
iPhone 18 Pro, Pro Max వచ్చేశాయి.. తొలిసారి ఫోల్డబుల్ iPhone Duo లాంచ్!
iPhone 18 Pro, Pro Max వచ్చేశాయి.. తొలిసారి ఫోల్డబుల్ iPhone Duo లాంచ్!
© 2026 nimisham.in

iPhone 18 Pro, Pro Max వచ్చేశాయి.. తొలిసారి ఫోల్డబుల్ iPhone Duo లాంచ్!

iPhone 18 Pro, iPhone 18 Pro Max సిరీస్ రిలీజ్.. ధర ఎంతంటే..? ఆ రోజు నుంచే మార్కెట్ లోకి

ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ ఆపిల్ కొత్త సీఈఓ జాన్ టెర్నస్ వార్షిక వేతన ప్యాకేజీకి సంబంధించి కీలక వివరాలు బయటపడ్డాయి. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ దాఖలు చేసిన నివేదిక ప్రకారం ఆయన 2027 ఆర్థిక సంవత్సరానికి గాను 58 మిలియన్ డాలర్లు అంటే సుమారు 485 కోట్ల రూపాయల టార్గెట్ కాంపెన్సేషన్ పొందనున్నారు. ఇందులో బేసిక్ జీతం 3 మిలియన్ డాలర్లు కాగా 55 మిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీ షేర్లు భాగమై ఉన్నాయి. ఆపిల్ సీఈఓ గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునే ఈ భారీ ప్యాకేజీ వివరాలు వెల్లడించడం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జాన్ టెర్నస్ 2001లో ఆపిల్ సంస్థలో ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి గత 25 ఏళ్లుగా కంపెనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 2021 నుంచి హార్డ్వేర్ ఇంజనీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఆపిల్ వాచ్ వంటి కీలక ఉత్పత్తుల రూపకల్పనను ఆయనే పర్యవేక్షించారు. అనంతరం ఏప్రిల్ 20, 2026న కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుని సెప్టెంబర్ 1 నుంచి ఆయన్ను కొత్త సీఈఓగా నియమించింది. దీంతో సుదీర్ఘ కాలం పాటు సీఈఓగా సేవలు అందించిన టిమ్ కుక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పాత్రలోకి మారారు. ఈ మార్పులతో కంపెనీ నాయకత్వ పంపిణీలో స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఆపిల్ సీఈఓ ప్యాకేజీలో 75 శాతం పర్ఫార్మెన్స్ ఆధారిత రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లు కాగా మిగిలిన 25 శాతం టైమ్ ఆధారిత ఈక్విటీగా కేటాయించారు. బోర్డు నిర్దేశించిన స్టాక్ మార్కెట్ లక్ష్యాలను అందుకోవడంపైనే ఈ ప్యాకేజీ ఆధారపడి ఉంటుంది. మరోవైపు సెప్టెంబర్ చివరి వరకు ఆపిల్ ఆర్థిక సంవత్సరం కొనసాగుతున్నందున 2026 చివరి వారాల కోసం ఆయనకు అదనంగా 2.5 మిలియన్ డాలర్ల ప్రొరేటెడ్ షేర్లు మంజూరయ్యాయి. అదే సమయంలో 15

టెక్ ప్రపంచంలో సెప్టెంబర్ నెలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నెల నుంచి పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు తమ నయా ఫ్లాగ్షిప్, మిడ్-రేంజ్ ప్రొడక్ట్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సమాయత్తమయ్యాయి. వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హంగులు, అధునాతన కెమెరా సెన్సార్లు, శక్తివంతమైన ప్రాసెసర్లతో 10కి పైగా సరికొత్త స్మార్ట్ఫోన్లు ఈ నెలలో మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ జాబితాలో ప్రతిష్టాత్మకమైన, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడల్ యాపిల్ ‘ఐఫోన్ 18 ప్రో’. ప్రతిసారి డిజైన్, సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే యాపిల్ ఈసారి ఏఐ ఏకీకరణ, అత్యంత నాణ్యమైన పెరిస్కోప్ లెన్స్, మెరుగైన బ్యాటరీ లైఫ్తో వినియోగదారులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. యాపిల్ వార్షిక మెగా ఈవెంట్లో సెప్టెంబర్ ద్వితీయార్థంలో ఈ ఫోన్లు అధికారికంగా ఆవిష్కృతం కానున్నాయి. ఈ నెలలో మార్కెట్లోకి రానున్న కొన్ని మోడళ్లు కింది విధంగా ఉన్నాయి. కంపెనీలు ఇప్పటికే వీటి ఫీచర్లను ప్రకటించాయి. అయితే వీటి ధరలకు సంబంధించిన వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro): నెక్స్ట్-జెన్ A20 బయోనిక్ చిప్సెట్, అధునాతన ఏఐ ఫీచర్లతో రానుంది. వీవో T5 (Vivo T5): భారత మిడ్-రేంజ్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని అత్యుత్తమ డిజైన్, కెమెరా సామర్థ్యంతో బడ్జెట్ విభాగంలో పోటీకి దిగుతోంది. పోకో F9 (Poco F9): గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, తక్కువ ధరలో గరిష్ట పనితీరును అందించనుంది. శామ్సంగ్, వన్ప్లస్, రియల్మీ, షావోమీ సంస్థలు కూడా తమ సరికొత్త వేరియంట్లను ఈ సెప్టెంబర్లో ఆవిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. మొత్తానికి, సెప్టెంబర్ 2026 స్మార్ట్ఫోన్ పరిశ్రమకు అత్యంత కీలకమైన నెలగా మారనుంది. మీ పాత ఫోన్ను అప్గ్రేడ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెలలో రాబోయే ఈ సరికొత్త

ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ 16 భారీ తగ్గింపుతో లభిస్తోంది బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ ధర ఇంకా తగ్గుతుంది పవర్ఫుల్ చిప్, OLED డిస్ప్లే సామర్థ్యంతో కెమెరాలు Apple iPhone 16 Deal : ఆపిల్ లవర్స్కు పండగే.. ఫ్లిప్కార్ట్లో ఆపిల్ ఐఫోన్ 16 ధర భారీగా తగ్గింది. రూ. 79,900కు లాంచ్ అయిన ఈ ఐఫోన్ ఇప్పుడు రూ. 65వేల కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. వినియోగదారులు బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో అసలు ధరను మరింత తగ్గించుకోవచ్చు. లిమిటెడ్ టైమ్ ఆఫర్ త్వరలో ముగియనుంది. మీరు ఈ ఐఫోన్ సొంతం చేసుకోవాలంటే ఇప్పుడే కొనేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో ఆపిల్ ఐఫోన్ 16 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఐఫోన్ 16 ఫ్లిప్కార్ట్ డీల్ : ఆపిల్ ఐఫోన్ 16 తొలుత రూ. 79,900 ధరకు లాంచ్ అయింది. కానీ, ప్రస్తుతం ఈ ఐఫోన్ ఫ్లిప్కార్ట్లో రూ. 15వేలు తగ్గింపుతో రూ. 64,900 ధరకు అమ్ముడవుతోంది. నేరుగా తగ్గింపుతో పాటు, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో అదనంగా రూ. 5,145 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఐఫోన్ ధర రూ. 59,755కు తగ్గుతుంది. Read Also : PM Kisan- Annadata Sukhibava : రైతులకు పండుగ గిఫ్ట్.. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్డేట్.. ఆ తేదీనే ఖాతాల్లోకి డబ్బులు? ఫ్లిప్కార్ట్ 36 నెలలకు కేవలం రూ. 2,262 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తోంది. అంతేకాదు.. మీ పాత ఫోన్ ఇచ్చి రూ. 49,250 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందొచ్చు. అయితే, కచ్చితమైన ఎక్స్చేంజ్ వాల్యూ అనేది మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్ పర్ఫార్మెన్స్పై ఆధారపడి ఉంటుంది. ఐఫోన్ 16 ఇదే బెస్ట్ టైమ్? : ఆపిల్ త్వరలో ఐఫోన్ల ధరలను భారీగా పెంచనుంది. అయితే, దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్సైట్కు సంబంధించిన వీడియో కంటెంట్పై కూడా అవగాహన ఉంది.. Madhuri Rathod Latest News: ప్రముఖ జానపద కళాకారిణి మాధురి రాథోడ్ పై దాడితో పాటు ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తనపై దురుసుగా ప్రవర్తించి.. దాడి చేయడమే కాకుండా తన మొబైల్ ఫోన్ను చోరీ చేసి అందులో వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ ఆమె వేములవాడ పోలీసులను ఆశ్రయించింది.. ఈ వ్యవహారంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో పాటు మరికొందరిపై పోలీస్ కేసు నమోదు చేశారు.. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఈ నెల 19వ తేదీన వేములవాడలోని రెడ్డి భవన్లో ఈ వివాదం చోటు చోటుచేసుకుంది. అక్కడ ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనతో అత్యంత దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించి.. ఆమెపై భౌతికంగా దాడి కూడా చేసిందని మాధురి పేర్కొంది. ఆ సమయంలో సుమారు 50 వేల విలువైన ఐఫోన్ బలవంతంగా లాక్కొని తీసుకొని వెళ్ళిపోయారని ఆరోపించారు.. తన ఫోన్ను దొంగలించి తీసుకొని పోయిన తర్వాత.. అందులోని వ్యక్తిగత డేటా తో పాటు వీడియోలను రికార్డు చేసి.. ఉద్దేశ పూర్వకంగా తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియా వేదికల్లో వైరల్ చేశారని మాధురి ఫిర్యాదులు తెలిపారు. సమాజంలో తనకున్న గౌరవంతో పాటు వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ వ్యవహారానికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో వివరించారు.. వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా సంస్థలతోపాటు సోషల్ మీడియా ఛానల్లు తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వార్తలు ప్రసారం
iPhone EMI Family Tragedy : మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో కొండపైకి ఎక్కిన కొడుకు చనిపోతానంటూ రచ్చ చేయడంతో.. కాపాడేందుకు వెళ్లి తండ్రి సైతం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే కొడుకు, భర్త చనిపోవడం చూడలేక మహిళ కూడా కొండ పైనుంచి దూకి చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ముగ్గురు మృతికి కారణం.. ఐఫోన్ ఈఎమ్ఐ కట్టే విషయంలో గొడవలు తలెత్తడమేనని తెలుస్తోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.అసలేం జరిగిందంటే..?పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్రపతి శంభాజీనగర్లోని తిస్గావ్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల కునాల్ అనే యువకుడు ఇటీవల ఎంతో ఇష్టపడి ఓ ఐఫోన్ కొనుగోలు చేశాడు. అయితే ఆ ఫోన్కు సంబంధించిన ఈఎంఐ వాయిదాలు చెల్లించడానికి అతడి వద్ద డబ్బులు లేకపోవడంతో.. ఇంట్లో తండ్రి మురళీధర్ చాంద్గుడేను డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలోనే ఈఎంఐ చెల్లింపుపై తండ్రీకొడుకుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కునాల్.. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కోపంతో ఇంట్లోంచి బయటకు వచ్చి, వాలూజ్ ఎంఐడీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిస్గావ్ కొండపైకి ఎక్కాడు.కొడుకు కొండపైకి వెళ్లడం గమనించిన తల్లిదండ్రులు మురళీధర్, సంగీత వెంటనే అతడిని అనుసరిస్తూ అక్కడికి చేరుకున్నారు. స్థానిక మాజీ సర్పంచ్ సంజయ్ జాధవ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్థులు కూడా కొండ వద్దకు చేరుకుని యువకుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. "నీకు ఐఫోన్ 15 ప్రో కూడా కొనిస్తాం. నీకు మంచి భవిష్యత్తు ఉంది, నీ తల్లి కోసం అయినా కిందకు దిగి రా" అని దాదాపు మూడు గంటల పాటు అక్కడున్న వారంతా వేడుకున్నారు. అయినా కునాల్ మాత్రం "చావడమే నాకు ఉన్న ఏకైక మార్గం" అని భీష్మించుకూర్చున్నాడు.క్షణాల్లో తుడిచిపెట్టుకుపోయిన కుటుంబం..!మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పరిస్థితి చేయిదాటిపోతుండటంతో.. తండ్రి మురళీధర్ ధైర్యం చేసి కునాల్ నిలబడి

మహారాష్ట్రలోని ఓ కొండపై చోటుచేసుకున్న విషాద ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల మీద అలిగి కొండ మీద నుంచి దూకుతానంటూ కొడుకు.. ఆ కొడుకును కాపాడేందుకు వెళ్లిన తండ్రి, వాళ్లు చనిపోవడం చూసి తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. అసలు ఈ ఘటనకు దారితీసిన కారణమేంటి?.. క్షణాల్లో మూడు ప్రాణాలను బలిగొన్న ఆ వివాదం వెనుక ఉన్న షాకింగ్ కారణాన్ని పోలీసులు వెల్లడించారు. ఛత్రపతి శంభాజీనగర్ (Chhatrapati Sambhajinagar) జిల్లా వాలూజ్లో ఘోరం జరిగింది. కొడుకును కాపాడేందుకు ప్రయత్నంలో.. కుటుంబం మొత్తం బలైంది. ఈ తీవ్ర విషాదం తిస్గావ్ ప్రాంతంలోని ఖవాడ్యా కొండపై జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసి అయ్యో పాపం అనుకుంటున్నారంతా. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. 19 ఏళ్ల కునాల్ చంద్రగూడే ఇంట్లో తెలియకుండా ఐఫోన్ కొన్నాడు. అయితే దాని ఈఎంఐ కట్టేందుకు ఇబ్బందులు పడ్డాడు. దీంతో తండ్రికి అసలు విషయం చెప్పి.. ఈఎంఐ కట్టమని బతిమాలాడు. ఈ క్రమంలో ఒప్పుకోని తండ్రి మురళీధర్.. కొడుకును మందలించాడు. ఇదే విషయమై ఇంట్లో శుక్రవారం పొద్దున గొడవ జరిగింది. పట్టరాని కోపంతో తిస్గావ్ ప్రాంతంలోని ఓ కొండపైకి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లీదండ్రులు, మాజీ సర్పంచ్ సహా కొందరు గ్రామస్తులు అక్కడికి చేరుకుని అతన్ని కిందకు దించే ప్రయత్నం చేశారు. మూడు గంటల పాటు కొనసాగిన బుజ్జగింపులు కునాల్ కొండ అంచున నిలబడి తీవ్ర నిర్ణయం తీసుకుంటానని బెదిరించడంతో అంతా బతిమాలడం మొదలుపెట్టారు. దాదాపు మూడు గంటల పాటు అతడిని కిందకు రావాలని నచ్చజెప్పారు. “నీ తండ్రి సంగతి వదిలేయ్.. నీ తల్లి కోసం అయినా బతుకు. నీకు మంచి భవిష్యత్తు ఉంది” అంటూ పలువురు వేడుకున్నా కునాల్ వినలేదు. అతడికి ఐఫోన్ 15 ప్రో ఇప్పిస్తామని కొందరు చెప్పినా ఫలితం లేకపోయింది. ఈలోపు కింద

