
Success Story: ఆ ఇద్దరే.. కేవలం రూ.4 లక్షల పెట్టుబడి.. 10 నెలల్లో రూ. 2 కోట్ల ఆదాయం..!
Success Story: ఆ ఇద్దరే.. కేవలం రూ.4 లక్షల పెట్టుబడి.. 10 నెలల్లో రూ. 2 కోట్ల ఆదాయం..!
© 2026 nimisham.in

Success Story: ఆ ఇద్దరే.. కేవలం రూ.4 లక్షల పెట్టుబడి.. 10 నెలల్లో రూ. 2 కోట్ల ఆదాయం..!

Success Story: అర ఎకరం నుండి 40 ఎకరాల వరకు.. రూ.80 లక్షల సంపాదన.. ఓ మహిళా రైతు సక్సెస్ స్టోరీ!

రిటైర్ అయిన తరువాత ఏం చేయాలి? కాలక్షేపం ఎలా? మరీ ముఖ్యంగా డబ్బులు ఎలా మధనపడే వారికి కేరళకు చెందిన రిటైర్డ్ టీచర్ రేమాబాయి జీవితం స్ఫూర్తినిస్తుంది. ఇంతకీ ఆమె చేశారు? తెలుసుకుందాం ఈ కథనంలో. కేరళలోని కొల్లమ్కు చెందిన రేమాబాయి జువాలజీ టీచర్గా,హెడ్మిస్ట్రెస్గా 30 ఏళ్ల పాటు విద్యారంగంలో సేవలందించారు. 2022 మే 31న ఆమె పదవీ విరమణ చేశారు. ఆమె భర్త, ఒక రిటైర్డ్ సీనియర్ బ్యాంక్ మేనేజర్. అలాగే సర్జన్లైన ఆమె కుమారుడు, కోడలు ఢిల్లీలో పనిచేస్తున్నారు. అయితే అదే ఏడాది తల్లి మరణం, ఒంటరితనం వల్ల ఏర్పడిన మానసిక వేదనను జయించడానికి ఆమె తన ఇంటి పెరటి స్థలంలో మొక్కల పెంపకం ప్రారంభించారు. అలా డ్రాగన్ ఫ్రూట్ సాగును చేపట్టారు. దీని మీద బాగా పరిశోధించి 'మలేషియన్ కింగ్' (Malaysian King) రకానికి చెందిన రెడ్ డ్రాగన్ ఫ్రూట్ను ఎంచుకున్నారు. కేవలం 1,750 చదరపు అడుగుల పెరటి స్థలంలో 90 కాంక్రీట్ స్తంభాలు, పాత టైర్ల సాయంతో 360 మొక్కలతో సాగు ప్రారంభించారు. ప్రారంభంలో 360 మొక్కలు నెలకు రూ. 50వేలకు మించి ఆదాయాన్ని అందించగా,ఆ తరువాత ఆదాయం సుమారు రూ. 1.5 లక్షలకు పెరిగింది. ఈ ఫలితాలు, మరింత భూమి కొనకుండానే తన సాగును విస్తరించడానికి ఆమెను ప్రోత్సహించాయి. ఫలితంగా నెలకు రూ. 4 లక్షలు ఆర్జించేస్థాయికి చేరుకున్నారు. డ్రాగన్ ఫ్రూట్ -మిద్దెతోట మిద్దెపై మట్టిలేని సాగు (Soil-less Cultivation): పెరట్లోనే కాకుండా తన ఇంటి మిద్దెపై (Terrace) బరువు కాకుండా ఉండటానికి మట్టికి బదులుగా ఇంట్లోనే తయారు చేసిన కంపోస్ట్, ఆవు పేడను డ్రమ్ములు/బారెళ్లలో నింపి మొక్కలను పెంచడం ప్రారంభించారు. సేంద్రీయ పద్ధదితో ఆమె సక్సెస్ను అందుకోవడం విశేషం. పాత వంటగది వ్యర్థాలు, ఆకులు, కొబ్బరి/పనస వ్యర్థాలు మరియు చేపల వ్యర్థాలతో ఫ్రిష్ అమినో యాసిడ్స్ వంటి 15 రకాల ద్రవ ఎరువులను తయారు చేసి

అరవింద సమేత చిత్రంలో 5 రూపాయల కారణంగా ఎంత హింస జరిగిందో అందరికి తెలుసు. అయితే ఈ కథలో 5 నిమిషాలు వల్ల ఓ వ్యక్తి మహా కుబేరుడిగా మారారు. ఏకంగా 5 లక్షల కోట్ల రూపాయలను ఆయన సంపాదించేశారు. ఇంటర్నెట్ డెస్క్: రోజుకు 5 నిమిషాలే పని చేయాలి.. నెలకు 10 వేల డాలర్లు ( దాదాపు 9 లక్షల రూపాయలు) సంపాదించాలి. ఇది కొంచెం అతిగా అనిపిస్తోందా.. కానీ ఓ వ్యక్తి ఇది సాధ్యమని భావించారు. ప్రతిరోజూ 5 నిమిషాల పనితో నెలకు లక్షలు గడించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఆయనను చూసి తోటి వారే నవ్వుకున్నారు. ఇవేమీ పట్టించుకోని ఆయన డబ్బు సంపాదించడం కోసం రోజులో 5 నిమిషాలు ఆలోచించేవారు. అలా ఓ రోజు ఒక కొత్త పరికరం కనిపెట్టాలన్న ఆలోచన ఆయనకు తట్టింది. ఆయనే మసయోషి సన్. సాఫ్ట్బ్యాంక్ వ్యవస్థాపకుడిగా టెక్నాలజీ రంగానికి ఆయన సుపరిచితులు. 2026 సెప్టెంబరు నాటికి ఆయన సంపద అక్షరాల 5.3 లక్షల కోట్లు. తాను యువకుడిగా ఉన్నప్పుడు ఈ 5 నిమిషాల సవాలును ఆయనకు ఆయనే విసురుకున్నారు. ఇలా నిర్ణీత సమయంలోనే ఓ ఆవిష్కరణ చేయాలని పూనుకున్నారు. మసయోషి.. కొందరు పరిశోధకులు, ప్రొఫెసర్ల సహాయంతో ఎలక్ట్రానిక్ ట్రాన్స్లేటర్ పరికరాన్ని కనిపెట్టారు. ఆ పరికరాన్ని జపాన్కు చెందిన ఓ సంస్థకు 1.7 మిలియన్ డాలర్లకు విక్రయించారు. ఈ విధంగా సన్ ప్రయాణానికి తొలి అడుగు పడింది. ఆ తరువాత ఆయన జపాన్ నుంచి వీడియో గేమ్ యంత్రాలను అమెరికాకు తీసుకొచ్చి రెస్టారెంట్లకు అమ్మేవారు. ఈ వ్యాపారంలో ఆయనకు 1.5 మిలియన్ డాలర్ల లాభం వచ్చింది. 5 నిమిషాల ఆలోచన వచ్చిన 18 నెలల్లోనే 3.2 మిలియన్ డాలర్లు ఆర్జించారు. జపాన్లో ఉంటున్న సన్కు అమెరికా వెళ్లాలని ఓ సన్నిహితుడు సలహా ఇచ్చారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలని, కంప్యూటర్లపై పట్టు తెచ్చుకోవాలని ప్రోత్సహించారు. దీంతో అమెరికా వచ్చిన సన్

