
వరలక్ష్మి వత్రం సందర్భంగా హైదరాబాద్లో అమ్మవారికి పూజలు చేసిన మహిళలు
ఇంటర్నెట్డెస్క్: శ్రావణ మాసం సందర్భంగా ఈనాడు- ఈటీవీ- EFM ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ‘శ్రావణ లక్ష్మి’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి జోస్ అలుక్కాస్, శుభమస్తు షాపింగ్ మాల్, కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ స్పాన్సర్లుగా వ్యవహరించాయి. ఆహ్వానితుల ఇళ్లలో నిర్వహించిన వరలక్ష్మీ వ్రతం పూజా కార్యక్రమాల్లో ఈఎఫ్ఎం ఆర్జేలు పాల్గొని కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. సాయంత్రం వేళ విశాఖపట్నం, హైదరాబాద్ నగరాల్లోని జోస్ అలుక్కాస్ షోరూమ్లలో నిర్వహించిన ఈవెంట్లలో ఆర్జేలు సందడి చేశారు. శ్రావణ మాస విశిష్టతను గుర్తుచేసుకుంటూ ఈ మాసంలో పాటించే సంప్రదాయాలు, ఆచారాలను మహిళలు తోటివారితో పంచుకున్నారు. సంప్రదాయబద్ధంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అనంతరం ముత్తయిదువులకు వాయినాలు అందజేశారు. శ్రావణ మాసంలో మహిళల సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఆధ్యాత్మికత అంశాలతో మహిళలకు క్విజ్, పాటలు, నృత్య పోటీలు నిర్వహించారు. విజేతలకు స్పాన్సర్లు బహుమతులు అందించారు. ఈనాడు ఈఎఫ్ఎం నిర్వహించిన సమున్నత కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
చెరువులు, కుంటల్లో సహజసిద్ధంగా పెరిగే తామర పూలను ఓ రైతు వరికి ప్రత్యామ్నాయంగా పొలంలో సాగు చేస్తున్నారు.
శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా అనకాపల్లిలో నూకాలమ్మ.. ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు.
విజయవాడ దుర్గగుడికి దశాబ్దం తర్వాత.. అన్నదానం, ప్రసాదం తయారీకి ప్రత్యేక భవనాలు అందుబాటులోకి వచ్చాయి.
శ్రావణ మాసం శుక్రవారం, వరలక్ష్మీ వత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ శోభ సంతరించుకుంది. జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో అమ్మవారిని కూరగాయలు, కరెన్సీ నోట్లు, పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయాలకు అధిక సంఖ్యలో తరలిరావడంతో రద్దీ నెలకొంది. మరోవైపు మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఆ ఫొటోలు మీకోసం..





