
చుంచుపల్లి, సెప్టెంబర్ 02 : కోతుల బెడదను తక్షణమే పరిష్కరించకపోతే ఇకపై నిర్వహించే గ్రామసభలను బహిష్కరిస్తామని చుంచుపల్లి మండలం గౌతంపూర్ గ్రామ ప్రజలు హెచ్చరించారు. గ్రామంలో కోతుల సంఖ్య విపరీతంగా పెరిగి చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను తీసుకెళ్లడంతో పాటు వస్తువులను ధ్వంసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించి కోతులను పట్టించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతూ గ్రామసభలో సర్పంచ్ కళ్యాణి, సెక్రటరీ షర్మిలకు వినతిపత్రం అందజేశారు.
Written by Skyc Media Editorial
checkSenior Editorial Lead • Skyc Media