అవకాశం ఇస్తే చాలు.. ఉచితంగానే పనిచేస్తానన్న ఓ భారతీయ యువకుడికి ఇప్పుడు అదే అవకాశం భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త, సీఈఓ మిక్కీ హార్డీ తన సోషల్ మీడియా పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్కు చెందిన ఓ యువకుడు తొలుత ఎలాంటి జీతం వద్దని, తన సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు అవకాశం మాత్రమే కావాలని కోరాడని ఆయన తెలిపారు.హార్డీ ప్రకారం.. ఆ యువకుడికి ప్రస్తుతం కమిషన్ ఆధారంగా పనిచేసే అవకాశం ఇచ్చారు. ఔట్రీచ్, కంపెనీ మీడియా కార్యకలాపాల ద్వారా అతను తీసుకొచ్చే లాభంలో 20 శాతం అతనికి అందుతుంది. ఈ విధానంలో ప్రస్తుతం అతను నెలకు దాదాపు 5,000 డాలర్లు.. అంటే సుమారు రూ.4.7 లక్షలు సంపాదిస్తున్నట్లు హార్డీ వెల్లడించారు.యువకుడు తొలుత ఉచితంగా పనిచేయడానికి ముందుకు రావడాన్ని హార్డీ ప్రశంసించారు. తన సామర్థ్యంతో కంపెనీకి విలువను సృష్టిస్తానని నిరూపించుకోవాలన్నదే అతని ఉద్దేశమని చెప్పారు. ప్రస్తుతం ఈ ఉద్యోగం తన జీవితాన్ని మార్చేసిందని, తన కుటుంబానికి కూడా ఎంతో సహాయపడుతోందని ఆ యువకుడు పలుసార్లు చెప్పినట్లు హార్డీ తెలిపారు.ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు కేవలం తాము కష్టపడి పనిచేస్తామని చెప్పడం కంటే.. ఏదైనా కంపెనీకి తమ వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో నిరూపించాలని హార్డీ సూచించారు. తమకు మెసేజ్ చేసి ఉద్యోగం అడిగేవారు కూడా ‘నేను హార్డ్ వర్కర్ను.. నాకు అవకాశం ఇవ్వండి’ అని మాత్రమే చెప్పకుండా, తాము ఏం చేయగలరో, కంపెనీకి అది ఎందుకు అవసరమో, అందుకు తమ వ్యూహం ఏమిటో వివరించాలని సూచించారు.అయితే ఈ

సాక్షి, ముంబై: బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న 'ఆవారాపన్ 2' మూవీతో ఒక్కసారిగా వార్తల్లో నిలుస్తున్న నటుడు సువిందర్ విక్కీ( Suvinder Vicky). బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నితిన్ కక్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఆవారాపన్ 2' లో అద్భుత నటనతో గుర్తింపు పొంది, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పదండి ఆయన బాలీవుడ్ జర్నీ ఎలాసాగింది, ఇంత సక్సెస్ ఎలా వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాం. సినీ రంగంలో రాణించాలంటే నటన మీద ఆసక్తి ఉన్నంతనే సరిపోదు. ఎన్నో కష్ట నష్టాలు, అవమానాలు భరించాల్సి ఉంటుంది. అలా ఎంతోమంది నటులు ఏళ్ల తరబడి పోరాటం తరువాత రాణించినవారే. సువిందర్ విక్కీ సక్సెస్ స్టోరీ కూడా అలాంటిదే. ఆయన వెండితెర ఎంట్రీ అంత ఆషామాషీగా జరగలేదు. ఆరంభంలో పొట్టనింపుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఇదీ చదవండి : టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు బెంగాల్ కోర్టు షాక్ పంజాబ్కు చెందిన సువిందర్ విక్కీ సినీ నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చిన ప్పటికీ చిన్న వయసులోనే సినిమాలపై ఆసక్తి కలిగింది.పంజాబీ విశ్వవిద్యాలయం (పాటియాలా)నుంచి థియేటర్ మరియు టెలివిజన్లో ఎంఏ పూర్తి చేశారు. నటనపై ఉన్న ఆసక్తితో కేవలం రూ.5,000 చేతిలో పెట్టుకుని ముంబైకి వచ్చారు. అయితే నెల రోజుల్లోనే ఆ డబ్బులు అయిపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని తిరిగి పంజాబ్ వెళ్లాల్సి వచ్చింది. ముంబైలో ఉన్నప్పుడు కనీసం ఒక పూట భోజనానికి కూడా డబ్బు లేని క్లిష్ట పరిస్థితులను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో, పొట్టకూటి కోసం ఆయన కొంతకాలం ఇన్సూరెన్స్ ఏజెంట్గా కూడా పాలసీలు విక్రయించారు. తిరిగి చాలాకాలానికి 50 ఏళ్ల వయసులో స్టార్డమ్ను సాధించారు. నటనలో అరంగేట్రం పంజాబ్కు తిరిగి వచ్చిన తర్వాత, సువిందర్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడం ప్రారంభించారు. 2004లో 'దేస్ హోయా పర్దేస్' అనే పంజాబీ
Inspirational story: జీవితంలో ఎదురయ్యే కష్టాలు, పేదరికం ఎవరి భవిష్యత్తునూ నిర్ణయించలేవు అనేందుకు ప్రముఖ రియల్టర్ విజయ్ వర్మ (Vijay Varma) ప్రయాణమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. రాజస్థాన్లోని ఒక చిన్న పల్లెటూరులో నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన, చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, రోజుకు కేవలం రూ.3 కూలీకి వంట పాత్రలు తోమడం, రూ.8లకు ఇసుక తీసుకెళ్లడం వంటి పనులు చేశారు. కానీ, ఆయనలోని పట్టుదల, కృషి ఆయనను నేడు రూ.160 కోట్ల విలువైన కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేతగా నిలబెట్టాయి. విజయ్ వర్మ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, వ్యాపారవేత్తగా ఆయన సాధించిన విజయం గురించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.రోజుకు రూ.3 కూలీ నుంచి మొదలురాజస్థాన్లోని ఝుంఝుంను జిల్లా బిసావు గ్రామంలో అక్టోబర్ నెల 1978లో విజయ్ వర్మ జన్మించారు. 10 ఏళ్ల వయసులోనే తన తాతమ్మలు చనిపోయారు. ఆ మరుసటి ఏడాదిలోనే తన తండ్రిని సైతం కోల్పోయారు. దీంతో వారి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. కుటుంబ భారం మొత్తం విజయ్ వర్మ తల్లిపై పడింది. ఆమె అడవి నుంచి ఎండుటాకులు, కట్టెలు సేకరించి కేవలం కొన్ని కిలోల పిండి కోసం వాటిని ఇచ్చేవారు.Read Also: ఛాయ్ బంక్: రూ. 50 వేలతో స్టార్ట్ చేసి.. 120 ఫ్రాంచైజీల స్థాయికి.. ఇద్దరు మిత్రుల సక్సెస్ స్టోరీకుటుంబ ఆర్థిక పరిస్థితిని చూసి 6వ తరగతిలోనే చదువును ఆపేసిన విజయ్ వర్మ పని కోసం తన అన్నతో కలిసి ముంబై, పుణే వంటి నగరాలకు వెళ్లారు. పుణే రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఒక వడాపావ్ బండి వద్ద గిన్నెలు తోముతూ రోజుకు రూ.3 సంపాదించేవారు. ఆ తర్వాత ఒక నిర్మాణ సంస్థలో ఇసుక రవాణా పని చేస్తూ రోజుకు రూ.8 దినసరి కూలీగా మారారు. ఆ తర్వాత థియోటర్లు, భవనాల నిర్మాణ పనుల్లో టైల్స్ వేయడం, ప్లాస్టరింగ్, ఆర్సీసీ పనులన్నింటినీ స్వయంగా నేర్చుకుని భవన నిర్మాణ
Babu Rao Success Story : జీవితంలో ఏమీ లేకుండా ఏదైనా సిటీకి రావడం, తినడానికి ఉండటానికి కూడా ఇబ్బందులు పడటం, తర్వాత ఏదైనా చిన్న పనితో ప్రారంభించి కోట్లకు కోట్లు సంపాదించడం ఇది సినిమాల్లో కనిపించే కథలా అనిపించినా హైదరాబాద్లో నిజంగానే జరిగిన ఒక వ్యక్తి ప్రయాణం. అవును హైదరాబాద్లో ప్రముఖ ఇరానీ చాయ్ బ్రాండ్గా గుర్తింపు పొందిన కేఫ్ నిలోఫర్ వెనుక ఉన్న ఏ. బాబు రావు ప్రయాణం ఇలాంటిదే. 1975 సంవత్సరంలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన చేతిలో పెద్దగా డబ్బు లేదు. ఉద్యోగం కోసం టికెట్ లేకుండానే రైలులో హైదరాబాద్ చేరుకున్న ఆయనకు మొదట టెక్స్టైల్ షాపులో సేల్స్మెన్గా ఒక పని దొరికింది. ఇక ఉద్యోగం వచ్చిన వెంటనే ఉండటానికి ఇల్లు దొరకలేదు. దాదాపు 15 రోజుల పాటు ఫుట్పాత్పైనే నిద్రించిన ఆయన స్నానం చేసేందుకు నాంపల్లి రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్ను ఉపయోగించేవారని తెలిసింది. అక్కడి నుంచి మొదలైన ఆయన ప్రయాణం దాదాపు 5 దశాబ్దాల్లో కేఫ్ నిలోఫర్ అనే పెద్ద బ్రాండ్గా మారింది.