
Swetha Reddy : మా అన్నయ్య సీరియల్ నటిశ్వేతారెడ్డి బర్త్ డే.. సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్..
మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతారెడ్డి (Swetha Reddy) తన బర్త్ డే సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
© 2026 nimisham.in

మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతారెడ్డి (Swetha Reddy) తన బర్త్ డే సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సీరియల్ నటుడు మానస్ నాగులపల్లి తాజాగా తన కొడుకు ధ్రువ రెండో రెండో పుట్టిన రోజు వేడుకలను ఫ్యామిలీతో కలిసి ఘనంగా సెలబ్రేట్ చేసాడు. ఈ బర్త్ డే కి సంబంధించిన పలు సెలబ్రేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు మానస్.

బిగ్ బాస్ ఫేమ్, నటి అలేఖ్య హారిక తాజాగా తన పుట్టిన రోజుని ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకోగా వాటికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

పలు కన్నడ, తెలుగు సినిమాలు, సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకుంది కన్నడ నటి పాయల్ చెంగప్ప. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా సెలబ్రేషన్స్ నిర్వహించి దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తెలుగులో బబుల్ గమ్, లక్కీ భాస్కర్ తదితర సినిమాల్లో నటించిన మానస చౌదరి.. రీసెంట్గా అమ్మతో కలిసి కాశీ వెళ్లింది. అక్కడి ఘాట్స్లో తిరిగింది. తన పుట్టినరోజుని కూడా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంది. కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు) మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే snake plant ఈ మొక్కలని కిచెన్లో పెట్టుకుంటే.. మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

Nellore: పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు 'జై కొట్టు' నినాదం ఆవిష్కరణ నెల్లూరు: యువతను రాజకీయాల్లో భాగస్వామ్యం చేయడంతో పాటు సమాజంలో మార్పుకు వారిని భాగస్వాములుగా చేయడమే జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు దుగ్గిశెట్టి సుజిబాబు అన్నారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పరమేశ్వరి కళ్యాణ మండపంలో బుధవారం సుజయ్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువతతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ యువత కోసం ‘జై కొట్టు’ అనే నినాదాన్ని ఆవిష్కరించి ప్రకటించారు. దీంతో కార్యక్రమ ప్రాంగణం జనసేన కార్యకర్తలు, యువత నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ.. యువతలో రాజకీయ చైతన్యం తీసుకురావడంతో పాటు జనసేన పార్టీలో వారికి సముచిత భాగస్వామ్యం కల్పిస్తామని తెలిపారు. ‘జై కొట్టు’ నినాదంతో యువతను పెద్ద సంఖ్యలో రాజకీయాల వైపు ఆకర్షించి, పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. యువతతోనే సమాజంలో గణనీయమైన మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించడం రాజకీయ చరిత్రలో ప్రత్యేకమైన ఘట్టమని సుజయ్ బాబు అన్నారు. జనసేన పార్టీకి ప్రజల్లో, ముఖ్యంగా యువతలో పెరుగుతున్న ఆదరణకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో యువతను సమష్టిగా ముందుకు నడిపించి వైఎస్సార్సీపీని 11 స్థానాల నుంచి ఒక్క స్థానానికి పరిమితం చేసే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడం పవన్కళ్యాణ్ నాయకత్వంతోనే సాధ్యమవుతుందని సుజయ్ బాబు అన్నారు. ‘జై కొట్టు’ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పవన్కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలన్న లక్ష్యంతో యువతతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.అనంతరం భారీ కేక్ ను కట్ చేసి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజంటే అభిమానులు ఒక పండగలా భావిస్తారు. ఊరు వాడా కేక్ కటింగ్ లతో పాటు రక్తదానం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు పవన్ ఫ్యాన్స్. అలా ఈసారి కూడా పవన్ పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు అభిమానులు. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. అయితే దురదృష్టవశాత్తూ ఈ వేడుకల్లో ఒక అపశ్రుతి చోటు చేసుకుంది. అమలాపురంకు చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ అనే అభిమాని ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే ఈ విషాద ఘటన గురించి తెలుసుకున్న ప్రముఖ నిర్మాత ప్రేమ్ కుమార్ కుటుంబానికి అండగా నిలిచారు. మృతుని కుటుంబానికి రూ. 2లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎస్కేఎన్.. 'నేను కూడా ఒకప్పుడు బ్యానర్లు కడుతూ, అభిమానిగా మొదలుపెట్టి ఈ స్థాయికి వచ్చాను. అందుకే ఒక అభిమాని బాధ నాకు ఎంత దగ్గరగా ఉంటుందో నాకు తెలుసు.అందులోనూ మన హీరో పుట్టినరోజు రోజునే మన అభిమాని ప్రేమ్ కుమార్ ఇలా అకాలంగా మనకు దూరమవ్వడం ఎంతో బాధ కలిగించింది. ఈ కష్ట సమయంలో నేను ఆయన కుటుంబం పక్కన ఒక అభిమానిగా, ఒక మనిషిగా నిలబడాలని అనుకుంటున్నాను. వారి బాధను తీర్చలేకపోయినా, నా వంతుగా ఒక చిన్న ఆర్థిక సహాయం 2,00,000 అందించడం ద్వారా నా సంఘీభావాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. మన అభిమాని కుటుంబానికి మనమంతా అండగా నిలుద్దాం' అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు ఎస్కేఎన్. నేను కూడా ఒకప్పుడు బ్యానర్లు కడుతూ, అభిమానిగా మొదలుపెట్టి ఈ స్థాయికి వచ్చాను. అందుకే ఒక అభిమాని బాధ నాకు ఎంత దగ్గరగా ఉంటుందో నాకు తెలుసు. అందులోనూ మన హీరో పుట్టినరోజు రోజునే మన అభిమాని
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా తన తమ్ముడికి బర్త్ డే విషెస్ అందజేశారు. కళ్యాణ్ బాబు సంకల్ప సాధకుడని ప్రశంసించారు. తన సోదరుడిని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు. తమ కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తారని కొనియాడారు. తన్న అన్న పోస్టుపై పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. తండ్రి స్థానంలో నిలిచి తనకు దిశ చూపిన మొదటి హీరో మీరే అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.''చిరంజీవి అన్నయ్యా.. మీ ప్రేమకు, ఆప్యాయతకు, శుభాకాంక్షలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. చిన్ననాటి నుంచి నాపై మీరు చూపిన నమ్మకం, ఇచ్చిన అండ నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనవి. తండ్రి స్థానంలో నిలిచి నాకు దిశ చూపిన మీరు నా జీవితంలో మొదటి హీరో. జీవితంలో ఏం సాధించాలో తెలియని రోజుల నుంచి నన్ను నడిపించిన మీ మాటలు, మీ ఆలోచనలు నాతోనే ఉన్నాయి. కుటుంబం పట్ల మీ ప్రేమను, సమాజం పట్ల మీ బాధ్యతను, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలనే మీ తపనను చూస్తూ పెరిగాను. ఆ అనుభవాలే నా ఆలోచనలకు ఒక దిశను ఇచ్చాయి. మీరు నా జీవితానికి ఎప్పటికీ మార్గదర్శి. మన ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులతో, మీ ఆశీస్సులతో ముందుకు సాగుతాను'' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.చిరంజీవి పోస్ట్ చేస్తూ.. ''సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.. నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు. మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు

ఏపీలో అధికార కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మధ్య తాజాగా గ్యాప్ నెలకొందన్న ప్రచారం జరుగుతోంది. పవన్ తరచుగా కేబినెట్ భేటీలకు, చంద్రబాబు పాల్గొంటున్న కీలక కార్యక్రమాలకు హాజరు కాకపోవడంతో ఈ ప్రచారం సాగుతోంది. అలాగే పవన్ కళ్యాణ్ స్దానిక ఎన్నికల్లో జనసేన పోటీపై చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇలాంటి సమయంలో టీడీపీ ఎంపీ ఒకరు ఆయన పుట్టినరోజును ఇవాళ ఘనంగా నిర్వహించడంతో పాటు జనసేనాని నాయకత్వంపైనా ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశమైంది.ఉద్యోగులతో గ్యాప్ పెరుగుతున్న వేళ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni) ఇవాళ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. తిరువూరు జనసేన పార్టీ ఇంచార్జి మనుబోలు శ్రీనివాసరావు, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరంమని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ మైత్రి రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని అన్నారు. కూటమి ఐక్యతతోనే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలమన్నారు. ఏం చేసినా క్రెడిట్ చోరీ చేసేస్తున్న జగన్ ..! రేపు ఇవన్నీ.. చంద్రబాబు జోస్యం..!ఎన్టీఆర్ జిల్లా కూటమి తరఫున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. గతంలో రాష్ట్రంలో సాగిన దుష్ట పరిపాలనకు చరమగీతం పాడేందుకు పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం, కూటమి ఏర్పాటులో ఆయన పోషించిన కీలక పాత్రను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరువరని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ఎలాంటి వ్యక్తిగత లేదా రాజకీయ లాభాలను ఆశించకుండా, రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. జనసేన జైకొట్టు లోగో ఆవిష్కరణ జనసేన అధినేత పవన్కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం పిఠాపురంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ యువజన విభాగం ‘జై కొట్టు’ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యకర్తలకు ఆడియో సందేశం ఇచ్చారు. చెయ్యొత్తి జై కొట్టు నినాదం మనందరినీ ఎంతో కదిలిస్తుంది. ఆ స్ఫూర్తిని మీకు అందించాలనే అధినేత పవన్ ఈ లోగో పెట్టారు. జై కొట్టు నినాదంతో ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రాజకీయాల్లో యువతకు ప్రత్యేక స్థానం కల్పించాలనే ఈ విభాగాన్ని ఏర్పాటు చేశాం. అరుపులు.. కేకలు కాదు.. క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. అధినేత ఆదేశాలను జనసైనికులు క్రమశిక్షణతో పాటించాలి అని సూచించారు. ఈ వార్తకు సంబంధించిన

