
New Delhi | 26 ఏళ్ల యువకుడిలో గర్భసంచి.. ఇన్ఫెర్టిలిటీ పరీక్షలో బయటపడ్డ అరుదైన లక్షణం
New Delhi | 26 ఏళ్ల యువకుడిలో గర్భసంచి.. ఇన్ఫెర్టిలిటీ పరీక్షలో బయటపడ్డ అరుదైన లక్షణం
© 2026 nimisham.in

New Delhi | 26 ఏళ్ల యువకుడిలో గర్భసంచి.. ఇన్ఫెర్టిలిటీ పరీక్షలో బయటపడ్డ అరుదైన లక్షణం

New Delhi | ఢిల్లీలో ఆక్సిజన్ సిలిండర్ పేలుడు.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు

New Delhi | పీజీ భవనం కూలిన ఘటనలో ఒకరి మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం..!

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. YSR Awards 2026: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ఒక కోరిక తీరకుండానే మరణించాడని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ఆయన జీవిత లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఆ కోరిక తీరలేదని చెప్పారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్సార్కు నిజమైన నివాళి అని ప్రకటించారు. దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ ఆశయాల సాధనకు తాము పనిచేస్తామని తెలిపారు. ఢిల్లీలో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026 కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. 'రైతులకు ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేసిన గొప్ప వ్యక్తి వైఎస్సార్. ఆనాడు రూ.1,300 కోట్లు విద్యుత్ బకాయిలు రద్దు చేసి.. రైతులపై కేసులు ఎత్తివేసి రైతుల గుండెల్లో వైఎస్సార్ రారాజుగా నిలిచారు' అని రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణలో సాగునీరు అందిచేందుకు ప్రాణహిత చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రారంభించిన ఘనత వైఎస్సార్ది' అని వివరించారు. ఆనాడు వైఎస్సార్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల, ఎస్ఎల్బీసీ ఆగిపోయాయని.. ఆయన ఆశయాలను నూటికి నూరు శాతం కొనసాగిస్తామని ప్రకటించారు. 'వైఎస్సార్ చివరి కోరిక ఇంకా నెరవేరలేదు. ఆయన రెండోసారి ప్రమాణస్వీకారం చేశాక ఒకే ఒక్క మాట చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఆయన జీవిత లక్ష్యం అని ఒకే ఒక్క మాట చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్సార్కు నిజమైన నివాళి. ఆయన చివరి కోరిక నెరవేర్చాలంటే రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని

కిర్గిజ్ రాజధాని బిష్కెక్లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. ఐదేళ్లు దాటుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి తక్షణమే ముగింపు పలకాలంటూ పుతిన్ ముందే భారత్ తన శాంతి వైఖరిని అత్యంత స్పష్టంగా పునరుద్ఘాటించింది. అంతులేని యుద్ధం నుంచి యుద్ధం ముగింపు వైపు అడుగులు వేయడం మానవాళి శ్రేయస్సుకు అత్యవసరమని మోదీ తేల్చిచెప్పారు. గతంలో 2022 సమర్కాండ్ ఎస్సీఓ సదస్సులో ఇది యుద్ధాల యుగం కాదని చెప్పిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. 2025 డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన వార్షిక సదస్సు తర్వాత 2026లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి భేటీ ఇదే కావడం విశేషం. గాంధీ, బుద్ధుడు నడయాడిన భారత భూమి నుంచి ఎల్లప్పుడూ శాంతి సందేశమే ప్రపంచానికి వెళ్తుందని రష్యా అధ్యక్షుడికి ప్రధాని నేరుగా వివరించారు. శాంతి వైపు వేసే ప్రతి అడుగు మానవాళిలో కొత్త ఆశను నింపుతుందని మోదీ స్పష్టం చేశారు. దీంతో ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చలకు మరియు శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లవేళలా మద్దతు ఇస్తుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి వెల్లడించారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లోని సంఘర్షణల వల్ల అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం మరియు భారతీయ నావికుల భద్రత తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భేటీలో మోదీ వ్యాఖ్యలపై స్పందించిన పుతిన్, భారత్ మరియు రష్యాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనియాడారు. ఫలితంగా 2026 మొదటి ఆరు నెలల్లో రెండు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగిందని రష్యా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రక్షణ, ఇంధనం, ఎరువులు, అంతరిక్షం మరియు వినూత్న రంగాలు సహా ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై రెండు దేశాల అధినేతలు సుదీర్ఘంగా చర్చించారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12–13

ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతోపాటు సీడబ్ల్యూసీ సభ్యులు.. కేసీ వేణుగోపాల్, పి.చిదంబరం, వీరప్ప మొయిలీ, అంబికా సోనీ, జైరామ్ రమేశ్, సచిన్ పైలట్, దామోదర రాజనర్సింహ, దిగ్విజయ సింగ్, ఎన్.రఘువీర రెడ్డి, పల్లంరాజుతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నీట్ పేపర్ లీక్తోపాటు విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహాంపై ఈ భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది. అలాగే అయోధ్య రామమందిర విరాళాల ‘చోరీ’ ఆరోపణలపై పోరాటం చేసేందుకు ఈ సమావేశంలో కార్యాచరణకు రూపకల్పన జరగనుందని సమాచారం. మరోవైపు వచ్చే ఏడాది 7 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దీర్ఘకాలికంగా అనుసరించాల్సిన వ్యూహాంపై సమీక్షించనున్నారు. ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన అంశాలపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడీ సతీశన్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు హాజరయ్యారు. నీట్ పేపర్ లీక్ అంశంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోపాటు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్త ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనకు విద్యార్థులతో ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో జులై 20వ తేదీన న్యూఢిల్లీలో ఛలో పార్లమెంట్ ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. దీంతో దేశ

ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ బ్యాటర్ కొట్టిన బంతి అంపైర్ తాకింది. అతడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్పోర్ట్స్ డెస్క్: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ బ్యాటర్ కొట్టిన బంతి అంపైర్ తాకింది. అతడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన న్యూఢిల్లీ టైగర్స్, ఈస్ట్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... న్యూఢిల్లీ టైగర్స్ ఇన్నింగ్స్లో 18వ ఓవర్లో లక్ష్య తరేజా అనే బ్యాటర్ పవర్ఫుల్ స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. ఆ బంతి కాస్త మెయిన్ అంపైర్గా ధర్మేశ్ భరద్వాజ్ చెవి భాగంలో బలంగా తాకింది. అంపైర్ అప్రమత్తమై కిందికి వంగినప్పటికీ బంతి నుంచి తప్పించుకోలేకపోయాడు. వెంటనే అంపైర్ను పరీక్షించిన ఫిజియోలు మైదానం నుంచి బయటకు పంపించారు. ప్రస్తుతం అతడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని సమాచారం. అయితే ఈ అంపైర్కు మైదానంలో బంతి తాకడం ఇదే తొలిసారి కాదు. ఇదే సీజన్ ఆరంభంలో మరో బ్యాటర్ ఆడిన స్ట్రైట్ డ్రైవ్ అతని భుజానికి బలంగా తాకింది. కానీ ఆ సమయంలో పెద్ద గాయం కాలేదు. అంపైర్ను గాయపర్చిన లక్ష్య తరేజా 25 బంతుల్లో ఫోర్తో 21 పరుగులు చేశాడు. మరోవైపు ఈ వీడియోను చూసిన నెటిజన్లు 'పాపం అంపైర్' అంటూ సానుభూతి చూపిస్తున్నారు. అంపైర్లు కూడా హెల్మెట్లు వాడాలని, టీ20 ఫార్మాట్లో తప్పనిసరి చేయాలని సూచిస్తున్నారు. డీఆర్ఎస్తో ఊహించని లైఫ్.. పడిక్కల్ను హగ్ చేసుకున్న రాహుల్! బుల్లెట్ త్రోతో అంపైర్ను భయపెట్టిన సిరాజ్.. వీడియో వైరల్