టెక్స్టైల్ షాపు నుంచి రెస్టారెంట్ వరకుహైదరాబాద్ వచ్చిన తర్వాత బాబు రావు తొలుత టెక్స్టైల్స్ షాపులో సేల్స్మెన్గా చేరగా తర్వాత రెస్టారెంట్ ఉద్యోగంలో చేరారు. అక్కడే ఆయనకు సదరు వ్యాపారం ఎలా నడుస్తుంది. కస్టమర్లను ఎలా చూసుకోవాలి? రోజువారీగా నిర్వహణ ఎలా ఉంటుంది. ఇలా అన్ని విషయాలపై అవగాహన వచ్చింది. అదే సమయంలో ఒక కస్టమర్ ఆయన పనితీరును గమనించారు. కొత్తగా ప్రారంభమైన ఒక కేఫ్లో బాబు రావు బాగా పనిచేస్తారని భావించి అక్కడ ఉద్యోగం ఇప్పించారు. అదే కేఫ్ నిలోఫర్.ఇక బాబు రావు కేఫ్ నిలోఫర్లో తొలుత వెయిటర్గా చేరారు. అయితే ఆయన పని కేవలం కస్టమర్లకు చాయ్ ఇవ్వడంతోనే ముగియలేదు. అవసరమైనప్పుడు కేఫ్ను శుభ్రం చేయడం, పాత్రలు కడగటం వంటి పనులు కూడా చేసేవారు. పనేదైనా వెనుకాడకుండా చేయడం

ఆమె లక్నోలో చదువుకున్న ఓ ఉన్నత విద్యావంతురాలు.. బాబా అణు పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా ఉద్యోగం.. ఆ తర్వాత సివిల్స్ వైపు అడుగులు.. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా కీలక బాధ్యతలు. ఇదీ నిధి తివారీ ప్రయాణం. శాస్త్రవేత్తగా మొదలైన ఆమె కెరీర్.. విదేశాంగం, భద్రతా వ్యవహారాల్లో పనిచేసే స్థాయికి ఎలా చేరిందో చూస్తే ఆసక్తికరమే.నిధి తివారీ ఉత్తర్ప్రదేశ్లోని లక్నోకు చెందినవారు. అక్కడే పాఠశాల విద్య, డిగ్రీ పూర్తి చేశారు. బీఎస్సీ తర్వాత బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు. ఈ కోర్సులో గోల్డ్ మెడల్ సాధించారు.బార్క్లో శాస్త్రవేత్తగా..చదువు పూర్తయ్యాక బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్)లో శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు. అయితే సివిల్స్ సర్వీసులోకి వెళ్లాలన్న పట్టుదలతో ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. 2008లో బార్క్ నుంచి బయటకు వచ్చి యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యారు.ఒక్కసారి కాదుసివిల్స్ ప్రయాణం ఆమెకు వెంటనే విజయాన్ని అందించలేదు. 2012లో జరిగిన పరీక్షలో ఆమె పేరు వెయిటింగ్ లిస్ట్లో వచ్చింది. అయినా ప్రయత్నం ఆపలేదు. 2013లో మళ్లీ పరీక్ష రాశారు. ఈసారి ఆల్ ఇండియా స్థాయిలో 96వ ర్యాంకు సాధించారు. దీంతో ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికై 2014 బ్యాచ్లో చేరారు.విదేశాంగం నుంచి పీఎంవోకుఐఎఫ్ఎస్ అధికారిగా పనిచేసే సమయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖలో నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై పనిచేశారు. విదేశాంగ విధానం, అంతర్జాతీయ భద్రతపై ఆమెకు వచ్చిన అనుభవం తర్వాత పీఎంవోలో కీలకంగా ఉపయోగపడింది.2022 నవంబర్లో పీఎంవోలో అండర్ సెక్రటరీగా చేరారు. ఆ తర్వాత

ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ తన బాల్యం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో, చిన్నప్పుడు తనను, తన సోదరిని చూసి చాలామంది జీవితంలో పైకిరారని అన్నారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇటీవల ఎం9 న్యూస్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాధవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.జంషెడ్పూర్లో తన బాల్యం గడిచిందని మాధవన్ తెలిపారు. ఆయన తండ్రి రంగనాథన్ ఒక ప్రైవేట్ సంస్థలో, తల్లి సరోజ బ్యాంకులో పనిచేసేవారని చెప్పారు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలకు వెళ్లడంతో, పిల్లల బాగోగులు, హోంవర్క్ చూసేవారు ఎవరూ లేరని ఇరుగుపొరుగు వారు అనేవారని ఆయన పేర్కొన్నారు. "పిల్లల భవిష్యత్తు కంటే మీకు ఉద్యోగాలే ముఖ్యమా?" అంటూ చుట్టుపక్కల వారు తరచూ తమ తల్లిదండ్రులను నిందిస్తూ, వారిని బాధపెట్టే ప్రయత్నం చేసేవారని మాధవన్ వివరించారు.