
PM Modi | ఏడు రైల్వేప్రాజెక్టులకు కేంద్రక్యాబినెట్ ఆమోదం.. తెలంగాణకు ఒకటి.. ఏపీకి మరొకటి
PM Modi | ఏడు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. తెలంగాణకు ఒకటి.. ఏపీకి మరొకటి
© 2026 nimisham.in

PM Modi | ఏడు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. తెలంగాణకు ఒకటి.. ఏపీకి మరొకటి

PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ

PM Modi: స్వాతంత్ర సమరయోధుడిగా మోడీ ...! తీవ్ర విమర్శలు, ట్రోలింగ్స్..!

PM Modi: తొలిసారి ‘బుక్మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్ఫుల్ బోర్డు

ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. కానీ మన దేశంలో బంగారం ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో దేశ అవసరాలకు కావాల్సిన బంగారంలో అధిక భాగాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. విదేశాల నుంచి బంగారం కొనుగోలు చేయాలంటే రూపాయల్లో కాకుండా ప్రధానంగా అమెరికన్ డాలర్లలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. దేశంలో బంగారం డిమాండ్ పెరిగిన కొద్దీ విదేశాలకు ఎక్కువ డాలర్లు వెళ్లిపోతాయి. దీంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అవసరం లేని బంగారం కొనుగోళ్లు తగ్గితే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారత్ విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకునే వస్తువుల్లో ముడి చమురు తర్వాత బంగారం కూడా కీలక స్థానంలో ఉంటుంది. బంగారం కొనుగోలు కోసం ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తే దేశ దిగుమతుల వ్యయం పెరుగుతుంది. దీని వల్ల ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం పెరిగి వాణిజ్య లోటు అధికమయ్యే అవకాశం ఉంటుంది. విదేశీ కరెన్సీపై డిమాండ్ పెరిగినప్పుడు భారత రూపాయిపై కూడా ఒత్తిడి పడుతుంది. రూపాయి విలువ తగ్గితే మరో సమస్య ఎదురవుతుంది. ముడి చమురు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర విదేశీ ఉత్పత్తుల దిగుమతులు మరింత ఖరీదవుతాయి. చివరకు వాటి ప్రభావం దేశీయ ధరలపై పడి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. చాలా మంది బంగారాన్ని పెట్టుబడిగా భావించి నగలు, నాణేలు లేదా బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేసి ఇంట్లో లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తుంటారు. అయితే ఇలా పెద్ద మొత్తంలో డబ్బు బంగారం రూపంలో నిల్వ ఉండిపోతే అది నేరుగా ఉత్పాదక రంగాల్లోకి వెళ్లదు. ఉదాహరణకు అదే డబ్బును బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, కంపెనీల షేర్లు లేదా కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే ఆ నిధులు ఆర్థిక కార్యకలాపాలకు ఉపయోగపడతాయి. బ్యాంకుల్లో డబ్బు

షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు గ్రూప్ ఫొటో నుంచి భారత ప్రధాని మోదీ చిత్రాన్ని పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం ఎడిట్ చేసి తొలగించడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయం చేసిన ఈ చిల్లర చేష్టలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఏక్ నాథ్ షిండే... పాకిస్థాన్ చేసిన పని అత్యంత దురదృష్టకరమని మండిపడ్డారు. వారు ఫొటో నుంచి మాత్రమే మోదీ చిత్రాన్ని తొలగించగలరని... కానీ మోదీ అనుకుంటే ప్రపంచపటం నుంచి పాకిస్థాన్ను లేకుండా చేయగలరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. గతంలో పహల్గామ్లో ఉగ్రవాదులు ఘోరానికి ఒడిగట్టినప్పుడు, మోదీ నాయకత్వంలో మన భారత సాయుధ బలగాలు పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను, 11 ఎయిర్బేస్ క్యాంపులను ధ్వంసం చేసి వారిని మోకాళ్లపై నిలబెట్టాయని గుర్తుచేశారు. ఇటువంటి చవకబారు ట్రిక్కులతో భారత్తో కానీ, ప్రధాని మోదీతో కానీ ఆడుకోవాలని చూడవద్దని పాకిస్థాన్కు ఆయన హితవు పలికారు. కేవలం ఫొటో నుంచి మోదీని కట్ చేసినంత మాత్రాన దేశంలోనూ, అంతర్జాతీయ వేదికలపైనా ఆయనకు ఉన్న గుర్తింపు, స్థాయి ఎంతమాత్రం తగ్గబోవని ఏక్ నాథ్ షిండే స్పష్టం చేశారు

ప్రకృతి కంటికి కనిపించని రౌద్రరూపం దాల్చితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో నేపాల్లో వచ్చిన వరదలే నిదర్శనంగా నిలిచాయి. వరదల ధాటికి అతలాకుతలమైన పొరుగు దేశం నేపాల్లో బాధితులను పరామర్శించేందుకు రియల్ హీరో, బాలీవుడ్ నటుడు సోనూసూద్ నేరుగా రంగంలోకి దిగారు. అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న త్రిశూలి బజార్ ప్రాంతాన్ని ఆయన పర్యటించి, క్షేత్రస్థాయిలో పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. బాధితులను కలిసిన ఆయన వారి కష్టాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. కష్టకాలంలో పొరుగు దేశానికి అండగా నిలుస్తూ భారత్ అందిస్తున్న సహాయాన్ని సోనూసూద్ మనస్ఫూర్తిగా కొనియాడారు.మనసారా మెచ్చుకున్న సోనూసూద్నేపాల్లో విపత్తు తీవ్రత ఊహించని స్థాయిలో ఉందని, అక్కడి ప్రజలు మళ్లీ సాధారణ జీవితానికి రావడానికి చాలా సమయం పడుతుందని సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్కి అందిస్తున్న సహాయం నిజంగా అభినందనీయం. నేపాల్ మళ్లీ సొంత కాళ్లపై నిలబడాలంటే ఈ సహాయం ఇలాగే కొనసాగాలి. నేను స్వయంగా ఇక్కడి కుటుంబాలను కలిసిన తర్వాత అర్థమైంది ఏమిటంటే.. ఈ సమస్య కొద్ది వారాల్లోనో, నెలల్లోనో తీరేది కాదు. మనం నిరంతరం అండగా ఉంటేనే వాళ్లు కోలుకోగలరు అని మీడియా ముఖంగా వ్యాఖ్యానించారు. Nepal flash floods: దేవుడిలా వచ్చి 1,643 మంది పిల్లల్ని కాపాడి.. రియల్ హీరో1,127కు చేరిన మృతుల సంఖ్యనేపాల్లో సంభవించిన ఈ జలప్రళయంలో ప్రాణనష్టం ఊహించని రీతిలో ఉంది. నేపాల్ పోలీసుల సమాచారం ప్రకారం ఇప్పటివరకు మృతుల సంఖ్య ఏకంగా 1,127కు చేరింది. రసువా, నువాకోట్, ధాడింగ్, చిత్వాన్, గోర్ఖా, తనహున్, నావల్పరాసి ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మృతదేహాలను వెలికితీశారు. దొరికిన మృతదేహాల్లో ఇప్పటివరకు కేవలం 95 మృతదేహాలను మాత్రమే గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించగలిగారు. మరికొన్ని మృతదేహాలు సరిహద్దులు దాటి భారత్లో కూడా లభ్యమవడం విపత్తు తీవ్రతకు అద్దం పడుతోంది.మృత్యువుకు 30 సెకన్ల దూరం! ఒకే ఒక్క మెసేజ్ 8

భారత్-పాకిస్థాన్ మధ్య సింధు జలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సింధు జలాల ఒప్పందంపై హేగ్లోని కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ డెస్క్: భారత్-పాకిస్థాన్ మధ్య సింధు జలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty)పై హేగ్లోని కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో ప్రస్తావించారు. నీటిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని ఆయన అన్నారు (India Pakistan water dispute). ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ సమావేశంలో మాట్లాడిన షెహబాజ్ షరీఫ్.. నీరు లక్షలాది మంది జీవితాలకు ఆధారమని, వ్యవసాయానికి కీలకమని, భవిష్యత్ తరాల అవసరాలను తీర్చే వనరని అన్నారు. నీటిని ఆయుధంగా ఉపయోగించడానికి అనుమతించకూడదని షరీఫ్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి జల వనరులను ఒక దేశంపై ఒత్తిడి తీసుకురావడానికి లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని పేర్కొన్నారు (Shehbaz Sharif about Indus Waters Treaty). షెహబాజ్ షరీఫ్ జల వివాదాన్ని ప్రస్తావించడానికి కొద్దిసేపటి ముందు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎస్సీఓ సదస్సులో ప్రసంగించారు (Pakistan water dispute). ఆయన ప్రసంగంలో ఉగ్రవాదంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి నిధులు అందించడం, ఉగ్రవాదుల నియామకం, ఉగ్ర స్థావరాలు వంటి మొత్తం వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉగ్రవాదాన్ని తమ సాధనంగా ఉపయోగించే దేశాలకు గట్టి సందేశం ఇవ్వాలని కూడా ప్రధాని పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్కు పాకిస్థాన్ కోర్టు భారీ ఊరట.. ఇక ఏకాంత నిర్బంధం ఉండదు.. విజయ్ ఫర్ పీఎం.. టీవీకే-కాంగ్రెస్ మధ్య విభేదాలు ముదురుతున్నాయా
పీఎం మోదీ ఇన్స్టా వీడియో.. వారందరికీ అదిరిపోయే కౌంటర్! ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్ 7.8% జీడీపీ వృద్ధిని నమోదుచేయడంతో.. అంచనాలకు మించి సాధించిన ఈ ఆర్థిక పనితీరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రశంసించారు. ఈమేరకు ఇన్స్టాగ్రాంలో ఓ వీడియో విడుదల చేశారు. వృద్ధి కనిపిస్తున్నా కొందరు ఆర్థిక వ్యవస్థపై నిరాశావాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని విమర్శకులపై విమర్శలు గుప్పించారు. ఈ విజయం భారతీయుల సంకల్పం, కఠోర శ్రమ ఫలితమేనన్నారు. క్లిష్టమైన ప్రపంచ పరిస్థితులు ఉన్నా, ఈ గణాంకాలు దేశ బలాన్ని చాటిచెప్పాయని పేర్కొన్నారు. ఈ వార్తకు సంబంధించిన

