
దేశంలో చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడమే కారణమంటూ వస్తున్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ వాదనల్లో ఏమాత్రం వాస్తవం లేదని, ధరల పెరుగుదల వెనుక ఇతర కారణాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఈ అంశంపై వివరణ ఇచ్చింది.దేశీయంగా చక్కెర ఉత్పత్తి అంచనాల కంటే తగ్గడం, పండుగల సీజన్ కారణంగా డిమాండ్ పెరగడం, పంట నష్టాలు, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో తలెత్తిన అవాంతరాలే ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని ప్రభుత్వం తెలిపింది. కొందరు వ్యాపారులు అక్రమంగా నిల్వలు చేయడం కూడా దీనికి దోహదం చేసిందని పేర్కొంది. గత నెల రోజుల్లోనే చక్కెర ధర గణనీయంగా పెరిగింది. జూలై 20న కిలో రూ. 48గా ఉన్న ధర, ఆగస్టు 20 నాటికి రూ. 55 మార్కును దాటింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో హోల్ సేల్ మార్కెట్లో ధర రూ. 65 దాటగా, రిటైల్ మార్కెట్లో రూ. 70 మార్కును కూడా అధిగమించింది.అయితే, ఈ ధరల పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తికి ఎటువంటి సంబంధం లేదని కేంద్రం వెల్లడించింది. ఇథనాల్ తయారీ కోసం చక్కెర మళ్లింపు గతంతో పోలిస్తే తగ్గిందని గణాంకాలతో సహా వివరించింది. 2022-23లో 12 శాతం చక్కెరను ఇథనాల్ కోసం మళ్లించగా, 2025-26 నాటికి అది 9 శాతానికే పరిమితమైందని తెలిపింది. దేశంలో ఉత్పత్తి అవుతున్న ఇథనాల్లో దాదాపు మూడో వంతు మొక్కజొన్న వంటి