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు వేడుకల అదరహో అనే రేంజ్లో జరిగాయి. తెలుగునేలపైనే కాదు తెలుగువారున్న పలు ప్రాంతాల్లో పవన్ పుట్టినరోజు (HBDPawanKalyan)ను ఘనంగా జరుపుకున్నారు ఫ్యాన్స్. ఈ సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ సారి మరింత ఘనంగా జరిగిందని చెప్పవచ్చు. ఊరూరా, వాడవాడలా పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్ను ఫ్యాన్స్ ఉత్సాహంగా జరుపుకున్నారు. తెలుగునేలపైనే కాదు ప్రపంచంలోని నలుమూలల ఉన్న తెలుగువారిలో చాలామంది పవన్ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం విశేషం. పవన్కు దేశప్రధాని నరేంద్ర మోదీ, ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవితో పాటు పవన్ భార్య అన్నా, ఆయన నిర్మాత బండ్ల గణేశ్ తదితరులు విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పలు స్పెషల్ వీడియోస్ కూడా క్రియేట్ చేశారు. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ పవన్ పై ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మరికొందరు సినీజనం కూడా పవన్ పుట్టినరోజున స్పెషల్ వీడియోస్ రిలీజ్ చేయడం విశేషం. ఇక పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్లో సాయిధరమ్ పాల్గొని అభిమానులకు ఆనందం పంచారు... చిత్రసీమలోని పలువురు పవన్కు బర్త్ డే విషెస్ చెప్పారు. పవన్ కళ్యాణ్పై ‘ఓజీ’ నటి శ్రియా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ 200 కోట్ల క్లబ్లోకి ‘ఇరుముడి’.. మణికంఠుడి పోస్టర్ వైరల్ ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. బండ్లన్న మళ్లీ స్టార్ట్ చేశాడ్రోయ్

Bhimavaram: పవన్ కళ్యాణ్ జన్మదిన బైక్ ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు! Bhimavaram: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవర్ కారిడార్లలో డిప్యూటీ సీఎం అనే పదవికి సరికొత్త గ్లామర్, బ్రాండ్ ఇమేజ్ ను తెచ్చిపెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం భీమవరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. విస్సాకోడెరు వంతెన దగ్గర జియో పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఉండి రోడ్డులోని మల్టీప్లెక్స్ ఎమ్మెల్యే కార్యాలయం వరకు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలతో బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ కేవలం ఒక హోదాగా పరిమితం కాకుండా ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించే సేవకుడిగా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో పాలనందిస్తున్నారని అన్నారు. సినిమా పరిశ్రమ నుండి ప్రజా నాయకుడిగా ఎదిగిన పవన్ కళ్యాణ్ ప్రస్థానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు. ప్రజాదరణ పొందిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని, సమాజ సేవలో నిరంతరం కొనసాగాలని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామని అన్నారు. పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలతో అభివృద్ది కార్యక్రమాలతో పెనుమార్పులు తెస్తున్నారని, గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయన్నారు. అనంతరం జియో పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఓవర్ బ్రిడ్జి, బుధవారం మార్కెట్ రోడ్, పోలీస్ బొమ్మ సెంటర్, ప్రకాశం చౌక్, అంబేడ్కర్ సెంటర్, బాంబే స్వీట్స్ సెంటర్, ఉండి రోడ్డు మీదుగా ఎమ్మెల్యే

Pithapuram: ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం కుమారపురం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికుల ఆధ్వర్యంలో పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.శ్రీ అభయ బ్లడ్ సెంటర్ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పలువురు జనసైనికులు, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం నాయకులు, జనసైనికులు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలకు మంచి చేయాలనే తపనతో, సేవా భావంతో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్న తీరు తమకు స్ఫూర్తినిస్తోందని, ఆయన ఆశయాల సాధన కోసం ఎల్లప్పుడూ ఆయన నాయకత్వంలో పనిచేస్తామని తెలిపారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. కార్యక్రమానికి సహకరించిన నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, కుమారపురం గ్రామ జనసైనికులు, గ్రామస్తులు, శ్రీ అభయ బ్లడ్ సెంటర్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

Chittoor: చిత్తూరులో పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలు: భారీ స్కూటర్ ర్యాలీ! చిత్తూరు: డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను చిత్తూరులో జనసేన పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి అరణి కవిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుకల్లో భాగంగా చిత్తూరు నగరంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం నుంచి మురకంబట్టు వరకు సాగిన ఈ ర్యాలీకి చిత్తూరు జనసేన సీనియర్ నాయకులు పగడాల శశికాంత్ నాయకత్వం వహించారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాలు చేతబట్టి పవన్ కళ్యాణ్కు అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. అలాగే చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల మండలం నుంచి సుమారు 100 మంది జనసేన నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వేడుకలకు తరలివచ్చారు. దీంతో కార్యక్రమ ప్రాంగణం జనసేన శ్రేణులతో సందడిగా మారింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉదయం నుంచి సోషల్ మీడియాలో పవన్ కు బర్త్ డే విషెస్ వెల్లువలా కురుస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు వేడుకలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉదయం నుంచి సోషల్ మీడియాలో పవన్ కు బర్త్ డే విషెస్ వెల్లువలా కురుస్తున్నాయి. అభిమనులతో పాటు.. సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఆయన బర్త్ డే రోజున సందర్భంగా అభిమానులకు, సినీ ప్రియులకు ఒక అద్భుతమైన బిగ్ సర్ప్రైజ్ లభించింది. ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ నుంచి ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ సినిమా విజన్ గురించి ప్రత్యేకంగా వివరిస్తూ.. సౌత్ ఈస్ట్ ఎమోషన్స్, ఇండియన్ బ్యాక్డ్రాప్ను వెస్ట్రన్ శైలిలో ప్రజెంట్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఆజాద్ హింద్ ఫౌజ్ రోజుల నుంచి నేటి 1970ల కాలం దాకా సాగే ఈ కథాంశంలో అద్భుతమైన పొటెన్షియల్ ఉందని, ప్రతి ఒక్కరం మన లైఫ్టైమ్లో ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్లకు పవన్ కళ్యాణ్ సూచించారు.ఈ చిత్రంలో జపనీస్ సంస్కృతికి చెందిన సమురాయ్ ఎలిమెంట్స్, జపాన్ యాకుజా నేపథ్యం కీలకంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇక వీడియోలో పవన్ సమురాయ్ కత్తి పట్టుకొని ఓజస్ గంభీర ఎంతో గాంభీర్యంగా కనిపించారు. 'సమురాయ్ రేమై.. యాకుజా మేకై' అనే పవర్ ఫుల్ క్యాప్షన్తో ఈ ఓజీ విశ్వం యొక్క విస్తృతిని పరిచయం చేశారు. ఓజీ యూనివర్స్ గురించి పవన్, తమన్, సుజీత్ మాట్లాడుతూ.. 'మన కొత్త బ్లడ్ గ్రూప్ ఓజీ సార్ అని తమన్ అనగా ఇది యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అని సుజీత్ అనడం సినిమాపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. తమన్ అందించిన నేపధ్య సంగీతం, యానిమేషన్

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బర్త్డేను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న వేళ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న వేళ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అభిమాన హీరో జన్మదినాన్ని ఘనంగా నిర్వహించాలనే ఉత్సాహం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుని, ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. అమలాపురంలో పవన్ కళ్యాణ్ బర్త్డే ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై.. రోళ్ల ప్రేమ్ కుమార్ అనే యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ దుర్ఘటన పవన్ అభిమానులతో పాటు సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామానికి చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ (Prem Kumar) హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం ఉన్న ప్రేమ్ కుమార్, తన అభిమాన నాయకుడి పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి సొంత ఊర్లో ఘనంగా నిర్వహించాలని హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో అమలాపురంలోని ఓ ప్రైవేట్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన పవన్ కళ్యాణ్ భారీ ఫ్లెక్సీ బ్యానర్ను ఏర్పాటు చేసేందుకు స్నేహితులతో కలిసి సిద్ధమయ్యాడు. బ్యానర్ కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు పైనున్న హైటెన్షన్ విద్యుత్ వైరు తగిలింది. దీంతో కరెంట్ షాక్ తగలడంతో ప్రేమ్ కుమార్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న అమలాపురం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద వార్త తెలుసుకున్న