ఎస్సీఓ వేదికపై ఫొటోగ్రాఫ్ అనంతరం వెళ్లిపోతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ను పాక్ ప్రధాని పిలిచారు. అనంతరం ఆయనతో సంభాషించారు. ఇంటర్నెట్ డెస్క్: కిర్గిస్థాన్లో జరుగుతున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సదస్సులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈరోజు(మంగళవారం) సభ్యదేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రుల ఫొటోగ్రాఫ్ తరవాత అక్కడి నుంచి వెళ్లిపోతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ను పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వెనుక నుంచి తట్టారు. అనంతరం ఆయనతో సంభాషించారు. అయితే పాక్ ప్రధాని రష్యా అధ్యక్షుడికి ఏం చెప్పి ఉంటారనే విషయమై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. ఉక్రెయిన్తో యుద్ధానికి రష్యా ముగింపు చెప్పాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చిన తరువాతి రోజే ఈ ఘటన జరిగింది. బీష్కెక్లో రష్యా అధ్యక్షుడు పుతిన్కు, తనకు జరిగిన భేటీలో మోదీ ఈ సూచనలు చేశారు. ‘యుద్ధానికి కేటాయించే ప్రతి దినమూ మానవత్వాన్ని అంతం చేస్తుంది. శాంతి కోసం కేటాయించే ప్రతి ఒక్కరోజూ మావవత్వాన్ని బతికించి, కొత్త ఆశలు చిగురించేలా చేస్తుంది’ అని ఆయన చెప్పారు. అందుకే యుద్ధాన్ని వీడాలని సూచించారు. హెగ్సెత్పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా? విమాన ఇంధనానికి మళ్లీ మంట.. లీటరుకు రూ.6.28 పెరిగిన ఏటీఎఫ్ ధర

కిర్గిజ్ రాజధాని బిష్కెక్లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. ఐదేళ్లు దాటుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి తక్షణమే ముగింపు పలకాలంటూ పుతిన్ ముందే భారత్ తన శాంతి వైఖరిని అత్యంత స్పష్టంగా పునరుద్ఘాటించింది. అంతులేని యుద్ధం నుంచి యుద్ధం ముగింపు వైపు అడుగులు వేయడం మానవాళి శ్రేయస్సుకు అత్యవసరమని మోదీ తేల్చిచెప్పారు. గతంలో 2022 సమర్కాండ్ ఎస్సీఓ సదస్సులో ఇది యుద్ధాల యుగం కాదని చెప్పిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. 2025 డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన వార్షిక సదస్సు తర్వాత 2026లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి భేటీ ఇదే కావడం విశేషం. గాంధీ, బుద్ధుడు నడయాడిన భారత భూమి నుంచి ఎల్లప్పుడూ శాంతి సందేశమే ప్రపంచానికి వెళ్తుందని రష్యా అధ్యక్షుడికి ప్రధాని నేరుగా వివరించారు. శాంతి వైపు వేసే ప్రతి అడుగు మానవాళిలో కొత్త ఆశను నింపుతుందని మోదీ స్పష్టం చేశారు. దీంతో ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చలకు మరియు శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లవేళలా మద్దతు ఇస్తుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి వెల్లడించారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లోని సంఘర్షణల వల్ల అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం మరియు భారతీయ నావికుల భద్రత తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భేటీలో మోదీ వ్యాఖ్యలపై స్పందించిన పుతిన్, భారత్ మరియు రష్యాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనియాడారు. ఫలితంగా 2026 మొదటి ఆరు నెలల్లో రెండు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగిందని రష్యా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రక్షణ, ఇంధనం, ఎరువులు, అంతరిక్షం మరియు వినూత్న రంగాలు సహా ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై రెండు దేశాల అధినేతలు సుదీర్ఘంగా చర్చించారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12–13

కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్ లో ఆరంభమైన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 26వ సమ్మిట్ ఇది. సభ్య దేశాల అధినేతలు, ప్రధానులతో భేటీ అయ్యారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లను కలిశారు. రష్యా అధ్యక్షుడితో జరిగిన ప్రత్యేక ద్వైపాక్షిక చర్చల్లో పరస్పర సంబంధాల బలోపేతంతో పాటు అంతర్జాతీయ శాంతి స్థాపన ప్రాధాన్యత గురించి వివరించారు.ఎస్సీఓ రౌండ్ టేబుల్ ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆయా దేశాధినేతలతో పాటు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఉగ్రవాదంపై పోరు, సభ్యదేశాల సార్వభౌమాధికారం, రీజినల్ కనెక్టివిటీ వంటి అంశాలపై తన వైఖరిని స్పష్టం చేశారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకుంటూనే యురేషియా ప్రాంతంలోని ఇతర దేశాలతో సహకారాన్ని పెంచుకుంటోందని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో రాజీపడబోమని తేల్చి చెప్పారు.సరిహద్దు దేశాల ఉగ్రవాద విధానాల గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాకిస్తాన్, ఇతర ఉగ్రవాద దేశాలు అనుసరిస్తోన్న వైఖరిని ఎండగట్టారు. ఉగ్రవాదంపై ద్వంద్వనీతిని అనుసరించవద్దని హెచ్చరించారు. ఒకవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే మరో వైపు దీన్ని అంతం చేస్తామంటూ మాట్లాడటం సరికాదని, ఇటువంటి వైఖరికి ఏ మాత్రం ఆస్కారం ఇవ్వకూడదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.నేటి నుంచి.. అరుణాచలం, తమిళనాడులోని ఇతర ఆలయాలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనికఉగ్రవాదాన్ని ఒక వ్యూహాత్మక ఆయుధంగా ఉపయోగించుకోవడం, తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలను వీడాలని ప్రధాని మోదీ హితవు పలికారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, వారిని పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసుకోవడం, షెల్టర్ జోన్ లను ఏర్పాటు చేయడం వంటి విధానాలను ఏ దేశం కూడా ప్రోత్సహించబోదని, ఈ వ్యవస్థను సమూలంగా మట్టుబెట్టాల్సిందేనని చెప్పారు.మీరు నిత్యం ధ్వేషించే మొఘల్ చక్రవర్తి పుట్టిన గడ్డ అది: ప్రధాని మోదీకి ఒవైసీ

భారత దేశ జీడీపీ 7.8 శాతం మేర వృద్ధి సాధించిందన్న ప్రధాని మోదీపై రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు. ఇంటర్నెట్ డెస్క్: భారత దేశ జీడీపీ 7.8 శాతం మేర వృద్ధి సాధించిందన్న ప్రధాని మోదీపై రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు. అవన్నీ ప్రచారార్భాటమేనని కొట్టిపారేశారు. గణంకాల గారడీతో మోదీ ప్రభుత్వం ప్రజలను భ్రమల్లో ముంచెత్తుతోందని ఎంపీ జైరాం రమేశ్ ఆరోపించారు. దేశంలో పెట్టుబడులు, వినియోగం మందగించాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 'హై వోల్టేజ్' ధరల భారాన్ని సామాన్యులపై మోపుతోందని ఆరోపించారు. ముడిసరకుల ధరలు పెరగడంతో సామాన్యుల సొంతింటి కలలు కల్లలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరాభారం కేవలం వంటింటికే పరిమితం కాలేదని అన్నారు. రాగి వైర్ ధర రూ. 850 నుంచి రూ. 1,700 కి, అల్యూమినియం ధర రూ. 350 నుంచి రూ. 650 కి చేరిందని వెల్లడించారు. 1,000 చదరపు అడుగుల ఇంటికి వైరింగ్ ఖర్చు రూ. 50 వేల నుంచి లక్ష రూపాయిలకు పెరిగిందని చెప్పారు. హోమ్ అప్లయన్సెస్, ఎల్ఈడీ లైట్లు, ఫ్యాన్లు, సోలార్ ప్యానెళ్ల ధరలు 10 నుంచి 20 శాతం వరకు పెరిగాయని అన్నారు. స్విచ్ సాకెట్లు, మెయిన్ లైన్ కేబుల్స్, టైల్స్, కార్మికులు ఖర్చు ఇలా అన్ని పెరిగాయని అన్నారు. ధరాభారం అన్ని వైపుల నుంచి ప్రజలకు షాకులిస్తోందని వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతున్నా కూడా మోదీ ప్రభుత్వం మాత్రం వాస్తవాలను మరుగున పరిచి, గణాంకాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉందని మండిపడ్డారు. త్రైమాసిక జీడీపీ గణాంకాలు దేశంలోని పరిస్థితుల్ని తప్పుగా చూపిస్తున్నాయని అన్నారు. వీక్ సెంటీమెంట్ను ప్రతిఫలించట్లేదని చెప్పారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత జీడీపీ 7.8 శాతం వృద్ధి సాధించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భారత్ ప్రగతిబాటలో దూసుకుపోతుంటే నిరాశావాదులు మాత్రం అసత్యాలను ప్రతిధ్వనిస్తున్నారని విమర్శించారు. ఈ వృద్ధి రేటు భారతీయుల సమష్టి శక్తికి

Narendra Modi: భారతదేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ భారత్ మంచి వృద్ధిని సాధించిందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలు స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని, అవసరం లేని విదేశీ ఖర్చులను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. భారత్ 7.8 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేయడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ వృద్ధి దేశ ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. ప్రపంచంలో యుద్ధాలు, అంతర్జాతీయ సమస్యలు, సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా విదేశీ పర్యటనల గురించి కూడా ప్రధాని మాట్లాడారు. కేవలం వినోదం కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని సూచించారు. అలాగే విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం కూడా తగ్గించాలని అన్నారు. అవసరం లేని సమయంలో బంగారం కొనుగోలు చేయవద్దని ప్రజలను కోరారు. దేశంలో తయారయ్యే వస్తువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. స్వదేశీ వస్తువులను ఉపయోగించడం వల్ల దేశంలోని వ్యాపారాలు, పరిశ్రమలు, ఉద్యోగాలకు కూడా ప్రయోజనం ఉంటుందని చెప్పారు. భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని మోదీ కోరారు. దేశ ప్రజలంతా కలిసి పనిచేస్తే భారత్ మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని అన్నారు. ముఖ్యంగా యువత కలలను నెరవేర్చే బాధ్యత నేటి తరంపై ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో దేశంలో నిరాశ వాతావరణం సృష్టిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కూడా ప్రధాని విమర్శలు చేశారు. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమిస్తూ 7.8 శాతం వృద్ధిని సాధించిందని తెలిపారు. ప్రస్తుతం ప్రధాని మోదీ కిర్గిజిస్థాన్లోని బిష్కెక్లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సమావేశానికి పలు దేశాల నాయకులు హాజరయ్యారు. భారత్ అభివృద్ధి, స్వయం
రచయిత గురించిబండ తిరుపతిబండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2023లో సమయంలో చేరిన తిరుపతి.. బిజినెస్ రంగానికి సంబంధించి తాజా వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ న్యూస్, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్డేట్లు అందిస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సైతం ఇస్తున్నారు. బండ తిరుపతి 2025 ఫిబ్రవరిలో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి ఓవర్ అచీవర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్నారు. తిరుపతి మండలస్థాయి న్యూస్ కంట్రిబ్యూటర్గా తన జర్నలిజం కెరీర్ను ప్రారంభించారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో మల్టీమీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ భారత్, సాక్షి మీడియా సంస్థల్లో పని చేశారు. అక్కడ బిజినెస్, స్పోర్ట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ రాశారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో ప్రత్యేక కథనాలు అందించిన అనుభవం ఉంది. సినిమాలు, క్రికెట్ చూడటం, బిజినెస్ రంగానికి సంబంధించిన కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆయన ఆసక్తి చూపుతారు.... ఇంకా చదవండి

