
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.
ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టలు ఇప్పుడు మార్పు దిశగా అడుగులు వేస్తున్నాయి.దశాబ్దాలుగా సాధారణ ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు దాదాపు అందనంత ప్రాంతంగా ఉన్న ఈ కొండల్లో తొలిసారిగా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ఐదు రోజుల ముందే తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కర్రెగుట్టలపై 650 అడుగుల ఎత్తులో కర్రెగుట్టల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని ఈ ప్రాంతంలో సుమారు 50 ఏళ్ల తర్వాత తెలంగాణ వైపుతొలిసారి జాతీయ జెండా ఎగరడం విశేషంగా నిలిచింది.దట్టమైన అటవీ ప్రాంతమైన కర్రెగుట్టలు .. ఒకప్పుడు మావోయిస్టులకు ప్రధాన స్థావరంగా ఉండేది. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒకటిగా పేరున్న ఈ కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు భారీగా మందుపాతరలు అమర్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులతో ఈ కొండ ప్రాంతం ఎన్నో ఏళ్ల పాటు ఉద్రిక్తంగా ఉండేది. భద్రతా కారణాలతో ప్రభుత్వ అధికారులు సైతం ఈ ప్రాంతంలోకి వెళ్లడం కష్టంగా ఉండేది.ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ తర్వాత పరిస్థితుల్లో గణనీయమైన మార్పువచ్చింది. పలువురు మావోయిస్టులు భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లలో మృతి చెందగా.. మరికొందరు లొంగిపోయారు. దీంతో కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతా బలగాలు పట్టు సాధించాయి. ఈ పరిణామాలు అక్కడ అభివృద్ధి పనులకు మార్గం సుగమం చేశాయి.కర్రెగుట్టల దిగువన ఉన్న పామునూరు ప్రాంతం నుంచి కొండపైకి నిర్మిస్తున్న రహదారి పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ రహదారిని సుమారు 20 కిలోమీటర్ల మేర ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా సరిహద్దు వరకు విస్తరించారు. ఈ రహదారి నిర్మాణం పూర్తిగా అందుబాటులోకి రాకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రయాణం ఇప్పటికీ కష్టతరంగానే ఉంది.డీజీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో సీనియర్ పోలీసు అధికారులు, సీఆర్పీఎఫ్, ఇంటెలిజెన్స్, అటవీ శాఖల అధికారులు తొలిసారి రోడ్డు మార్గంలో కర్రెగుట్టలకు చేరుకున్నారు. గతంలో ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఉన్నతాధికారులు హెలికాప్టర్లను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు