అయింది. డ్రాగన్ సినిమాని తన బాయ్ ఫ్రెండ్ ఆంక్షల వల్లే ప్రమోట్ చేసుకోలేకపోయాను అని చెప్పింది అంటే అప్పుడు రిలేషన్ లో ఉన్నది ధృవ్ విక్రమ్ తోనే. సో, పేరు చెప్పకపోయినా ఆమె ఇచ్చిన ‘డ్రాగన్’ హింట్ తో ఆమె అతని గురించే మాట్లాడింది అని అర్థం అవుతోంది. ఆమె ఇటీవలే సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టింది. నర్మగర్భమైన పోస్టులతోనే ఆమె ధృవ్ తో కటీఫ్ చేసుకుందని తెలిసిపోయింది. ఆ మధ్య హైదరాబాద్ లో జరిగిన ఒక ప్రెస్ మీట్ లో ఆమెని ఈ పోస్టుల గురించి, బ్రేకప్ గురించి అడిగితే సీరియస్ అయింది. కానీ ఇప్పుడు ఒక కొత్త ఇంటర్వ్యూలో తాను రెండేళ్లు టాక్సిక్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ఇప్పుడు చెప్తోంది

సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. పదేళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎలాంటి వివాదాలకు చోటు ఇవ్వకుండా కేవలం నటనపైనే దృష్టి పెట్టిన ఈ మలయాళ బ్యూటీ, గత కొంతకాలంగా లవ్ అండ్ బ్రేకప్ రూమర్స్తో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఒక ప్రముఖ యువ హీరోతో ఆమె ప్రేమాయణం నడిపిందని, ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారంటూ సినీ వర్గాల్లో అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ రూమర్స్పై సైలెంట్గా ఉన్న అనుపమ, తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన గత రిలేషన్షిప్కు సంబంధించిన చేదు అనుభవాలను బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. తన జీవితంలో ఎదురైన ఆ చేదు జ్ఞాపకాల గురించి మాట్లాడిన అనుపమ, గత రెండేళ్ల కాలంలో తాను అనుభవించిన నరకాన్ని పూసగుచ్చినట్లు వివరించింది. తాను ఒక తీవ్రమైన నార్సిసిస్టిక్ అబ్యూజ్ కు గురయ్యానని, ఒక విషపూరితమైన బంధంలో బందీ అయ్యానని వెల్లడించింది. తన మాజీ ప్రియుడు ఒక రోజు 'రెమో'లా ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా ఉంటూ ప్రపంచంలోనే ఉత్తమ వ్యక్తిగా కనిపించేవాడని, కానీ మరుసటి రోజే విక్రమ్ 'అపరిచితుడు' సినిమాలోని క్యారెక్టర్ లాగా అత్యంత దారుణంగా, క్రూరంగా ప్రవర్తించేవాడని గుర్తుచేసుకుంది. మళ్లీ ఆ తర్వాత రోజు చిన్నపిల్లాడిలా ఏడుస్తూ క్షమాపణలు కోరేవాడని, ఈ సైకిల్ నిరంతరం రిపీట్ అయ్యేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమ పేరుతో తన జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి, క్రమక్రమంగా తనను పూర్తిగా కంట్రోల్ చేయడం ప్రారంభించాడని అనుపమ తెలిపింది. తాను వేసుకునే దుస్తుల నుంచి, సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల వరకు ప్రతీ విషయాన్ని ఆయనే నియంత్రించేవాడని పేర్కొంది. ఆఖరికి తాను నటిస్తున్న సినిమాల ఎంపికలోనూ, ప్రమోషన్స్కు హాజరయ్యే విషయంలోనూ ఆంక్షలు విధించేవాడని చెప్పింది. తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించిన 'డ్రాగన్' సినిమా ప్రమోషన్లకు కూడా ఈ తీవ్రమైన మానసిక ఒత్తిడి