Pawan Kalyan Birthday : పవన్ కల్యాణ్... తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరిది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారు ఉండరు... ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరిది. సినీ అభిమానులకు 'పవర్ స్టార్' గా... రాజకీయ అభిమానులకు 'జనసేనాని' గా.. ఆడబిడ్డలకు 'పవనన్న' గా... మరికొందరికి 'కల్యాణ్ బాబు'గా సుపరిచితమే. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యధికమంది అభిమానులకు కలిగిన హీరో పవన్ కల్యాణ్ అనడంలో అతిశయోక్తి లేదు. పొలిటికల్ గా కూడా ఆయన ఎంత స్ట్రాంగో గత ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పలితమే తెలియజేసింది. మొత్తంగా పవన్ కల్యాణ్ అంటే ఓ పేరు కాదు ఓ బ్రాండ్ గా మారిపోయింది. ఈ పేరు వినిపిస్తే చాలు అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి... అభిమానం కట్టలుతెంచుకుంటుంది. చాలామంది తమ పిల్లలకు పవన్ కల్యాణ్ అని పేరు పెట్టుకుంటున్నారంటేనే ఈ పేరులో మ్యాజిక్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అయితే నిజానికి పవన్ కల్యాణ్ అసలుపేరు ఇది కాదట.. తల్లిదండ్రులు వేరే పేరు పెట్టారట. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అసలు పేరు ఏంటి? పవన్ కల్యాణ్ గా ఎలా మారారు? వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. సెప్టెంబర్ 2, 1971 లో ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్లలో పవన్ కల్యాణ్ జన్మించారు. ఆయన తండ్రి కొణిదెల వెంకటరావు, తల్లి అంజనా దేవి... వీరికి చివరి సంతానంగా పుట్టారు. తమ బిడ్డకు ఈ దంపతులు కల్యాణ్ కుమార్ అని పేరు పెట్టారు. తండ్రి వెంకటరావు ఎక్సైజ్ పోలీస్ కావడంతో కొణిదెల ఫ్యామిలీ అనేక ప్రాంతాలు తిరగాల్సి వచ్చింది. ఇలా బాపట్లలో పుట్టిన కల్యాణ్ కుమార్ నెల్లూరులో విద్యాబ్యాసం చేశారు. తర్వాత అన్న చిరంజీవితో కలిసి చెన్నైలో ఉన్నారు... ఇక్కడే ఉన్నత విద్యాబ్యాసం చేశారు. సినిమా ఇండస్ట్రి చెన్నై నుండి హైదరాబాద్ కు మారినతర్వాత అన్నతోపాటే పవన్ కూడా

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఆయనకున్న అశేష ప్రజాదరణ, స్టార్డమ్, పవర్ ప్యాక్డ్ వ్యక్తిత్వం గురించే అందరూ చర్చిస్తుంటారు. అయితే, తెరవెనుక ఆయనలో ఉన్న అరుదైన మానవతా దృక్పథాన్ని, ఆపన్నుల పట్ల ఆయన చూపించే ప్రేమను ఆవిష్కరిస్తూ ‘ఓజీ’ (OG) చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటి శ్రియా రెడ్డి (Sriya Reddy) సోషల్ మీడియా వేదికగా చేసిన భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్లోని సేవా గుణాన్ని శ్రియా రెడ్డి వివరిస్తూ.. ‘‘హ్యాపీ బర్త్డే పీకే సర్! మీ గురించి మాట్లాడేటప్పుడు ప్రజలు చాలా గొప్ప విషయాలు చెబుతుంటారు. కానీ నా మనసులో బలంగా ముద్రపడిపోయినవి మాత్రం.. సైలెంట్గా మీరు చేసే మంచి పనులే. ఎదుటివారి మాటలను మీరు వినే విధానం, వారి కష్టాలను గుర్తుపెట్టుకునే తీరు.. అన్నింటికంటే ముఖ్యంగా వారి సమస్యను పరిష్కరించడానికి మీరు రంగంలోకి దిగి కార్యాచరణ చేసే పద్ధతి ఎవరికీ సాధ్యం కాదు. మీరు కేవలం వినడం మాత్రమే కాదు, దాన్ని గుర్తుపెట్టుకుని వెంటనే చేసి చూపిస్తారు’’ అంటూ పవన్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. పవన్ కళ్యాణ్ సైలెంట్గా చేసిన పలు సంఘటనలను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. ‘‘భారత మహిళా అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తన గ్రామానికి రోడ్డు సౌకర్యం గురించి మీతో ప్రస్తావించినప్పుడు.. మీరు శ్రద్ధగా విన్నారు, ఆ సమస్యను పరిష్కరించి చూపించారు. ఓ వృద్ధురాలు తన ఇంటికి మళ్లీ రమ్మని మిమ్మల్ని కోరితే.. ఎన్నో ఏళ్ల

అమలాపురంలో విద్యుత్ షాక్తో జన సైనికుడి మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రేమ్ కుమార్ మృతి కలిచివేసిందన్నారు. అమరావతి, సెప్టెంబర్ 2: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్కు గురై ప్రేమ్కుమార్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉపముఖ్యమంత్రి స్పందిస్తూ.. యువకుడి మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై జనసైనికుడు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. యువకుడి కుటుంబానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. జీవితం ఎంతో అమూల్యమైనదని పవన్ అన్నారు. ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సమయంలో మన కోసం కుటుంబం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఎత్తైన ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో, ర్యాలీల్లో స్వీయ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలు చేశారు. జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’.. పిఠాపురంలో లోగో ఆవిష్కరణ అన్నమయ్య ప్రాజెక్ట్ విపత్తు క్రెడిట్ జగన్కే దక్కుతుంది: పట్టాభి

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, జనసేన శ్రేణులు పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నారు. పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, జనసేన శ్రేణులు పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం (AP Deputy CM)కు శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ బర్త్డే అంటే అందరి కళ్లూ ఎదురుచూసేది ఒక్కరి ట్వీట్ కోసమే.. ఆయనే ప్రముఖ నిర్మాత, పవన్ వీరాభిమాని బండ్ల గణేష్ (Bandla Ganesh)! గతంలో పవన్ కళ్యాణ్ మూవీ ఆడియో ఫంక్షన్లలో బండ్లన్న ఇచ్చిన స్పీచ్లు, డైలాగులు ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్ పుట్టినరోజు సందర్భంగా బండ్ల గణేష్ పెట్టిన సుదీర్ఘమైన, ఎమోషనల్ ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన మార్క్ భక్తిని చాటుకుంటూ బండ్లన్న చేసిన పోస్ట్ చూసి ‘బండ్లన్న మళ్లీ పూనకాలతో పూనకేశ్వరుడిగా మారాడు’ అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ను ఆకాశానికెత్తుతూ బండ్ల గణేష్ రాసిన పదాలు అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ‘‘ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. మీ పేరు వింటే పూనకం… మీ పేరు వింటే పులకం… మీ రూపం చూస్తే పులకింత… మీ మాట వింటే ధైర్యం… మీ అడుగు పడితే సంచలనం! మీరు కేవలం ఒక హీరో మాత్రమే కాదు… కోట్లాది మందికి ఒక బలమైన భావోద్వేగం. మీరు ఒక స్టార్ కాదు… నడిచే ఒక అద్భుత శక్తి. మీరు ఒక సాధారణ పేరు కాదు… కోట్లాది హృదయాల్లో ఎప్పటికీ చెరగని ముద్ర. మీ శిష్యుడిగా మిమ్మల్ని అభిమానించడం నా పూర్వజన్మ సుకృతం

జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’ పిఠాపురంలో లోగో ఆవిష్కరించిన నాదెండ్ల పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆడియో సందేశం Jai Kottu Logo Launch: జనసేన పార్టీ తమ అధికారిక యువజన విభాగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ యువజన విభాగానికి 'జై కొట్టు(Jai Kottu Logo Launch)' అనే శక్తివంతమైన పేరును ఖరారు చేస్తూ, దానికి సంబంధించిన లోగోను పిఠాపురంలో ఘనంగా ఆవిష్కరించారు. పార్టీ నాదెండ్ల మనోహర్ ఈ లోగోను విడుదల చేయగా, పెద్ద ఎత్తున జనసైనికులు, యువత హాజరయ్యారు. రాష్ట్ర నిర్మాణంలో యువత భాగస్వామ్యం ఎంతైనా ఉందని, వారి భావాలను, సమస్యలను వేదికపైకి తీసుకురావడానికే ఈ వేదికను సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. BRS Charge Sheet: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై చార్జ్షీట్.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన బీఆర్ఎస్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు పిఠాపురంలో వేడుకగా కార్యక్రమం: నాదెండ్ల మనోహర్ లోగో ఆవిష్కరణ: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా 'జై కొట్టు' లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో మార్పు తీసుకురావడానికి యువశక్తి ఎంతో కీలకమని పేర్కొన్నారు. జనసేన సిద్ధాంతాలను ప్రజా క్షేత్రంలోకి బలంగా తీసుకెళ్లడంలో 'జై కొట్టు' విభాగం చురుగ్గా వ్యవహరిస్తుందని, యువతలోని నాయకత్వ పటిమను బయటకు తీయడమే దీని ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆడియో సందేశం: ఈ ఆవిష్కరణ సందర్భంగా జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంపిన ప్రత్యేక ఆడియో మెసేజ్ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పవన్ కళ్యాణ్ తన సందేశంలో యువతకు దిశా నిర్దేశం చేస్తూ, బాధ్యతాయుతమైన రాజకీయం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. 'జై కొట్టు' అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదని, అది యువత ఆశయాలకు, ఆకాంక్షలకు ప్రతిరూపమని

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Pawan Kalyan Flop Movies List: ఉస్తాద్ భగత్ సింగ్:‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా అందరి అంచనాలను తలకిందలు చేస్తూ డిజాస్టర్గా నిలిచింది. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో అత్యధిక రోజులు షూటింగ్ జరుపుకున్న చిత్రంగా రికార్డులకు ఎక్కింది. గతేడాది రిలీజైన ఈ పవన్ కళ్యాణ్ కెరీర్ లో డిజాస్టర్గా నిలిచింది. ఖుషీ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ మెగాఫోన్ పట్టుకొని తెరకెక్కించిన చిత్రం‘జానీ’. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా..అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అజ్ఞాతవాసి.. త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా ‘అజ్ఞాతవాసి’. వీళ్ల కలయికలో వచ్చిన మూడో సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో అన్న నాగబాబు నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘గుడుంబా శంకర్’. వీర శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. తొలి ప్రేమ తర్వాత డైరెక్టర్ ఏ.కరుణా కరణ్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘బాలు’. ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై టాప్ డిజాస్టర్ మూవీగా నిలిచింది. ‘ఖుషీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎస్.జే.సూర్య కాంబినేషన్లో పవన్