అయితే, తన తల్లిదండ్రులు ఇలాంటి విమర్శలను ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన స్పష్టం చేశారు. "చాలామంది అనుకున్నట్టు నేను ఇంజనీర్ను కాదు. కేవలం బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివి, అతికష్టం మీద పాసయ్యాను. చదువులో నేనేమీ గొప్పవాడిని కాదు," అని మాధవన్ నిజాయితీగా అంగీకరించారు. తల్లిదండ్రులు ఇద్దరూ సంపాదించడం వల్లే తనకు ఎక్స్ఛేంజ్-స్టూడెంట్ ప్రోగ్రామ్స్, స్కాలర్షిప్స్ కింద విదేశాలకు వెళ్లే అవకాశాలు లభించాయని, అవే తన జీవితాన్ని మార్చేశాయని ఆయన తెలిపారు.తమ తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం తనకు గర్వకారణమని, వారు తమకు ఒక మంచి ఉదాహరణగా నిలిచారని మాధవన్ అన్నారు. పరిశ్రమలో ఎలాంటి నేపథ్యం లేకపోయినా ప్రతిభ, కష్టపడి పనిచేసే తత్వం ఉంటే ఎవరైనా విజయం సాధించవచ్చనే తన
N Chandrashekaran: ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి టెక్నాలజీ మీద ఆసక్తితో కార్పొరేట్ రంగంలో ఒక ఇంటర్న్గా అడిగుపెట్టారు నటరాజన్ చంద్రశేఖరన్ (Natarajan Chandrasekaran). ఒక సాధారణ ఉద్యోగిగా తన కెరీర్ మొదలు పెట్టి టాటా గ్రూప్లో దిగ్గజ నాయకుడిగా తనదైన ముద్రవేశారు. ఇప్పుడు అనూహ్య పరిణామాల మధ్య తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి చంద్రశేఖరన్ వైదొలుగుతున్న నేపథ్యంలో టాటా గ్రూప్లో ఆయన ప్రస్థానాన్ని ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.తమిళనాడులోని మోహనూర్ అనే ఓ కుగ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో ఎన్ చంద్రశేఖరన్ 1963లో జన్మించారు. ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేశి కోయంబత్తూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ సైన్సెస్లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రోగ్రామింగ్, టెక్నాలజీపై ఇష్టంతో ఎంసీఏ పట్టా పొందారు. 1987లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఇంటర్న్గా తన కెరీర్ను మొదలు పెట్టారు. ఆ తర్వాత 40 ఏళ్ల పాటు ఒకే కంపెనీలో కొనసాగుతూ వచ్చారు.చిన్న వయసులోనే సీఈఓగాఅంచలంచెలుగా ఎదుగుతూ చిన్న వయసులోనే 2007లో టీసీఎస్ బోర్డు సభ్యుడిగా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా చంద్రశేఖరన్ నియమితులయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకో 2009లో టీసీఎస్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆయన వయసు 46 ఏళ్లు. టాటా గ్రూప్ లో సీఈఓ బాధ్యతుల చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన బాధ్యతలు తీసుకున్నప్పుడు టీసీఎస్ కష్టకాలంలో కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం దెబ్బతో కుదేలైన సంస్థను విపత్తు నుంచి బయటపడేశారు.2 సార్లు టాటా సన్స్ ఛైర్మన్గాసైరస్ మిస్త్రీ వివాదం తర్వాత టాటా గ్రూప్ పలు సవాళ్లను ఎదుర్కొంది. ఆ సమయంలో టాటా సన్స్ ఛైర్మన్ పగ్గాలను ఎన్ చంద్రశేఖరన్ అందుకున్నారు. 2016 అక్టోబరులో టాటా సన్స్ బోర్డులో చేరారు. 2017లో ఛైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు. టాటా కుటుంబం నుంచి కాకుండా

కాలేజీలో మంచి మార్కులు లేకపోతే మంచి ఉద్యోగం దొరకదనే భయం చాలామంది విద్యార్థుల్లో ఉంటుంది. 6 సీజీపీఏతో చదువు పూర్తిచేసిన నమన్ బన్సల్కు ఈ భయం నిజంగానే అడ్డంకిగా మారింది. క్యాంపస్ ప్లేస్మెంట్కు అర్హత లేకపోవడంతో పాటు, ఇంటర్న్షిప్లకు దరఖాస్తు చేసినా వరుస తిరస్కరణలు ఎదురయ్యాయి. కానీ అక్కడితో ఆయన ప్రయాణం ఆగలేదు.అకడమిక్ స్కోర్ బలంగా లేకపోవడంతో తన ప్రోగ్రామింగ్ నైపుణ్యాలపై నమన్ మరింత దృష్టి పెట్టారు. కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో నైపుణ్యం పెంచుకుని కోడ్ఫోర్సెస్లో క్యాండిడేట్ మాస్టర్ స్థాయికి చేరుకున్నారు. రెజ్యూమేలో సీజీపీఏ కంటే తన టెక్నికల్ స్కిల్స్ను హైలైట్ చేశారు. చివరకు రిఫరల్ ద్వారా మేక్మైట్రిప్లో ఇంటర్న్షిప్ సాధించారు.