ఒక్క ఫోన్ మోజు, అది తెచ్చిపెట్టిన అప్పుల భారం ఒక పచ్చని కుటుంబాన్ని నిలువునా బలితీసుకుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా పరిధిలోని దేవలాయ్ ప్రాంతంలో ఒళ్లు గగుర్పొడిచే విషాద సంఘటన వెలుగు చూసింది. ఐఫోన్ ఈఎంఐ కిస్తీ డబ్బుల విషయంలో తండ్రితో గొడవపడి, ఆవేశంలో కొండపైకిక్కిన 18 ఏళ్ల కుర్రాడు.. అతడిని కాపాడుకోవడానికి వెళ్లిన తండ్రి, ఇద్దరినీ కళ్లముందే కోల్పోయి తట్టుకోలేకపోయిన తల్లి.. ముగ్గురూ కొండపై నుంచి కిందపడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం.. 18 ఏళ్ల కునాల్ చందగూడే అనే యువకుడు ఇటీవలే ఖరీదైన ఐఫోన్ కొనుగోలు చేశాడు. అయితే, దానికి సంబంధించి నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ కోసం ఇంట్లో నిత్యం గొడవపడుతున్నాడు. శుక్రవారం ఉదయం కూడా తండ్రి మురళీధర్తో ఈఎంఐ డబ్బుల విషయమై తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కునాల్, ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి సమీపంలోని తిస్గావ్ కొండపైకి ఎక్కాడు. కొండ అంచున నిలబడి కిందకి దూకేస్తానని బెదిరించడం ప్రారంభించాడు.మూడు గంటల నరకం.. అమ్మా నాన్నల కోసం బ్రతుకురా!విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు, స్థానిక సర్పాంచ్ సంజయ్ జాధవ్, గ్రామస్థులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు కునాల్ను కిందకు తీసుకురావడానికి సర్వవిధాలా ప్రయత్నించారు. నానా! నీకు ఏది కావాలంటే అది కొనిస్తాం, నీకు మంచి భవిష్యత్తు ఉంది, మీ అమ్మను చూసైనా కిందకి దిగి రారా అని సర్పాంచ్, పోలీసులు ఎంతో బతిమిలాడారు. నాకు చావే శరణ్యం, వేరే దారి లేదు అంటూ కునాల్ భీష్మించుకూర్చున్నాడు. కొండ కింద నిలబడి కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు కొండపైకి చేరుకుని కొడుకుని బతిమాలే ప్రయత్నం చేశారు.Viral Video: వికెట్ తీసి Gen-Z సెలబ్రేషన్స్.. రాత్రికి రాత్రే స్టార్!క్షణాల వ్యవధిలోనే ముగిసిన మూడు ప్రాణాలు!మధ్యాహ్నం 1 గంట సమయంలో కొండ అంచుకు

Apple iPhone 16 : మీరు కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఐఫోన్ 16 అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ ఆపిల్ కొత్త ఐఫోన్ మోడల్ ఇప్పుడు ప్రారంభ ధర కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్కార్ట్ బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో వస్తుంది. తద్వారా ధర మరింత తగ్గింపు పొందవచ్చు. ముఖ్యంగా, ఐఫోన్ 16లో ఆపిల్ A18 చిప్సెట్, 48MP కెమెరా ఓఎల్ఈడీ (Apple iPhone 16) డిస్ప్లే ఉన్నాయి. కొత్త ఐఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్ను అసలు వదులుకోవద్దు. పూర్తి ఆఫర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.. ఐఫోన్ 16 డీల్స్ : 128GB స్టోరేజ్ వేరియంట్ ఐఫోన్ 16 అసలు ధర రూ.69,990గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్ రూ.65,900కే లభిస్తోంది. అదనంగా, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఫ్లిప్కార్ట్ ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో కొంటే రూ.5,195 క్యాష్బ్యాక్ పొందవచ్చు. అసలు ధరపై రూ.9,285 ఆదా చేయొచ్చు. అంతేకాదు.. మీ పాత ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేస్తే అదనంగా రూ.5వేలు బోనస్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. దాంతో మొత్తంగా రూ.14,285 ఆదా చేసుకోవచ్చు. Read Also : Nothing Phone 3 : వారెవ్వా.. రూ.80వేల నథింగ్ ఫోన్ 3 జస్ట్ రూ. 50వేలకే.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..! ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు : ఆపిల్ ఐఫోన్ 16లో 1179×2556 పిక్సెల్స్ రిజల్యూషన్ 2,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్, 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ ఆపిల్ A18 చిప్సెట్తో రన్ అవుతుంది. iOS26 ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఈ ఫోన్కు IP68 రేటింగ్ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్, GPS, NFC, సింగిల్ యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సెల్ఫీలు

Apple iPhone 17 : ఆపిల్ గత ఏడాదిలో భారత మార్కెట్లో ఐఫోన్ 17 లాంచ్ చేసింది. ఇప్పుడు రాబోయే ఐఫోన్ సిరీస్ సెప్టెంబర్లో లాంచ్ కానుంది. మీరు ఐఫోన్ 17 కొనేందుకు చూస్తుంటే ఇంతకన్నా బెటర్ టైమ్ ఉండదు. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ ప్రస్తుతం ఐఫోన్ 17పై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లతో అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తోంది. ఐఫోన్ 17 డీల్స్ ఆఫర్లను ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఐఫోన్ 17 ధర, ఆఫర్లు : 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 80,900గా ఉంది. అయితే, గత ఏడాదిలో రూ. 82,900కు లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్ల (Apple iPhone 17) విషయానికి వస్తే.. ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే.. మీరు రూ. 5,955 తగ్గింపు పొందవచ్చు. ఆ తర్వాత అసలు ధర రూ. 74,955 అవుతుంది. అంతేకాదు.. మీ పాత ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 57,250 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, ఎక్స్ఛేంజ్ డివైజ్, మోడల్పై ఆధారపడి ఉంటుంది. ఈ ఐఫోన్ లాంచ్ ధరతో పోలిస్తే సుమారు రూ. 7,945 తగ్గింపుతో లభిస్తుంది. Read Also : SBI Cash Withdrawals : SBI ఖాతాదారులకు బిగ్ షాక్.. ఇక 4 విత్డ్రాయల్స్ దాటితే ఛార్జ్ పడుద్ది.. ఎప్పటినుంచంటే? ఐఫోన్ 17 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : ఈ ఐఫోన్ మోడల్ 2622×1206 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 3,000 నిట్స్ టాప్ బ్రైట్నెస్, 6.3-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఈ ఐఫోన్ ఆపిల్ A19 ప్రాసెసర్తో రన్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే.. ఈ ఐఫోన్ iOS 26పై రన్ అవుతుంది. ఈ ఐఫోన్ డస్ట్, వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్తో వస్తుంది

టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 18 సిరీస్కు సంబంధించిన కీలక వివరాలు ఆన్లైన్లో లీకయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లతో పాటు యాపిల్ నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈసారి ఐఫోన్ కెమెరా టెక్నాలజీలో భారీ మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.లీకుల ప్రకారం.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్లో ప్రధాన ఆకర్షణగా వేరియబుల్ అపెర్చర్ కెమెరా ఉండనుంది. డీఎస్ఎల్ఆర్ కెమెరాల మాదిరిగా, కాంతిని బట్టి అపెర్చర్ను మార్చుకునే ఈ ఫీచర్తో తక్కువ వెలుతురులోనూ అద్భుతమైన ఫోటోలు తీయవచ్చు. వెనుక వైపు 48 మెగాపిక్సెల్ సామర్థ్యంతో మూడు కెమెరాలు (మెయిన్, అల్ట్రావైడ్, టెలిఫోటో) ఉంటాయని, ముందు వైపు 18ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుందని సమాచారం.పనితీరు విషయంలో కూడా ఈ ఫోన్ కొత్త బెంచ్మార్క్లు సెట్ చేయనుంది. యాపిల్ సొంతంగా తయారు చేసిన, టీఎస్ఎంసీ 2-నానోమీటర్ టెక్నాలజీపై పనిచేసే శక్తిమంతమైన ఎ20 ప్రో చిప్ను ఇందులో ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు 12జీబీ ర్యామ్, 5,100 ఎంఏహెచ్ కంటే ఎక్కువ సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ఉండటంతో వేగం, బ్యాటరీ లైఫ్ రెండూ మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు. 6.9-అంగుళాల ప్రకాశవంతమైన డిస్ప్లే, చిన్న డైనమిక్ ఐలాండ్, 'డార్క్ చెర్రీ' వంటి కొత్త రంగు ఆప్షన్ కూడా ఉండొచ్చని లీక్స్ చెబుతున్నాయి.అయితే, ఈసారి యాపిల్ తన వ్యూహంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్లో కేవలం ప్రో, ప్రో మ్యాక్స్, ఫోల్డబుల్ మోడల్స్ను మాత్రమే

వచ్చే సెప్టెంబర్లో ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ లాంచ్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర, లాంచ్ డేట్, ఫీచర్లు వివరాలివే సెల్ఫీలు, వీడియో కాల్స్ 24MP ఫ్రంట్ స్నాపర్ Apple iPhone 18 Pro Max Price : ఆపిల్ ఐఫోన్ లవర్స్ గెట్ రెడీ.. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ వచ్చేస్తోంది.. ఐఫోన్18 ప్రో, ఐఫోన్ అల్ట్రా (కంపెనీ ఫస్ట్ ఫోల్డబుల్) ఫోన్ ఎంట్రీకి రెడీ అవుతున్నాయి. ఐఫోన్ ప్రో మాక్స్ వేరియంట్ విషయానికి వస్తే.. గత మోడల్ మాదిరిగానే పవర్ ఫుల్ డివైజ్ గా రానుంది. బహుశా A20 ప్రో చిప్సెట్ కూడా ఉండొచ్చు. లీక్లు, పుకార్లు ఊహాగానాల ఆధారంగా రాబోయే ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర, లాంచ్ డేట్, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.. కెమెరా, డిజైన్, స్పెసిఫికేషన్లు : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ మెయిన్ డిజైన్ అప్గ్రేడ్తో వస్తుంది. కొత్త కెమెరా ఐలాండ్ డిజైన్ అందిస్తుంది. ఐఫోన్ 18 ప్రో మాక్స్లో ఎలాంటి కొత్త డిజైన్ ఉంటుందో ఇప్పటివరకూ రివీల్ కాలేదు. నివేదికల ప్రకారం.. గత మోడల్ డిజైన్తోనే వస్తుందని అంచనా. Read Also : Central Bank FD : సెంట్రల్ బ్యాంక్లో 24 నెలల FDపై ఎంత వడ్డీ వస్తుంది? సీనియర్ సిటిజన్లకు బెనిఫిట్స్ ఇవేనా? కెమెరాల విషయానికొస్తే.. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్లో 48MP ప్రైమరీ స్నాపర్, 48MP అల్ట్రా-వైడ్-యాంగిల్ స్నాపర్ 48MP పెరిస్కోప్ టెలిఫోటో స్నాపర్తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండొచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లో 24MP ఫ్రంట్ స్నాపర్ ఉండవచ్చు. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 6.9-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో రావచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్ 3000 నిట్స్ టాప్ బ్రైట్నెస్ ఉంటాయి. 2nm ప్రాసెస్పై ఆపిల్ A20