విజయనగర సామ్రాజ్యం అనగానే మనందరికీ గుర్తుకువచ్చే ఏకైక పేరు.. శ్రీకృష్ణదేవరాయలు. ఆ గొప్ప విజయనగర సామ్రాజ్య వైభవాన్ని, కృష్ణదేవరాయ రాజసాన్ని ఇప్పుడు మళ్ళీ బిగ్ స్క్రీన్ పై చూడబోతున్నాం. కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు, సినీ ప్రేమికులకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ ఇచ్చింది. అదే 'దేవరాయ' (Devaraaya) సినిమా టైటిల్ అనౌన్స్మెంట్. సుప్రియన్వి పిక్చర్ స్టూడియోతో పీపుల్ మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కిచ్చా సుదీప్ శ్రీకృష్ణదేవరాయల పాత్రలో కనిపించబోతున్నారు. దేవరాయ పాత్రలో సుదీప్ రాయల్ లుక్, ఈ టైటిల్ గ్లింప్స్ సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టైటిల్ గ్లింప్స్ తోనే గూస్ బంప్స్ తెప్పించారని చెప్పొచ్చు. ప్రొడ్యూసర్స్ టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతిష్టాత్మకంగా ఈ విజువల్ స్పెక్టకిల్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ చరిత్ర, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్ గ్రాండ్నెస్.. ఇవన్నీ చూస్తుంటే ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, బిగ్ స్క్రీన్ పై ఒక పీరియాడిక్ ఎపిక్ కాబోతోందని స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి గౌరహరి అందిస్తున్న సంగీతం వింటేనే ఒక రేంజ్లో గూస్బంప్స్ వస్తున్నాయి. కిచ్చా సుదీప్ పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ నిర్మాణ విలువల కలయికలో రాబోతున్న ఈ 'దేవరాయ' విజువల్ వండర్ ని బిగ్ స్క్రీన్స్ పై చూడటానికి 2027 డిసెంబర్ వరకు వేచి చూడక తప్పదు. Panjaa Re Release: 3 గంటల్లో 150 షోలు సోల్డ్ అవుట్.. రీ రిలీజ్ బాక్సాఫీస్ షేక్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 2వ తేదీన తన 55వ జన్మదినాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేవలం రాష్ట్ర నాయకులే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షల సందేశాలు పంపించారు. సినిమా రంగంలో పవర్ స్టార్గా కోట్ల మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న పవన్ కల్యాణ్, ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజాసేవలో బిజీగా మారారు. జనసేన పార్టీని స్థాపించి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే ఆయన తన 55వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం చంద్రబాబు తన పోస్టులో పవన్ కల్యాణ్ను ప్రియ మిత్రుడిగా సంబోధిస్తూ ఆయన సేవా నిరతిని కొనియాడారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ రోడ్ల నిర్మాణం, పచ్చదనం పెంపొందించడం మరియు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టారని కొనియాడారు. దీంతో రాష్ట్ర పునర్నిర్మాణ హామీలను నెరవేర్చేందుకు పవన్ నిరంతరం శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మంత్రి నారా లోకేశ్ కూడా పవన్ కల్యాణ్పై తనకున్న అభిమానాన్ని ప్రత్యేక పోస్ట్ ద్వారా చాటుకున్నారు. పవన్ కల్యాణ్ను దేవుడిచ్చిన అన్నయ్యగా అభివర్ణించిన లోకేశ్, సినీ అభిమానులకు ఆయన పవర్ స్టార్ అయితే జనసైనికులకు మార్గదర్శకుడైన సేనాని అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పవన్ జన్మదిన వేడుకలు ఒక పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయని చెప్పారు. ఫలితంగా అభిమానులు, నాయకులు భారీ ఎత్తున సేవా

కన్నడ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక భారీ తీపి కబురు అందడంతో సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ ప్రత్యేకమైన వేడుకను పురస్కరించుకుని ఆయన నటిస్తున్న కొత్త చిత్రం దేవరాయ ఫస్ట్ లుక్ పోస్టర్ను అధికారికంగా విడుదల చేశారు. చిత్రబృందం ఈ సర్ప్రైజ్ ప్రకటించడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సామాజిక దృశ్యమాధ్యమాల్లో ఈ ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో కిచ్చా సుదీప్ కనిపించిన తీరు మరియు ఆయన గెటప్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. సుదీప్ తనదైన ముద్రతో దేవరాయ పాత్రలో అత్యంత శక్తివంతంగా కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా, పోస్టర్లో చూపించిన ప్రతి అంశం కూడా కథలోని తీవ్రతను, సినిమాలో ఉండబోయే భారీ యాక్షన్ ఘట్టాలను స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ విజువల్స్ సినీ విమర్శకులను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఫస్ట్ లుక్ విడుదలై క్షణాల్లోనే సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సుదీప్కు సామాజిక వేదికల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫలితంగా దేవరాయ చిత్రంపై ఉన్న క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. చిత్రబృందం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో, అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ సినిమాకు సంబంధించిన తదుపరి తాజా వివరాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ముందుముందు ఈ చిత్రం నుంచి మరిన్ని సర్ప్రైజ్లు ఉంటాయని చిత్రబృందం సంకేతాలు ఇచ్చింది. దేవరాయ చిత్రాన్ని అత్యంత సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సుదీప్ కెరీర్లోనే ఇది ఒక ప్రత్యేకమైన మరియు విభిన్నమైన ప్రాజెక్ట్గా నిలిచిపోతుందని నిర్మాతలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. కథనంలో ఉన్న కొత్తదనం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. రాబోయే రోజుల్లో దేవరాయ సినిమాకు సంబంధించిన టీజర్ మరియు
టీవీలో వినోదం అనేది ఎప్పుడూ దొరుకుతూనే ఉంటుంది. ఏ టైంలో అయినా సరే ఏ ఛానెల్ పెట్టినా బుల్లితెరపై ఛానెల్స్లో ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. అలా బుల్లితెరపై 24 గంటలు వినోదానికి అయితే కొరత ఉండదు. ఇంట్లో ఉండే వారికి, మహిళలకు బుల్లితెర అనేది రిలాక్స్, ఎంటర్టైన్మెంట్ మోడ్ను ఇస్తుంది. ఇక రేపు అంటే గురువారం అన్ని ఛానెల్స్లో ప్రసారం అయ్యే సినిమాల లిస్ట్ ఓ సారి చూద్దాం.డీడీ యాదగిరి చానెల్లో మధ్యాహ్నం రెండు గంటలకు ఉడతా ఉడతా ఊచ్ రానుంది. ఈటీవీ ప్లస్లో రాత్రి తొమ్మిదిన్నరకి మీ శ్రేయోభిలాషి రానుంది. ఈటీవీలో మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి పదిన్నరకి సందడే సందడి రానుంది. ఈటీవీ సినిమాలో ఏడు గంటలకు ఓ చినదాన, ఉదయం 10 గంటలకు జగదేకవీరుని కథ, ఒంటి గంటకు మహానగరంలో మాయగాడు, సాయంత్రం నాలుగు గంటలకు మా ఆవిడ కలెక్టర్, ఏడు గంటలకు బలరామకృష్ణులు, రాత్రి పది గంటలకు గుండా, మిడ్ నైట్ ఒంటి గంటకు మళ్లీ ఓ చినదాన మూవీని రిపీట్ మోడ్లోనే ప్రసారం చేయనున్నారు.జెమినీ లైఫ్లో ఉదయం 11 గంటలకు 1940లో ఒక గ్రామం, సాయంత్రం నాలుగున్నరకి జగపతి చిత్రాలు రానున్నాయి. జెమిని టీవీలో ఉదయం 9 గంటలకు సాంబ, మూడు గంటలకు రచ్చ రానున్నాయి. జెమినీ మూవీస్లో మిడ్ నైట్ ఒకటిన్నరకి స్వప్నలోకం, ఉదయం నాలుగున్నరకి అందరూ దొంగలే, ఉదయం ఏడు గంటలకు రావుగారిల్లు, పది గంటలకు బిల్లా, ఒంటి గంటకు లోఫర్, నాలుగు గంటలకు పూలరంగడు, ఏడు గంటలకు సీమసింహం, రాత్రి పది గంటలకు వేటగాడు ప్రసారం కానున్నాయి.జీ తెలుగులో ఉదయం 9 గంటలకు నువ్వులేక నేనులేను, సాయంత్రం ఐదు గంటలకు పిండం రానున్నాయి. జీ సినిమాలు ఛానెల్లో ఉదయం 7 గంటలకు స్టూడెంట్ నెంబర్ 1, 9 గంటలకు మిస్టర్ మజ్ను, 12 గంటలకు హనుమాన్, 3 గంటలకు రంగ్

