
Swetha Reddy : మా అన్నయ్య సీరియల్ నటిశ్వేతారెడ్డి బర్త్ డే.. సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్..
మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతారెడ్డి (Swetha Reddy) తన బర్త్ డే సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
© 2026 nimisham.in

మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతారెడ్డి (Swetha Reddy) తన బర్త్ డే సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు నటి లయ (Laya ) కూడా తన ఫోటోలను 80s స్పెషల్ ఫొటోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు నటి అర్చన (Archana ) సైతం తన ఫోటోలను AIలో 80s స్పెషల్ ఫోటోలుగా మార్చి పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలో సీరియల్ నటి మహేశ్వరి (Maheshwari) సైతం తన కుటుంబం ఫోటోలను AIలో 80s స్పెషల్ ఫోటోలుగా మార్చి పోస్ట్ చేసింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో నటి దివి కూడా తన ఫోటోలను 80s స్పెషల్ ఫొటోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సీరియల్ నటి కావ్యశ్రీ తాజాగా ఓ షో కోసం ఇలా అందంగా ముస్తాబయి మెరిసిపోతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తాజాగా మొదలయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లోకి మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్ వచ్చింది. బెంగాలీ మోడల్, నటి దేబ్జానీ మోదక్ బెంగాలీలో పలు సీరియల్స్ చేసింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో దేబ్జానీ మోదక్ సత్యభామ, ఎన్నెన్నో జన్మల బంధం.. లాంటి పలు సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకొని ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో బబుల్ గమ్, లక్కీ భాస్కర్ తదితర సినిమాల్లో నటించిన మానస చౌదరి.. రీసెంట్గా అమ్మతో కలిసి కాశీ వెళ్లింది. అక్కడి ఘాట్స్లో తిరిగింది. తన పుట్టినరోజుని కూడా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంది. కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు) మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే snake plant ఈ మొక్కలని కిచెన్లో పెట్టుకుంటే.. మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

ఈ మధ్య హీరోయిన్లు సినిమాల్లో నటించడం కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించే భారీ ఫాలోయింగ్ ను సంపాదిస్తున్నారు. ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోషూట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటున్నారు. గ్లామరస్ హీరోయిన్ కయాదు లోహర్(Kayadhu Lohar) కూడా ఈ లిస్ట్ లో ఒకరు. తాజాగా ఆమె కొన్ని అందమైన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో కయాదు సాంప్రదాయంగా గోల్డెన్ కలర్ లంగా వోణీ ధరించి డిఫరెంట్ స్టైల్ లో జడ వేసుకుని, అవుట్ఫిట్ కు తగ్గ జ్యువెలరీతో మరింత అందంగా మెరిసింది. ఈ ఫోటోల్లో కయాదుని చూసి కుర్రాళ్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు

కేజీఎఫ్, హిట్ 3 సినిమాల హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. తన రోజూవారీ పనుల్ని ఫొటోల రూపంలో పంచుకుంది. సినిమా డబ్బింగ్, ఊరిలో ఎద్దులని మచ్చిక చేసుకుంటూ కనిపించింది. పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు) నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు) Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్ నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఆయనకున్న అశేష ప్రజాదరణ, స్టార్డమ్, పవర్ ప్యాక్డ్ వ్యక్తిత్వం గురించే అందరూ చర్చిస్తుంటారు. అయితే, తెరవెనుక ఆయనలో ఉన్న అరుదైన మానవతా దృక్పథాన్ని, ఆపన్నుల పట్ల ఆయన చూపించే ప్రేమను ఆవిష్కరిస్తూ ‘ఓజీ’ (OG) చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటి శ్రియా రెడ్డి (Sriya Reddy) సోషల్ మీడియా వేదికగా చేసిన భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్లోని సేవా గుణాన్ని శ్రియా రెడ్డి వివరిస్తూ.. ‘‘హ్యాపీ బర్త్డే పీకే సర్! మీ గురించి మాట్లాడేటప్పుడు ప్రజలు చాలా గొప్ప విషయాలు చెబుతుంటారు. కానీ నా మనసులో బలంగా ముద్రపడిపోయినవి మాత్రం.. సైలెంట్గా మీరు చేసే మంచి పనులే. ఎదుటివారి మాటలను మీరు వినే విధానం, వారి కష్టాలను గుర్తుపెట్టుకునే తీరు.. అన్నింటికంటే ముఖ్యంగా వారి సమస్యను పరిష్కరించడానికి మీరు రంగంలోకి దిగి కార్యాచరణ చేసే పద్ధతి ఎవరికీ సాధ్యం కాదు. మీరు కేవలం వినడం మాత్రమే కాదు, దాన్ని గుర్తుపెట్టుకుని వెంటనే చేసి చూపిస్తారు’’ అంటూ పవన్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. పవన్ కళ్యాణ్ సైలెంట్గా చేసిన పలు సంఘటనలను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. ‘‘భారత మహిళా అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తన గ్రామానికి రోడ్డు సౌకర్యం గురించి మీతో ప్రస్తావించినప్పుడు.. మీరు శ్రద్ధగా విన్నారు, ఆ సమస్యను పరిష్కరించి చూపించారు. ఓ వృద్ధురాలు తన ఇంటికి మళ్లీ రమ్మని మిమ్మల్ని కోరితే.. ఎన్నో ఏళ్ల

చిత్ర పరిశ్రమలో నటీనటులుగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించి చివరకు దీన స్థితిలో మరణించిన వారు చాలా మందే ఉన్నారు. వారిలో హాస్య నటి కల్పనా రాయ్ ఒకరు. లేడీ కమెడియన్ గా కల్పనా రాయ్ ఎన్నో సినిమాల్లో నటించారు. 70వ దశకం నుంచే ఆమె కెరీర్ ప్రారంభం అయింది. 400పైగా సినిమాల్లో కల్పనా రాయ్ నటించారు. కమెడియన్ గా తిరుగులేని గుర్తింపు సాధించిన కల్పనా రాయ్ చివరి రోజుల్లో ఎవరూ లేని దీన స్థితిలో అనాథలా మరణించారు. కల్పనా రాయ్ పుట్టుకతో పేదవారు కాదు. కోటీశ్వరుల కుటుంబంలో జన్మించారు. సీనియర్ రచయిత నందం హరిశ్చంద్రరావు ఓ ఇంటర్వ్యూలో కల్పనా రాయ్ జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్పనా రాయ్ అచ్చతెలుగు మహిళ. ఆమె కాకినాడలో జన్మించారు. కానీ ఆమె పేరు చివర రాయ్ అని ఉండడం వెనుక ఆసక్తికర కథ ఉంది. పుట్టుకతోనే కల్పనా రాయ్ ధనవంతురాలు. ఆమె తల్లి దండ్రులు ఒళ్ళంతా బంగారం చేయించారు. ఓ కార్యక్రమంలో నటి శారద చిన్న వయసులో ఉన్న కల్పనా రాయ్ ని చూసి నటి అయ్యే లక్షణాలు ఉన్నాయి అని అభినందించారట. నటిని చేయమని ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పారు. కానీ దురదృష్టవశాత్తూ కల్పనా రాయ్ చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. దీనితో కల్పనా రాయ్ బంధువులు ఆమె ఆస్తిని కరిగించేశారు. దీనితో ఆమె పేదరికంలోకి నెట్టివేయబడింది. సినిమాల్లోకి వెళ్లి సంపాదించాలని కల్పనా రాయ్ అనుకుంది. నటి శారద సహాయంతో ఆమెకి తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. యుక్త వయసులో ఉన్నప్పుడు మోహన్ రాయ్ అనే వ్యక్తిని కల్పనా రాయ్ ప్రేమించింది. పెళ్లి చేసుకోకుండానే అతడితో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రాయ్ అనే పేరు అతడి నుంచి ఆమెకి వచ్చింది. కానీ అతడు కల్పనా రాయ్ ని మోసం చేసి వెళ్ళిపోయాడు. తన బిడ్డని పోషించడం కోసం నటిగా మారింది. జీవితంలో ఎన్ని

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Mamitha Baiju Hospitalised News: చిత్రసీమలో వరుస విజయాలతో అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ యువ కథానాయిక మమితా బైజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటన రద్దు..వేడుకలు వాయిదా.. సెప్టెంబర్ 5న ఆస్ట్రేలియాలో అత్యంత వైభవంగా జరగాల్సిన 'క్లైడ్ ఓనం 2026' వేడుకలకు మమితా బైజు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో, వైద్యుల సలహా మేరకు ఆమె తన ఆస్ట్రేలియా పర్యటనను పూర్తిగా రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని 'క్లైడ్ మలయాళీ అసోసియేషన్' సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటిస్తూనే, ఆమె లేకపోవడంతో ఓనం వేడుకలను కూడా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అభిమానులకు క్షమాపణలు చెప్పిన మమిత.. ఈ మేరకు క్లైడ్ మలయాళీ అసోసియేషన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మమితా బైజు ఈ వీడియోలో స్వయంగా మాట్లాడుతూ.. అనారోగ్య కారణాల వల్ల, వైద్యుల సూచనల మేరకు తాను ప్రయాణం చేయలేకపోతున్నానని తెలిపారు. ప్రయాణాలు చేయడం వల్ల శారీరక నొప్పులు, అలర్జీలు పెరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించవద్దని డాక్టర్లు హెచ్చరించారని, పూర్తి విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారని చెప్పారు. తనను ఎంతగానో ఆహ్వానించిన నిర్వాహకులకు, ఆస్ట్రేలియా అభిమానులకు క్షమాపణలు చెబుతూ, త్వరలోనే పూర్తిగా కోలుకుని కలుసుకుంటానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రేజ్.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో

Mamitha Baiju: మలయాళ బ్యూటీ మమితా బైజు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఆమెకు సంబంధించిన ఆస్ట్రేలియా పర్యటన రద్దు కావడంతో పాటు, మెల్బోర్న్లో జరగాల్సిన ఓనం వేడుకలను కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మమితా బైజు మెల్బోర్న్లో నిర్వహించనున్న Clyde Onam 2026 వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమం కోసం ఆమె ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. దీంతో మమితా పాల్గొనాల్సిన ఓనం వేడుకను కూడా నిర్వాహకులు వాయిదా వేసినట్లు సమాచారం. మమితా బైజు ప్రస్తుతం వైద్యుల సలహాలను పాటిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే ఆమె నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సక్సెస్ను అందుకున్నారు. మమితా ఆస్పత్రిలో చేరిన విషయం తెలియడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమెకు ఎదురైన అనారోగ్య సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్పత్రిలో ఎంతకాలం ఉండాల్సి వస్తుందనే విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం బయటికి రాలేదు. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు మాత్రమే తెలుస్తోంది. మమితా త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఆస్ట్రేలియాలో వాయిదా పడిన ఓనం వేడుకకు సంబంధించిన కొత్త తేదీని నిర్వాహకులు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు

'ప్రేమలు' మూవీతో యూత్ హార్ట్స్ లో తిష్ట వేసిన భామ మమితా భైజు. రీసెంట్ గా విశ్వనాధ్ అండ్ సన్స్ తో భారీ హిట్ అందుకొని సౌత్ ఇండియా క్రేజీ హీరోయిన్ గా మారింది. ఇప్పుడు ఉన్నట్టుండి హఠాత్తుగా ఆసుపత్రిలో జాయిన్ కావడం అభిమానులతో పాటు పరిశ్రమ వర్గాలని షాక్ కి గురి చేస్తుంది. హాస్పిటల్ లో జాయిన్ కావడానికి గల కారణాన్ని అధికారకంగా ప్రకటించకపోయినా జ్వరం, , ఆస్తమా, అలర్జీ లాంటి సమస్యలతో బాధపడుతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ నెల 5న ఆస్ట్రేలియా దేశంలోని మెల్బోర్న్లో జరగాల్సి ఉన్న 'క్లైడ్ మలయాళీ' ఓణం వేడుకలకి మమిత చీఫ్ గెస్ట్ గా హాజరుకావాల్సి ఉంది. దీంతో ఆ పర్యటన కూడా రద్దయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా మమిత బైజూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆ వీడియోలో 'ఆస్ట్రేలియా పర్యటన రద్దు కావడం నాకు చాలా పెద్ద లోటు. అనుకున్న దాని ప్రకారం రాలేకపోతున్నందుకు ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాను. వీలైతే ఎలాగైనా రావాలని అనుకున్నాను కానీ ఆరోగ్య పరిస్థితి సహకరించడం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు. మమిత ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలిసిన వెంటనే ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.సినిమాలతో నిరంతరం బిజీగా గడపడం, తీవ్రమైన పని ఒత్తిడి వల్లనే ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో మమిత బైజూ ఇలా ఆసుపత్రి పాలవ్వడం అందరినీ కలవరపెట్టినప్పటికీ, వైద్యుల పర్యవేక్షణలో ఆమె త్వరలోనే కోలుకొని మళ్లీ షూటింగ్లలో పాల్గొంటారని అభిమానులు ఆశిస్తున్నారు. సంకల్ప సాధకుడు కల్యాణ్ బాబు.. తమ్ముడికి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ 200 కోట్లకి చేరువలో: మరో డివోషనల్

నటి నిత్యామీనన్ ఇటీవలే తన సొంత నిర్మాణ సంస్థ ‘కేయూరి ప్రొడక్షన్స్’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నటి నిత్యామీనన్ (Nithya Menen) ఇటీవలే తన సొంత నిర్మాణ సంస్థ ‘కేయూరి ప్రొడక్షన్స్’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. డీకే, విక్రమ్ కె.కుమార్తో కలిసి తొలుత ఆమె ఫాంటసీ డార్క్ కామెడీ మూవీ నిర్మిస్తున్నారు. తాజాగా ఇందులో నిర్మించబోయే మొదటి చిత్రం గురించి అప్డేట్ ఇచ్చారు ఆమె. ఈ సినిమాకు డీకే దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. గతంలో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లియో విజన్, హీరోయిన్ నిత్యామేనన్కు చెందిన కేయురి ప్రొడక్షన్స్ కలిసి 'ప్రొడక్షన్ నెం.5' అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నట్లు చెప్పారు. ఇంకా పేరు ఖరారు చేయని ఈ మూవీలో నిత్యామేనన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అభిమానులకు విభిన్నమైన సినిమాటిక్ అనుభూతి అందించేలా ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచుతుందని, త్వరలోనే టైటిల్ టీజర్ను విడుదల చేస్తామని అన్నారు. ‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాతో అందరూ ప్రేమలో పడతారు’ అని పేర్కొన్నారు. కాగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు

సాఫీగా సాగిపోతూ ముగింపుకు వచ్చింది అనుకున్న కార్తీక దీపం సీరియల్ లో ఇటీవలే మాలిని తన విలనిజం చూపించడం మొదలుపెట్టింది. మాలిని పాత్ర ఎంట్రీతో కార్తీక దీపం సీరియల్ అనేక మలుపులు తిరిగింది. దీంతో మాలిని పాత్ర చేసిన కన్నడ నటి తేజస్విని ప్రకాష్ ఫొటోలు వైరల్ గా మారాయి. అనేక కన్నడ సీరియల్స్ లో నటించిన తేజస్విని కన్నడ బిగ్ బాస్ లో కూడా పాల్గొంది. తెలుగులో లక్ష్మి రావే మా ఇంటికి సీరియల్ తో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ తో ఒక్కసారిగా తన విలనిజం బయటపెట్టి వైరల్ అయింది

సినిమా రంగంలో గ్లామర్, పేరుప్రఖ్యాతలు ఉంటాయి. కెమెరా ముందుకొచ్చి చప్పట్లు కొట్టించుకున్న వాళ్లు ఆ ప్రపంచాన్ని వదిలి వెళ్లడం చాలా కష్టం. అవకాశాలు ఉన్నా, లేకపోయినా వదల్లేరు. అలాంటి పరిస్థితి వస్తే అది ఎంతో స్ట్రగుల్తో కూడుకొన్నదే అవుతుంది. కానీ, తెలుగు అందం రేష్మా రాథోర్ మాత్రం 'గ్లామర్ అనేది క్షణికం, న్యాయం కోసం పోరాడటమే అసలైన జీవితం' అని నిరూపిస్తున్నారు రేష్మ. ఆమె యాక్టింగ్కి గుడ్ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కేందుకు రెడీ అయ్యింది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రేష్మాకు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఎక్కువ. బాలనటిగా కెమెరా ముందుకొచ్చిన ఆమె, వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో చదువుతుండగా దర్శకుడు మారుతి కంటపడ్డారు. ఆయన తీసిన యూత్ఫుల్ హిట్ 'ఈ రోజుల్లో' సినిమాతో రేష్మా హీరోయిన్గా పరిచయమయ్యారు. తొలి సినిమానే బ్లాక్బస్టర్ అవ్వడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి

మలయాళ బ్యూటీ మమితా బైజుకు మహర్దశ పట్టినట్టు ఉంది. ఆమె పట్టిందల్లా బంగారమే అన్నట్లు అనిపిస్తోంది. అందుకు సజీవ సాక్ష్యం ఇప్పుడు రిలీజైన సినిమాలే. ఇటీవల ఆమె నటించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమాలు రిలీజ్ కాగా.. ఒక్కొక్కటి రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. దీంతో నెల రోజుల్లోనే మూడు సినిమాలు రూ.200 కోట్లు సాధించిన హీరోయిన్గా మమితా బైజు రికార్డ్ సృష్టించింది. జూలై 23న ఆమె నటించిన జన నాయగన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ చిత్రంలో దళపతి విజయ్ హీరోగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత సూర్య సరసన హీరోయిన్గా కనిపించింది. విశ్వనాథ్ అండ్ సన్స్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం రూ.240 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇటీవల రిలీజైన మలయాళ మూవీ బెత్లెహమ్ ఫ్యామిలీ యూనిట్ సైతం బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో హ్యాట్రిక్ కొట్టిన మమితా బైజు అరుదైన ఫీట్ సాధించింది. ఈ విషయంలో తొలి హీరోయిన్గా ఘనతను సొంతం చేసుకుంది. ట్రేడిషనల్ శారీలో బిగ్బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా అడ్డంగా పడుకుని