Flipkart Freedom Sale : కొత్త ఐఫోన్ కొనాలని అనుకుంటున్నారా? ఐఫోన్ 17 కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఐఫోన్ 17పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఐఫోన్ మోడల్ ప్రారంభ ధర కన్నా చాలా తక్కువ ధరకే లభిస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా పొందవచ్చు. ఐఫోన్ 17 ప్రారంభ ధర రూ.82,900 ఉండగాప్రస్తుతం రూ.6వేలు తక్కువ ధరకే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ ఐఫోన్ 17 మోడల్ మరింత చౌకైన ధరకే లభిస్తోంది. ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ 17 డిస్కౌంట్ : ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ 17పై రూ.6వేలు డైరెక్ట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్ అసలు ధర రూ. 82,900 ఉండగా ఇప్పుడు రూ.77వేలకే లభిస్తోంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్కార్ట్ ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.5,750 క్యాష్బ్యాక్ పొందవచ్చు. మొత్తంగా రూ.11,750 వరకు తగ్గింపు పొందవచ్చు. డిస్కౌంట్ తర్వాత ఈ ఐఫోన్ కేవలం రూ.71,250కే లభిస్తుంది. ఈ ఐఫోన్ బ్లాక్ కలర్ వేరియంట్ మాత్రమే అందబాటులో ఉంది. Read Also : Realme P4s Leak : భారీ బ్యాటరీతో కొత్త రియల్మి P4s వచ్చేస్తోంది.. లాంచ్కు ముందే కీలక ఫీచర్లు లీక్..! ఐఫోన్ 17 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : ఐఫోన్ 17లో 2622×1206 పిక్సెల్స్ రిజల్యూషన్తో 6.3-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఆపిల్ A19 ప్రాసెసర్తో పాటు iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో NFC, GPS, 5G, Wi-Fi 7, eSIM సపోర్ట్, బ్లూటూత్ 6, USB-C పోర్ట్ ఉన్నాయి

ప్రస్తుతం సాధారణ బ్యాక్గ్రౌండ్లు, లిమిటెడ్ థీమ్లకే పరిమితమైన చాట్ లుక్ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్లను టెస్టింగ్ చేస్తోంది. చాట్ లుక్ మారిపోవడంతో పాటు చాట్ సమయంలో బ్యాక్ గ్రౌండ్ థీమ్ యానిమేటెడ్ వాల్ పేపర్లతో కనిపించనుంది. 3 రకాల కొత్త థీమ్లు : iOS బీటా వెర్షన్ 26.31.10.74లో కొత్త థీమ్ కస్టమైజేషన్పై వాట్సాప్ పనిచేస్తున్నట్లు సమాచారం. ఇందులో (Featured, Doodle, Minimal) అనే 3 సెక్షన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రతి సెక్షన్లో విభిన్న రంగులు, డిజైన్లు, వాల్పేపర్లు అందించనుంది. Read Also : Flipkart Freedom Sale 2026 : కెమెరా ప్రియులకు పండగే.. రూ.10 వేల తక్కువకే పిక్సెల్ ఫోన్.. ఈ ఆఫర్ మిస్ కావద్దు! ఎంచుకున్న థీమ్కు సరిపోయేలా మెసేజ్ బబుల్ కలర్లను కూడా వాట్సాప్ ఆటోమేటిక్గా సెట్ చేయనుంది. తద్వారా చాట్ మొత్తం ఒకే స్టైల్లో కనిపిస్తుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఆఫీసు వర్క్ సంబంధిత చాటింగ్ కోసం వేర్వేరు లుక్లను ఎంచుకునే అవకాశం కూడా ఉండనుంది. యానిమేటెడ్ వాల్పేపర్లు : ఇకపై స్టేబుల్ బ్యాక్గ్రౌండ్లతో పనిలేదు.. యానిమేటెడ్ ఎలిమెంట్స్తో వాల్పేపర్లు రాబోతున్నాయి. మీరు చాట్ చేసే సమయంలో బ్యాక్ గ్రౌండ్లో వాల్ పేపర్లు మూవ్ అవుతుంటాయి. తద్వారా చాట్ స్క్రీన్కు మరింత డైనమిక్ లుక్ ఇవ్వనున్నాయి. అయితే, ఈ కొత్త ఫీచర్లు ప్రస్తుతం డెవలప్, టెస్టింగ్ స్టేజీలోనే ఉన్నాయి. రెగ్యులర్ ఐఫోన్ యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే దానిపై క్లారిటీ లేదు. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కూడా కూడా ఇలాంటి థీమ్ కస్టమైజేషన్ ఫీచర్ డెవలప్ చేస్తున్నట్టు సమాచారం

iPhone 18 Pro Series Launch: త్వరలోనే ఐఫోన్ 18 ప్రో సిరీస్ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం కెమెరా సెటప్తో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా కెమెరాల్లో అనేక మార్పులు చేర్పులు చేసిన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. iPhone 18 Pro Series Launch: యాపిల్ లవర్స్ ఐఫోన్ 18 ప్రో సిరీస్ ఎప్పుడు విడుదలవుతుందని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఆ మ్యాజికల్ మూమెంట్ రానే వచ్చింది.. యాపిల్ తమ కొత్త సిరీస్ను త్వరలోనే అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది దిమ్మతిరిగే డిజైన్తో లాంచ్ కానుండడం విశేషం.. ఇది 3 మైండ్ బ్లోయింగ్ కెమెరా అప్గ్రేడ్స్తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దానికి సంబంధించిన ఫీచర్స్, ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro) సిరీస్ గ్రాండ్గా త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ దీనిని సెప్టెంబర్ రెండవ వారంలో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు బ్లూమ్బెర్గ్ వర్గాలు తెలిపాయి.. ఇందులో కంపెనీ ప్రొఫెషనల్ కెమెరాలకే సవాల్ విసిరేలా ఊహించని కెమెరా ఫీచర్స్ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇందులో కంపెనీ చాలా అద్భుతమైన వేరియబుల్ అపెర్చర్ (Variable Aperture) ఫీచర్ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ప్రొఫెషనల్ DSLR కెమెరాలకే పరిమితమైన వేరియబుల్ అపెర్చర్ ఫీచర్ ఇప్పుడు తొలిసారిగా ఐఫోన్ 18 ప్రో మెయిన్ కెమెరాలో అందుబాటులోకి రావడం విశేషం.. ఇది చీకటిలో (Low-Light) కూడా అద్భుతమైన ఫోటోలను అందిస్తుంది. ఇక టెలిఫోటో కెమెరాలో కూడా ఊహించని మార్పులు తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. కేవలం మెయిన్ కెమెరా మాత్రమే కాదు.. టెలిఫోటో కెమెరాను సైతం యాపిల్ ఊహించని రీతిలో అప్గ్రేడ్ చేసిన్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. Wide Aperture వాడటం వల్ల లెన్స్ లోపలికి అత్యధిక వెలుతురు వెళ్లి, నైట్ మోడ్ షాట్స్, జూమింగ్ ఫొటోలు చాలా