Panja Re Release: కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోయినా, కాలం గడిచేకొద్దీ వాటికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల విషయంలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లో అలాంటి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సినిమాల్లో ‘పంజా’ కూడా ఒకటి. 2011లో విడుదలైన ఈ యాక్షన్ డ్రామా అప్పట్లో మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ స్టైల్, స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు దాదాపు 15 ఏళ్ల తర్వాత అదే సినిమా మరోసారి థియేటర్లలోకి రావడంతో అభిమానుల సందడి మామూలుగా లేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పంజా’ మూవీని 4Kలో రీమాస్టర్ చేసి థియేటర్లలోకి తీసుకొచ్చారు. తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ మూవీ మంగళవారం రాత్రి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ప్రీమియర్ షోలు నిర్వహించడంతో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ను జై పాత్రలో మరోసారి పెద్ద తెరపై చూసే అవకాశం రావడంతో అభిమానులు థియేటర్లకు భారీగా తరలివచ్చారు. అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే ‘పంజా’ రీ రిలీజ్కు ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యే సమయానికి అన్ని ప్రాంతాలను కలిపి రూ.3 కోట్లకు పైగా ప్రీ సేల్స్ నమోదైనట్లు తెలుస్తోంది. రీ రిలీజ్ సినిమాలకు ఈ రెస్పాన్స్ రావడం అరుదుని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన రీ రిలీజ్ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించే సినిమాగా ‘పంజా’ నిలిచే అవకాశం ఉందనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరో ప్రత్యేకత పవన్ కళ్యాణ్ అభిమానుల సెలబ్రేషన్స్. ఆయన బర్త్ డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు సింగిల్ స్క్రీన్ థియేటర్ల వద్ద అభిమానులు భారీగా సంబరాలు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Mega wishes: మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నదమ్ములుగా మాత్రమే కాకుండా.. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, గౌరవాన్ని వారు ఎన్నో సందర్భాల్లో చాటుకున్నారు. ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ను ఉద్దేశిస్తూ చిరంజీవి చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. “సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు” అంటూ తన తమ్ముడిపై ఉన్న ప్రేమను, గర్వాన్ని చిరంజీవి చాటుకున్నారు. చిన్నప్పటి నుంచే పవన్లో నిబద్ధతతో కూడిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, ప్రజలకు మంచి చేయాలనే తపనను చూస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమై.. ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే ఉద్దేశంతో వేస్తారని కొనియాడారు. తమ కుటుంబంపై పవన్ ఎంత ప్రేమ చూపిస్తారో.. తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తారని చిరంజీవి అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ.. అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకెళ్తున్న తీరు తనకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోందని చిరంజీవి తెలిపారు. ముఖ్యంగా తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు పవన్ ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నారని అన్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే పవన్ కళ్యాణ్.. తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు. ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటూ.. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని

Devaraaya: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. సుదీప్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవరాయ’ నుంచి కీలకమైన అప్డేట్ను విడుదల చేశారు. ఈ సినిమాలో సుదీప్ శ్రీకృష్ణదేవరాయలుగా కనిపించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘చరిత్రను మార్చిన సామ్రాజ్యం.. ఒక శకాన్ని నిర్వచించిన మహారాజు.. కాలాన్ని దాటి నిలిచిపోయే ఓ దిగ్గజం’ అంటూ ‘దేవరాయ’ను మేకర్స్ పరిచయం చేశారు. అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ను శ్రీకృష్ణదేవరాయల పాత్రలో చూపించబోతున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు భారత చరిత్రలో అత్యంత గొప్ప రాజుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అలాంటి చారిత్రక పాత్రలో సుదీప్ కనిపించనుండటంతో ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి నెలకొంది. విడుదల చేసిన గ్లింప్స్లో సుదీప్ లుక్ రాజసం, గంభీరతతో ఆకట్టుకునేలా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సుప్రియాన్వి పిక్చర్ స్టూడియో బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 డిసెంబర్లో థియేటర్లలోకి రానుందని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటి వరకు సుదీప్ మాస్, యాక్షన్ పాత్రలతో ప్రేక్షకులను అలరించగా.. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల వంటి చారిత్రక పాత్రలో ఆయన ఎలా కనిపించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సుదీప్ కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Pawan kalyan fan dies due to electric shock in amalapuram: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. ముఖ్యంగా జనసైనికులు తమ అభిమాన హీరో, డిప్యూటీ సీఎం పేరు మీదుగా పలు ఆలయాల్లో అర్చనలు, పూజలు, అన్నదానాలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా పలు చోట్ల ఆస్పత్రులలో పండ్లను కూడా పంపిణి చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తన కుడి భూజానికి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అయితే.. పవన్ కళ్యాణ్ బర్త్ డే నేపథ్యంలో అమలాపురంలో ఫ్లెక్సీలు కడుతుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. అమలాపురంలో పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై ఒక యువకుడు స్పాట్ లోనే మృతిచెందాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని బెండమూర్లంకకు చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ కు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. అతను హైదరాబాద్ లో ఉంటూ అక్కడ ప్రైవేటు జాబ్ చేసుకుంటున్నాడు. ఇటీవల సెలవులపై స్వగ్రామానికి వచ్చిన ప్రేమ్ కుమార్..తన స్నేహితులతో కలిసి తమ అభిమాన నేత పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలలో పాల్గొన్నాడు. స్థానికంగా ఉన్న ఒక కాలేజీ గోడ మీద ఎక్కి పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా అతనికి విద్యుత్ తీగ తగలడంతో కరెంట్ షాక్ కు గురయ్యాడు. దీంతో అతను స్పాట్ లోనే మృతిచెందాడు. Read more

Anakapalle: జనసేనాని బర్త్డే జోష్.. బైక్ నడిపిన ఎమ్మెల్యే కొణతాల! ఈ వార్తకు సంబంధించిన

Ishant Sharma: భారత మాజీ పేసర్ ఇశాంత్ శర్మ 1988 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించాడు. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తుతో భారత క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ కుడిచేతి ఫాస్ట్ బౌలర్ 2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2008 ఆస్ట్రేలియా పర్యటనలో పెర్త్ టెస్టులో అతని బౌలింగ్ కీలకంగా నిలిచింది. ఆ ప్రదర్శనతో భవిష్యత్తులో జహీర్ ఖాన్ వారసుడిగా ఎదుగుతాడనే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తర్వాత వేగం తగ్గడంతో ఫామ్ కోల్పోయాడు. సెలెక్టర్లు అతని పనిభారాన్ని తగ్గించినా ఇబ్బందులు కొనసాగాయి. 2013లో 50 టెస్టులు పూర్తి చేసే సమయానికి అతని గణాంకాలు ఆశించిన స్థాయిలో లేవు. అయినా తర్వాత రీఎంట్రీ చేసి కీలక మ్యాచ్ల్లో ప్రభావం చూపించాడు. ముఖ్యంగా 2014 లార్డ్స్ టెస్టులో కెరీర్లోనే అత్యుత్తమంగా 7/74 నమోదు చేసి భారత్ విజయానికి ప్రధాన కారణమయ్యాడు. లార్డ్స్లో మరపురాని ప్రదర్శన..: ఇశాంత్ కెరీర్లో 2014 లార్డ్స్ టెస్టు ప్రత్యేక అధ్యాయం. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో అతను 7 వికెట్లు పడగొట్టి భారత్కు 95 పరుగుల విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. కెరీర్లో అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవే. ఆ తర్వాత 2015 శ్రీలంక పర్యటనలోనూ ఇశాంత్ కీలకంగా నిలిచాడు. కొలంబోలోని ఎస్ఎస్సీ వేదికగా జరిగిన టెస్టులో 8 వికెట్లు సాధించి, టెస్టు క్రికెట్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. కెరీర్లో మరో మంచి దశ..: 2018లో ఇంగ్లాండ్ పర్యటన ఇశాంత్కు మరో ముఖ్యమైన దశగా నిలిచింది. ఆ 5 టెస్టుల సిరీస్లో అతను 18 వికెట్లు తీసి భారత బౌలింగ్ విభాగంలో అత్యధిక ప్రభావం చూపిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఇంగ్లాండ్లో భారత బౌలర్గా 43 టెస్టు వికెట్లతో కపిల్దేవ్ రికార్డును సమం చేశాడు. పేస్ తగ్గిన దశను దాటి, మళ్లీ తన అనుభవం, లైన్-లెంగ్త్తో ప్రభావం చూపడం ఇశాంత్ కెరీర్లో చెప్పుకోదగ్గ అంశం. 2008లో పెర్త్లో

ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. మరి మెగా స్టార్ చిరంజీవికి ఉండే ఆనందం అంతా ఇంతా కాదు. ప్రతి సంవత్సరం పవన్ కి తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్తూ అభిమానుల్లో జోష్ నింపుతూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం మాత్రం అంతకు మించిన ట్వీట్ తో సోషల్ మీడియాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడం టూ డే టాక్ అఫ్ ది డే. 'ఎక్స్' వేదికగా 'సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.కేవలం చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగానే కాకుండా ప్రజా జీవితంలో జనసేనానిగా, ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నాడు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించని గుణం, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే తత్వం పవన్ సొంతం. కళ్యాణ్ బాబు ఆయురారోగ్యాలతో, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ ప్రజలకు మరింతగా సేవ చేసే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలి" అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఘనంగా జరుగుతున్నాయి. అభిమానుల్లో మరింత జోష్ నింపేలా 'పంజా' మూవీ ఈ రోజు రీ రిలీజై థియేటర్స్ లో సందడి చేస్తుంది. అంతర్జాతీయ సినిమా వేదికగా జమ్మూకశ్మీర్.. రూ. 96 లక్షల ప్రైజ్ మనీతో వైభవంగా వేడుకలు.!