ప్రముఖ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ తన గతానికి సంబంధించిన పలు సంచలన విషయాలను వెల్లడించింది. గతంలో రెండేళ్ల పాటు ఒక వ్యక్తితో రిలేషన్షిప్లో ఉండి 'నార్సిసిస్టిక్ అబ్యూజ్' (మానసిక వేధింపుల)కు గురయ్యానని, శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ విషయాలను పంచుకున్నప్పటికీ, ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం ఆమె గోప్యంగా ఉంచింది."ప్రేమ పేరుతో నా జీవితంలోకి ప్రవేశించిన ఆ వ్యక్తి, నన్ను పూర్తిగా తన అదుపులో ఉంచుకోవాలని ప్రయత్నించాడు. నేను ధరించే దుస్తులు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అంశాలు, చివరికి ఎంచుకునే సినిమాల విషయంలోనూ ఆయనే ఆంక్షలు విధించేవాడు. నటనకు స్వస్తి పలకాలని కూడా ఒత్తిడి తెచ్చాడు. పరిచయమైన మూడు నెలలకే నిశ్చితార్థం, వివాహం చేసుకోవాలని బలవంతం చేశాడు. అది ప్రేమ కంటే నన్ను నియంత్రించే ప్రయత్నంగా అనిపించడంతో వాయిదా వేస్తూ వచ్చాను" అని వివరించింది.ఆ బంధం కారణంగా తాను తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని, ఆందోళనకు గురయ్యానని, ఫలితంగా శారీరకంగానూ కుంగిపోయి బరువు తగ్గానని అనుపమ ఆవేదన వ్యక్తం చేసింది. "షూటింగ్ సెట్స్లో క్యారవాన్లోకి వెళ్లి ఒంటరిగా ఏడ్చేదాన్ని. తరచూ పానిక్ ఎటాక్స్కు గురయ్యేదాన్ని. చివరికి నా సొంత తమ్ముడిని తాకడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. నా కెరీర్లో అతిపెద్ద విజయాన్ని అందుకున్న 'డ్రాగన్' సినిమా ప్రమోషన్లకు కూడా ఈ మానసిక వేదన కారణంగానే హాజరు కాలేకపోయాను" అని ఆమె గుర్తుచేసుకుంది.అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ , కోలీవుడ్ సీనియర్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ల మధ్య గత కొంతకాలంగా గాఢమైన ప్రేమాయణం సాగిన సంగతి తెలిసిందే. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), కోలీవుడ్ సీనియర్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram) ల మధ్య గత కొంతకాలంగా గాఢమైన ప్రేమాయణం సాగుతోందని వార్తలు రావడం తెల్సిందే. గతంలో వీరిద్దరూ కలసి ఉన్న ఫోటోలు, కిస్ చేసుకుంటున్న పిక్స్ కూడా సోషల్ మీడియాలో బయటకు వచ్చి తీవ్ర దుమారం రేపాయి. ఒకానొక దశలో వీరిద్దరూ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. అయితే, అందరూ అనుకున్నట్లుగా ఆ ప్రేమకథ సజావుగా సాగలేదని, ఆ బంధం వెనుక తనకు ఎదురైన చేదు అనుభవాలను, తీవ్రమైన మానసిక వేదనను అనుపమ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె తన మనోగతాన్ని బయటపెట్టింది. వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారన్న వార్తలపై అనుపమ స్పందించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ.. తాను గడిచిన రెండేళ్ల కాలంలో తీవ్రమైన నార్సిసిస్టిక్ అబ్యూజ్, తీవ్ర శారీరక, మానసిక క్షోభను అనుభవించానని తెలిపింది. ప్రారంభంలో ఎంతో ప్రేమను కురిపించిన భాగస్వామి, క్రమంగా తన జీవితంపై, దుస్తుల ఎంపికపై, సోషల్ మీడియా పోస్టులపై, చివరికి సినిమాల ఎంపికపై కూడా తీవ్రమైన నియంత్రణ సాధించడం మొదలుపెట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం 3 నెలల పరిచయంలోనే ఎంగేజ్మెంట్, డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి మాట్లాడారని, కానీ అది ప్రేమతో కాకుండా తనను నటన మాన్పించి పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నమని గ్రహించి తనే పదే పదే ఎంగేజ్మెంట్ను వాయిదా వేస్తూ వచ్చానని వివరించింది. అంతేకాకుండా ఈ మానసిక ఒత్తిడి వల్ల తాను డిప్రెషన్, యాంగ్జైటీ మందులు వాడాల్సి వచ్చిందని, తన కెరీర్లోనే పెద్ద హిట్ అయిన డ్రాగన్ సినిమా ప్రమోషన్లకు కూడా వెళ్లలేకపోయానని చెప్పింది. షూటింగ్ స్పాట్లో పానిక్ అటాక్స్ వచ్చి వ్యాన్ లోపలికి

ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ప్రశ్నించడమే పెద్ద పాపమన్నట్లుగా అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఉందని, తమ అభిమానులను, సానుభూతిపరులను ఉద్దేశించి మంత్రి నీచమైన వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. ఆనం గెలిచినప్పటి నుంచి ఆత్మకూరులో ఇసుక దందా, చికెన్ వేస్ట్ మాఫియాలు విచ్చలవిడిగా రాజ్యమేలుతున్నాయని, మర్రిపాడులో ఇసుక కొండనే మాయం చేశారని విక్రమ్రెడ్డి ఆరోపించారు. మంత్రి ధనదాహానికి ఏడుగురు బలికావడమే కాకుండా, చివరకు పోలీస్ స్టేషన్ల నుంచే మామూళ్లు వసూలు చేసే నీచ సంస్కృతికి తెరతీశారని దుయ్యబట్టారు. ఐదేళ్లకోసారి పార్టీలు మారే ఊసరవెల్లి నైజం ఆనందేనని, జగన్ను తిట్టి మంత్రి పదవి తెచ్చుకున్న చరిత్రహీనుడని ఎద్దేవా చేశారు. కేవలం ఇసుక దందా ద్వారానే నెలకు రూ.3 కోట్లు ఆర్జిస్తున్నారని విమర్శిస్తూ.. "ఆనం అంటే అవినీతి, అవినీతి అంటే ఆనం" అని అభివర్ణించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకోవడానికైనా, రాజీనామా చేయడానికైనా సిద్ధమని, ఈ సవాల్ను స్వీకరించే దమ్ము ఆనంకు ఉందా అని నిలదీశారు

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఊహించని వివాదంలో చిక్కుకున్నాడు. సోషల్ మీడియాలో ఆయన సరదాగా షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం ఆయనను చట్టపరమైన సమస్యల్లోకి నెట్టింది. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram) ఊహించని వివాదంలో చిక్కుకున్నాడు. సోషల్ మీడియాలో ఆయన సరదాగా షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం ఆయనను చట్టపరమైన సమస్యల్లోకి నెట్టింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విక్రమ్.. తాజాగా ఒక అరుదైన విదేశీ జాతి కోతితో కలిసి విక్రమ్ రీల్ చేసి పోస్ట్ చేశాడు. అది వైల్డ్లైఫ్ అధికారుల దృష్టికి వెళ్లడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ వీడియోలో సదరు విదేశీ కోతి హావభావాలను ఇమిటేట్ చేస్తూ విక్రమ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. అయితే వన్యప్రాణుల సంరక్షణ నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి అరుదైన జీవులను ఇంట్లో ఉంచుకోవడంపై కొందరు వైల్డ్లైఫ్ అధికారులకు, అటవీ శాఖకు ఫిర్యాదు చేశాడు. నెటిజన్ల నుంచి కూడా విమర్శలు రావడంతో విక్రమ్ తక్షణమే ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతా నుంచి డిలీట్ చేశాడు. అయినప్పటికీ అటవీ శాఖ అధికారులు సదరు వీడియో ఆధారంగా సమగ్ర విచారణ ప్రారంభించారు. అటవీ శాఖ ప్రాథమిక విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియో విక్రమ్ ఇంట్లో కాకుండా, ఆయన కూతురు అత్తింట్లో తీసినట్లు అధికారులు గుర్తించారు. విక్రమ్ తన వియ్యంకుడు, ప్రముఖ వ్యాపారవేత్త సీకే రంగనాథన్ ఇంటికి వెళ్లిన సమయంలో ఈ రీల్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ అరుదైన విదేశీ కోతిని రంగనాథన్ ఎక్కడి నుండి కొనుగోలు చేశారు? దీని వెనుక ఏమైనా అంతర్జాతీయ వన్యప్రాణుల అక్రమ రవాణా ముఠా హస్తం ఉందా? అనే కోణంలో అటవీ శాఖ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో స్పష్టత కోసం హీరో విక్రమ్తో పాటు బిజినెస్మెన్ సీకే రంగనాథన్ను కూడా అధికారులు త్వరలోనే విచారించనున్నట్లు