ఏషనాగుల కట్ట మీద సాంగ్ ట్రెండ్.. ఆ ఫొటోలు షేర్ చేసిన కీర్తిఏషనాగుల కట్ట మీద సాంగ్ ట్రెండ్.. ఆ ఫొటోలు షేర్ చేసిన కీర్తి samatha 01 september 2026 Pic credit - Pinterest స్టార్ బ్యూటీ, అందా చిన్నది కీర్తి సురేశ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ అమ్మడు నేను శైలజ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఈ మూవీతోనే అందరి మనసు దోచేసుకుంది. మొదటి మూవీతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ చిన్నది తర్వాత నాని సరసన నేను లోకల్ మూవీలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ మూవీతో ఈ అమ్మడుకు విపరీతంగా క్రేజ్ పెరిగింది. తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. వరసగా సినిమాలు చేసి మంచి ఫే మ్ సంపాదించుకుంది. ముఖ్యంగా మహానటి మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీలో అచ్చం సావిత్రిలా నటించి, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ తర్వాత కీర్తి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా, టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగింది. ఇక తర్వాత నాని సరసన దసరా మూవీలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ ఏషనాగుల కట్ట మీద ట్రెండ్ అవుతుంది. అదే సమయంలో ఈ ముద్దుగుమ్మ ఓనం పండుగకు సంబంధించిన ఫొటోలను షేర్ చేయడంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా? సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?

Actress Hema:తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి, అక్క, పిన్ని, వదిన వంటి ఎన్నో పాత్రల్లో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కామెడీ పాత్రల్లో కూడా తనదైన శైలితో నవ్వించారు. సినిమాలతో పాటు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కు సంబంధించిన విషయాల్లో కూడా హేమ చురుగ్గా కనిపించారు. హేమ ఏ విషయం గురించి మాట్లాడినా తన అభిప్రాయాన్ని నేరుగా చెప్పే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆమెకు సంబంధించిన వ్యాఖ్యలు తరచూ సోషల్ మీడియాలో చర్చకు వస్తుంటాయి. తాజాగా ఆమె గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి.తనపై కేసు నడిచిన సమయంలో తాను చాలా ఒత్తిడికి గురయ్యానని హేమ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తనలో చాలా కోపం, బాధ ఉండేవని తెలిపారు. ఆ భావోద్వేగాలను బయటకు చెప్పుకోలేకపోతే తాను తీవ్రంగా ఇబ్బంది పడతానని అనిపించిందని ఆమె వివరించారు. అలాంటి సమయంలో ఐస్ బాత్ థెరపీని ప్రయత్నించినట్లు హేమ తెలిపారు. పెద్ద మొత్తంలో మంచుతో నింపిన నీటిలో కూర్చుని తనలో ఉన్న కోపాన్ని, బాధను బయటకు వెళ్లగక్కినట్లు చెప్పారు. అలా చేయడం ద్వారా తన మనసులో ఉన్న భారాన్ని కొంత తగ్గించుకున్నానని వివరించారు. ఐస్ బాత్కు ముందు కౌన్సిలింగ్ వంటి సెషన్స్లో కూడా పాల్గొన్నానని హేమ చెప్పారు. తనలాంటి మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారికి ఉపయోగపడేలా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచన కూడా తనకు వచ్చిందని తెలిపారు. అదే సమయంలో మీడియా తన గురించి వార్తలు రాసిన తీరుపై కూడా హేమ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణల సమయంలో కొన్ని వార్తలు ఎక్కువగా ప్రచారం అయ్యాయని, తరువాత జరిగిన పరిణామాలకు అంత ప్రాధాన్యం ఇవ్వలేదని ఆమె అన్నారు. తనకు విష్ణు బాబు అండగా నిలిచారని హేమ పేర్కొన్నారు. ఆధారాలు చూపించిన తర్వాత తాను తిరిగి

Actress Prema: సీనియర్ హీరోయిన్ ప్రేమ తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆమె సినీ రంగంలో కొనసాగుతున్నారు. హీరోయిన్గా మాత్రమే కాకుండా ప్రస్తుతం తల్లి, అక్క, వదిన వంటి పాత్రల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే కొంతకాలంగా ప్రేమ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయి. దేవి సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిన.. ప్రేమకు క్యాన్సర్ వచ్చిందని కొందరు ప్రచారం చేశారు. చికిత్స కోసం ఆమె విదేశాలకు వెళ్లారని కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని ప్రేమ స్వయంగా స్పష్టం చేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ఆరోగ్యం గురించి మాట్లాడారు. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని చెప్పారు. తాను న్యూజిలాండ్కు వెళ్లిన మాట నిజమేనని అయితే అది చికిత్స కోసం కాదని వివరించారు. అక్కడ ఉన్న తన స్నేహితుడిని కలవడానికి వెళ్లినట్లు తెలిపారు. తన గురించి కొందరు తప్పుడు విషయాలను సృష్టించారని ప్రేమ అన్నారు. ఇలాంటి వార్తలు తనను బాధపెట్టినా వాటి వల్ల తాను మరింత బలంగా మారానని చెప్పారు. దేవుడి దయతో తాను ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. ప్రేమ వ్యక్తిగత జీవితంపై కూడా గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఆమె రెండో పెళ్లి గురించి తరచుగా ఊహాగానాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై కూడా ఆమె స్పందించారు. పెళ్లి అనేది తన వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. తనకు సరైన వ్యక్తి దొరికితే భవిష్యత్తులో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తన జీవితంపై తనకు పూర్తి అవగాహన ఉందని ప్రేమ చెప్పారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు తనకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చి పెంచారని తెలిపారు. జీవితంలో ఎన్నో విషయాలు చూశానని అన్నారు. తన బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహించానని

చిరుత(Chirutha) సినిమాతో రామ్ చరణ్(Ram charan) సరసన హీరోయిన్ గా నటించి టాలీవుడ్ కు పరిచయమైన నేహా శర్మ(Neha Sharma) మొదటి సినిమాతోనే తనదైన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆ తర్వాత తెలుగు లో పెద్దగా సినిమాలు చేయని నేహా, బాలీవుడ్ లో మాత్రం అడపా దడపా సినిమాలు చేస్తూ మెప్పిస్తూ వస్తోంది. అయితే నేహా సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల ద్వారానే ఎక్కువ క్రేజ్ ను సంపాదించింది. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్లను నెట్టింట షేర్ చేస్తూ ఉండే నేహా తాజాగా వెకేషన్ కు వెళ్లి స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకున్న సెల్ఫీలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో నేహా గ్రీన్, ఐవరీ కలర్ చెక్స్ ఉన్న మినీ షాట్ ధరించి అందులో తన ఎద అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది

ప్రముఖ సినీ నటి భానుప్రియ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంపై, తోటి నటులతో తన అనుబంధంపై, అలాగే తన సోదరి శాంతిప్రియ జీవితంలోని వ్యక్తిగత సంఘటనలపై గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన కెరీర్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో సుమన్, బాలకృష్ణ, దర్శకుడు వంశీలను ప్రస్తావించారు. హీరో సుమన్తో 14-15 సినిమాలు, బాలకృష్ణతో దాదాపు 8-10 సినిమాలలో కలిసి నటించినట్లు తెలిపారు. సుమన్ను నిశ్శబ్దంగా, అత్యంత మర్యాదగా ఉండే వ్యక్తిగా అభివర్ణించగా, బాలకృష్ణను చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉండే వ్యక్తిగా పేర్కొన్నారు. బాలకృష్ణతో ఎయిర్పోర్ట్లో అనుకోకుండా జరిగిన భేటీని గుర్తుచేసుకుంటూ, ఆయన ప్రేమగా పలకరించారని, ఇంటికి రావాలని ఫోన్ నంబర్ ఇచ్చారని చెప్పారు. సుమన్తో చివరిగా దమ్ము సినిమాలో నటించినట్లు పేర్కొన్నారు. నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు.. దర్శకుడు వంశీ, తనకు సీతార, అన్వేషణ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చినట్లు భానుప్రియ తెలిపారు. వంశీతో తన పెళ్లి గురించి ఒకప్పుడు వదంతులు వచ్చాయని, అయితే అప్పటికే ఆయనకు వివాహం కావడంతో తన తల్లి ఆ సంబంధానికి అంగీకరించలేదని భానుప్రియ స్పష్టం చేశారు. అలాగే, నటుడు అక్కినేని నాగార్జునతో జతకట్టే అవకాశం తనకు రాలేదని భానుప్రియ తెలిపారు. అన్నమయ్య వంటి చిత్రాలలో ఇతర నటీనటులు నటించినప్పటికీ, తనకు ఆ అవకాశం దొరకలేదని, తన పెళ్లి చేసుకునే వయస్సుకి వచ్చే సమయానికి ఆ అవకాశం రాలేదని చెప్పారు. అయితే, తన సోదరి శాంతిప్రియ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అగ్ని సినిమాలో నటించినట్లు గుర్తు చేసుకున్నారు. Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్ దేవరకొండ భానుప్రియ తన సోదరి శాంతిప్రియ గురించి కూడా వివరించారు. శాంతిప్రియ ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారని, అక్కడే స్థిరపడ్డారని తెలిపారు. సహారా వన్ ఛానెల్లో ప్రసారమైన మాతా కీ చౌకీ అనే