ఈ రోజు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు. ఈ రోజు “OG 2” సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్తాం అని ఆ మధ్య తమన్ ఊదరగొట్టారు. తమన్ పాటలు కంపోజ్ చెయ్యడం కన్నా హీరోలకు భజన చెయ్యడం, అభిమానులకు ట్విట్టర్ లో అప్డేట్స్ ఇవ్వడం గురించి ఎక్కువ టైం కేటాయిస్తుంటాడు అని అందరికీ తెలుసు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజీత్ ని కలిసి “OG 2” చేస్తున్నామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఐతే “OG 2” ఉంటుంది అని చెప్పారు కానీ ఎప్పుడు మొదలవుతుంది, నిర్మాత ఎవరు వంటి విషయాలను వెల్లడించలేదు. అలా పవన్ కళ్యాణ్ అలా అన్నారో లేదో, తమన్ (Thaman) ఆ సినిమా గురించి అప్పుడే ఎంతో హడావిడి చేశారు. సెప్టెంబర్ 2న ఉంటుంది చూస్కోండి, కాస్కోండి అంటూ రెచ్చిపోయారు తమన్. ఐతే, అసలు విషయం ఏంటంటే ఈ సినిమాని వచ్చే ఏడాది మొదలుపెట్టాలని పవన్ కల్యాణ్ ఫిక్స్ అయ్యారు. ఈ గ్యాప్ లో సుజీత్ ని నాని హీరోగా మొదలుపెట్టిన “బ్లడీ రోమియో”ని పూర్తి చేసుకోమని చెప్పారు. సుజీత్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ భుజానికి ఇటీవల శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడు కేరళలో ఆయన ఆయుర్వేద చికిత్స చేయించుకుంటున్నారు

పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిరు తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు క్షణాలలో వైరల్గా మారింది. ఆ పోస్టులో.. 'నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబు (PawanKalyan) లో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు. మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐 అన్నయ్య చిరంజీవి' అంటూ ముగించారు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కల్యాణ్ 55వ పుట్టినరోజు సందర్భంగా ఆయన భార్య అన్నా కొణిదెల ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఎంతో మంది హృదయాల్లో, ఆలోచనల్లో, ప్రార్థనల్లో ఉన్నారని పేర్కొన్నారు. భర్తతో కలిసి దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు.‘‘ఈ రోజు నిన్ను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నువ్వు ఎంతోమంది హృదయాల్లో, ఆలోచనల్లో, ప్రార్థనల్లో ఉన్నావు. ఎంతోమంది జీవితాలను నువ్వు ప్రభావితం చేశావనడానికి ఇది నిదర్శనం. ఇతరులకు ఎంతో ఇచ్చావు. పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అంటూ అన్నా పోస్టు చేశారు.అన్నా పంచుకున్న ఫొటోలో దంపతులిద్దరూ కిటికీ పక్కన కూర్చున్నారు. పవన్ పక్కనే అన్నా కూర్చొని ఆయన వైపు ఆప్యాయంగా చూస్తూ కనిపించారు. ఈ పోస్టు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.పవన్ కల్యాణ్ 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషి’ వంటి వరుస విజయాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘జల్సా’, ‘గబ్బర్సింగ్’, ‘అత్తారింటికి దారేది’, ‘గోపాల గోపాల’, ‘భీమ్లా నాయక్’ చిత్రాలతోనూ విజయాలు అందుకున్నారు.ప్రస్తుతం పవన్ కల్యాణ్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. నటుడిగా ఆయనకు ప్రత్యేకమైన శైలి, మేనరిజమ్స్ ఉన్నాయి. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఆయనకు పుస్తకాలు చదవడం కూడా ఇష్టం
సినీ పరిశ్రమలో అభిమానం అనేది సహజమే... కానీ ఆ అభిమానాన్ని ఆరాధనగా, భక్తిగా మార్చుకున్న అతి కొద్దిమందిలో ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఒకరు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఆయనకు కేవలం ఒక హీరో మాత్రమే కాదు.. సాక్షాత్తూ ప్రత్యక్ష దైవం. మైక్ దొరికితే చాలు పవన్ను ఆకాశానికెత్తేస్తూ బండ్ల గణేష్ ఇచ్చే ఎనర్జిటిక్ స్పీచ్లు టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ను సృష్టించాయి. పవన్పై ఆయన చూపించే ఈ నిస్వార్థ ప్రేమని సినీ జనాలు వీరభక్తి అని పిలుస్తుంటారు. తాజాగా పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఒక ప్రత్యేక పోస్ట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.* అల్లు అర్జున్ని పక్కనపెట్టి యష్తో లోకేష్ కనకరాజ్ సినిమానా?... అల్లు, యష్ ఫ్యాన్ వార్ వేళ మరో బాంబ్హాస్య నటుడిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత అగ్ర నిర్మాతగా మారిన బండ్ల గణేష్ ఎదుగుదలలో పవన్ కల్యాణ్ పాత్ర ఎంతో కీలకం. పవన్తో ఆయన నిర్మించిన ‘గబ్బర్ సింగ్’ మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి వారి అనుబంధాన్ని మరింత దృఢం చేసింది. ఆడియో వేడుకల్లో, ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో బండ్ల గణేష్ వేదికపైకి వచ్చారంటే అభిమానుల్లో పూనకాలు రావడం ఖాయం. 'వకీల్ సాబ్' ఈవెంట్లో పవన్ వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ... ‘ఈశ్వరా… పవనేశ్వరా… పవరేశ్వరా’ ఆయన ఇచ్చిన స్పీచ్ తెలుగు సినీ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా, పవన్ కల్యాణ్ సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుంటూ ఆపదలో ఉన్న అభిమానులకు, పేదలకు ఎన్నో సందర్భాల్లో ఆయన ఆర్థిక సహాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు.మరోసారి 'పవనేశ్వర' జపంబుధవారం (సెప్టెంబర్ 2) పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని బండ్ల గణేష్ తన ఆరాధ్య దైవానికి తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. గతంలో 'వకీల్ సాబ్' వేదికపై గర్జించిన డైలాగును గుర్తుచేస్తూ ఆయన రాసిన

ఇంటర్నెట్ డెస్క్: తన భర్త, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అన్నా కొణిదెల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఓ క్యూట్ ఫొటో పంచుకున్న ఆమె.. ఆకట్టుకునే క్యాప్షన్ రాశారు. ‘‘ఈరోజు మీ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీరు ఎంతోమంది హృదయాల్లో, వారి ఆలోచనల్లో, వారి ప్రార్థనల్లో ఉన్నారు. ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపారు. వాళ్లకు ఎంతో సాయం చేశారనడానికి వారి గుండెల్లో మీ స్థానమే నిదర్శనం. హ్యాపీ బర్త్డే’’ అంటూ లవ్ ఎమోజీతో అన్నా తన ప్రేమను తెలిపారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కాగా.. పవన్ (Pawan Kalyan) అభిమానులు కామెంట్స్లో ఆయనకు విషెస్ చెబుతున్నారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ బోర్డ్ ఛైర్మన్, ఎమ్మెల్సీ నాగబాబు పవన్ పేరిట మారేడు మొక్క నాటారు. మారేడు దళాలంటే శివుడికి ఇష్టమని.. సనాతన ధర్మాన్ని ఇష్టపడే పవన్కు ఇదే తన కానుక అని చెప్పారు. నేడు తాను 20 మొక్కలు నాటినట్లు వెల్లడించారు. పవన్ అభిమానులంతా కూడా ఈరోజు ఒక మొక్క నాటాలని నాగబాబు (Nagababu) పిలుపునిచ్చారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు సెప్టెంబర్ 2న తన పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అంటే అభిమానుల్లో ఎలాంటి జోష్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వెల్లువలా వస్తున్నాయి. పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి తగ్గ తమ్ముడిగా నిరూపించుకున్నారు. మెగాస్టార్ తో సమానమైన క్రేజ్ ని చూశారు. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ పవన్ సినిమాల్లో తనకి ఇష్టమైన 4 సినిమాలని ప్రస్తావించారు. పవన్ సినిమాలన్నీ ఇష్టం ఒకటి రెండు తప్ప. వాటిలో నాలుగు సినిమా స్పెషల్ గా ఇంకా ఎక్కువ ఇష్టం అని చిరంజీవి అన్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. తొలిప్రేమ సినిమా అంటే తనకు చాలా ఇష్టం అని చిరంజీవి తెలిపారు. పవన్ కళ్యాణ్ కి దక్కిన తొలి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇదే. ఈ మూవీతోనే పవన్ ని యువత ఫాలో కావడం ప్రారంభించారు. పవన్ అల్లరి, మెచ్యూర్డ్ లవ్ స్టోరీ, కీర్తి రెడ్డి పెర్ఫార్మెన్స్, కరుణాకరన్ దర్శకత్వం ఈ చిత్రంలో హైలైట్స్. చిరంజీవికి ఇష్టమైన సినిమాల జాబితాలో బద్రి కూడా ఉంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఈ పవర్ ఫుల్ మూవీ తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకమైన మ్యానరిజమ్స్ మొదలైంది ఈ సినిమాతోనే. కథ కంటే పవన్ యాటిట్యూడ్ కారణంగా ఈ మూవీ సూపర్ హిట్ అయింది. తనకు జల్సా మూవీ అంటే కూడా ఇష్టం అని చిరంజీవి అన్నారు. పవన్ కళ్యాణ్ కి అస్సలు టైం బాగా లేని సమయంలో ఊరటనిచ్చిన సినిమా ఇది. ఈ సినిమా ఆడియో లాంచ్ కి