టెక్ దిగ్గజం యాపిల్ నుంచి వచ్చిన అత్యంత ప్రీమియం స్మార్ట్ఫోన్ 'ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్'ను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది శుభవార్త. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ నిర్వహిస్తున్న 'ఫ్రీడమ్ సేల్' సందర్భంగా ఈ ఫోన్పై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. అన్ని డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్లను కలుపుకుంటే ఈ ఫోన్ కేవలం రూ. 98,300కే వచ్చేస్తోంది. ఇది ఐఫోన్ ప్రియులకు గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.ఆఫర్ వివరాలు ఇలా..యాపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 256GB వేరియంట్ మార్కెట్లో రూ. 1,49,900 ప్రారంభ ధరతో విడుదలైంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్లో భాగంగా ఈ ఫోన్పై నేరుగా రూ. 8,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. దీంతో దీని లిస్టెడ్ ధర రూ. 1,41,900కి తగ్గింది. ఇది కేవలం ప్రాథమిక తగ్గింపు మాత్రమే.దీనికి అదనంగా ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్న వినియోగదారులు మరో రూ. 8,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ను వినియోగించుకుంటే ఫోన్ ధర రూ. 1,33,900కి చేరుతుంది. అయితే, అసలు సిసలైన తగ్గింపు ఎక్స్ఛేంజ్ ఆఫర్తోనే వస్తుంది.మీ పాత స్మార్ట్ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ. 35,600 వరకు బోనస్ పొందవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ బోనస్ను కూడా విజయవంతంగా పొందితే, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ తుది ధర రూ. 98,300 అవుతుంది. అంటే.. ప్రారంభ ధరతో పోలిస్తే దాదాపు రూ. 51,600 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ విలువ మీ పాత ఫోన్ మోడల్, కండిషన్పై

ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెజాన్లో 'గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026' నడుస్తోంది. ప్రైమ్, నాన్-ప్రైమ్ కస్టమర్లు అందరూ ఈ సేల్లో పాల్గొనవచ్చు. యాపిల్, శాంసంగ్, గూగుల్, వివో, మోటోరోలా, వన్ప్లస్ లాంటి టాప్ బ్రాండ్ల ఫోన్లను ఆఫర్ ధరలకు కొనడానికి ఇదే మంచి అవకాశం. కొత్త ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి ఈ సేల్ ఒక మంచి ఛాన్స్. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర రూ.94,999 నుంచి రూ.89,999కి తగ్గింది. రూ.1,19,999 విలువైన వివో X300 FE 5G ఇప్పుడు రూ.89,999కే అందుబాటులో ఉంది. 256 జీబీ స్టోరేజ్ ఉన్న ఐఫోన్ ఎయిర్ మోడల్పైనా భారీ డిస్కౌంట్ ఉంది. రూ.1,19,900 ధర ఉన్న ఈ ఫోన్ను ప్రస్తుతం రూ.97,900కు అమ్ముతున్నారు. శాంసంగ్ ప్రీమియం ఫోల్డబుల్ మోడల్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా 5G ధరను కూడా ఈ సేల్లో తగ్గించారు. రూ.2,24,999 విలువైన ఈ ఫోన్ ఇప్పుడు రూ.1,99,999కే లభిస్తోంది. అలాగే, రూ.1,66,899 అసలు ధర ఉన్న ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 256 జీబీ మోడల్ ఆఫర్ ధర ఇప్పుడు రూ.1,56,399. ప్రీమియం ఫోన్లే కాదు, మిడ్-రేంజ్ ఫోన్లపైనా సూపర్ డీల్స్ ఉన్నాయి. రూ.94,999 విలువైన మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ 5G ఇప్పుడు రూ.58,959కే దొరుకుతోంది. గూగుల్ పిక్సెల్ 10 మోడల్ ధర కూడా తగ్గింది. దీని ధరను రూ.79,999 నుంచి రూ.66,250కి తగ్గించారు. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5G కొనాలనుకునే వారికి కూడా ఈ సేల్లో మంచి అవకాశం ఉంది. రూ.1,69,999 విలువైన ఈ ఫోన్, రూ.1,24,999కే అందుబాటులో ఉంది. వన్ప్లస్ 15 ఫోన్ ధరను కూడా తగ్గించారు. రూ.89,999 మోడల్ ఇప్పుడు రూ.85,999కు అమ్ముతున్నారు. డైరెక్ట్ డిస్కౌంట్లు కాకుండా, కొన్ని ఎంపిక చేసిన వస్తువులపై HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఈజీ ఈఎంఐ లావాదేవీల ద్వారా 10% వరకు తక్షణ డిస్కౌంట్