ఇంటర్నెట్డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్- జూన్)లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదు కావడంపై ప్రధాని మోదీ (PM Modi) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలు తెలిపిన ఆయన.. గతంలో చేసిన విజ్ఞప్తినే మరోసారి గుర్తుచేశారు. స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని, విదేశీ ప్రయాణాలు వద్దని, అవసరం లేకుండా బంగారం కొనొద్దని మరోసారి కోరారు. ప్రస్తుతం కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు ఇన్స్టా వీడియో విడుదల చేశారు. ‘‘దేశ ప్రజలకు అభినందనలు. 7.8% వృద్ధి గొప్ప విషయం. ప్రజల సంకల్ప బలం, కృషికి ఇది నిదర్శనం. ప్రపంచం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో భారత్ ఈ అసాధారణ ఘనతను దక్కించుకుంది. ప్రపంచం యుద్ధంలో మునిగిపోయింది. ఎటుచూసినా యుద్ధ వార్తలే.. సంక్షోభాలే. సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింది. 2020లో కొవిడ్ తర్వాత నుంచి నేటి వరకు ఎక్కడా స్థిరత్వం కనిపించడం లేదు. అయినా భారత్ పురోగమిస్తోంది’’ అని మోదీ తన వీడియోలో పేర్కొన్నారు. ‘‘పర్యటనల కోసం విదేశాలకు వెళ్లొద్దు. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్లకు దూరంగా ఉండండి. ‘భారత్లోనే వివాహం చేసుకోండి’ అనే మంత్రాన్నే మనం పాటిద్దాం. అవసరం లేకపోతే బంగారాన్ని కొనడం మానుకోండి. స్థానికంగా తయారైన వస్తువులు, సేవలు ఎంత ఎక్కువగా ఎంచుకుంటే.. దేశం అంత ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. మనం స్వావలంబనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటే.. స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యేనాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతామనే విశ్వాసం నాకు ఉంది’’ అని మోదీ పేర్కొన్నారు. ‘‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన 7 శాతం కంటే ప్రస్తుత వృద్ధి రేటు ఎక్కువ. అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా అనిశ్చితులు, ఇంధన సరఫరాకు అవరోధాలు వంటి పరిస్థితులను తట్టుకొని భారత ఆర్థిక వ్యవస్థ రాణించడం విశేషం. ఈ వృద్ధిని దేశ

భారత్ సాధించిన వృద్ధి రేటు దేశ సమష్టి శక్తికి నిదర్శనమని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ నిరాశావాదులు మాత్రం తమ అసత్యాలను వ్యాప్తి చేస్తూనే ఉన్నారని విమర్శించారు. ఇంటర్నెట్ డెస్క్: భారత్ సాధించిన వృద్ధి రేటు దేశ సమష్టి శక్తికి నిదర్శనమని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నిరాశావాదులు మాత్రం తమ అసత్యాలను వ్యాప్తి చేస్తూనే ఉన్నారని విమర్శించారు. యుద్ధాలు, సరఫరా వ్యవస్థల్లో అడ్డంకుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ మెరుగైన వృద్ధి రేటు సాధించిందని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత దేశ జీడీపీ ఏకంగా 7.8 శాతం మేర వృద్ధి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు అభినందనలు చెప్పారు. 7.8 శాతం వృద్ధి రేటు నమోదవడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోందని అన్నారు. దేశ ప్రజల పట్టుదల, శక్తిసామర్థ్యాలు గొప్పవని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు నెలకొన్నా భారత్ వృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. భారత దేశ ప్రగతిని ఇలాగే కొనసాగించాల్సిన అవనరం ఉందని కూడా ప్రధాని చెప్పారు. ఆత్మనిర్భరత సాధించడం అవసరమని మరోసారి చెప్పారు. స్వదేశీ వస్తువులకు దేశ ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనవసర విదేశీ పర్యటనలు, బంగారం కొనుగోళ్లు వద్దని అన్నారు. విదేశీ మారకనిల్వల పొదుపు కోసం భారత్లోనే వివాహాది శుభకార్యాలు జరుపుకోవాలని సూచరించారు. రష్యా సైన్యంలోని 51 మంది భారతీయుల మృతి.. విదేశాంగ శాఖ సెక్రటరీ వెల్లడి రైల్వే అభివృద్ధిలో తెలంగాణకు పెద్దపీట కేంద్ర మంత్రి కిషన్రెడ్డి

భారత్- రష్యా మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో కీలక భేటీ నిర్వహించారు. ఇరు దేశాధినేతలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సమస్యలు, సవాళ్లపై చర్చించారు. అలాగే ఉక్రెయిన్- రష్యా మధ్య నిరంతరాయంగా కొనసాగుతున్న యుద్ధానికి ఇక ముగింపు పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ కీలక సందేశం ఇచ్చారు. ప్రతిరోజూ యుద్ధం కారణంగా మానవత్వం నశిస్తుందని.. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని హితవు పలికారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్ కేక్ లో నిర్వహించిన షాంగై కో ఆపరేషన్ సదస్సు(SCO) లో భాగంగా విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యారు. శాంతి స్థాపన కోసం భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ మేరకు తన సహాయ సహకారాలను అందిస్తుందని అన్నారు. " ప్రతిరోజూ యుద్ధం కారణంగా మానవత్వం వెనక్కు వెళ్తుంది. శాంతి స్థాపన కోసం ముందుకు వేసే ఒక్కో అడుగు మానవత్వాన్ని పెంపొందిస్తుంది. కొత్త ఆశలను చిగురింపజేస్తుంది" అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మనమంతా ముగింపు లేని యుద్ధం నుంచి ముగింపు పలికే యుద్ధం దిశగా చేరుకోవాలని అన్నారు. మానవత్వం సంరక్షణకు ఇదే ముందడుగు.. వీలైనంత త్వరలో అన్ని సమస్యలు కొలిక్కి వస్తాయి" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శాంతి సందేశం విషయంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. గాంధీ, బుద్ధుడు నడయాడిన భారత్ నుంచి ప్రపంచ దేశాలకు ఇచ్చే సందేశం ఇదేనని ప్రధాని మోదీ.. పుతిన్ తో జరిగిన భేటీలో స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరు దేశాధినేతలు ఉక్రెయిన్ తో యుద్ధంపై చర్చలు నిర్వహించారు. గతంలోనూ పుతిన్ తో జరిగిన భేటీల్లో ఉక్రెయిన్ అంశాన్ని ఆయన ప్రధానంగా లేవనెత్తుతున్న సంగతి తెలిసిందే. " ఎక్సెలెన్సీ.. ఉక్రెయిన్ గురించి మేము

Burning Topic: సెంట్రల్ ఏషియాతో భారత్ భారీ ఒప్పందాలు! ఈ వార్తకు సంబంధించిన

రాజస్థాన్లోని జైపూర్లో సర్కార్ బడి తనిఖీ చేయడానికి వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) బృందంపై శుక్రవారం తీవ్రస్థాయిలో దాడి జరిగింది. రాజస్థాన్లోని రాంపురా కన్వార్పురాలో ఘటన జైపూర్, ఆగస్టు 21: రాజస్థాన్లోని జైపూర్లో సర్కార్ బడి తనిఖీ చేయడానికి వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) బృందంపై శుక్రవారం తీవ్రస్థాయిలో దాడి జరిగింది. ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రంకా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం.. రాంపురా కన్వార్పురా గ్రామంలో బడుల స్థితిగతులను పరిశీలించేందుకు వెళ్లింది. సీజేపీ ప్రతినిధులు గ్రామానికి చేరుకోగానే.. స్థానికులు, బీజేపీ కార్యకర్తలు చుట్టుముట్టి రాళ్లతో, కర్రలతో విరుచుకు పడ్డారని అశుతోష్ ఆరోపించారు. పాఠశాల భవనం ప్రమాదకరంగా ఉందనే కారణంతో, గత కొన్నేళ్లుగా విద్యార్థులకు సమీపంలోని ఓ పశువుల కొట్టంలో తరగతులు నిర్వహిస్తున్నారని.. దీనిని ప్రశ్నించినందుకు తమపై దాడి చేయించారని ధ్వజమెత్తారు. తమ సభ్యులపై దాడి చేసి చొక్కాలు చింపేశారని, వాహనాల అద్దాలు, మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని.. మహిళా ప్రతినిధులపై బురద చల్లి దుర్భాషలాడారని వాపోయారు. ఈ ఘర్షణల్లో పలువురు సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయని, ఒకరి చెయ్యి కూడా విరిగిందని పేర్కొన్నారు. రాజస్థాన్ విద్యాశాఖమంత్రి మదన్ దిలావర్ ఆదేశాల మేరకే.. బీజేపీ గుండాలు తమపై దాడి చేశారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుల పాకలో నడుస్తున్న బడిని బాగుచేయాలని కోరడమే తమ ప్రతినిధులు చేసిన నేరమా? అని నిలదీశారు. బాధ్యులైన వారిని 48గంటల్లో అరెస్ట్ చేయాలని లేదంటే తమ నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు

జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీద కు వస్తున్నాయి. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ పైన మరో సారి కేంద్రం వేగంగా పావులు కదుపుతోంది. ఎలాగైనా ఈ బిల్లులను ఆమోదించుకోవాలని కొత్త ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తాజాగా కొత్త లెక్కలు కలిసి వస్తున్నాయి. దీంతో, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లుల ఆమోదానికి కసరత్తు మొదలైంది.కేంద్రం మరోసారి మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం కసరత్తు వేగవంతం చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుల ఆమోదం కోసం ప్రయత్నాలు జరిగాయి. అయితే, జంతర్ మంతర్ వద్ద జెన్ జీ నిరసనలు.. ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గెలుపు.. విపక్ష పార్టీలు తమ డిమాండ్ల కోసం పట్టుబడటంతో సాధ్యం కాలేదు. శివసేన (థాకరే), టీఎంసీ, ఆప్ నుంచి చీలిక వర్గం ఎంపీ ల మద్దతుతో బిల్లును ఆమోదించేలా బీజేపీ ముఖ్య నేతలు ప్రణాళికలతో సిద్దమయ్యారు. ఇండి కూటమి కీలక నేత శరద్పవార్తో ప్రధాని మోదీ ఇటీవల భేటీ కావటం వంటి పరిణామాలు.. ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన బలాన్ని ఎన్డీఏ సమకూర్చుకుంటుందన్న వాతావరణాన్ని సృష్టించాయి. అయితే, అనూహ్యంగా ఆవిర్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సారథ్యంలో జరిగిన జెన్జీ ఉద్యమం, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామాతో కేంద్రం అంచనాలు తప్పాయి.మారుతున్న పవన్ స్థానిక రాజకీయం - పొత్తుల లెక్కల్లో కొత్త ఫార్ములా..!!ప్రత్యేక సమావేశాల నిర్వహణ దిశగాకాగా.. మారుతున్న రాజకీయ లెక్కల వేళ కేంద్రం ఆలోచన మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ముందుకు తీసుకెళ్లటం కోసం దక్షిణాది పార్టీల పైన ఫోకస్ చేసింది. డీఎంకే మద్దతు ఇస్తే బిల్లు పాస్ చేసుకోవటం సులభంగా మారుతుందని భావిస్తోంది. దీంతో.. దక్షిణాదికి ఎలాంటి నష్టం లేకుండా బిల్లులో స్పష్టత ఇస్తామని డీఎంకే కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది

