
RC 17 | దేవిశ్రీకిబ్రేకప్ చెప్పిన సుకుమార్?.. 'RC17'కి కొత్తమ్యూజిక్ డైరెక్టర్?
RC 17 | దేవిశ్రీకి బ్రేకప్ చెప్పిన సుకుమార్?.. 'RC17'కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్?
© 2026 nimisham.in

RC 17 | దేవిశ్రీకి బ్రేకప్ చెప్పిన సుకుమార్?.. 'RC17'కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే 'పెద్ది' సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నారు. థియేటర్లలో రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొట్టింది. భారీ వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత చేతికి సర్జరీ చేయించుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇదే క్రమంలో తన తర్వాతి సినిమా కోసం కూడా రెట్టింపు ఉత్సాహంతో రెడీ అవుతున్నాడు రామ్ చరణ్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్తో చేయబోతున్న RC 17 ప్రాజెక్టు స్క్రిప్ట్ పనులను పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నాడు చరణ్. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఆర్ సీ 17లో మొదట కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారట. చాలా రోజుల క్రితమే ఈ బాలీవుడ్ హీరోయిన్ ను ఫైనల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. గతంలో రామ్ చరణ్, కియారా కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. 'వినయ విధేయ రామ', 'గేమ్ ఛేంజర్' ల్లో వీరు హీరో, హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో సుక్కూ సినిమాలో కియారాను హీరోయిన్ గా తీసుకున్నారని తెలియగానే మెగాభిమానులు ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన మరో ఆసక్తికర అప్ డేట్ వచ్చింది. ఆర్ సీ 17 కియారా స్థానంలో మరో హీరోయిన్ని పరిశీలిస్తోందట చిత్ర బృందం. ప్రస్తుతం ఈ రేసులో ధురంధర్ సినిమాల హీరోయిన్ సారా అర్జున్ పేరు మొదట వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడికి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్, పాపులారిటీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో సారానే హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో

పెద్ది తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తోన్న చిత్రం RC17. రంగస్థలం తరువాత చరణ్- సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ మొత్తం ఎన్నో ఆశలు పెట్టుకుంది. పెద్ది తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) చేస్తోన్న చిత్రం RC17. రంగస్థలం తరువాత చరణ్- సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ మొత్తం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం చరణ్.. సర్జరీ తరువాత రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఇంకోపక్క సుకుమార్.. RC17 స్క్రిప్ట్ పనులను పూర్తిచేసే పనిలో పడ్డాడు. ఇక ఈ సినిమా గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా నిమిషాల్లో వైరల్ గా మారుతోంది. మొదటి నుంచి ఈ సినిమాలో కథానాయికగా మొదట బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీని పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగింది. ఇప్పటికే చరణ్ - కియారా రెండు సినిమాల్లో జంటగా కనిపించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ, శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్. ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. ఇక ముచ్చటగా మూడోసారి ఈ జంట RC17లో కనిపిస్తున్నారని టాక్ వచ్చింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ రేసులోకి చైల్డ్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకుని ధురంధర్ చిత్రంలో యలీనా పాత్రతో మెప్పించిన సారా అర్జున్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. కియారా అద్వానీ స్థానంలో సారా అర్జున్ను కథానాయికగా తీసుకుంటే రామ్ చరణ్ సరసన ఒక సరికొత్త ఫైరీ కాంబినేషన్ కుదురుతుందని సుకుమార్, ఆయన టీమ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్గా విక్రమ్ నాన్న వంటి చిత్రాలలో మెప్పించిన సారా అర్జున్, ఇప్పుడు కథానాయికగా ప్రమోషన్ పొంది రామ్ చరణ్ సరసన ఛాన్స్ కొట్టేయడం నిజంగా పెద్ద మైలురాయనే చెప్పాలి. ఇందులో నిజమెంత