Raaz Actress: ఒకప్పుడు భయంకరమైన లుక్తో ప్రేక్షకులను వణికించిన ‘రాజ్’ సినిమా నటి మాలినీ శర్మ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్కు దూరంగా ఉంటున్న మాలినీ శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్గా మారారు. ఆమెను గుర్తుపట్టిన అభిమానులు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్, మెసేజ్లు చేయడంతో ఆమె కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఇంతకాలం మాలినీ శర్మ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? 2002లో విక్రమ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మూవీ ‘రాజ్’ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బిపాషా బసు, డినో మోరియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో మాలినీ శర్మ దెయ్యం పాత్రలో హల్చల్ చేసింది. పెద్దగా డైలాగ్స్ లేకపోయినా, ఆమె లుక్, హావభావాలు, భయపెట్టే స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల ఒంట్లో వణుకు పుట్టించాయి. దీంతో ఆ సినిమా చూసిన చాలామందికి మాలినీ శర్మ పోషించిన దెయ్యం పాత్ర ఇప్పటికీ గుర్తుండిపోయింది. అయితే ‘రాజ్’ తర్వాత మాలినీ శర్మ కెరీర్ మాత్రం ఊహించిన స్థాయిలో కొనసాగలేదు. మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఆమె, సినిమాల్లోకి రాకముందు పలు మ్యూజిక్ వీడియోల్లోనూ కనిపించారు. ‘ఆప్కే ప్యార్ మే’ వంటి పాటల్లో కనిపించి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘క్యాట్స్’ అనే టీవీ సిరీస్లో కూడా నటించారు. కానీ బాలీవుడ్లో ఎక్కువకాలం కొనసాగకుండా ఆమె క్రమంగా సినిమాలకు దూరమయ్యారు. సినీ ప్రపంచానికి దూరమైన తర్వాత మాలినీ శర్మ తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నారు. సినిమా షూటింగ్స్, కెమెరాలు, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన లైఫ్ స్టైల్ ను గడుపుతున్నారు. ప్రస్తుతం పూణే సమీపంలోని సహ్యాద్రి కొండల్లో ‘ది స్లో లోకల్’ అనే ఫామ్స్టేను నిర్వహిస్తున్నారు. ప్రకృతి మధ్య ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఈ ఫామ్స్టే ఒక ప్రత్యేక అనుభూతిని అందించేలా ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో మాలినీ శర్మకు సంబంధించిన కొన్ని

Kayadu Lohar: ‘డ్రాగన్’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అస్సామీ బ్యూటీ కయాదు లోహర్కు ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ‘డ్రాగన్’ తర్వాత ఆమె నటించిన తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో.. ఆమె క్రేజ్పై ప్రభావం పడిందనే చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది. అయితే ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం కయాదు లోహర్కు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ నెలలో వరుసగా మూడు సినిమాలతో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘డ్రాగన్’ సినిమాతో కయాదు లోహర్కు తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటన, గ్లామర్కు మంచి రెస్పాన్స్ రావడంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్గా మారిపోయారు. ఆ తర్వాత టాలీవుడ్లో విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’లో కనిపించారు. అలాగే మలయాళంలో టోవినో థామస్ నటించిన ‘పల్లి చట్టంబి’, ‘ఇదయం మురళి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ‘డ్రాగన్’ తర్వాత వరుసగా మూడు ఇండస్ట్రీల్లోనూ పరాజయాలు ఎదుర్కొన్న హీరోయిన్గా కయాదు లోహర్ పేరు వినిపించింది. అయితే సెప్టెంబర్ నెలలో ఈ పరిస్థితులు మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ నెలలో కయాదు నటించిన మూడు క్రేజీ ప్రాజెక్టులు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సెప్టెంబర్ 3న దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఐ యామ్ గేమ్’ విడుదల కానుంది. ఈ సినిమాలో కయాదు కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అనంతరం సెప్టెంబర్ 4న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ‘ఇమ్మోర్టల్’ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ రెండు సినిమాలు వాస్తవానికి ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో సెప్టెంబర్కు వాయిదా పడ్డాయి. ఇక కయాదు లోహర్కు అత్యంత కీలకమైన సినిమా ‘ది ప్యారడైజ్’

90sలో టాలీవుడ్ను ఓ ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లలో రంభ ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించి అప్పట్లో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగారు. 90sలో టాలీవుడ్ను ఓ ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లలో రంభ (Rambha) ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించి అప్పట్లో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగారు. అందం, అభినయం, డ్యాన్స్తో ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకున్న రంభ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. మధ్యలో దేశముదురు, యమదొంగ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో తళుక్కుమన్నారు. దాదాపు 17 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె ప్రస్తుతం కుటుంబంతో కలిసి విదేశాల్లో జీవిస్తున్నారు. తాజాగా రంభకు సంబంధించిన ఓ సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన పిల్లలు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన సమయంలో ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. తలకు టవల్ చుట్టుకుని, ఫుల్ ఎనర్జీతో బెల్లీ డ్యాన్స్ చేశారు. ఆమె డ్యాన్స్ చేస్తుంటే పిల్లలు కూడా గంతులు వేస్తూ సందడి చేశారు. దీంతో ఈ వీడియోను చూసిన అభిమానులు ‘రంభలో ఆ ఎనర్జీ ఇంకా అలాగే ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే రంభ వివాహం చేసుకున్నారు. మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న తర్వాత కెనడాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం పిల్లలు, కుటుంబంతో అక్కడే ఉంటున్నారు. సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు అభిమానులకు దగ్గరవుతూనే ఉన్నారు.ఇటీవల ఓ టీవీ రియాలిటీ షోకు జడ్జ్గా వ్యవహరించి బుల్లితెరపై కూడా సందడి చేశారు. మరోవైపు రంభ సెకండ్ ఇన్నింగ్స్పై కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాను మళ్లీ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గతంలో ఆమె వెల్లడించారు. ఇప్పుడు వైరల్ అవుతోన్న డాన్స్ వీడియో అందుకు నాంది అని

అర్జున్ రెడ్డి సినిమాతో గుర్తింపు పొందిన నటి షాలిని పాండే తన పేరుతో నెట్లో వస్తున్న ఫేక్ వీడియోపై తీవ్రంగా స్పందించారు. ఆగస్టు 31 సోమవారం నాడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సదరు వీడియో పూర్తిగా కల్పితమని, అది ఏఐ సాంకేతికతతో సృష్టించిన నకిలీ క్లిప్ అని ఆమె తెలిపారు. అందులో కనిపిస్తున్నది తాను కాదని, మహిళలను లక్ష్యంగా చేసుకుని సాంకేతికతను దుర్వినియోగం చేయడంపై తీవ్రంగా కలత చెందినట్లు వెల్లడించారు. గత ఆగస్టు 27 మరియు 28 తేదీల్లో ఒక చిన్న వీడియో క్లిప్ అంతర్జాలంలో వేగంగా వ్యాపించింది. సదరు క్లిప్ షాలిని పాండేకు చెందినదేనంటూ కొందరు ప్రచారం చేయగా, అది ఏఐ డీప్ఫేక్ కావచ్చునని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో ఆమె ఇటలీ పర్యటన సమయంలో పోస్ట్ చేసిన స్టిల్ ఫోటోల ఆధారంగానే ఏఐ ద్వారా కదిలే వీడియోను సృష్టించి ఉంటారని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఆ సమయంలో నటి నుంచి ఎలాంటి అధికారిక సమాధానం రాకపోవడంతో ప్రచారం తీవ్రమైంది. దీంతో ఈ అంశంపై పూర్తి స్థాయి వివరణ ఇచ్చేందుకు నటి స్వయంగా ముందుకు వచ్చారు. ఆ నకిలీ వీడియో కనిపించిన వెంటనే ఏ మాత్రం షేర్ చేయవద్దని, ఫార్వర్డ్ లేదా డౌన్లోడ్ చేయవద్దని అభిమానులను కోరారు. ఇదిలా ఉండగా ఇటువంటి కంటెంట్తో ఎంగేజ్ కాకుండా ప్లాట్ఫామ్లలో వెంటనే రిపోర్ట్ చేయాలని అభ్యర్థించారు. డిజిటల్ మాధ్యమాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే ఇటువంటి అవాంఛనీయ ప్రచారాలను అడ్డుకోవడం సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. ఫలితంగా సినీ రంగానికి చెందిన నటీమణులపై పెరిగిపోతున్న ఏఐ దుర్వినియోగం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గతంలో రష్మిక మందన్న, ఆలియా భట్, దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్ వంటి ప్రముఖులు కూడా ఇటువంటి డీప్ఫేక్ బారిన పడి స్పందించిన

