
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

పోలీసుల కళ్లుగప్పి హషీష్ ఆయిల్ను శరీరానికి కట్టుకుని బస్సులో తరలిస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాను ఎస్ఓటీ ఎల్బీనగర్, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. ఎల్బీనగర్ సమీపంలోని చింతల్కుంట వద్ద నిర్వహించిన ఆపరేషన్లో ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. నిందితుల నుంచి 12 కిలోల హషీష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని మల్కాజిగిరి సీపీ బి.సుమతి వెల్లడించారు. దూసుకొస్తున్న వాయుగుండం - ఈ జిల్లాల్లో భారీ వర్షాల పై తాజా అలర్ట్...!!ఏజెన్సీ ప్రాంతాల నుంచి.. బెంగళూరుకు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి హషీష్ ఆయిల్ను సేకరించి.. హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. పక్కా సమాచారంతో చింతల్కుంట వద్ద నిందితులను అడ్డుకున్నామని తెలిపారు. బస్సులో ప్రయాణిస్తూ డ్రగ్స్ను తరలించే ప్రయత్నం చేశారని.. పోలీసులు తనిఖీలు చేయడంతో వారి అక్రమ రవాణా బయటపడిందని చెప్పారు.కాళ్లకు.. కడుపుకు కిలో చొప్పున!పోలీసుల కళ్లుగప్పేందుకు క్యారియర్లు వినూత్న పద్ధతిని అనుసరించారు. ఒక్కొక్కరు రెండు కాళ్లకు కిలో చొప్పున, కడుపుకు మరో కిలో.. మొత్తం 3 కిలోల హషీష్ ఆయిల్ను బ్రౌన్ టేపుతో శరీరానికి కట్టుకుని తరలించారు. నలుగురు క్యారియర్లు కలిపి 12 కిలోల హషీష్ ఆయిల్ తరలిస్తూ పట్టుబడ్డారు. వారి నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, రూ.5 వేల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 12 కిలోల హషీష్ ఆయిల్ను బెంగళూరుకు చేర్చేందుకు అక్కడి రిసీవర్ సిజో రూ.10 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. సరుకు బెంగళూరుకు చేరిన అనంతరం ప్రధాన నిందితులకు ఆ మొత్తాన్ని చెల్లించేలా ఒప్పందం జరిగినట్లు వెల్లడించారు.నిరుద్యోగ గిరిజన యువతే క్యారియర్లుఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు గెమ్మెలి శ్రీను, అతని భార్య నిబియా బెంగళూరులో ఉంటున్నట్లు సీపీ తెలిపారు. వీరిద్దరూ గిరిజన ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు డబ్బు ఆశ చూపి క్యారియర్లుగా ఉపయోగించుకుంటున్నారని