ప్రధాని నరేంద్ర మోదీని దేవుడిగా చిత్రీకరిస్తూ ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించిన 'మోదీ చాలీసా' కార్యక్రమం పెను దుమారం రేపింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బీహార్ రాష్ట్ర ట్రాన్స్జెండర్ సంక్షేమ బోర్డు సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ శ్రీరాముడి రూపంలో చిత్రీకరించిన భారీ కటౌట్ను దేవుడి రూపంలో నిలబెట్టి, 'జై జై మోదీ, హర్ హర్ మోదీ' అంటూ నినాదాలు చేస్తూ హారతులు ఇచ్చారు.ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత రావడంతో 'ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా' (పీసీఐ) వెంటనే స్పందించి వివరణ ఇచ్చింది. ఈ కార్యక్రమంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం నిర్వాహకులు హాల్ను అద్దెకు తీసుకున్నారని, కానీ వారు నిబంధనలను ఉల్లంఘించి మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించారని పీసీఐ 'ఎక్స్' వేదికగా తెలిపింది. విషయం తెలియగానే తమ అధికారులు జోక్యం చేసుకుని కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపివేశారని పేర్కొంది.అయితే, ఈ కార్యక్రమాన్ని బీహార్ ట్రాన్స్జెండర్ సంక్షేమ బోర్డు వైస్-ప్రెసిడెంట్ రాజన్ సింగ్ గట్టిగా సమర్థించుకున్నారు. మోదీ ప్రభుత్వం వల్లే తమ కమ్యూనిటీకి తొలిసారిగా హక్కులు, ఉపాధి అవకాశాలు లభించాయని ఆయన అన్నారు. అందుకే తాము ఆయన్ను దైవంగా భావిస్తున్నామని తెలిపారు. కేవలం చాలీసా పఠించడమే కాదని, బీహార్లో ఐదు ఎకరాల స్థలంలో రూ.112 కోట్ల వ్యయంతో "శ్రీ నరేంద్ర మోదీ భగవానుడికి" ఆలయాన్ని నిర్మించాలని కూడా తాము ప్రణాళికలు రచిస్తున్నామని ఆయన సంచలన

ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనం చేకూర్చే కీలకమైన రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. గూడూరు-గుమ్మిడిపూండి మధ్య 90 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,229 కోట్లుగా నిర్ణయించారు.కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం డబుల్ లైన్గా ఉన్న ఈ మార్గాన్ని నాలుగు లైన్లుగా అప్గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి, మరిన్ని ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లను నడిపేందుకు వీలవుతుందని వివరించారు. దేశంలో అత్యంత రద్దీగా ఉండే చెన్నై-కోల్కతా, ఢిల్లీ-చెన్నై మార్గాలతో పాటు వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో ఈ ప్రాజెక్టు ఎంతో కీలకం కానుంది.ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించడంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తిరుపతి ఎంపీ గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఈ అదనపు ట్రాక్లు ప్రాంతీయ అభివృద్ధికి, ప్రగతికి బాటలు వేస్తాయని పవన్ కల్యాణ్ పేర్కొంటూ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపినందుకు రైల్వే మంత్రికి ఎంపీ గురుమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.ప్రాజెక్టుతో చేకూరే ప్రయోజనాలుఈ ప్రాజెక్టు పూర్తయితే గూడూరు జంక్షన్లో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. చెన్నై, విజయవాడ, తిరుపతి వైపు వెళ్లే రైళ్ల రాకపోకలు సులభతరం అవుతాయి. ముఖ్యంగా పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం, శ్రీహరికోటలోని సతీశ్

Union Cabinet | ఇంటర్నెట్ డెస్క్: దేశంలో నాలుగు నూతన రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.9,450 కోట్ల అంచనా వ్యయంతో 410 కి.మీ మేర అదనపు రైల్వే లైన్ల నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాలను కవర్ చేస్తూ ఈ నెట్వర్క్ విస్తరించనున్నారు. 2030-31 నాటికి ఈ కొత్త రైల్వే లైన్ల నిర్మాణాన్ని పూర్తి చేసి.. ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన సేవలందించడమే లక్ష్యమని రైల్వే శాఖ (Indian Railways) ఓ ప్రకటనలో పేర్కొంది. కొత్తగా ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టులలో పశ్చిమబెంగాల్లోని ఖరగ్పూర్, ఒడిశాలోని భద్రక్ (రానితాల్) మధ్య 173 కి.మీ మేర నాలుగో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే, ఒడిశాలోని భద్రక్, హరిదాస్పూర్ మధ్య 75 కిలోమీటర్ల మేర నాలుగో లైన్; వీటితో పాటు ఏపీలోని గూడూరు - తమిళనాడులోని గుమ్మిడిపూండి మధ్య 90 కి.మీ; ఒడిశాలోని కటక్, పారాదీప్ మధ్య 72 కి.మీ మేర మూడు, నాలుగో రైల్వే లైన్లను నిర్మించనున్నారు. రైల్వే నెట్వర్క్ను మరో 410 కి.మీ మేర విస్తరించే ఈ నూతన ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.9,450 కోట్లుగా నిర్ణయించారు. ఈ కొత్త రైల్వే లైన్లు ఎనిమిది జిల్లాల్లోని 6,448 గ్రామాలకు రవాణా అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయని రైల్వేశాఖ తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు

ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి జాయింట్ కో-ఆర్డినేటర్ బాధ్యత..! ఆంధ్రప్రదేశ్ బీజేపీ యువ నేత, పార్టీ వక్త ఎస్. విష్ణువర్ధన్ రెడ్డికి జాతీయ స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో ఆయనను ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్గా నియమించారు. రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న ఆయనకు జాతీయ స్థాయిలో సంస్థాగత బాధ్యత అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివిధ రాష్ట్రాల్లో పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న సెల్స్, విభాగాల మధ్య సమన్వయం చేయడం విష్ణువర్ధన్ రెడ్డి ప్రధాన బాధ్యతగా ఉండనుంది. ఆయా విభాగాల కార్యకలాపాలను పార్టీ జాతీయ నాయకత్వంతో అనుసంధానం చేయడంతో పాటు, పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు. దీంతో ఇప్పటివరకు ఏపీ రాజకీయాలకే పరిమితమైన ఆయన రాజకీయ బాధ్యతలు జాతీయ స్థాయికి విస్తరించనున్నాయి. విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే బీజేపీ వక్తగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గుర్తింపు పొందారు. పార్టీ విధానాలను మీడియా వేదికలపై బలంగా వినిపించడం, రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు సమాధానం ఇవ్వడం, సమకాలీన అంశాలపై బీజేపీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన వాగ్దాటి, రాజకీయ అంశాలపై అవగాహనకు తోడు సంస్థాగత అనుభవం కూడా ఉండటంతో తాజాగా జాతీయ స్థాయిలో సమన్వయ బాధ్యత అప్పగించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నేతలకు ప్రాధాన్యత లభించింది. దగ్గుబాటి పురందేశ్వరికి జాతీయ ఉపాధ్యక్షురాలిగా, రాంమాధవ్కు జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు దక్కగా, విష్ణువర్ధన్ రెడ్డికి కీలకమైన సమన్వయ బాధ్యత లభించింది. ఒకే జాతీయ కార్యవర్గంలో ఏపీకి చెందిన నేతలకు కీలక బాధ్యతలు దక్కడంతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. సీనియర్ నేతలతో పాటు యువ నాయకత్వానికి జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడంలో భాగంగానే విష్ణువర్ధన్ రెడ్డి నియామకాన్ని రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. యువతతో అనుసంధానం, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం వంటి అంశాల్లో ఆయనకు

బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఇవాళ కీలక మార్పులు జరిగాయి. ఊహించని విధంగా పలువురు నేతలకు ఇందులో స్ధానం దక్కింది. మరికొందరిపై వేటు పడింది. స్మృతీ ఇరానీ తిరిగి రావడం, రాం మాధవ్ కూ, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు కీలక బాధ్యతలు దక్కడం జరిగాయి. అలాగే ఐటీ సెల్ ఛీఫ్ అమిత్ మాలవీయపై వేటు పడింది. ఇలా చాలా మార్పులే జరిగాయి. వీటి అనంతరం ఇక మిగిలింది కేంద్ర కేబినెట్ ప్రక్షాళన (Cabinet reshuffle). ఇప్పటికే ఈ దిశగా పలు అడుగులు పడినా పార్లమెంట్ సమావేశాల కారణంగా ముందడుగు పడలేదు. దీంతో త్వరలో కేబినెట్ మార్పులు, చేర్పులకు ప్రధాని మోడీ సిద్దమవుతున్నారు.Dimagi Naxal Party: మోడీ వ్యాఖ్యలతో మరో కొత్త పార్టీ- లక్షల ఫాలోయర్లు..!ప్రధాని మోదీ తన మూడవ విడత ప్రభుత్వంలో త్వరలోనే జరగబోయే కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పార్టీ సంస్థాగత మార్పుల ప్రక్రియ ముగియడంతో ప్రభుత్వంలోనూ మార్పులు తథ్యమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జరిగిన పలు రాజకీయ పరిణామాలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ బాధ్యతలను వదులుకోవడంతో ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు అప్పగించారు. రాజ్యసభ పదవీకాలం ముగియడంతో రవ్నీత్ సింగ్ బిట్టు, జార్జ్ కురియన్ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు, పలువురు కేంద్ర సహాయ మంత్రులకు పార్టీ సంస్థాగత బాధ్యతలు ఇవ్వడం కూడా క్యాబినెట్ మార్పుల సంకేతాలను స్పష్టం చేస్తోంది. కాక్రోచ్ దెబ్బకు బీజేపీలో రెండో వికెట్..! కొత్త టీమ్ లో కీలక నేతపై వేటు..!కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అతి త్వరలోనే జరుగుతుందని ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన ఆర్పీఐ (ఎ) చీఫ్ రామ్దాస్ అథవాలే వెల్లడించారు. ఈ మార్పుల్లో ఎన్డీయే మిత్రపక్షాలకు, ముఖ్యంగా ఎన్సీపీకి కూడా చోటు దక్కే అవకాశం ఉందని ఆయన తెలిపారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే

బీజేపీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ టీం ను ఎట్టకేలకు ప్రకటించారు. ఏపీకి ప్రాధాన్యత పెరిగింది. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. పురందేశ్వరికి ఊహించని పదవి దక్కింది. ఏపీ నేతలకు జాతీయ కమిటీలో కీలక పదవులు కేటాయించారు. అదే సమయంలో తెలంగాణకు ప్రాధాన్యత దక్కలేదు. ఇక.. కొందరు కేంద్ర మంత్రులకు పార్టీ పదవుల ద్వారా కొత్త సంకేతాలు ఇచ్చారు.బీజేపీ జాతీయ కమిటీని ప్రకటించారు. మొత్తం 13 మంది జాతీయ ఉపాధ్యక్షులను ఎంపిక చేసారు. వారిలో ఏపీ నుంచి పురందేశ్వరి, రాం మాధవ్ కు సైతం పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలు కేటాయించారు. వీరిద్దరితో పాటుగా వసుంధర రాజే సైతం ఉపాధ్యక్షురాలిగా ఉండనున్నారు. ఇక, ఏపికి చెందిన విష్ణు వర్ధన్ రెడ్డిని పార్టీ జాయింట్ కో ఆర్డినేటర్ గా నియమించారు. మాజీ మంత్రి స్మృతి ఇరానీ కి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొత్త బాధ్యతలు అప్పగించారు.నా రాజీనామా నిర్ణయానికి కట్టుబడి ఉన్నా, వెనక్కి తీసుకోను: తేల్చి చెప్పిన బీజేపీ అధికార ప్రతినిధికాగా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను పార్టీ కోశాధికారిగా నియమించారు. దీని ద్వారా పీయూష్ మంత్రివర్గం లో కొనసాగటం పైన సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా.. పార్టీలో కీలకమైన కార్య నిర్వహణా కార్యదర్శిగా తిరిగి బీఎల్ సంతోష్ ను కొనసాగిస్తూ నిర్ణయించారు. కాగా, ఈ సారి జాతీయ కార్యవర్గం లో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత దక్కలేదు.బీజేపీ నుంచి ప్రస్తుతం ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ స్థానంలో అమర్ పాల్ మౌర్య న నియమించారు. బీజేపీ కార్యాలయ ఇంఛార్జ్ గా తరుణ్ చుగ్ కు బాధ్యతలు కేటాయించారు. ఇక.. సంస్థాగత జాయింట్ జనరల్ సెక్రటరీగా శివప్రకాష్ నియమితులయ్యారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటు దక్కకపోవటం పైన చర్చ జరుగుతోంది. తెలంగాణలో వచ్చే ఎన్నికలను పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది.మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ ప్రభుత్వంలో కీలక

గతంలో ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన బొద్దింకల వ్యాఖ్యల తర్వాత ఆన్ లైన్ లో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. అంతే కాదు రోజుల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో ఫాలోయర్లను సంపాదించుకుంది. దీన్ని ముందుగా లైట్ తీసుకున్న కేంద్రం.. ఆ తర్వాత దాని అకౌంట్లను బ్లాక్ చేయిస్తూ పోయింది. చివరికి జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా పెట్టి.. పార్లమెంట్ మార్చ్ కు పిలుపునిచ్చిన యువత.. నీట్ అక్రమాలకు బాధ్యతగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించింది. ఇది చరిత్ర. తాజాగా ప్రధాని మోడీ చేసిన ఓ విమర్శ మరో పార్టీకి ప్రాణం పోసింది. అదే దిమాగీ నక్సల్ పార్టీ (dimagi naxal party).NALSAR-CJI Row: హైదరాబాద్ నల్సార్ విద్యార్థులపై సీజేఐ కీలక ఆదేశాలు..! నిరసనలపై..!ప్రధాని మోడీ ఈసారి ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో దిమాగీ నక్సల్స్ అనే పదం వాడారు. దీని అర్దం మేథావులైన నక్సల్స్. గతంలో దేశానికి సమస్యగా మారిన నక్సల్స్ ను ఏరిపారేశామని, ఇప్పుడు దిమాగీ నక్సల్స్ సమస్యగా మారిందంటూ ఈ మధ్య కాలంలో బీజేపీని, కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్న మేథావుల్ని, విద్యార్దుల్ని, విపక్షాల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే సత్తా చాటుకున్న కాక్రోచ్ జనతా పార్టీతో పాటు విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. దీంతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వివరణ కూడా ఇచ్చుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీని నడపబోతున్న ఆ 12 మంది ఎవరు ? రాజకీయం అంటని జెన్ జీ ప్రతినిధులు..!ఈ నేపథ్యంలోనే గతంలో కాక్రోచ్ జనతా పార్టీ తరహాలోనే ఇప్పుడు దిమాగీ నక్సల్ పార్టీ, దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ పేరుతో కొత్త కౌత్త అకౌంట్లు పుట్టుకొచ్చాయి. ఎక్స్, ఇన్ స్టాతో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఇవి ఇప్పుడు దర్శనమిస్తున్నాయి

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Alluri Sitaramaraju International Airport: భోగాపురంలో ప్రారంభించిన కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్కు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుపేరు పెట్టారు. ఉత్తరాంధ్రకు గేట్ వేగా విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిలిచిందని ఆప్రాంత వాసులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న భోగాపురం ఎయిర్ పోర్ట్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జీఎంఆర్ ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్ పోర్ట్.. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను నిర్మించిన జీఎంఆర్ సంస్థ భోగాపురం ఎయిర్పోర్ట్ను నిర్మించింది. ఆదివారం రాత్రి 10.45 నిమిషాలకు విశాఖ నుంచి ఢిల్లీ విమానం బయలు దేరింది. ఆ తర్వాత విశాఖలో వాణిజ్యపరమైన సేవలు నిలిచిపోయాయి. విశాఖ నుంచి చిట్టచివరి సర్వీసుగా నిలిచిపోయింది. విశాఖ విమానాశ్రయంలో పనిచేస్తున్న వెయ్యి మంది సిబ్బంది సేవలను ఎక్కడ యూజ్ చేసుకుంటారనేది చూడాలి. ఆదివారం అర్ధరాత్రి నుంచి భోగాపురం నుంచి స్కూట్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానం రాత్రి ఇక్కడ నుంచి సింగపూర్కు పయనమైంది. దీంతో అధికారిక సేవలు ప్రారంభమయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాలకు రెగ్యులర్ సర్వీసులు.. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ, ముంబై,కోల్కతా, హైదరాబాద్, చెన్నై,బెంగళూరు నగరాలకు రెగ్యులర్ సర్వీసులు ఉండనున్నాయి. ఇప్పటికే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో లాంటి దేశీయ విమానాయన సర్వీసులతో పాటు ఎయిర్ ఇండియా, స్కూట్ ఎయిర్ లైన్స్ సింగపూర్కు, ఇండియా విమానాల నుంచి అబుదాబి, దుబాయ్లకు విమాన సర్వీసులు నడపనున్నారు. హైదరాబాద్ నుంచి భోగాపురం విమానాశ్రయానికి తొలి విమానం

స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోటకు వెళ్లే ముందు ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసంలో మూగజీవాలకు ఆహారం తినిపిస్తున్న ఒక అందమైన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోటకు వెళ్లే ముందు ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసంలో మూగజీవాలకు ఆహారం తినిపిస్తున్న ఒక అందమైన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. "నా స్నేహితులకు ప్రతిరోజూ ఆహారం పెట్టడం నా దైనందిన దినచర్య" అని ఆయన పేర్కొన్నారు
.webp)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను నిత్యం సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటారు. తాజాగా ఆయన తన అధికారిక నివాసంలో ఉదయం వేళ మూగజీవులతో గడిపిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఢిల్లీలోని 7 లోక్ కల్యాణ్ మార్గ్ ప్రాంగణంలో ప్రధాని మోదీ తన ఉదయపు నడక సందర్భంగా ప్రకృతి ఒడిలో సమయాన్ని గడిపారు. ఈ క్రమంలో అక్కడి పక్షులకు, పశువులకు స్వయంగా ఆహారాన్ని అందించే దృశ్యాలు నెటిజన్ల మనసులను గెలుచుకుంటున్నాయి. ముఖ్యంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఎర్రకోటకు బయలుదేరేందుకు ప్రధాని సాధారణ సమయం కంటే కాస్త త్వరగా సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని గ్రహించినట్లుగా ఆ జీవులు ముందుగానే వచ్చి ఆయనను కలిశాయని మోదీ వివరించారు. ఈ దృశ్యాలలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రాముఖ్యత కలిగిన పుంగనూరు (చిత్తూరు) సూక్ష్మ జాతి ఆవులే కావడం గమనార్హం. ప్రపంచంలోనే అతిచిన్న పశువులలో ఒకటిగా పేరుగాంచిన ఈ అరుదైన నాటు జాతి పశువులను మోదీ ఎంతగానో ప్రేమిస్తారు. కేవలం 70 నుంచి 90 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉండే ఈ చిత్తూరు ఆవులు పిఎంఓ ప్రాంగణంలో సందడి చేస్తూ కనిపించాయి. వాటిని ప్రధాని ప్రేమగా నిమురుతూ, గింజలు మరియు దానా అందిస్తూ గడిపిన క్షణాలు అత్యంత సుందరంగా నిలిచాయి. ప్రకృతి సంరక్షణ, దేశీయ పశుసంపద కాపాడటంపై ఉన్న ఆసక్తిని ఈ దృశ్యాలు మరొకసారి స్పష్టం చేస్తున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. అరుదైన దేశీయ పశు జాతులను ప్రోత్సహించడంలో ప్రధాని మోదీ తీసుకుంటున్న ఈ తరహా చర్యలు అభినందనీయమని నెటిజన్లు కొనియాడుతున్నారు. అలాగే ఉదయం పూట ఆ ప్రాంగణంలో స్వేచ్ఛగా విహరించే నెమళ్లతో కూడా ప్రధాని మోదీ సమయం గడిపారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకోవడంతో కొద్ది నిమిషాల్లోనే లక్షలాది లైకులు, వీక్షణలతో ట్రెండింగ్గా మారింది. ఈ రకమైన సంఘటనలు రాజకీయ ఒత్తిళ్ల మధ్య కూడా జీవరాశుల పట్ల మానవత్వాన్ని