పౌరాణికాలు, జానపదాలు రాజ్యమేలుతున్న రోజుల్లో సాంఘిక చిత్రాలతో సామాన్యులకు చేరువైన నటి ఆమె. కంటనీరు పెట్టి కదిలించినా, నటనతో కనికట్టు చేసినా, పొట్ట చెక్కలయ్యేలా నవ్వించినా ఆమెకే సాధ్యమైంది. పౌరాణికాలు, జానపదాలు రాజ్యమేలుతున్న రోజుల్లో సాంఘిక చిత్రాలతో సామాన్యులకు చేరువైన నటి ఆమె. కంటనీరు పెట్టి కదిలించినా, నటనతో కనికట్టు చేసినా, పొట్ట చెక్కలయ్యేలా నవ్వించినా ఆమెకే సాధ్యమైంది. ఏడున్నర దశాబ్దాల సినీ చరిత్రకు సజీవ సాక్ష్యంగా తిరిగిన ఆమె ఇప్పుడు మన మధ్య లేరు. అయితేనేం.. షావుకారుగా షావుకారు జానకి (Sowcar Janaki) ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారు. పాత్రకు ప్రాణం పోసిన నటి షావుకారు జానకి. దక్షిణాది సినీ స్వర్ణయుగంలో మేలిమి బంగారం వంటి నటీమణుల సరసన ఎదిగి, ఒదిగి, ప్రేక్షకహృదయాలు గెలుచుకున్న సాంఘికనాయిక జానకి. పౌరాణికాలు, జానపదాలు రాజ్యం ఏలుతున్న రోజుల్లో ఆ పాత్రలకు తను నప్పనని తెలుసుకుని, స్వీయ నియంత్రణతో సాంఘిక కథానాయికగా అగ్రనటులకు ధీటుగా తన భావాలను పలికించి పాత్రలను పండించారామె. గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహామహులకు సేవలందించారు. ఆమె అసలు పేరు శంకరమంచి జానకి. ఎనిమిదేళ్ల క్రితం మరణించిన నాటి కథానాయిక కృష్ణకుమారి ఈమెకు స్వయాన చెల్లెలు. దాదాపు 400 చిత్రాల్లో నటించిన జానకి చివరి చిత్రం 2023లో వచ్చిన ‘అన్నీ మంచి శకునములే’. దాదాపు ఏడు దశాబ్దాలకు పైగా చిత్రపరిశ్రమ (1950 నుంచి 2023 వరకు)లో కొనసాగిన షావుకారు జానకి ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. 94 ఏళ్ల సుదీర్ఘ జీవితాన్ని చూసిన జానకిని తెలుగు వారు ఎప్పటికీ మరచిపోలేరు. షావుకారు జానకి 1931 డిసెంబరు 12న రాజమండ్రిలో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి టేకుమళ్ల వెంకోజీ రావు. తల్లి శచీదేవి. ఈ దంపతులకు మొత్తం 13 మంది పిల్లలు. చివరకు వీళ్లలో నలుగురే మిగిలారు. తండ్రి పూర్వీకులు మరాఠీవారు. అందువల్ల ఇంట్లో మరాఠీ, కన్నడ కూడా

దాదాపు 75 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు షావుకారు జానకి. తమిళం మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా, ‘పుదియ పఱవై’, ‘నీర్కుమిళి’, ‘బామా విజయం’, ‘ఎదిర్ నీచ్చల్’, ‘ఇరు కోడుగళ్’, ‘కావియ తలైవి’, ‘దిల్లు ముల్లు’ లాంటి చిత్రాలు ఆమె నటనలోని వైవిధ్యానికి నిదర్శనంగా నిలిచాయి. కేవలం విషాద పాత్రలకే సరిపోతారనే ఇమేజ్ను కూడా ఆమె చాలా సినిమాల్లో బ్రేక్ చేశారు. ఆ సినిమాల్లో 7 పాత్రలను ఇప్పుడు చూద్దాం. శివాజీ గణేశన్ నటించిన ‘పుదియ పఱవై’ చిత్రంలో షావుకారు జానకి పోషించింది సాధారణ పాత్ర కాదు. ఒకవైపు గోపాల్ భార్య చిత్రగా, మరోవైపు చిత్రలాగే కనిపించే సరసగా రెండు విభిన్నమైన పాత్రల్లో ఆమె నటించారు. అప్పటివరకు ఎక్కువగా కుటుంబ నేపథ్యం ఉన్న ఎమోషనల్ పాత్రల్లో కనిపించిన సౌకార్ జానకిని, ఈ సినిమాలో పూర్తిగా భిన్నమైన ఎక్స్ ట్రార్డినరీ లుక్లో, ఒక భిన్నమైన పాత్రలో కనిపించారు. ‘పార్థ జ్ఞాపగం ఇల్లయో’ పాటలో ఆమె లుక్, నటన ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 1970లో కె. బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన ‘కావియ తలైవి’ చిత్రంలో సౌకార్ జానకి మళ్లీ ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో తల్లి దేవిగా, ఆమె కూతురు కృష్ణగా రెండు పాత్రలనూ ఆమెనే పోషించారు. తల్లి జీవిత పోరాటం, కూతురి జీవితం కలిసే ఈ కథలో రెండు పాత్రలకు విభిన్నమైన భావోద్వేగాలను పలికించడం ఆమె నటనకే హైలైట్గా నిలిచింది. ఈ చిత్రం ఆమెకు వ్యక్తిగతంగా ఇష్టమైన చిత్రాలలో ఒకటిగా కూడా చెబుతారు. షావుకారు జానకి నటనలో మరో ముఖ్యమైన మలుపు ‘ఎదిర్ నీచ్చల్’. అప్పటివరకు ఎక్కువగా సీరియస్, విషాద పాత్రల్లో కనిపించిన ఆమెను, కె. బాలచందర్ ‘పట్టు మామి’ అనే సరదా పాత్రలో విభిన్నంగా చూపించారు. కొన్నిసార్లు ఆప్యాయంగా మాట్లాడే, మరికొన్నిసార్లు పక్కింటి విషయాలను ఆసక్తిగా

ప్రముఖ సినీ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత షావుకారు జానకి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులర్పించారు.ఈ సందర్భంగా నారా లోకేశ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. షావుకారు జానకి సినీ రంగానికి చేసిన సేవలను కొనియాడారు. "తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 400 చిత్రాల్లో నటించి, తన అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించారు. తొలి చిత్రం 'షావుకారు' పేరునే తన ఇంటిపేరుగా మార్చుకుని, సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు" అని లోకేశ్ గుర్తు చేసుకున్నారు."వైవిధ్యభరితమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో షావుకారు జానకి చెరగని స్థానం సంపాదించుకున్నారు. సినీ రంగానికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం" అని నారా లోకేశ్ తన సందేశంలో పేర్కొన్నారు. షావుకారు జానకి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వెల్లడించారు

దక్షిణాది చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది. ఏడు దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటి ‘షావుకారు’ జానకి (94) వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1950లో ఎన్టీఆర్ సరసన ‘షావుకారు’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె, ఆ చిత్ర విజయంతో ‘షావుకారు జానకి’గా గుర్తింపు పొందారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి అగ్ర తారలందరి సరసన మెప్పించారు. బహుభాషా ప్రావీణ్యం ఉన్న ఆమె తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకునేవారు. సినిమా రంగానికి చేసిన సేవలకు గాను 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు

కోలీవుడ్ బ్యూటీ ఆదితి శంకర్ ఫుల్ గ్లామరస్గా కనిపించింది. లైట్ కలర్ శారీలో మరింత అందంగా కనిపించింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి. శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు) 20 మంది MLAల లేఖ కొండా సురేఖ మెడకు ఉచ్చు బర్తరఫ్ చేయాల్సిందే విశాఖ పిల్లాడి ఘటనపై త్రీమెన్ కమిటీ నియమించిన ప్రభుత్వం తీరని విషాదం.. కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా ! రోహిత్, గిల్ రికార్డులు OUT పంత్ @ NO.1 ఎవరికీ సాధ్యం కాని ఘనత

లెజెండరీ నటి షావుకారు జానకి హఠాన్మరణం చిత్ర పరిశ్రమ ని విషాదంలోకి నెట్టేసింది. ఆమె శ్వాస సంబంధించిత సమస్యలతో బాధపడుతూ శుక్రవారం కన్నుమూశారు. దీంతో సౌత్ సినిమాలో విషాదం నెలకొంది. అయితే షావుకారు జానకికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఆమె సంపాదించిన ఆస్తులకు సంబంధించిన వివరాలు షాకిస్తున్నాయి. స్వయంగా జానకినే తాను ఎంత సంపాదించిందో తెలిపారు. వేల కోట్లు సంపాదించినట్టు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కెరీర్ని ప్రారంభించింది జానకి. తాను సినిమాల్లోకి వెళ్లాలనుకున్న సమయంలోనే ఇంట్లో పెళ్లి చేశారు. ఆ తర్వాత ఫ్యామిలీ ఇబ్బందులు ఫేస్ చేసింది. ఈ క్రమంలో భర్తని ఒప్పించి ఇళ్లు గడవడం కోసం ఆమె నటిగా బిగ్ స్క్రీన్పైకి ఎంట్రీ ఇచ్చారు. `షావుకారు` చిత్రంతో బిగ్ బ్రేక్ అందుకున్నారు. ఆ మూవీ టైటిల్నే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఏడు దశాబ్దాలుగా నటించారు. రాణించారు. ఈ క్రమంలో తాను బాగా ఆస్తులు సంపాదించారు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టిమెంట్ పెట్టారు. ఇటు హైదరాబాద్, అటు చెన్నైలో భారీగా ఆస్తులు కొన్నారు. కొన్ని తన భర్త పేరుతోనూ రిజిస్టర్ చేయించారు. అయితే జానకి సంపాదించడంతో భర్త శంకరమంచి శ్రీనివాసులు జల్సాలకు అలవాటు పడ్డారు. జాబ్ వదిలేసి భార్య సంపాదనతో బతకడం స్టార్ట్ చేశారు. అప్పట్లో భారీగా డబ్బు రావడంతో తాను ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు, తాగుడికి బానిసయ్యారు. ఈ క్రమంలో ఆస్తులన్నీ కరిగిపోవడం స్టార్ట్ అయ్యాయి. దీంతో ఇది సరిగా లేదని చెప్పి జానకి.. భర్తకి దూరంగా ఉన్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఆస్తులన్నీ పోయాయి. అయినా భర్త బాగోగులు చూసుకున్నారు జానకి. అయితే తాను కొన్న ఆస్తులు, పోయిన ఆస్తుల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జానకి స్పందించారు. తాను కొన్న ఆస్తులు ఇప్పుడు ఉండి ఉంటే వాటి విలువ వందల కోట్లు కాదు, వేల కోట్లు ఉంటాయని చెప్పారు. అవన్నీ

ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత షావుకారు జానకి (94) అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశానవాటికలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శనివారం ఉదయం నుంచి అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని నివాసంలో ఉంచి, మధ్యాహ్నం అనంతరం అంతిమ సంస్కారాలను పూర్తి చేయనున్నారు.వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 1931 డిసెంబర్ 12న జన్మించిన ఆమె అసలు పేరు శంకరమంచి జానకి. 'షావుకారు' చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమెకు, ఆ సినిమా పేరే ఇంటిపేరుగా స్థిరపడిపోయింది.దాదాపు ఏడు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి ఆమె తనదైన ముద్ర వేశారు. జానకి మృతి పట్ల చిరంజీవి, కమల్ హాసన్, జూనియర్ ఎన్టీఆర్, విష్ణు మంచు వంటి పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆమెకు ముగ్గురు సంతానం, నలుగురు మనుమలు, నలుగురు మునిమనుమలు ఉన్నారు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Shavukaru Janaki RIP: తెలుగు సినీ పరిశ్రమతోపాటు దక్షిణాది సినీ ప్రేక్షులను ఏడు దశాబ్దాల పాటు అలరించిన అందాల నటి.. నట దిగ్గజం షావుకారు జానకి తీవ్ర అనారోగ్యంతో చెన్నైలో మృతిచెందారు. ఆమె మృతితో దక్షిణాది సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగింది. ఆమె మృతికి సినీ ప్రముఖులతోపాటు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తదితరులు సంతాప ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సంతాపం ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'చిన్నతనం నుంచే నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ కెరీర్ను ప్రారంభించిన షావుకారు జానకి దాదాపు ఏడు దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారు. ‘షావుకారు’ సినిమాలో అసమాన ప్రతిభ కనబరిచి షావుకారు జానకిగా స్థిరపడ్డారని గుర్తుచేస్తూ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 400 చిత్రాల్లోనే కాకుండా హిందీ, మలయాళ చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు' అని కొనియాడారు. 'షావుకారు జానకి పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయి. చలనచిత్ర రంగంలో ఆమె లేని లోటు పూడ్చలేనిది' అని తెలిపారు. భగవంతుడు ఆమెకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ.. ఆమె కుటుంబసభ్యులు, అభిమానులకు ముఖ్యమంత్రి సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ సీఎం సంతాప ప్రకటన షావుకారు జానకి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రార్థించారు. షావుకారు జానకి మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని టీడీఈప అధినేత, సీఎం చంద్రబాబు తెలిపారు

మహానటి షావుకారు జానకిగారు తుదిశ్వాస విడిచారన్న వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. జానకిగారితో మా నందమూరి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. నాన్నగారు హీరోగా రిలీజైన తొలి చిత్రం ‘షావుకారు’తోనే ఆమె ‘షావుకారు జానకి’గా సుప్రసిద్ధులయ్యారు. అలా నాన్నగారికి జానకిగారు తొలి హీరోయిన్, అలాగే ఆమె తొలి కథానాయకుడు ఆయన. నాన్నగారితో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జానకిగారు. మా యన్.ఏ.టి. బ్యానర్ లో రూపొందిన తొలి చిత్రం ‘పిచ్చిపుల్లయ్య’లో కీలక పాత్ర ధరించారు. ‘పాండురంగ మహాత్మ్యం’ నుంచీ యన్.ఏ.టి. బ్యానర్ లోగోలో శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడివైపును జానకిగారు కూర్చుని తెరపై కనిపించడం విశేషం. నేను ‘తాతమ్మకల’లో మహానటి భానుమతి మునిమనవడిగా నటిస్తూ పరిచయమయ్యాను. ఆ తరువాత “రామ్ – రహీమ్, వేములవాడ భీమకవి” చిత్రాల్లో షావుకారు జానకిగారితో నటించే అదృష్టం నాకు దక్కింది. మన దేశంలో 75 ఏళ్ళ సుదీర్ఘ నటనాప్రస్థానం చూసిన ఆర్టిస్ట్ షావుకారు జానకిగారు ఒక్కరే అనుకుంటాను. అంతటి సుదీర్ఘ నటనాజీవితంలో ఎన్నెన్నో మరపురాని పాత్రల్లో జనాన్ని మెప్పించారు జానకిగారు. ఆ మహానటి మరణం నాకు వ్యక్తిగతంగా తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను

ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత షావుకారు జానకి మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణవార్త తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొంటూ, శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.'షావుకారు' చిత్రంతో ప్రారంభమైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా చిరంజీవి స్మరించుకున్నారు. సుమారు ఏడు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ తదితర భాషల్లో వైవిధ్యభరితమైన పాత్రలకు తన సహజ నటనతో ప్రాణం పోశారని కొనియాడారు. ప్రేక్షకుల హృదయాల్లో ఆమె చెరగని ముద్ర వేసిన గొప్ప నటి అని అభివర్ణించారు."భారతీయ చిత్ర పరిశ్రమకు షావుకారు జానకి గారు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, అసంఖ్యాక అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Hema fires on anasuya Bharadwaj over Jai Shri Ram Slogans row: ఇటీవల అనసూయ తరచుగా వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ.. కొంత మంది జై రామ్ ముసుగులో దాడులు చేస్తున్నారని అన్నారు. నినాదాల కంటే వ్యక్తి ప్రవర్తన గొప్పదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై రచ్చ రాజుకొవడంతో దీనిపై అనసూయ భరద్వాజ్ పై హిందు సంఘాలు బోరబండ పీఎస్ లో ఫిర్యాదు చేశాయి. దీంతో అనసూయ కాస్త తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. కొంత మంది కావాలని తన వ్యాఖ్యల్నివక్రీకరించారని అన్నారు. తనకు రాముడంటే ఇష్టమని, సనాతన ధర్మమంటే గౌరవమని చెప్పారు. తన కొడుకుకి హనుమాన్ పేరు పెట్టానని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అనసూయ ఎపిసోడ్ పై హిందూ సంఘాలు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నాయి. దీనిపై తాజాగా.. నటి హేమ రంగంలోకి దిగారు. సనాతన ధర్మంపై,జై రామ్ నినాదంపై అనసూయచేసిన వ్యాఖ్యల్ని ఏకీపారేశారు. అనసూయను గురించి మాట్లాడుతూ.. మనం అద్దాల మెడలో ఉంటున్నామని చెప్పారు. మాట్లాడేప్పుడు ప్రతి ఒక్క మాటలను జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. అనసూయ వ్యక్తిగత అంశాలు, ఆమె ధర్మం ఆమె ఇష్టమన్నారు. కానీ కొట్లాది మంది విశ్వాసాల్ని తక్కువ చేసే మాట్లాడే హక్కు అనసుయకు లేదన్నారు. శ్రీరామ్ అనేది నినాదం మాత్రమే కాదని, అది కోట్లాది మంది హిందువుల గుండెల్లో నిలిచిపోయిన పవిత్ర మంత్రమన్నారు. Read more: Anasuya Bharadwaj: చిక్కుల్లో అనసూయ భరద్వాజ్.!. బోరబండ పీఎస్ లో కేసు నమోదు.. మ్యాటర్ ఏమిటంటే..?.. ఒకవైపు

భారతీయ చిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో ఏడు దశాబ్దాల పాటు అలరించిన లెజెండరీ నటి, పద్మశ్రీ షావుకారు జానకి కన్నుమూశారు. ఆమె మరణవార్త పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిరంజీవి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగమైన సందేశాన్ని పోస్ట్ చేస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. "ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి గారు ఇకలేరనే వార్త ఎంతో బాధ కలిగించింది. ‘షావుకారు’ చిత్రంతో మొదలైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాల పాటు కొనసాగింది" అంటూ ఆమె ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. "వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి ఆమె. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం. షావుకారు జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి." అంటూ చిరంజీవి నివాళులర్పించారు. యష్ ‘టాక్సిక్’ మూవీకి షాక్ ఇచ్చిన సెన్సార్.. రన్ టైమ్ ఎంతంటే? నయనతార మూవీకి రికార్డు డీల్.. రూ.100 కోట్ల ప్రాజెక్ట్కి మైండ్ బ్లాకింగ్ ఓటీటీ రేట్!