Apply Pay UPI : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు పండగే.. అతి త్వరలో భారతీయ ఐఫోన్ యూజర్ల కోసం కొత్త ఆపిల్ పే సర్వీసు రాబోతుంది. ఆపిల్ టెక్ దిగ్గజం పేమెంట్ సర్వీసును 2026 సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ ప్రారంభంలో భారత్లో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే, ప్రారంభ దశలో ఆపిల్ పేకి యూపీఐ సపోర్ట్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. భారతీయ యూజర్ల కోసం ఆపిల్ పే సర్వీసును ప్రధానంగా Visa, Mastercard నెట్వర్క్లపై జారీ చేసిన క్రెడిట్ కార్డుల కోసం తీసుకున్నట్టు సమాచారం. ఇందుకోసం ఆపిల్ ఇప్పటికే దేశంలోని ప్రముఖ బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అర్హత ఉన్న క్రెడిట్ కార్డులను యూజర్లు ఆపిల్ వాలెట్ ద్వారా లోడ్ చేసుకోవచ్చు. ఐఫోన్, ఆపిల్ వాచ్ ద్వారా కాంటాక్ట్లెస్ పేమెంట్లు చేయవచ్చు. ఆపిల్ పే సర్వీసు వస్తే.. : ప్రతి పేమెంట్ సమయంలో కార్డు నంబర్, CVV, OTP వివరాలను మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫేస్ ఐడీ, టచ్ ఐడీ, టోకనైజేషన్ వంటి సేఫ్టీ బెనిఫిట్స్ ద్వారా పేమెంట్లు చేయవచ్చు. కార్డు వివరాలు బహిర్గతమయ్యే రిస్క్ కూడా తగ్గుతుంది. అయితే, యూపీఐ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉండవచ్చు. యూపీఐ పేమెంట్లను ఆపిల్ పేలో అందించాలంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అలాగే స్పాన్సర్ బ్యాంక్ పార్టనర్ షిప్కూడా అవసరం. దీనికి సంబంధించిన ఫీజులపై ఆపిల్, భారతీయ బ్యాంకుల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. Read Also : Jagtial Twins Adoption : తల్లి చనిపోయింది.. తండ్రి నిస్సహాయతే ఆసరా.. కవల శిశువుల దత్తత కలకలం ఆపిల్ ఒక్కో లావాదేవీపై 15–20 బేసిస్ పాయింట్ల వరకు ఫీజు కోరుతున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులు సుమారు 10 బేసిస్ పాయింట్లకు పరిమితం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రారంభంలో UPI, QR పేమెంట్లకు ఆపిల్ పే సపోర్టు

మూడు జనరేషన్ల గ్యాప్ తర్వాత వస్తున్న ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro), పాత ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro) వాడుతున్న వారికి ఒక పర్ఫెక్ట్ అప్గ్రేడ్లా కనిపిస్తోంది. అయితే ఈ కొత్త ఫోన్ కొనేముందు ఆలోచించాల్సిన ఒక పెద్ద సమస్య కూడా ఉంది. సెప్టెంబర్ చివరిలో రాబోతున్న ఈ కొత్త ఫోన్ కోసం ఐఫోన్ 16 ప్రో యూజర్లు వెంటనే హడావుడిగా అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేకపోయినా, ఐఫోన్ 15 ప్రో యూజర్లకు మాత్రం మారడానికి చాలా మంచి కారణాలు ఉన్నాయి. ఐఫోన్ 18 ప్రోలో కాస్త పెద్ద స్క్రీన్, మెరుగైన బ్యాటరీ లైఫ్, ప్రతీ కెమెరాలోనూ మార్పులు, ఫాస్ట్ ఛార్జింగ్, పెరిగిన పెర్ఫార్మెన్స్ లభించనున్నాయి. ఇవన్నీ చాలా మంచి మార్పులే అయినప్పటికీ, ఒక కలవరపెట్టే వార్త కూడా ఉంది. గతేడాదిగా ర్యామ్ ధరలు భారీగా పెరగడంతో, ఆపిల్ ఐఫోన్ 18 ప్రో ధరను బాగా పెంచే అవకాశం ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు $1,300 (భారత కరెన్సీలో దాదాపు రూ. 1,23,500) నుండి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఇది ఐఫోన్ 15 ప్రో బేస్ మోడల్ ధర $1,000 (సుమారు రూ. 95,000) కంటే దాదాపు $300 (రూ. 28,500) ఎక్కువ. ఐఫోన్ 15 ప్రోలో 6.1 అంగుళాల స్క్రీన్ ఉండగా, ఐఫోన్ 18 ప్రోలో అది 6.3 అంగుళాలకు పెరిగింది. స్క్రీన్ చుట్టూ ఉన్న బెజెల్స్ తగ్గడం వల్ల ఫోన్ సైజు పెద్దగా పెరిగినట్లు అనిపించదు. డిజైన్ పరంగా ఐఫోన్ 15 ప్రో ప్రీమియం టైటానియం ఫ్రేమ్తో వచ్చి 187 గ్రాముల బరువు, 146.6 x 70.6 x 8.25 mm సైజుతో తేలికగా ఉంటుంది. కానీ ఐఫోన్ 18 ప్రో అల్యూమినియం బాడీతో వస్తోంది. దీని వల్ల గీతలు త్వరగా పడే అవకాశం ఉన్నప్పటికీ, వేడి త్వరగా బయటకు పోయేలా సహాయపడుతుంది