జెన్ జీ స్టైల్లో ప్రధాని మోదీ పూర్తిగా సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టారు. ఇటీవల ఆయన చేస్తున్న ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఇందుకు నిదర్శనం. తాజాగా సోషల్ మీడియా స్టార్లు తమ డైలీ రొటీన్ ను పోస్ట్ చేసినట్లు మోదీ కూడా తన దినచర్యలో కీలక ఘట్టాన్ని మనముందుకు తీసుకువచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి కొద్ది నిమిషాల ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక నివాసంలో అత్యంత ఆత్మీయమైన క్షణాలను గడిపారు.7 లోక్ కల్యాణ్ మార్గ్లోని తన నివాస ప్రాంగణంలో రోజూవారీ దినచర్యలో భాగంగా నెమళ్లు, ఆవులకు ఆహారం తినిపిస్తున్న అరుదైన దృశ్యాలను ఆయన సామాజిక మాధ్యమ వేదికగా పంచుకున్నారు. దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న 80వ స్వాతంత్య్ర వేడుకల వేళ ఈ భావోద్వేగపూరిత వీడియో నెటిజన్ల మనసులను అమితంగా ఆకట్టుకుంటోంది.రాజ్యతంత్రంలో రాచఠీవి.. మన నెమళ్లు ఇక ఐక్యరాజ్యసమితిలో ముందే గుర్తుపట్టి ఆత్మీయంగా వీడ్కోలు పలికిన మూగజీవాలు!తన నివాసంలోని మూగజీవాలు తన కుటుంబ సభ్యులతో సమానమని ప్రధాని మోదీ తరచూ చెబుతుంటారు. ప్రతిరోజూ ఉదయాన్నే వాటికి దాణా అందించడం ఆయన నిత్యకృత్యం. అయితే, స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో ఎప్పటికంటే ముందే ఆయన ఎర్రకోటకు బయలుదేరాల్సి వచ్చింది. ఈ మార్పును గ్రహించినట్లుగా ఆవులు, అందమైన నెమళ్లు ఆయన కంటే ముందే దగ్గరకు వచ్చి వీడ్కోలు పలికాయని మోదీ పేర్కొన్నారు. నా మిత్రులకు ఆహారం అందించడం రోజూ చేసేదే.. కానీ నిన్న ఉదయం నేను తొందరగా వెళ్తున్నానని గ్రహించి అవి నన్ను కలిసేందుకు వచ్చాయి అంటూ ఆయన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు.రీల్స్పై మోదీ తీవ్ర వ్యాఖ్యలు! యూత్ కు సీరియస్ మెసేజ్ప్రత్యేక ఆకర్షణగా పుంగనూరు జాతి ఆవులు!పీఎం నివాసంలో కనిపిస్తున్న పశువులలో ఆంధ్రప్రదేశ్ ప్రాచీన, అరుదైన రకానికి చెందిన పుంగనూరు జాతి ఆవులు కూడా ఉండటం గమనార్హం. వీటితో పాటు అందమైన నెమళ్లకు ఆయన సొంత చేతులతో ధాన్యాన్ని, దానాను

ఇంటర్నెట్డెస్క్: ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ (PM Modi) యువత లక్ష్యంగా పలు కార్యక్రమాలను ప్రకటించారు. కోటి మంది యువతకు ఏఐ (AI) నైపుణ్యాలలో శిక్షణ ఇస్తామని, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందిస్తామన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే.. ఉచిత కోచింగ్ కార్యక్రమ లక్ష్యమని చెప్పారు. అలాగే ప్రస్తుతం దేశంలో జరుగుతోన్న జనగణన గురించి ప్రస్తావించారు. దానిలో చురుగ్గా పాల్గొనాలని మోదీ పిలుపునిచ్చారు. ‘‘నేను అందరినీ ఒక ఫేవర్ చేయాలని అడుగుతున్నాను. ఒక గంటా, రెండు గంటల సమయం కేటాయించండి. అది దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ మాత్రం సమయం దేశాన్ని ఎలా బలోపేతం చేస్తుందా..? అని యువత ఆలోచిస్తూ ఉండొచ్చు. వారి భాగస్వామ్యంతో ప్రతి ఇంట్లో జనాభా గణనకు ఒక అనుకూల వాతావరణం ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. గణన అంటే లెక్కలన్నీ ఒక దగ్గర రాసుకోవడం కాదు. జనాభా లెక్కల సమయంలో ప్రజలు ఇచ్చే వివరాల ఆధారంగానే జాతీయ విధానాలు, పథకాలు రూపుదిద్దుకుంటాయి. దేశ ప్రగతికి ఆ లెక్కలు సూచీగా ఉంటాయి. అందుకే కచ్చితమైన, స్పష్టమైన సమాచారం ఇవ్వడం అత్యంత కీలకం’’ అని మోదీ పేర్కొన్నారు. అలాగే ‘దిమాగీ నక్సల్స్’ గురించి మాట్లాడుతూ.. వారిని దేశానికి కొత్త శత్రువులుగా అభివర్ణించారు. ‘‘సంవత్సరాలుగా మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు దేశంలో బలంగా పాతుకుపోయారు. అడవుల్లోని సాయుధ నక్సల్స్ను నిర్మూలించి, ఆ సంక్షోభం నుంచి దేశాన్ని విముక్తి చేయడంలో ప్రభుత్వం విజయం సాధించింది. సాయుధ నక్సల్స్ కనుమరుగైనా.. ‘దిమాగీ నక్సల్స్’ మిగిలి ఉన్నారు. వారు ఒక అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. సమాజాన్ని తప్పుడు మార్గంలోకి లాగడానికి వారు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. మనం వారిని గుర్తించి..ఒంటరివాళ్లని చేయాలి’’ అని సూచించారు. తయారీ, వ్యవసాయం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, రక్షణ రంగం, గ్రీన్ అండ్ బ్లూ ఎకానమీ, ఇండియాస్ సాఫ్ట్ పవర్ కోసం ‘సప్తధార’ రోడ్మ్యాప్ను మోదీ ప్రకటించారు (Independence

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రసంగిస్తూ.. ‘‘వైబ్రంట్ సివిల్ డిఫెన్స్ నెట్వర్క్’’తో పాటు ‘‘భారీ, ఆధునిక పౌర రక్షణ స్వచ్ఛంద సేవకుల దళాన్ని’’ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆధునిక భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు పౌరులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 2025 మేలో ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్థాన్తో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో సివిల్ డిఫెన్స్ స్వచ్ఛంద సేవకులను రంగంలోకి దింపి దేశవ్యాప్తంగా కృత్రిమ విన్యాసాలు నిర్వహించారు. అసలు ఈ దళం అంటే ఏమిటి? జాతీయ భద్రత కోసం పౌర స్వచ్ఛంద సేవకుల దళాన్ని భారత్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారా? ఈ ప్రతిపాదిత దళం భారత్లో తొలి పౌర స్వచ్ఛంద సంస్థ కాదు. వాస్తవానికి 1968 సివిల్ డిఫెన్స్ చట్టం కింద భారత్లో ఇప్పటికే చట్టబద్ధమైన సివిల్ డిఫెన్స్ దళం ఉంది. సివిల్ డిఫెన్స్ దళాల ఏర్పాటు, శిక్షణ లేదా సివిల్ డిఫెన్స్ విధులకు పిలిచే పౌర స్వచ్ఛంద సేవకుల నియామకానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. 1968 సివిల్ డిఫెన్స్ నిబంధనల్లో ప్రజలను తరలించడం, కీలక మౌలిక వసతులకు రక్షణ కల్పించడం, అగ్నిప్రమాదాల నివారణ, ప్రజలకు అవగాహన కల్పించడం, శత్రు దాడుల నుంచి రక్షణకు ముందస్తు జాగ్రత్తలు వంటి చర్యలు ఉన్నాయి. అందువల్ల సివిల్ డిఫెన్స్ అంటే యుద్ధ సమయంలో పోరాటానికి మాత్రమే పరిమితం కాదు. అత్యవసర పరిస్థితుల్లో పౌరులు, కీలక సేవలను రక్షించడం దీని ప్రధాన ఉద్దేశం. స్వచ్ఛంద సేవకులు ఏం చేయవచ్చు? సాంప్రదాయ సివిల్ డిఫెన్స్ విధుల్లో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో సహాయపడటం, కీలక సేవలకు రక్షణ కల్పించడం, అగ్నిప్రమాదాలను ఎదుర్కోవడం, అత్యవసర సూచనలను ప్రజలకు చేరవేయడం ఉన్నాయి. ఆధునికీకరించిన వ్యవస్థలో ప్రథమ చికిత్స, గాలింపు, రక్షణ చర్యలు, అత్యవసర సమాచార వ్యవస్థలు, ప్రజల తరలింపు నిర్వహణ, ఆశ్రయ కేంద్రాల నిర్వహణ, విపత్తుల సమయంలో సహాయక చర్యలు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Minister Anam Ramanarayana Reddy Ill Health: ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ ఘటన తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జరిగింది. జెండా ఆవిష్కరించిన తరువాత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రసంగిస్తుండగా స్టేజీ పైన ఒక్కసారి కుప్పకూలిపోయారు. దీంతో ఉలిక్కిపడ్డ ఆనం భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో పెద్ద గండం తప్పింది. దీంతో వారు అక్కడే ఉన్న వైద్యసిబ్బంది ఆనంకు ప్రాథమిక చికిత్స అందించారు. ఇక మంత్రి ఆనంను పరీక్షించిన వైద్యులు ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. గంటకు పైగా నిలబడి ప్రసంగించడంతో అస్వస్థత నెలకుందని చెప్పుకొచ్చారు. కొంత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఆనం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆ రోజు ఆయన పాల్గొనాల్సిన కార్యక్రమాలు రద్దు చేయబడ్డాయి. డాక్టర్లు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. మొత్తంగా రాబోయే రోజుల్లో ఆనం పాల్గొనాల్సిన కార్యక్రమాలు రద్దు చేస్తారా లేదా కొనసాగుతాయా అనేది చూడాలి మరి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

దేశం శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంది. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ వరుసగా 13వ సారి ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేయడం విశేషం. ఈ ఏడాది వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోటలో జాతీయ గీతం ‘వందేమాతరం’ పాడారు. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జాతీయ గీతానికి నివాళిగా ఈ చారిత్రక అడుగు వేశారు. ఎన్సిసి క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు కలిసి వందేమాతరం పాడగా, ఆ తర్వాత జాతీయ గీతం జనగణమన వినిపించింది. ప్రధాని మోదీ ముందుగా రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఎర్రకోటకు చేరుకుని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర అధికారుల స్వాగతం స్వీకరించారు. గౌరవవందనం తీసుకున్న తర్వాత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వదేశీ 105 మి.మీ. ఫీల్డ్ గన్లతో 21 తుపాకుల గౌరవార్థన జరిగింది. వాయుసేన హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 79 సంవత్సరాలు పూర్తయినప్పటికీ, అధికారికంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవంగా ఈ వేడుకను జరుపుకోవడం జరిగింది. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఈ సందర్భాన్ని చారిత్రకంగా అభివర్ణించారు. దీంతో దేశ ప్రజల్లో సరికొత్త ఉత్సాహం నిండింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ప్రతి హృదయంలో వందేమాతరం ధ్వనిస్తోందని చెప్పారు. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి ఎర్రకోట నుంచి వందేమాతరం మారుమ్రోగుతోందని పేర్కొన్నారు. 150 సంవత్సరాలు పూర్తయిన జాతీయ గీతానికి దీనికంటే అనుకూలమైన రోజు మరొకటి ఉండదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. స్వాతంత్ర్య సమరయోధులకు, మహాత్మా గాంధీకి ఆయన నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా చిన్న కలలతో ఇకపై సరిపోదని, పెద్ద కలలు కనాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఫలితంగా

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా 13వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ చరిత్రాత్మక ఘట్టంలో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఢిల్లీ, ఆగస్టు 15: 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా 13వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ చరిత్రాత్మక ఘట్టంలో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎరుపు రంగుతో కూడిన సాంప్రదాయ రాజస్థానీ బాంధనీ తలపాగాను ధరించి ఆకట్టుకున్నారు. దీనికి జతగా తెల్లటి కుర్తా, గోధుమ రంగు కలిగిన కోట్ను ధరించారు. జేబులో జాతీయ జెండా రంగులతో కూడిన ‘పాకెట్ స్క్వేర్’ను ప్రత్యేకంగా అలంకరించుకున్నారు

PM Modi | ఇంటర్నెట్ డెస్క్: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎరుపు రంగుతో కూడిన సాంప్రదాయ రాజస్థానీ ‘‘బాంధనీ’’ (Bandhani) తలపాగాను ధరించి ఆకట్టుకున్నారు. ఈ తలపాగాకు జతగా తెల్లటి కుర్తా, చాక్లెట్ గోధుమరంగు (Chocolate Brown) వెస్ట్కోట్ జాకెట్ ధరించారు. దేశభక్తిని చాటేలా జేబులో జాతీయ జెండా రంగులైన కాషాయం, తెలుపు, ఆకుపచ్చతో కూడిన ‘‘పాకెట్ స్క్వేర్’’ను ప్రత్యేకంగా అలంకరించుకున్నారు. దిల్లీలోని ఎర్రకోటపై మోదీ వరుసగా 13వ సారి జాతీయ జెండా ఎగురవేశారు. రాజస్థాన్, గుజరాత్లో బాంధనీ వస్త్ర కళకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చిన్న చిన్న వస్త్రాలను దారంతో కట్టి (టై-అండ్-డై) రంగులు అద్దే విధానంలో ఈ డిజైన్లు రూపొందుతాయి. ఆ దారాలు తొలగించిన తర్వాత వస్త్రంపై చుక్కలు, ఆకృతులు కనిపిస్తాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోదీ ధరించే తలపాగాలు ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 2025లో ఆయన కాషాయ తలపాగా, తెల్లటి కుర్తాతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్లో ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని యువతను భవిష్యత్ ఉద్యోగాలకు సిద్ధం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాదిలో కోటి మంది యువతకు AI స్కిల్స్లో శిక్షణ అందించేలా దేశవ్యాప్త కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ శిక్షణ ద్వారా యువతకు కొత్త టెక్నాలజీపై అవగాహన పెరగడంతో పాటు భవిష్యత్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉపయోగపడే నైపుణ్యాలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా ప్రధాని కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించే కార్యక్రమాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లే స్థోమత లేని విద్యార్థులకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంటి నుంచే శిక్షణ పొందేందుకు ఈ విధానం దోహదపడవచ్చు. దేశంలో క్రీడా ప్రతిభను చిన్న వయసులోనే గుర్తించేందుకు ప్రత్యేక కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టనున్నట్లు ప్రధాని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో క్రీడా ప్రతిభను గుర్తించి, వారికి సరైన శిక్షణ అందించే దిశగా చర్యలు చేపట్టనున్నారు. చిన్న వయసులోనే ప్రతిభను గుర్తించి అవసరమైన అవకాశాలు కల్పిస్తే భవిష్యత్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను తయారు చేయవచ్చనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను అమలు చేయనున్నారు. టెక్నాలజీ రంగంలో భారత్ను మరింత బలోపేతం చేయడంలో భాగంగా సెమీకండక్టర్ తయారీపై కూడా ప్రధాని దృష్టి సారించారు. వచ్చే ఒకటి నుంచి రెండేళ్లలో దేశవ్యాప్తంగా సుమారు 7 నుంచి 8 కొత్త సెమీకండక్టర్ తయారీ కేంద్రాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధి చెందితే ఎలక్ట్రానిక్స్, మొబైల్, ఆటోమొబైల్, టెలికాం వంటి అనేక

దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దేశ చరిత్రలో తొలిసారి ఎర్రకోటపై అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఢిల్లీ, ఆగస్టు 15: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. ఇదే సమయంలో వందేమాతరం గేయాన్ని ఆలపించారు. దేశ చరిత్రలో ఎర్రకోటపై వందేమాతరం గేయాన్ని (Vande Mataram) పూర్తిగా ఆలపించడం ఇదే ప్రథమం. అనంతరం జాతీయ గీతం ‘జన గణ మన’ను ఆలపించారు. ఆ సమయంలో భారత వాయుసేన చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. ఒక హెలికాప్టర్ జాతీయ జెండాను.. మరొకటి ‘వందేమాతరం’ అని రాసి ఉన్న పతకాన్ని తీసుకెళ్లి.. ఆకాశంలో కనువిందు చేశాయి. ‘వందేమాతరం’ గేయానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా గతేడాది నవంబర్ 7 నుంచి ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతోన్నాయి. ఈ క్రమంలోనే జాతీయ గీతం ‘జన గణ మన’తో పాటు వందేమాతరానికి కేంద్ర ప్రభుత్వం సమాన హోదా కల్పిస్తూ చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం.. ‘వందేమాతరం’ని అవమానించినా, ఆలపిస్తున్న సమయంలో ఆటంకం కలిగించినా చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. 'వందేమాతరం' గేయాన్ని మొదటిసారిగా 1896లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు. ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోంది: ప్రధాని మోదీ ఇండోనేషియాలో భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

Independence Day| దిల్లీ: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజధాని దిల్లీలో ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఈ వేడుకల్లో ఆలపించారు. జెండా ఎగురవేయడానికి ముందు ప్రధాని మోదీ రాజ్ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోట వద్ద గౌరవవందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలు ప్రారంభమైన సమయంలో వాయుసేన పూలవర్షం కురిపించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున మోదీ జెండా ఎగురవేయడం ఇది 13వసారి కావడం విశేషం. జెండా ఎగురవేసిన అనంతరం ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ఈ రోజు మనమంతా 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. ప్రతి హృదయంలో 'వందేమాతరం' ధ్వనిస్తోంది. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. కొత్త తీర్మానాలతో సరికొత్త ఉత్సాహంతో దేశం ముందుకు సాగుతోంది. గతంలో ఐదు బలహీన దేశాల జాబితాలో ఉన్న భారత్.. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థగా మారింది’’ అని మోదీ అన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

80వ స్వాతంత్య్ర వేడుకలకు దేశం సిద్ధమైంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. 80వ స్వాతంత్య్ర వేడుకలకు దేశం సిద్ధమైంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. అయితే ఈ సారి వేడుకల్లో ఓ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్ర్కుతమైంది. ఎర్రకోట వేదికగా స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు

దేశంలోని ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 80వ భారత స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో శనివారం ఉదయం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశంలోని ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 80వ భారత స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో శనివారం ఉదయం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందన్నారు. ఎందరో వీరుల బలిదానాల ఫలితమే స్వాతంత్ర్యం అని వివరించారు. తొలిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతరం గీతాన్ని ఆలపించామని అన్నారు. దేశం కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్-2047 లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా ఎదుగుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. సంకల్పం దృఢంగా ఉంటే కఠిన సవాళ్లను సునాయాసంగా ఎదుర్కోవచ్చునని ప్రధాని మోదీ తెలిపారు. సంకల్పం, కలలు ఉన్నతంగా ఉంటే.. సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. ఇవాళ ప్రపంచమంతా భారత్వైపు చూస్తోందన్నారు. శౌచాలయాలు 4 రెట్ల వేగంతో నిర్మించామని గుర్తు చేశారు. పేదలకు ఇళ్లు 3 రెట్ల వేగంతో నిర్మించామని తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా మెట్రోరైళ్ల సదుపాయాలు పెంచామని వివరించారు. ఆత్మనిర్భర భారత్ సాధనే మన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆత్మ విశ్వాసం పెంచుకోవడంతోపాటు స్వయం సమృద్ధి సాధించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్ నినాదంతో ముందుకెళ్తున్నామని అన్నారు. పలు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల వల్ల ప్రభావితమైన కుటుంబాలకు యావత్ దేశం అండగా నిలుస్తుందని అన్నారు. డిజిటల్ ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వస్తువుల్లో చిప్ ప్రాముఖ్యత పెరిగిందని వివరించారు. సెమీకండక్టర్ల రంగంలో స్వావలంబన దిశగా కీలక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మూడు ప్రధాన సెమీకండక్టర్ ప్లాంట్లు కార్యకలాపాలు చేపట్టాయని గుర్తు చేశారు. ఏడెనిమిదేళ్లలో దాదాపు 8 సెమీకండక్టర్ ప్లాంట్లు ప్రారంభమయ్యే అవకాశం

Independence Day Celebrations Red Fort : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఉదయం ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వేదికగా ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎర్రకోటపై 13వ సారి వరుసగా ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగుర వేశారు. ఇదిలాఉంటే.. దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఈ వేడుకల్లో ఆలపించారు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Independence Day 2026: వరుసగా 13 సార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని మోదీ ఆవిష్కరిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర భద్రత బలగాలు, పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తొలిసారి ఎర్రకోట వేడుకల్లో వందేమాతరం గేయం.. ఈ ఏడాది ఎర్రకోటలో జరగబోయే స్వాతంత్ర్య వేడుకల్లో రెండు ప్రత్యేక అంశాలు ఉన్నాయి. మొదటిది వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎర్రకోటపై తొలిసారిగా ఆ జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. రెండవ ప్రధాన అంశం యువ శక్తి – వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో యువత ఆశలు, ఆకాంక్షలు, దేశ నిర్మాణంలో వారి పాత్రను హైలైట్ చేసే విధంగా వేడుకలను రూపొందించారు. జ్ఞాన్పథ్పై దాదాపు 2,500 మంది ఎన్సీసీ క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు వందే మాతరం ఆకారంలో నిలబడతారు. వీరిలో ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్కు చెందిన బాలురు, బాలికలు ఉన్నారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం గీతాన్ని ఆలపించడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకూ మన జాతీయ గీతమైన జనగణమణను ఆలపిస్తుండగా.. దీని స్ధానంలో ఈసారి వందేమాతర గీతాన్ని ఆలపించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత శక్తి అందించే తోడ్పాటు ఈ కార్యక్రమం యొక్క ఇతివృత్తంగా ఉంటుందని కూడా కేంద్రం వెల్లడించింది. అయితే