మేక్మైట్రిప్లో అనుభవం నమన్ కెరీర్కు కీలక మలుపుగా మారింది. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ ‘డీఈ షా’లో ఫుల్టైమ్ ఉద్యోగం దక్కింది. మరింత అనుభవం సంపాదించిన తర్వాత.. ఒకప్పుడు సీజీపీఏ కారణంగా ఇంటర్న్షిప్ ఇవ్వని అడోబ్లోనే ‘మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్’గా ఉద్యోగం సాధించారు. అక్కడ దాదాపు రెండేళ్లు పనిచేశారు.ఆ తర్వాత నమన్ బన్సల్ కెరీర్ మరో స్థాయికి చేరింది. ప్రస్తుతం ఆయన మైక్రోసాఫ్ట్లో SDE-2గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఆయన వార్షిక వేతనం సుమారు రూ.90 లక్షలుగా పేర్కొంటున్నారు. ఒకప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్కు కూడా అర్హత లేని విద్యార్థి.. ఇప్పుడు ప్రపంచ దిగ్గజ కంపెనీలో పనిచేస్తున్నారు.నమన్ కథ చెప్పే విషయం ఒక్కటే.. మార్కులు ఒక అవకాశాన్ని ఆపగలవు. కానీ, ప్రతిభను శాశ్వతంగా ఆపలేవు. ఎదురైన ప్రతి తిరస్కరణను తనను తాను మెరుగుపరుచుకునే అవకాశంగా మార్చుకున్నారు. చివరకు

ఐడియా పెద్దదైనంత మాత్రాన ఎక్కువ పెట్టుబడి కావాల్సిన అవసరం లేదని నిరూపించిన కథ ఇది. చేతిలో భారీగా నిధులు లేవు. పెద్ద ఆఫీసు లేదు. మార్కెట్లో పేరు లేదు. అయినా ఆరుగురు యువకులు ఒక కలను నమ్మారు. చేతిలో ఉన్న పొదుపు, అప్పులతో కలిపి రూ.1.87 లక్షలు సమకూర్చుకున్నారు. చివరకు ఆ ఆలోచనే భారత టెక్నాలజీ రంగాన్ని మార్చిన హెచ్సీఎల్గా ఎదిగింది.హెచ్సీఎల్ సహ వ్యవస్థాపకుడు అజయ్ చౌదరి ఈ సంస్థ తొలి రోజుల్ని గుర్తుచేసుకుంటూ ‘ఎక్స్’లో సుదీర్ఘ పోస్టు చేశారు. హెచ్సీఎల్ 50వ వార్షికోత్సవం సందర్భంగా అప్పటి పరిస్థితులను ఆయన పంచుకున్నారు.చేతిలో రూ.1.87 లక్షలు1976లో కంప్యూటర్ అంటే భారత్లోనే కొత్త ఆలోచన. అలాంటి సమయంలో ఆరుగురు కలిసి సొంతంగా కంప్యూటర్ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. వారి దగ్గర భారీ పెట్టుబడిదారులు లేరు. వెంచర్ క్యాపిటల్ సంస్థల మద్దతు లేదు. ఆరుగురూ కలిసి రూ.1.87 లక్షలు సమకూర్చుకున్నారు. కొంత డబ్బు అప్పుగా తెచ్చారు. మరికొంత పొదుపు నుంచి పెట్టారు. ఓ సందర్భంలో కారును కూడా అమ్మేశారు.చిన్న గదిలో తొలి అడుగుఢిల్లీలోని గోల్ఫ్ లింక్స్లో ఓ భవనంపై ఉన్న చిన్న గదే హెచ్సీఎల్ తొలి కార్యాలయమైంది. అప్పటికి వారు తయారు చేయాలనుకున్న కంప్యూటర్ పూర్తిగా సిద్ధం కాలేదు. బ్రోచర్ ఉంది. నమూనా ఉంది. యంత్రం మాత్రం ఇంకా రూపుదిద్దుకుంటోంది. అయినా ఆ ఆరుగురు వెనక్కి తగ్గలేదు. కంప్యూటర్ను విక్రయించేందుకు సంస్థలను కలవడం మొదలుపెట్టారు. తొలి ఆర్డర్లు ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ మద్రాస్ నుంచి వచ్చాయి.ఒక్క ఆర్డర్.. వరుసగా అవకాశాలువ్యాపార సంస్థలను

Success Story: ఈ రోజుల్లో చాలా మంది యువత ఉద్యోగం చేయడానికి బదులుగా సొంత వ్యాపారం ప్రారంభించాలని లేదా సొంతంగా పని చేసుకోవాలని కోరుకుంటున్నారు. మధ్యప్రదేశ్లోని హర్దా జిల్లాకు చెంది రైతు మధుసూదన్ ధాకడ్ స్టోరీ కూడా అలాంటి వారికి స్ఫూర్తిదాయకం. రైతు మధుసూదన్ కేవలం పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. కానీ వ్యవసాయంలో కొత్త పద్ధతులను అవలంభించి ఏటా కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.ప్రధాని మోదీ లేటెస్ట్ ఇన్ స్టా వీడియో: దేశ ప్రజలకు పిలుపుమధుసూదన్ రైతు కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచే వ్యవసాయంతో అనుబంధం కలిగి ఉన్నాడు. మొదట్లో ఆయన సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేశాడు. కానీ ఆశించినంత ఆదాయం రాలేదు. అనంతం ఆయన తన వ్యవసాయ పద్ధతిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు . వ్యవసాయం, నర్సరీల ద్వారా ఆయన ఏటా సుమారు రూ. 