మరో దిగ్గజ సినీతార నింగికెగిసింది. దశాబ్దాల పాటు అభిమానులను మెప్పించిన అలనాటి కథానాయిక కథ ఇక ముగిసింది. దాదాపు 400లకు పైగా చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించిన నాట్య మయూరి ఇక సెలవు తీసుకుంది. తెలుగు వెండితెరపై తనదైన ముద్రవేసిన సీనియర్ నటి షావుకారు జానకి ఇవాళ తుదిశ్వాస విడిచింది. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆమె శాశ్వత నిద్రలోకి జారుకుంది. ఈ విషాద సమయంలో జానకి గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన ఆమె ఎన్నో అవార్డులు అందుకున్నారు. నంది అవార్డులతో పాటు ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి కూడా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమె నటించిన తొలి సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నారనే టాపిక్ ఆసక్తిగా మారింది. షావుకారు జానకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది షావుకారు మూవీనే. అందుకే ఆ సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరోగా నటించారు. ఈ మూవీకి గానూ జానకికి రూ.2500 రూపాయలు ఇచ్చారని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అప్పట్లో ఆర్థికంగా చితికిపోతున్న రోజుల్లో నాకు రెండన్నర్ర లక్షలుగా కనపడిందని జానకి పేర్కొంది. ఇది నాకు ఓ వరంలాగా అనిపించిందని జానకి వెల్లడించింది. హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు) హైదరాబాద్ : హైటెక్స్లో హిమ్టెక్స్ ప్రదర్శన (ఫొటోలు) షావుకారు జానకి మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి ప్రముఖ నటి షావుకారు జానకి లాస్ట్ ఇంటర్వ్యూ సీమ అంటే ఇంత ద్వేషమా రేవంత్ కోసం బాబు తలొంచాడు.. రాయలసీమ కరువుకు బాబే కారణం సోషల్ మీడియాలో మోదీ హవా.. కేంద్ర మంత్రులకు ర్యాంకింగ్స్ రష్యా సీక్రెట్ ఆపరేషన్ ఒక్క టీ... టాప్ స్పై హతం స్టోరీ వింటే

తెలుగు, తమిళ చిత్రసీమలో తనదైన నటనతో ప్రత్యేక ముద్ర వేసిన సీనియర్ నటి 'షావుకారు' జానకి (94) మరణవార్తపై స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.విలక్షణమైన పాత్రలతో చెరగని సంతకం చేసిన జానకి గారి మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి, బాధకు గురిచేసిందని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సుదీర్ఘ సినీ ప్రయాణం, వెండితెరపై ఆమె జీవం పోసిన విలక్షణమైన పాత్రలు తరతరాల సినీ ప్రేమికుల జ్ఞాపకాల్లో ఎప్పటికీ పదిలంగా నిలిచిపోతాయని కొనియాడారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూశారు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చెన్నై, ఆగస్టు 21: ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూశారు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 400పైగా సినిమాల్లో జానకి నటించారు. 1931 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో షావుకారు జానకి జన్మించారు

భారతీయ సినీ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి శుక్రవారం ఆగస్టు 21న కన్నుమూశారు. 94 ఏళ్ల వయసు కలిగిన ఆమె చెన్నైలోని కావేరి హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె గత కొన్ని రోజులుగా వయోభారంతో కూడిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గురువారం రోజున ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆమెను కావేరి హాస్పిటల్కు తరలించారు. ఐసియులో తీవ్ర నిఘాలో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 1:59 గంటలకు ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ వార్త తెలియగానే దక్షిణ భారత సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. అభిమానులు మరియు సినీ ప్రముఖుల నివాళుల కోసం ఆమె భౌతికకాయాన్ని తేనాంపేటలోని సెనోటాఫ్ రోడ్ నివాసంలో ఉంచారు. 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించిన జానకి 1950లో ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన షావుకారు సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ మొదటి చిత్ర విజయం ఆమె పేరు ముందు షావుకారు అనే శాశ్వత గుర్తింపును తెచ్చిపెట్టింది. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో దాదాపు 400 చిత్రాల్లో నటించి మెప్పించారు. 300కి పైగా నాటకాల్లో కూడా నటించి తన ప్రతిభను చాటుకున్నారు. కన్యాశుల్కం, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ శివ, ఇది కథ కాదు, తిల్లు ముల్లు, సంసారం ఒక చదరంగం, హే రామ్ వంటి చిత్రాలు సినీ చరిత్రలో నిలిచిపోతాయి. 2023లో వచ్చిన అన్ని మంచి శకునములే చిత్రంలో కూడా ఆమె నటించారు. భారత ప్రభుత్వం ఆమె సేవలకుగాను 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆమె మృతి దక్షిణ భారత సినిమా రంగానికి తీరని లోటు అని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఏడు దశాబ్దాల పాటు తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఒక మహానటి ప్రస్థానం ముగిసింది. ఆమె అందించిన సేవలు

గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటీమణి షావుకారు జానకి (95) చెన్నై కావేరీ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటీమణి షావుకారు జానకి (95) చెన్నై కావేరీ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. దాదాపు ఏడున్నర దశాబ్దాలుగా సినిమా రంగంలో నటిగా తనదైన ముద్రవేశారామె. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన జానకి 1931 డిసెంబర్ 12న జన్మించారు. ఆమె తల్లి దండ్రులు శచీదేవి, టేకుమళ్ళ వెంకోజీరావు. తండ్రి రాజమండ్రిలో గవర్నమెంట్ పేపరు ఎక్స్ పర్టు అండ్ కెమికల్ ఇంజనీరుగా పనిచేసేవారు. ఆమెకు ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు చెల్లెళ్ళు. వారిలో ఒకరు ప్రముఖ నటి కృష్ణకుమారి. తండ్రి ఉద్యోగరీత్యా 1944లోనే జానకి కుటుంబంతో మద్రాసు చేరారు. అక్కడ ఆలిండియా రేడియోలో ఆమె చిన్న పిల్లల కార్యక్రమంలో పాల్గొనే వారు. ఆ రకంగా సినిమా రంగంతో జానకి కుటుంబానికి పరిచయాలు ఏర్పడ్డాయి. 1947 నవంబర్ 5న ఆమెకు శంకరమంచి శ్రీనివాసరావుతో వివాహం జరిగింది. ఆ తర్వాతే ఆమె సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. విజయవారి 'షావుకారు' సినిమాతో 1950లో సినీరంగ ప్రవేశం చేసిన జానకి వివిధ భాషల్లో దాదాపు 380 చిత్రాలలో నటించారు. ఆమె నటించిన చివరి చిత్రం 2023లో వచ్చిన 'అన్నీ మంచి శకునములే'. 'షావుకారు' జానకి పేరు వినగానే ముందుగా ఆమె గళం గుర్తుకు వస్తుంది. గాయని కాకపోయినా, ఆమె గాత్రం నుండి జాలువారిన మాటలు వినసొంపుగా ఉండేవి. ఆ గళమహిమతోనే చిత్రసీమలో జైత్రయాత్ర చేశారు జానకి. విజయా సంస్థ ఎల్వీ ప్రసాద్ డైరెక్షన్ లో నిర్మించిన 'షావుకారు' చిత్రంతో చిత్రసీమలో అడుగు పెట్టిన జానకి, నాటి మేటి నటీనటుల సరసన తొలి సినిమాతోనే దీటుగా నటించి భళా అనిపించుకున్నారు జానకి. అందువల్లే 'షావుకారు' టైటిలే జానకి ఇంటిపేరుగా మారింది. పాత్ర ఏదైనా సరే ఇట్టే పరకాయ ప్రవేశం చేయడం షావుకారు జానకి