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధానిలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో చోటు చేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారానికి దారితీసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ జాతీయ గేయం వందేమాతరం ఆలాపనను ఆపాల్సిందిగా అక్కడి సిబ్బందికి చేత్తో సంజ్ఞలు చేస్తోన్నట్లు కనిపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా అదే విధమైన సైగలు చేయడం ఈ వివాదాన్ని మరింత పెంచింది.దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ ఉదయం ఖర్గే.. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా పార్టీకి చెందిన సీనియర్ నాయకులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. వందేమాతరం గేయాన్ని పూర్తిగా పాడుతుండగా సోనియా గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారని బీజేపీ ఆరోపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది.వందేమాతరం పూర్తి వెర్షన్ ఆలపిస్తున్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు అసహనానికి గురైనట్లు కనిపిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ విమర్శించారు. దేశ విభజనకు ముందు ఉన్న నాటి పాత మనస్తత్వమే కాంగ్రెస్ లో ఇప్పటికీ కొనసాగుతోందంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు దేశం పట్ల ఏ మాత్రం భక్తిభావం లేదని, విభజించి పాలించు దోరణిని కనపర్చుతోందని మండిపడ్డారు.ఎర్రకోటపై ప్రధాని మోదీ ధరించినది అసలు మన దేశ జాతీయ పతాకమే కాదు- ఆ దేశానిదిఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. ఖర్గే కోసం ఆమె ఓ కుర్చీని తీసుకుని రావాలంటూ ఆమె సిబ్బందిని కోరుతూ చేతిని ఊపారని వివరణ ఇచ్చింది. వృద్ధాప్యం కారణంగా ఖర్గే ఎక్కువ సేపు నిల్చోలేకపోయారని, ఇబ్బంది పడటాన్ని గమనించిన సోనియా గాంధీ ఆయన కూర్చోవడానికి కుర్చీని తీసుకుని రావాలంటూ అక్కడి సిబ్బందికి చేత్తో సైగలు చేశారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. దీన్ని కూడా

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం యువత, స్వయం సమృద్ధి, వికసిత్ భారత్ లక్ష్యాల చుట్టూ సాగింది. జెన్జీని ఉద్దేశించి ఏఐ శిక్షణ, ‘సప్తధార’ రోడ్మ్యాప్ను ప్రస్తావించిన ప్రధాని.. తొలిసారి ఎర్రకోట వేదికగా వందేమాతరం ఆలాపనను హైలైట్ చేశారు. యువశక్తితోనే 2047 నాటికి వికసిత్ భారత్ సాధ్యమని పిలుపునిచ్చారు. జెన్జీతో మోదీ కనెక్ట్.. వందేమాతరం హైలైట్.. ఎర్రకోటపై కొత్త సందేశం (చిత్రాలు) అఖిల్ రాజ్, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు) వెకేషన్లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు) 'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు) మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు) నా కోసం జగనన్న జైలు వరకు వచ్చాడు.. నా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్తున్నా.. లోకేష్ పని ఖతం.. Gen-Z చేతిలో మూడింది.. అమిత్ షా కాళ్లు పట్టుకున్న నో యూజ్ ఎర్రకోటపై మువ్వన్నెల జెండా.. 13వ సారి జెండా ఎగరేసిన మోదీ Watch Live: గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ

దేశంలోని ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 80వ భారత స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో శనివారం ఉదయం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశంలోని ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 80వ భారత స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో శనివారం ఉదయం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందన్నారు. ఎందరో వీరుల బలిదానాల ఫలితమే స్వాతంత్ర్యం అని వివరించారు. తొలిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతరం గీతాన్ని ఆలపించామని అన్నారు. దేశం కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్-2047 లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా ఎదుగుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. సంకల్పం దృఢంగా ఉంటే కఠిన సవాళ్లను సునాయాసంగా ఎదుర్కోవచ్చునని ప్రధాని మోదీ తెలిపారు. సంకల్పం, కలలు ఉన్నతంగా ఉంటే.. సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. ఇవాళ ప్రపంచమంతా భారత్వైపు చూస్తోందన్నారు. శౌచాలయాలు 4 రెట్ల వేగంతో నిర్మించామని గుర్తు చేశారు. పేదలకు ఇళ్లు 3 రెట్ల వేగంతో నిర్మించామని తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా మెట్రోరైళ్ల సదుపాయాలు పెంచామని వివరించారు. ఆత్మనిర్భర భారత్ సాధనే మన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆత్మ విశ్వాసం పెంచుకోవడంతోపాటు స్వయం సమృద్ధి సాధించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్ నినాదంతో ముందుకెళ్తున్నామని అన్నారు. పలు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల వల్ల ప్రభావితమైన కుటుంబాలకు యావత్ దేశం అండగా నిలుస్తుందని అన్నారు. డిజిటల్ ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వస్తువుల్లో చిప్ ప్రాముఖ్యత పెరిగిందని వివరించారు. సెమీకండక్టర్ల రంగంలో స్వావలంబన దిశగా కీలక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మూడు ప్రధాన సెమీకండక్టర్ ప్లాంట్లు కార్యకలాపాలు చేపట్టాయని గుర్తు చేశారు. ఏడెనిమిదేళ్లలో దాదాపు 8 సెమీకండక్టర్ ప్లాంట్లు ప్రారంభమయ్యే అవకాశం

రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ గొప్ప మనసును చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. అమరులైన ఆర్మీ జవాన్ల కుటుంబాలకు ఎంపీ అండగా నిలిచారు. న్యూఢిల్లీ, ఆగస్టు 13: రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ గొప్ప మనసును చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. అమరులైన ఆర్మీ జవాన్ల కుటుంబాలకు ఎంపీ అండగా నిలిచారు. ఎంపీగా తనకొచ్చిన మొదటి నెల జీతం మూడు లక్షల రూపాయలను దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులైన ఆర్మీ జవాన్ల కుటుంబాల సంక్షేమం కోసం విరాళంగా అందించారు. ఈ విరాళం చెక్కును భారత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు విజయ్ స్వయంగా అందజేశారు. దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తూ, ప్రాణత్యాగాలు చేసిన సైనికుల కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని.. అందులో భాగంగానే ఈ చిరు సాయం చేసినట్లు విజయ్ స్పష్టం చేశారు. పదవి చేపట్టిన వెంటనే తొలి వేతనాన్ని సైనికుల కుటుంబాల కోసం వెచ్చించడం పట్ల విజయ్ను పలువురు ప్రశంసిస్తున్నారు. కారులో 25.970 కేజీల గంజాయి తరలింపు.. ఇద్దరి అరెస్ట్ విజయవాడలో వెయ్యి మంది విద్యార్థులతో తిరంగా ర్యాలీ

ఏపీ, తమిళనాడులోని రెండు ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు.. తిరుపతి- అరుణాచలం (తిరువణ్ణామలై) జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టు మరింత వేగవంతం కానుంది. ఈ రహదారిని మరింత ఆధునీకరించి, ఫోర్ లేన్ గా విస్తరించడం వల్ల భక్తుల ప్రయాణ సమయం భారీగా తగ్గడంతో పాటు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే ప్రయత్నాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యులు తెర తీశారు.రోడ్డు భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచే ఈ ప్రతిపాదనపై వైఎస్ఆర్సీపీకి చెందిన తిరుపతి, కడప ఎంపీలు డాక్టర్ మద్దిల గురుమూర్తి, వైఎస్ అవినాష్ రెడ్డి ఈ మధ్యాహ్నం దేశ రాజధానిలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఓ వినతిపత్రాన్ని అందజేశారు. ఆ సమయంలో వారి వెంట డీఎంకేకు చెందిన తిరువణ్ణామలై ఎంపీ సీఎన్ అన్నాదురై కూడా ఉన్నారు. తిరుపతి- తిరువణ్ణామలై రోడ్డు ప్రాముఖ్యత గురించి గడ్కరీకి వివరించారు.తిరుపతి, కాణిపాకం, వేలూరు, తిరువణ్ణామలై వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించడానికి నిత్యం వేలాదిమంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారని ఎంపీలు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆయా రాష్ట్రాల భక్తులకు తిరుపతి- తిరువణ్ణామలై మార్గం ఎంతో కీలకమని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల భక్తులు, ఇతర వాహనదారులు ఈ రహదారిని వినియోగిస్తోన్నారని, ఈ క్రమంలో వాహనాల సంఖ్య అంచనాలకు మించి పెరిగిపోతోందని చెప్పారు.ఏపీ, తెలంగాణ మీదుగా తమిళనాడుకు నూతన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్- హాల్ట్ స్టేషన్లుపెరుగుతున్న వాహనాల రాకపోకలకు అనుగుణంగా రహదారిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని గురుమూర్తి, వైఎస్ అవినాష్ రెడ్డి, అన్నాదురై.. నితిన్ గడ్కరీకి వివరించారు. ఇప్పుడున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రహదారి విస్తరణ, అవసరమైన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, వాహనదారులకు మెరుగైన భద్రత కల్పించేలా రహదారి ప్రమాణాలను పెంచడం వంటి అంశాలను ఎంపీలు ప్రస్తావించారు.FCRA Bill పై కేంద్రం కీలక నిర్ణయం: ఇక అన్నింటికీ తెర దించినట్టే.. !!ఈ మార్గం అభివృద్ధి చెందితే ఏపీ