Pawan Kalyan: టాలీవుడ్లో పవర్స్టార్ పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో తనదైన స్టైల్తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన ఐదు విషయాలను ఒకసారి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ను అభిమానులు ప్రేమగా పవర్స్టార్ అని పిలుస్తుంటారు. ఆయన సినిమాల్లో కనిపించే ప్రత్యేకమైన స్టైల్, యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో పవర్స్టార్ అనే పేరు ఆయనకు బలమైన గుర్తింపుగా మారింది. పవన్ సినిమా విడుదలైతే అభిమానులు పండుగలా సెలబ్రేట్ చేసుకోవడం సాధారణంగా మారిపోయింది. పవన్ కళ్యాణ్కు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆయన కరాటేలో శిక్షణ తీసుకున్నారు. ఆయనకు కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. సినిమాల్లోని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపించే ప్రత్యేకమైన శైలి వెనుక ఈ శిక్షణ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. మార్షల్ ఆర్ట్స్ తనకు క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మ నియంత్రణ నేర్పాయని పవన్ గతంలో చెప్పారు. సినిమా రంగంలో స్టార్గా కొనసాగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో జనసేన పార్టీని స్థాపించారు. సామాన్య ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడు చిరంజీవికి తమ్ముడు. మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. సినిమాల్లో తనదైన శైలితో ప్రత్యేక అభిమాన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ సాధారణ జీవనశైలిని ఇష్టపడతారని ఆయనను దగ్గరగా చూసిన వారు చెబుతుంటారు. అవసరం లేని ఆర్భాటాలకు దూరంగా ఉండటం ఆయన వ్యక్తిత్వంలో కనిపించే ప్రత్యేకత

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ బేస్ తెలిసిందే. సదరు ఫ్యాన్ బేస్ యొక్క ప్రకంపనలు వరల్డ్ వైడ్ గా 'వైఫె' లా తిరుగుతూనే ఉంటాయి. రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రేపు పవన్ స్టైలిస్ట్ మూవీలో ఒకటైన 'పంజా' 4K వెర్షన్లో భారీ స్థాయిలో రీ రిలీజ్ కాబోతుంది. ఎప్పడు లేని విధంగా ఈ రోజు నైట్ ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మహారాష్ట్రలోని పూణే నగరంలో కూడా ఈ రోజు ప్రీమియర్ ప్రదర్శిస్తుండటం, టికెట్స్ అన్ని అయిపోవడం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తుంది. పూణేలోని ప్రధాన థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి, బాణాసంచా కాల్చుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఐటీ నిపుణులు, విద్యార్థులు పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుని థియేటర్లను హౌస్ఫుల్ చేస్తుండటంతో మహారాష్ట్ర బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో మరోసారి రుజువవుతోంది. దాదాపు 15 ఏళ్ల క్రితం నాటి సినిమా కూడా రీ-రిలీజ్ వేళ కొత్త సినిమాను తలపించేలా పూణే నగర వీధుల్లో మారుమోగిపోతుండటం పవర్ స్టార్కి ఉన్న తిరుగులేని మాస్ ఫాలోయింగ్కి సజీవ నిదర్శనం తెలుగు స్టేట్స్ లాగానే రీ రిలీజ్ ఈ స్థాయిలో వేడుకలా మారడం కూడా నిజంగానే ఒక అరుదైన విషయం. మరి ఈ నేపథ్యంలో తొలి రోజు ఏ మేర కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి. 2011 డిసెంబర్ 9న కోలీవుడ్ దర్శకుడు విష్ణువర్ధన్ మేకింగ్లో 33 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా అప్పట్లోనే సరికొత్త స్టైలిష్ గ్యాంగ్స్టర్ లుక్తో అభిమానులను అలరించింది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, దాదాపు 40 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆంధ్ర, నైజాం ప్రాంతాల్లోనే 15.86 కోట్ల షేర్ రాబట్టగా, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.50 కోట్లు, ఓవర్సీస్లో 1.75
పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రేపు (సెప్టెంబర్ 2) బుల్లితెరపై పవర్ స్టార్ సినిమాలు సందడి చేయబోతోన్నాయి. మామూలుగానే ఏ టైంలో అయినా సరే ఏ ఛానెల్ పెట్టినా బుల్లితెరపై ఛానెల్స్లో ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. అలా బుల్లితెరపై 24 గంటలు వినోదానికి అయితే కొరత ఉండదు. ఇంట్లో ఉండే వారికి, మహిళలకు బుల్లితెర అనేది రిలాక్స్, ఎంటర్టైన్మెంట్ మోడ్ను ఇస్తుంది. ఇక రేపు అంటే బుధవారం అన్ని ఛానెల్స్లో ప్రసారం అయ్యే సినిమాల లిస్ట్ ఓ సారి చూద్దాం.డీడీ యాదగిరి చానెల్లో ఉదయం 9 గంటలకు హాలీవుడ్ తెలుగు డబ్డ్ మూవీ ద బాయూ, రెండు గంటలకు నువ్వెక్కడుంటే నేనక్కడుంటా రానున్నాయి. ఈటీవీ ప్లస్లో రాత్రి తొమ్మిదిన్నరకి బీరువా రానుంది. ఈటీవీలో మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి పదిన్నరకి సుస్వాగతం రానుంది. ఈటీవీ సినిమాలో ఏడు గంటలకు అల్లుడి కోసం, ఉదయం 10 గంటలకు మంచి మనుషులు, ఒంటి గంటకు పిల్ల నచ్చింది, సాయంత్రం నాలుగు గంటలకు అల్లరి ప్రేమికుడు, ఏడు గంటలకు సుస్వాగతం, రాత్రి పది గంటలకు కృష్ణ నటించిన శక్తి, మిడ్ నైట్ ఒంటి గంటకు మళ్లీ అల్లుడి కోసం మూవీని రిపీట్ మోడ్లోనే ప్రసారం చేయనున్నారు

సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన అభిమానులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు సుజీత్ తెరకెక్కించనున్న మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్స్టర్ ప్రాజెక్ట్ ‘OG 2’ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ ‘OG 2’ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటిస్తూ పవన్-సుజీత్ కలయికలో ‘OG యూనివర్స్’ను మరింత విస్తరించనున్నట్లు వెల్లడించింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా గతంలో పలు సందర్భాల్లో బర్త్డే రోజు ‘OG 2’ సర్ ప్రైజ్ ఉంటుందని హింట్ ఇచ్చారు. సుజీత్ ఒక పవర్ఫుల్ యానిమేటెడ్ వీడియో రెడీ చేస్తున్నారనే టాక్ కూడా ఫిలింనగర్ వర్గాల్లో నడిచింది. అయితే ప్రస్తుతానికి మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక శబ్దం లేకపోవడం విశేషం. అటు పవర్ స్టార్ కూడా భుజం గాయం కారణంగా ఆయుర్వేదం చికిత్స నిమిత్తం కేరళలో ఉన్నారు. సో బర్త్డే సందర్బంగా పెద్ద వీడియో కాకుండా కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా చిన్న ప్రమోషనల్ గ్లింప్స్ మాత్రమే విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ సినిమా సెట్స్పైకి ఎప్పుడు వెళ్తుందనే దానిపై ఇంకా స్పష్టత లేకపోవడంతో ఈ పుట్టినరోజుకి పోస్టర్ లేదా గ్లింప్స్ ఇచ్చినా షూటింగ్ మాత్రం ఇప్పుడే ఆశించలేమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. పవర్ స్టార్ నుంచి ఎలాంటి బర్త్డే సర్ ప్రైజ్ రానుందో చూడాలి

Anakapalli: అనకాపల్లిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలు! Anakapalli: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి వేల్పులవీధి కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి మాజీ మంత్రి, శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ ప్రోత్సాహంతో మెగా యూత్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, జనసేన ప్రోగ్రాం కమిటీ మెంబర్ శ్రీ సురభి హరీష్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో రక్తదాన శిబిరానికి అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమానికి అనకాపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ భీమరశెట్టి రామ్కీ ముఖ్య అతిథిగా హాజరై రక్తదానం చేసిన వారిని అభినందించారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందని, సేవా కార్యక్రమాల్లో యువత మరింత చురుగ్గా పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భీమరశెట్టి రామ్కీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సేవా కార్యక్రమం.. జన్మదిన వేడుక. రెండింటినీ కలిపిన ఈ కార్యక్రమం అనకాపల్లిలో జనసేన శ్రేణుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్కు టాలీవుడ్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సంచలన విజయం సాధించడంతో వీరి తాజా చిత్రం 'NBK111'పై సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పెద్ది’తో ఇటీవల బ్లాక్బస్టర్ అందుకున్న నిర్మాత వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్పై ఈ ప్రాజెక్ట్ను ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక అదిరిపోయే ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్ట్ అధికారిక టైటిల్తో పాటు రిలీజ్ డేట్ని సెప్టెంబర్ 6న రివీల్ చేయనున్నారు. ఆ రోజు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ తేజ పుట్టినరోజు కావడంతో నందమూరి అభిమానులకు ఇది డబుల్ ధమాకాగా మారనుంది. ఇటీవల షూటింగ్లో బాలకృష్ణ కాలికి గాయమై శస్త్రచికిత్స జరిగినప్పటికీ, ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారు. గాయం వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం కాకుండా, ముందస్తు ప్రణాళిక ప్రకారమే చిత్రాన్ని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని తీసుకురానున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.* బాక్సాఫీస్ వద్ద బిగ్ క్లాష్.. దసరా రేసు నుంచి రజనీకాంత్ 'జైలర్ 2' ఔట్?గతంలో విడుదలైన ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ గ్లింప్స్కు అద్భుతమైన స్పందన వచ్చింది. ముంబై నేపథ్యంలో సాగే ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో బాలయ్య ఎన్నడూ చూడని సరికొత్త, అల్ట్రా స్టైలిష్ లుక్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, విలక్షణ నటుడు మంచు మనోజ్ పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండగా, అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా.. బాలయ్య కటౌట్కి తగినట్లుగా పదునైన సంభాషణలు రాస్తున్నారు. బాలయ్య మార్క్ యాక్షన్, గోపీచంద్ మలినేని మాస్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ NBK111. ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ రాబోతోంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్లో రూపొందుతోన్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ NBK111. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బ్లాక్బస్టర్ విజయం సాధించడంతో, ఈ తాజా చిత్రంపై ప్రకటన వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఎక్కడా రాజీపడకుండా అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ ఫస్ట్ గ్లింప్స్లో బాలయ్య అల్ట్రా స్టైలిష్, పవర్ఫుల్ అవతార్లో కనిపించి మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించారు. అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో NBK111 నుంచి చిత్ర బృందం ఒక అదిరిపోయే బిగ్ అప్డేట్ను సిద్ధం చేసింది. ఈ సినిమా అధికారిక టైటిల్తో పాటు ప్రపంచవ్యాప్త థియేట్రికల్ విడుదల తేదీని సెప్టెంబర్ 6వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు. ఆ రోజు విశేషం ఏమిటంటే.. నటసింహం తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ (Nandamuri Mokshagna Teja) పుట్టినరోజు! తనయుడి బర్త్డే వేళ అభిమానులకు డబుల్ ధమాకా ట్రీట్ ఇచ్చేందుకు బాలయ్య ఈ క్రేజీ అప్డేట్ను లాక్ చేశారు. ఈ ప్రకటనతో అటు మోక్షజ్ఞ బర్త్డే సెలబ్రేషన్స్తో పాటు ఇటు సినిమా టైటిల్ అనౌన్స్మెంట్తో నందమూరి ఫ్యాన్స్కు పండుగ వాతావరణం నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలకృష్ణ సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. వెర్సటైల్ యాక్టర్ మంచు మనోజ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అత్యున్నత