మహానటి సావిత్రి (Savithri) కెరీర్ లో గొప్ప పేరు తెచ్చిపెట్టిన పాత్ర 'దేవదాసు'లోని సావిత్రి. నిజానికి ఆ పాత్రకు తొలుత జానకిని అనుకున్నారు. మహానటి సావిత్రి (Savithri) కెరీర్ లో గొప్ప పేరు తెచ్చిపెట్టిన పాత్ర 'దేవదాసు'లోని సావిత్రి. నిజానికి ఆ పాత్రకు తొలుత జానకిని అనుకున్నారు. అలానే గుండమ్మ కథలో మేరీ పాత్ర కూడా జానకికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్రకూ మొదట భానుమతిని అనుకున్నారు. కానీ ఈ రెండు పాత్రలు చిత్రంగా సావిత్రి పోషించి, చిత్రసీమలో తనకంటూ ఓ గొప్ప ముద్రను వేసేలా చేశాయి. సావిత్రితో జానకికి ఎంతో గాఢమైన అనుబంధం ఉంది. జానకి సినిమా రంగంలో నిలదొక్కుకునే రోజుల్లో జెమినీ గణేశన్ సహకారంతో పలు చిత్రాలలో అవకాశాలు పొందింది. ఆ చనువుతో ఒకసారి ఆయనతో కలిసి అద్దె ఇంటి కోసం వెతుకుంటుంటే... జెమినీ గణేశన్ ధౌంజెడ్ లైట్స్ లోని షఫీ మహమ్మద్ రోడ్డులోని మేడమీద పోర్షన్ ను చూపించారట. అదే మేడ కింద పోర్షన్ లో తొలిసారి గౌన్ వేసుకున్న సావిత్రిని తాను చూశానని జానకి చెబుతుండేవారు. జెమినీ గణేశన్ ద్వారానే నటి సావిత్రి పరిచయమైందని, ఆ తర్వాత ఆమె తనకు ఎంతో సన్నిహితురాలిగా మారిపోయిందని అంటుండేవారు జానకి. తమ సినీ ప్రయాణం గురించి చెబుతూ, 'సావిత్రి గొప్ప చిత్రకారణి. తన రూపు రేఖా విలాసాలన్నీ ప్రతిబించేలా ఒక గొప్ప వర్ణ చిత్రాన్ని రచించి, తనకు తానుగా దాన్ని కాలి కింద నలిపి, ముక్కలు చేసిందేమో అనిపిస్తుంది నాకు. సావిత్రి 'దేవదాసు'లో చేసిన పార్వతి పాత్రకు మొదట నన్నే అనుకన్నారు. రిహార్సిల్స్ కూడా జరిగాయి. అయితే ఆ పాత్ర నుంచి నన్ను తప్పించారు. నిజంగా అది నా దురదృష్టమే. ఎందుకంటే 'ఓ దేవదా' పాట రిహార్సిల్స్ ఎంత బాగా వచ్చిందో చెప్పలేను. కారణం లేకుండా తీసేయడంతో చాలా బాధపడ్డాను. వేషం పోయినందుకు పది రోజులు ఏడ్చాను. ఒకవేళ నేను

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెరగని గుర్తింపును అందించిన నటీమనుల్లో ఒకరు, ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత 'షావుకారు' జానకి (94) మరణించారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె మరణంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. షావుకారు జానకి అసలు పేరు శంకరమంచి జానకి. ఆమె 1931 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు. చిన్నతనంలోనే రేడియో నాటికల ద్వారా కళారంగంలో ప్రవేశించిన ఆమె.. తన టాలెంట్ తో మంచి గుర్తింపు సాధించింది. 1950లో ప్రముఖ దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ తెరకెక్కించిన 'షావుకారు' చిత్రంతో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) సరసన హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంలోనే ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో 'షావుకారు' అనేది ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. ఒక్క సినిమాతోనే 'షావుకారు జానకి'గా సినీ ప్రపంచంలో సుస్థిర స్థానాన్ని ఆమె సంపాదించుకున్నారు. సుదీర్ఘమైన సినిమా ప్రయాణం చేసిన అరుదైన హీరోయిన్లలో .. షావుకారు జానకి ఒకరు.దాదాపు 70 ఏళ్ల సినీ ప్రయాణంలో ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాలలో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, శివాజీ గణేసన్, జెమిని గణేసన్, ఎంజీఆర్, రాజ్కుమార్ వంటి దిగ్గజ నటులందరి సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది. షావుకారు, కన్యాశుల్కం, రోజులు మారాయి, డాక్టర్ చక్రవర్తి, మంచి మనసులు, ఉయ్యాల జంపాల, అక్కచెల్లెళ్లు, దేవుడు చేసిన మనుషులు, తాయారమ్మ బంగారయ్య, బడిపంతులు వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలు ఆమె నటనా పటిమకు నిదర్శనాలు. పౌరాణిక, సాంఘిక, హాస్య, సెంటిమెంట్.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా జీవించడం ఆమె నైజం. వయసు పెరిగిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, బామ్మ పాత్రల్లోనూ మెప్పించారు. 2020లో వచ్చిన 'బిస్కోత్' చిత్రంలో ఆమె

ఒకప్పుడు తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన నటి యమున.అప్పట్లో వరుసగా సినిమాలు చేసిన ఆమె ఆతర్వాత ఊహించని విధంగా గ్యాప్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కాగా ఓ ఇంటర్వ్యూలో యమున మాట్లాడుతూ.. తన కెరీర్ ప్రారంభ దశలో ఇతర నటీమణులకు తాను పోటీ కాదని, తన పాత్రలన్నీ ప్రత్యేకమైనవని అన్నారు. ఎందుకంటే తాను గ్లామర్ పాత్రలకు దూరంగా, విభిన్నమైన క్యారెక్టర్లు చేశానని, అందుకే ఎవరూ తనను పోటీగా భావించలేదని తెలిపారు. దర్శకుడు దాసరి నారాయణ రావుతో తనకున్న బలమైన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, "మామగారు" సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత దాసరి సినిమాల్లో తాను ఎక్కువగా నటించే అవకాశం లభించిందని చెప్పారు. అయితే, ఒకే రకమైన పాత్రలు తన వద్దకు వచ్చేవని, "నాగమ్మ" తర్వాత చాలా పాము సబ్జెక్ట్ సినిమాలు వచ్చాయని వివరించారు. శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు.. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు ఇటీవల మళ్లీ సినిమాలు చేస్తారని కొందరు ఆశించినప్పటికీ, తాను సీరియల్స్తో బిజీగా ఉండడం వల్ల అవకాశాలను అందుకోలేకపోయానని అన్నారు. సీరియల్స్లో నటించడం తనకు ఎంతో సౌకర్యంగా ఉందని, ఒకే చోట, కుటుంబ వాతావరణంలో పనిచేయడం ఇష్టమని ఆమె వివరించారు. పాత్రల విషయంలో తనకు ఎలాంటి పరిమితులు లేవని యమున అన్నారు. "అమ్మ" పాత్రలు, "అక్క" పాత్రలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, 20 ఏళ్ల క్రితమే తాను ఒక సీరియల్లో బామ్మ పాత్ర చేశానని గుర్తుచేసుకున్నారు. Madhuri Rathod: అందుకే అలాంటి పాటల్ని సెలక్ట్ చేసుకున్నా.. వాటితోనే క్రేజ్ తెచ్చుకున్నా : మాధురి రాథోడ్ చిరంజీవి వంటి అగ్ర హీరోలకు అమ్మగా నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, అయితే అది ఎంతవరకు సరిపోతుందో తెలియదని నవ్వుతూ అన్నారు. మహేష్ బాబు వంటి హీరోలకు అమ్మగా నటించాలని తనకు

భారతీయ సినీ చరిత్రలో ఆమె ఓ ధృవతార.. తన అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి అగ్ర కథానాయికగా నిలిచింది. ఆమె మరెవరో కాదు సీనియర్ నటి రాజసులోచన. ఈ తరం ప్రేక్షకులకు ఆమె గురించి తెలియకపోవచ్చు కానీ.. అప్పట్లో ఆమె తిరుగులేని హీరోయిన్. నాట్య, సినీ రంగాలతో పాటు కార్ డ్రైవింగ్, బోట్ రైడింగ్ లలో సైతం ఆమె గుర్తింపు పొందారు. విజయవాడలో పుట్టి, మద్రాసులో పెరిగిన రాజా సులోచన, వ్యక్తిగత జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. రెండు వివాహాలు, వృత్తిపరమైన ఆటుపోట్లను అధిగమిస్తూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో 300కు పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారు రాజసులోచన. శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు.. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు ఈ అందాల తార అసలు పేరు రాజీవలోచన కాగా, స్కూల్ రిజిస్టర్లో పొరపాటున రాజసులోచన అని నమోదు కావడంతో అదే పేరు ఆమెకు స్థిరపడింది. రాజసులోచనకు చిన్నతనం నుంచే నాట్యం అంటే అపారమైన ఆసక్తి ఉండేది. కళాభిమాని అయిన ఆమె మేనమామ స్థాపించిన సుగుణ విలాస సభ నాటక, నృత్య ప్రదర్శనలు ఆమెకు ప్రేరణనిచ్చాయి. ఏడేళ్ల వయసులో సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టినా, ఆమె దృష్టి ఎక్కువగా నృత్యం పైనే ఉండేది. మూడో ఫారంలోనే చదువు మానేసి, 13వ ఏట స్టేజీపై తొలిసారి అరంగేట్రం చేశారు. నృత్యం నేర్పే క్రమంలో ఆమెకు పరమశివం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. తల్లిదండ్రుల అంగీకారం లేకపోయినా, 1951 సెప్టెంబర్ 11న కరుణానిధి సమక్షంలో పరమశివంతో ఆమె వివాహం జరిగింది. 1952లో కె.ఎస్. ప్రకాశరావు తన కన్నతల్లి చిత్రంలో ఆమెకు అవకాశం ఇచ్చారు. కెరీర్ ప్రారంభంలో తెలుగు, తమిళ చిత్రాల్లో వ్యాంప్ పాత్రలు చేసినప్పటికీ, ఎన్టీఆర్ నటించిన సొంతవూరు చిత్రంలో హీరోయిన్ గా నిలదొక్కుకున్నారు. ఆ తర్వాత మాంగల్య బలం