5 కోట్లు సంపాదిస్తున్నాడు.మధుసూదన్ ధాకడ్ గోధుమ వంటి సాంప్రదాయ పంటలకు బదులుగా వెల్లుల్లి, పచ్చి మిరపకాయలు, క్యాప్సికమ్, టమాటాలు, అల్లం వంటి అధిక విలువ గల పంటలపై దృష్టి పెట్టడం ప్రారంభించాడు. ఆధునిక పద్ధతుల సహాయంతో ఆయన క్రమంగా తన వ్యవసాయాన్ని విస్తరించి నేడు సుమారు 200 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు.వ్యవసాయంతో పాటు నర్సరీ ప్రారంభం మధుసూదన్ కేవలం పంటలు పండించడానికే పరిమితం కాలేదు. ఆయన తన సొంత నర్సరీని కూడా ప్రారంభించారు. దీని ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 20 లక్షల మొక్కలు ఉత్పత్తి అవుతున్నాయి. వ్యవసాయం, నర్సరీ ద్వారా ఆయన వార్షిక ఆదాయం సుమారు రూ.5 కోట్లకు చేరుకుంది. సరైన పంటను ఎంచుకోవడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం, మంచి యాజమాన్యం ద్వారా గణనీయమైన ఆదాయాన్ని పొందవచ్చని ఆయన విజయం నిరూపిస్తుంది.ఏ పంట నుంచి ఎంత ఆదాయం వస్తుంది?*మధుసూదన్ 40 ఎకరాల భూమిలో పచ్చి మిరపకాయలు సాగు చేశాడు. దీనికి ఆయనకు ఎకరానికి సుమారు 70,000 రూపాయలు ఖర్చయింది. ఆయనకు ఎకరానికి సుమారు

Agriculture : అభివృద్ధి, టెక్నాలజీ అవసరమే... కానీ వీటికోసం జీవితాలనే పనంగా పెట్టేంత అవసరం కాదు. కానీ నేటి తరం ఇదే చేస్తోంది. ఈ అభివృద్ధి మాయలో పడి అన్నీ కలుషితం చేసేస్తున్నారు... దీంతో మనిషికి సౌకర్యాలు పెరిగాయి కానీ ఆయుష్షు తగ్గింది. అందుకే ఇప్పుడు చాలామంది సౌకర్యాలకు త్యాగం చేసి గతంలో మాదిరిగా ప్రకృతితో మమేకం అయ్యేందుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలోనే ''ప్రకృతి వ్యవసాయం (Natural Farming)'' బాగా ఆదరణ పొందుతోంది. మన పూర్వీకుల మాదిరిగా రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో భూమి సారాన్ని పెంచుతూ పంటలు పండించడమే ప్రకృతి వ్యవసాయం. ఇలా సహజసిద్దంగా పండించిన కూరగాయలు, ధాన్యాలు, పండ్లను తినేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు... ఇది ఇప్పుడు పెద్ద బిజినెస్ గా మారింది. అయితే ఇంతకంటే సహజసిద్దంగా పంటలు పండించే మరో కాన్సెప్ట్ బాగా ప్రాచుర్యం పొందుతోంది... అదే ''డూ నథింగ్ ఫార్మింగ్ (Do Nothing Farming)''. ప్రకృతి వ్యవసాయం మాదిరిగానే ఈ డూ నథింగ్ ఫార్మింగ్ కూడా జపాన్కు చెందిన ఒక వినూత్న వ్యవసాయ పద్ధతి. ఈ విధానం ప్రకారం... ప్రకృతి తన పనిని తాను చేసుకునేలా వదిలివేయాలి... వ్యవసాయంలో మన జోక్యం చాలా తక్కువగా ఉండాలి. భూమిని దున్నడం, కలుపు తీయడం, పురుగు మందులు వాడటం వంటి పనులను తగ్గించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇంకా చెప్పాలంటే అడవుల్లో చెట్లకు పండ్లు మన ప్రమేయం లేకుండా ఎలా కాస్తాయో భూమిలో పంటలు కూడా అలా పండించాలి. మనం ఏమీ చేయకుండానే పంటలు పండించడమే డూ నథింగ్ ఫార్మింగ్. ఈ వ్యవసాయ పద్దతి ద్వారా రైతులు తమ శ్రమను, ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇది భూమిని సహజసిద్ధంగా సారవంతం చేసి, పంటలకు మెరుగైన వాతావరణాన్ని అందిస్తుంది. ఇది ఆధునిక వ్యవసాయానికి భిన్నమైన మార్గం. ఇది స్థిరమైన, పర్యావరణ అనుకూలమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ పద్ధతి రైతుల జీవితాల్లో

