
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని డెక్కన్ కిచెన్ ప్రాపర్టీ వివాదంలో నటులు దగ్గుబాటి వెంకటేశ్, రానా దగ్గుబాటిలకు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని దగ్గుబాటి కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఎన్. తుకారాంజీ ఇటీవల తోసిపుచ్చారు. దీంతో నాంపల్లి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు విచారణ యథాతథంగా కొనసాగనుంది. ఈ వ్యవహారంలో నటులతో పాటు నిర్మాత డి. సురేష్ బాబు, డి. అభిరామ్, అకౌంటెంట్ గడ్డం విశ్వనాథం కూడా క్రిమినల్ విచారణను ఎదుర్కోనున్నారు. ఈ వివాదం మూలాలు 2014 కాలం నాటి లీజు ఒప్పందంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ సమయంలో దగ్గుబాటి కుటుంబం తమ భూమిని డబ్ల్యూ3 హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు లీజుకు ఇవ్వగా, వ్యాపారవేత్త కొరే నందు కుమార్ అక్కడ డెక్కన్ కిచెన్ రెస్టారెంట్ ఏర్పాటుకు భారీ పెట్టుబడులు పెట్టారు. అయితే 2018 నుంచి ప్రాపర్టీ లీజు హక్కులు, స్థలం స్వాధీనం విషయంలో ఇరువర్గాల మధ్య తీవ్ర విభేదాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 2022 నవంబర్లో జీహెచ్ఎంసీ అధికారులు ప్రాంగణంలోని కొన్ని నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేశారు. హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు అమలులో ఉన్నప్పటికీ 2024 జనవరిలో నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశారని బాధితుడు నందు కుమార్ కోర్టును ఆశ్రయించారు. దీంతో దగ్గుబాటి కుటుంబ సభ్యులు అధికారుల సహకారంతో లీజు ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించి, ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారని ప్రైవేట్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హౌస్ ట్రెస్పాస్, దొంగతనం, క్రిమినల్ కుట్ర వంటి తీవ్రమైన సెక్షన్ల కింద నమోదు చేసిన పిటిషన్ను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. క్రిమినల్ కేసును రద్దు చేయాలంటూ దగ్గుబాటి కుటుంబం 2024 లోనే హైకోర్టును ఆశ్రయించి తమ వాదనలను బలంగా వినిపించింది. ఇది కేవలం లీజు, ఆస్తుల స్వాధీనానికి సంబంధించిన సివిల్ వివాదమని, కాబట్టి క్రిమినల్ ప్రొసీడింగ్స్ సరికాదని