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Karnataka MLA controversy:శ్రీరంగపట్నం సమీపంలోని అరేకెరె గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఎమ్మెల్యే తల్లి పుట్టినరోజు సందర్భంగా ఒక వినోద కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో నాటకం, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది కళాకారులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. స్థానికుల ఆరోపణల ప్రకారం, కళాకారులకు ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉండేందుకు అవకాశం కల్పించారు. అంతేకాకుండా కార్యక్రమానికి ముందు వారు అక్కడే మేకప్ వేసుకుని సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఒక మహిళా కళాకారిణి ఆసుపత్రి లోపల నుంచి రీల్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ కార్యక్రమానికి ఉపయోగించారనే విమర్శలు మొదలయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు వైద్యం అందించే ప్రదేశం. అలాంటి చోట ప్రైవేట్ వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి ఎలా ఇచ్చారనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అసలు ఆసుపత్రిలో కళాకారులు ఉండేందుకు ఎవరు అనుమతి ఇచ్చారు? అధికారికంగా అనుమతి తీసుకున్నారా? అనే విషయాలపై స్థానికులు స్పష్టత కోరుతున్నారు. అదే సమయంలో ఆసుపత్రిలో ఉన్న రోగులకు లేదా వైద్య సేవలకు ఇబ్బంది కలిగిందా అనే అంశంపైనా అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వానికి చెందిన వైద్య సదుపాయాలను వ్యక్తిగత కార్యక్రమాల కోసం ఉపయోగించడంపై విచారణ జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనను కొందరు స్థానికులు అధికార దుర్వినియోగంగా కూడా అభివర్ణిస్తున్నారు. ఈ

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్(Allu Arjun) చేసిన స్పెషల్ ట్వీట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిరంజీవిని తనకు మాత్రమే కాకుండా తమ అందరికీ గొప్ప సపోర్ట్ సిస్టమ్గా అభివర్ణించిన బన్నీ.. ఆయన అందరినీ ప్రోత్సహించి, ఎదిగేలా స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు. అయితే సాధారణంగా కనిపించే ఈ బర్త్డే విషెస్లో #KKAVCF అనే హ్యాష్ట్యాగ్ను జోడించడం చర్చనీయాంశంగా మారింది. దాని అర్థాన్ని నేరుగా వెల్లడించకుండా “Iykyk” అంటూ బన్నీ ట్వీట్ చేయడం మరింత ఆసక్తిని పెంచింది. అల్లు అర్జున్ గతంలో చిరంజీవిపై చేసిన కామెంట్స్ ను పరిశీలిస్తే ఈ హ్యాష్ట్యాగ్ వెనుక భావం ఏమిటన్నది కొంతవరకు అర్థమవుతుంది. కట్టే కాలే వరకు చిరంజీవి ఫ్యాన్ అంటూ బన్నీ గతంలో చెప్పిన మాట ఫ్యాన్స్ లో బలంగా నిలిచిపోయింది. ఇప్పుడదే అభిమాన భావనను సంక్షిప్తంగా, కోడ్లా #KKAVCF ద్వారా గుర్తుచేసినట్టుగా కనిపిస్తోంది. దీంతో బన్నీ ట్వీట్లోని ఈ చిన్న హ్యాష్ట్యాగ్నే ఫ్యాన్స్ ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. చిరంజీవి వారసత్వం నుంచి మెగా కుటుంబానికి చెందిన పలువురు హీరోలు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక స్థానాలను ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు అల్లు అర్జున్ కూడా తనదైన స్టార్డమ్తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కుటుంబాల మధ్య ఈక్వేషన్స్పై సోషల్ మీడియాలో ఎన్ని డిస్కషన్స్ జరిగినా.. చిరంజీవిపై తనకున్న గౌరవం, అభిమానం మాత్రం ప్రత్యేకమేనని బన్నీ తాజా ట్వీట్ ద్వారా మరోసారి చెప్పకనే చెప్పారు. అందుకే ఈ బర్త్డే విషెస్ ఇప్పుడు సాధారణ శుభాకాంక్షల కంటే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ప్రకటించిన భారీ సినిమా ఆగలేదని తాజాగా స్పష్టత వచ్చింది. చిరంజీవి 71వ జన్మదినం సందర్భంగా శ్రీకాంత్ ఓదెల చేసిన పోస్ట్ ఈ ప్రాజెక్ట్పై నెలకొన్న అనుమానాలకు సమాధానమిచ్చింది. చిరంజీవితో సినిమా చిత్రీకరణ ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో చిరు-ఓదెల సినిమా రద్దయిందంటూ కొంతకాలంగా వినిపిస్తున్న ప్రచారానికి దర్శకుడి నుంచే స్పష్టత వచ్చినట్లయింది. చిరంజీవిని ‘టి-రెక్స్ మెగాస్టార్’గా సంబోధిస్తూ శ్రీకాంత్ ఓదెల ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవితో కలిసి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు సృష్టించేందుకు సినిమా చిత్రీకరణ కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా చిరు-ఓదెల సినిమా భవిష్యత్తుపై వివిధ రకాల ప్రచారం సాగింది. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ పనుల్లో బిజీగా ఉండటమే ఈ అనుమానాలకు ప్రధాన కారణంగా మారింది. ‘ది ప్యారడైజ్’ పనుల కారణంగా చిరు-ఓదెల సినిమా ఆలస్యమవుతోందనే ప్రచారం మొదట వినిపించింది. ఆ తర్వాత ప్రాజెక్ట్ నిలిచిపోయిందని, చివరకు పూర్తిగా రద్దయిందనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఇదిలా ఉండగా, ఈ కథను రామ్ చరణ్తో రూపొందించే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగింది. దీంతో మెగా అభిమానుల్లో ప్రాజెక్ట్ భవిష్యత్తుపై సందేహాలు పెరిగాయి. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల స్వయంగా చిరంజీవితో చిత్రీకరణ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పడంతో ఆ ప్రచారానికి బలమైన సమాధానం లభించింది. చిరు-ఓదెల సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా, న్యాచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 1970ల కాలం నేపథ్యంలో ఈ కథ ఉంటుందని అందుబాటులో ఉన్న వివరాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 1974-75 తర్వాత జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా మాస్ యాక్షన్ కథను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఫలితంగా శ్రీకాంత్ ఓదెల తన రా, రస్టిక్ కథనశైలిలో చిరంజీవిని ఎలా చూపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. గతంలో విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో చిరంజీవి చేతులకు రక్తం

చిరంజీవి హీరోగా వస్తోన్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్ మూవీ ‘విశ్వంభర’. ఈ మూవీకి బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. ఇప్పటి వరకు విడుదల కాలేదు. వీఎఫ్ఎక్స్ (VFX)పై ఎక్కువ సమయం కేటాయించడంతో విడుదల విషయంలో ఆలస్యమైంది. జూలైలోనైనా థియేటర్లకు వస్తుందనుకుంటే అదీ కూడా జరగలేదు. ఆ తర్వాత ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇక ఫ్యాన్స్ కూడా విశ్వంభర చిత్రాన్ని మరిచిపోయేలా ఉన్నారు. కానీ తాజాగా మెగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఇవాళ మెగాస్టార్ బర్త్ డే కావడంతో ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర మూవీ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో పాటు ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ఆడియో విడుదల చేశారు. దాదాపు ఓ నిమిషం పాటు ఉన్న ఈ ఆడియో మెగా ఫ్యాన్స్కు ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మెగాస్టార్ సరసన త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఫ్రెండ్స్తో ఫుల్ జోష్లో ఆనంది..(ఫోటోలు) చీర కట్టుతో శెట్టి..చూపుతిప్పుకోనివ్వని నిధి..(ఫోటోలు) బ్యూటీఫుల్ డ్రెస్లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు గచ్చిబౌలిలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద మృతదేహాలు చిరంజీవి బర్త్డే స్పెషల్.. మెగా 158 గ్లింప్స్ వచ్చేసింది.. ఇక GOLD కొనలేమా? భారీగా పెరిగిన బంగారం ధరలు నన్ను ఆపే దమ్ము నీకుందా..? జేసీ ప్రభాకర్ ని ఏకిపారేసిన పెద్దారెడ్డి జియోకి జీవోకి తేడా తెలియని నువ్వు... జగనన్నలా ఛాలెంజ్ చేసే దమ్ముందా?