ఈ రోజు 'రాకింగ్ స్టార్' యశ్ అంటే దేశవ్యాప్తంగా తెలుసు. కానీ ఆయన ప్రయాణం పూలపాన్పు కాదు. నటుడు కావాలనే కలతో 16 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి వచ్చేశాడు. అప్పుడు ఆయన దగ్గర కేవలం ₹300 మాత్రమే ఉన్నాయని సమాచారం. సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తూ, ఖర్చుల కోసం చిన్న చిన్న పనులు కూడా చేశాడు. రోజుకు సుమారు ₹50 సంపాదిస్తూ, నటనలో శిక్షణ తీసుకున్నాడు. 2004లో 'ఉత్తరాయణ' అనే కన్నడ టీవీ సీరియల్తో ఆయన నటన ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత నాటకాల్లోనూ నటించాడు. 2007లో 'జంబద హుడుగి' సినిమాలో యశ్ సహాయ నటుడిగా పరిచయమయ్యాడు. ఆ మరుసటి ఏడాదే 'రాకీ' సినిమాతో హీరోగా మారాడు. 'మొగ్గిన మనసు', 'గూగ్లీ' వంటి చిత్రాలు ఆయనకు మంచి అభిమానులను ఏర్పర్చాయి. అయితే 2018లో వచ్చిన 'KGF: చాప్టర్ 1' ఆయన కెరీర్లోనే అతిపెద్ద టర్నింగ్ పాయింట్. 'రాకీ భాయ్' పాత్ర ఆయన్ను కన్నడ ప్రేక్షకులను దాటి పాన్-ఇండియా స్టార్ను చేసింది. 2022లో వచ్చిన 'KGF: చాప్టర్ 2' విజయంతో ఆయన మార్కెట్ మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ₹200 కోట్లు దాటిన తొలి కన్నడ చిత్రంగా 'KGF: చాప్టర్ 1' రికార్డు సృష్టించింది. కేజీఎఫ్ 2 సుమారు రూ.1200కోట్లు రాబట్టిన విషయం తెలిసిందే. యశ్, ఆయన భార్య రాధికా పండిట్ కలిసి 'యశోమార్గ ఫౌండేషన్' అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. ఈ సంస్థ గ్రామీణాభివృద్ధి, నీటి సంరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి పెడుతుంది. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో నీటి సమస్యను పరిష్కరించేందుకు, ఈ ఫౌండేషన్ చెరువుల పూడికతీత పనులు చేపట్టిందని సమాచారం. 2020లో కరోనా సమయంలో సినీ పరిశ్రమకు చెందిన 3,000 మంది కార్మికులకు తలా ₹5,000 చొప్పున సహాయం చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అందుకే యశ్ కథ కేవలం '₹300 నుంచి ₹53 కోట్లు' సంపాదించడం మాత్రమే కాదు, సినిమా

దేశంలోని లక్షలాది మంది గిగ్ వర్కర్లలో అతడు కూడా ఒకడు. మామూలు స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేసేవాడు. అయితే తనకు ఎదురైన ఒక ప్రమాదాన్ని అనుకూలంగా మలుచుకున్నాడు. దేశంలోని లక్షలాది మంది గిగ్ వర్కర్లలో అతడు కూడా ఒకడు. మామూలు స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేసేవాడు. అయితే తనకు ఎదురైన ఒక ప్రమాదాన్ని అనుకూలంగా మలుచుకున్నాడు. ఆసుపత్రి బెడ్ మీద తనలోని కథకుడిని బయటకు తీసుకొచ్చి, లక్షలాది మందిని ఆకట్టుకున్నాడు. ఓ డెలివరీ బాయ్ కథకుడిగా మారి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు. అతడే... అజిత్కుమార్. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సదరు అ‘సామాన్యుడి’ విజయగాథ ఆద్యంతం ఆసక్తికరం... ఫరీదాబాద్కు చెందిన అజిత్ కుమార్ తండ్రి కుటుంబపోషణ కోసం ఢిల్లీ ఎన్సీఆర్కు వలస వెళ్లారు. కుటుంబాన్ని పోషించడానికి ఆయన చిన్నాచితకా పనులు చేసేవారు. తండ్రి కష్టం చూసీచూసి, డబ్బు విలువ అజిత్కుమార్కు చిన్నతనంలోనే తెలిసొచ్చింది. అయితే అక్క పెళ్లితో కుటుంబ పరిస్థితి మరింత దిగజారిపోయింది. పెళ్లికి చేసిన అప్పుల కారణంగా ఇంటిపోషణలో తాను కూడా భాగం పంచుకోక తప్పలేదు. అప్పటికే వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు అజిత్. ఒకవైపు చదువుకుంటూనే ఇంటి అవసరాల కోసం మేకప్, మెహందీ డిజైన్స్ వేస్తూ అంతో ఇంతో సంపాదించేవాడు. అయినా కూడా అప్పులు తీరేవి కావు. సరిగ్గా అదే సమయంలో మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు... కొవిడ్ మహమ్మారి అజిత్ కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. కొవిడ్ లాక్డౌన్ కారణంగా అజిత్ కాలేజీ మానేయాల్సి వచ్చింది. అప్పటికే అతడు చేసే చిన్న చిన్న పనుల వల్ల ఇల్లు గడవడం కూడా కష్టమైంది. ఏదైనా ఉద్యోగం చేయాలను కున్నాడు. ఒక స్నేహితుడు ఫుడ్ డెలివరీ ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. స్విగ్గీ డెలివరీ రైడర్గా పని చేయడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో తన దగ్గర సైకిల్ మాత్రమే ఉండేది. రోజుకు 20 ఆర్డర్లను పూర్తి చేయాలంటే కనీసం 100 కిలోమీటర్లు