ఎర్రకోట వద్ద పటిష్ఠ భధ్రత.. వందేమాతరం గీతాలాపన తర్వాత సభా ప్రాంగణంలో వాయు సేన విమానాలతో పూల వర్షం.. పంద్రాగస్టు వేడుకలు హాజరైన కేంద్ర మంత్రులు, విద్యార్ధులు, వివిధ రంగల ప్రముఖులు.. అలరిస్తున్న విద్యార్ధులు, సైనిక దళాల కవాతు.. దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోటలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జెండా వందనం ముందు వందేమాతరం గీతాలాపన..మరికాసేట్లో ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండాను ఎగరేయనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఢిల్లీ ఎర్రకోటలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎర్రకోటకు వెళ్లేముందు రాజ్ ఘాట్ను సందర్శించిన ప్రధాని మోడీ.. కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Independence Day 2026 Live Updates: దేశ వ్యాప్తంగా ప్రజలు 80వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. 1947లో బ్రిటిష్ పాలనకు విముక్తిగా ప్రతి యేడాది ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు భారత ప్రధాన మంత్రి ఎర్రకోటపై మువ్వెన్నల జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్నారు. ఇక భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ వరుసగా 13వ సారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం వేళ భారత ప్రధాని ఎర్రకోట నుంచి ఎలాంటి సందేశం ఇస్తారనేది దేశ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. దేశ ప్రజలకు నరేంద్ర మోడీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు తన సందేశాన్ని ఇచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతినుద్దేశించి దేశ ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశాన్ని నక్సల్స్ రహితంగా

80 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతిని ఉద్దేశించి శుక్రవారం రాత్రి ప్రసంగించారు. అయితే రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. స్వాతంత్య్ర దినోత్సవం వేళ రాష్ట్రపతి వ్యాఖ్యలు స్ఫూర్తిని కలిగిస్తున్నాయని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ఆలోచనలు దేశ బలానికి, ప్రతి భారతీయుడి ఆకాంక్షలకు నిదర్శనమని ఆయన కొనియాడారు. రాష్ట్రపతి ప్రసంగం దేశ సుస్థిరతను ప్రతిబింబిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వికసిత్ భారత్ కు ప్రతి భారతీయుడు కట్టుబడి ఉన్నాడన్న సంకేతాన్ని రాష్ట్రపతి ఇచ్చారని కొనియాడారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఇందుకు సంబంధించిన అంశాలను పోస్టు చేశారు. "80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ రాష్ట్రపతి చాలా స్ఫూర్తిదాయకమైన, ఆలోచింపజేసే ప్రసంగం చేశారు. రాష్ట్రపతి ఆలోచనలు భారత దేశ శక్తిని, ప్రతి భారతీయుడి ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నాయి. 2047 వికసిత్ భారత్ నిర్మాణం కోసం పునరంకిత భావంతో పనిచేయడానికి ఆమె సందేశం ప్రతి భారతీయుడికీ స్ఫూర్తిని కలిగిస్తోంది" అని ప్రధాని మోదీ తన పోస్టులో తెలిపారు. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం మహిళలు, యువత, పేదలు, రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. గత పదేళ్లలో 25 కోట్లకు పైగా ప్రజలను పేదరికం నుంచి బయటపడేశామని తెలిపారు. అలాగే పేపర్ లీక్ ఘటనలపైనా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. పరీక్ష వ్యవస్థలో అవకతవకలను అరికట్టి, పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని యువతకు భరోసా కల్పించారు. దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపు వారేనని.. వారి శక్తితో స్టార్టప్ వ్యవస్థ దేశ స్వర్ణ భవిష్యత్తుకు బాటలు వేస్తోందని రాష్ట్రపతి స్పష్టం చేశారు. అంతేకాక పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నూ ప్రస్తావించారు. ఉగ్రమూకలు, వారికి సాయం చేసేవారు ఎక్కడ దాక్కున్నా.. వారి చర్యల ఫలితాలను అనుభవించక తప్పదనే

భారతదేశ చరిత్రలో ఆగస్టు 15వ తేదీకి ఒక ప్రత్యేకమైన భావోద్వేగ స్థానం ఉంది.బ్రిటిష్ సంకెళ్లను తెంచుకుని,స్వేచ్ఛా వాయువులు పీల్చిన ఆ మధుర క్షణాలను తనివితీరా గుర్తుచేసుకునే పర్వదినం ఇది. దేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది.ఆనాడు దేశ సార్వభౌమత్వాన్ని చాటుతూ ఎర్రకోటపై ఎగిరిన త్రివర్ణ పతాకం,నేడు కూడా కోట్లాది మంది భారతీయుల గుండెల్లో దేశభక్తిని,గర్వాన్ని రగిలిస్తోంది.ఈ మహోజ్వల సంబరాలకు ముందు రోజు,అంటే ఆగస్టు 14న దేశ విభజన నాటి దారుణాలను గుర్తుచేసుకునే విభజన భీభత్స స్మృతి దినంగా పాటిస్తాం.స్వాతంత్ర్య సంబరాల వెనుక ఎందరో అమాయక ప్రాణాల బలిదానాలు,కుటుంబాల విడిపోయిన వేదన దాగి ఉన్నాయి.ఆ చేదు జ్ఞాపకాలను స్మరిస్తూనే,సాధించుకున్న స్వేచ్ఛ విలువను కాపాడుకోవాలని ప్రతి ఒక్కరి హృదయం ఆకాంక్షిస్తుంది.1947లో మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించిన ఈ పతాకావిష్కరణ సాంప్రదాయం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతోంది.ఈ మహోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు,నవ భారత నిర్మాణంలో భాగస్వాములవుతామని ప్రతి పౌరుడు శపథం పూనే పవిత్రమైన సమయం.భరతమాత స్వేచ్ఛా ప్రస్థానం తరతరాల త్యాగాల పునాదులపై నిర్మితమైందని మనకు నిరంతరం గుర్తుచేస్తుంది.ఈ నేపథ్యంలో ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసే ప్రసంగం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.అలాగే తెలుగు రాష్ట్రాల్లో సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డిలు కూడా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి మినిట్-టు-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం

రాష్ట్రంలో రేషన్కార్డు లబ్ధిదారులకు సరికొత్త భద్రతా ఫీచర్లతో స్మార్ట్కార్డులు జారీ చేయడంపై హర్షం వ్యక్తమవుతున్నా.. ఆ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలు ఉండటంపై అభ్యంతరాలు వస్తున్నాయి. నేటి నుంచే స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ సంగారెడ్డిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్రెడ్డి రేషన్కార్డుల బియ్యంలో 90శాతం కేంద్రం ఇస్తున్నవే.. బీజేపీ ఎంపీలు రఘునందన్, అర్వింద్ డిమాండ్ హైదరాబాద్/న్యూఢిల్లీ/సంగారెడ్డి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రేషన్కార్డు లబ్ధిదారులకు సరికొత్త భద్రతా ఫీచర్లతో స్మార్ట్కార్డులు జారీ చేయడంపై హర్షం వ్యక్తమవుతున్నా.. ఆ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలు ఉండటంపై అభ్యంతరాలు వస్తున్నాయి. సుదీర్ఘకాలం ఉండే రేషన్కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలు ఉండటం ఏమిటని బీజేపీ సహా విపక్షాలు, వివిధ వర్గాల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుంచి స్మార్ట్రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనుంది. ఈ కార్డులపై సీఎం రేవంత్రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫొటోలను కూడా ముద్రించారు. ఈ క్రమంలో భవిష్యత్తులో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారినప్పుడు ఈ స్మార్ట్కార్డుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వంలో మార్పుల సంగతి వదిలేస్తే.. మంత్రులు, శాఖల మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ. అలా జరిగితే పాత రేషన్ స్మార్ట్ కార్డులను కొనసాగిస్తారా? మారుస్తారా? కొత్తకార్డులు ముద్రిస్తారా? ఒకవేళ కొనసాగించాలనుకుంటే.. కొత్తగా పదవిలోకి వచ్చిన మంత్రులు అంగీకరించగలరా? ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంటుందన్న అంశాలపై చర్చ జరుగుతోంది. ఒకవేళ కొత్త ప్రభుత్వాలు వచ్చినపుడు కార్డులు మార్చాల్సి వస్తుందని, అనవసరపు వ్యయభారమనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర పౌర సరఫరాలశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులను శనివారం నుంచి పంపిణీ చేయనున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 2.30గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం సంగారెడ్డి అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అంతకుముందు సంగారెడ్డి ఐబీ చౌరస్తాలో మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్గాంధీ విగ్రహాలను సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరిస్తారు

దేశ రాజధానిలోని చారిత్రక ఎర్రకోటపై 80వ స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 15న ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేయనున్నారు. ఢిల్లీ: దేశ రాజధానిలోని చారిత్రక ఎర్రకోటపై 80వ స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 15న ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేయనున్నారు. ఈ ఏడాది 'వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు, వికసిత్ భారత్@2047 కోసం యువశక్తి' థీమ్లతో ఎర్రకోట ముస్తాబైంది. చరిత్రలో తొలిసారిగా ఎర్రకోట స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించనున్నారు. అలాగే జాతీయ పతాకావిష్కరణ వేళ వాయుసేనకు చెందిన Mi-17 హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపించనున్నారు. జ్ఞానపథ్లో వందేమాతరం ఆకృతిలో 2,500 మంది ఎన్సీసీ క్యాడెట్లు, ‘మై భారత్’ వాలంటీర్లు కూర్చోనున్నారు. వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వివిధ రంగాలకు చెందిన దాదాపు 5 వేల మందికి అధికారులు ప్రత్యేక ఆహ్వానం పంపారు. వీఐపీ సంస్కృతికి స్వస్తి పలుకుతూ, భారతదేశంలోని ప్రముఖ సరస్సుల పేర్లతో సీటింగ్ ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశారు. మరోవైపు, పర్యాటకుల సౌకర్యార్థం ఉచిత మెట్రో ప్రయాణం, క్యూఆర్ కోడ్ ఈ-ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. వేడుకలు ముగిసిన వెంటనే ఎర్రకోట పరిసరాల్లో చెత్త తొలగింపు కోసం 'స్వచ్ఛత ప్రచారం' కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సుప్రీం కోర్టులో మరో రెండు కోర్టు హాల్స్ ప్రారంభం 60 రవాణా విమానాలు, 150 శిక్షణ విమానాలు.. భారత రక్షణ రంగం భారీ కొనుగోళ్లు