
ముంబై మహానగరంలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదా చేసే మరో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) శ్రీకారం చుట్టింది. నగరంలోని వెర్సోవా, మధ్ ఐలాండ్ ప్రాంతాలను కలుపుతూ మలాడ్ క్రీక్పై రూ. 2,395 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక కేబుల్ ఆధారిత వంతెన (కేబుల్-స్టేయ్డ్ బ్రిడ్జ్) నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే, ప్రస్తుతం 60 నుంచి 90 నిమిషాలు పట్టే ప్రయాణం కేవలం 10 నిమిషాలకు తగ్గిపోనుంది.ప్రస్తుత ప్రయాణ కష్టాలకు చెక్ప్రస్తుతం వెర్సోవా, మధ్ ఐలాండ్ మధ్య ప్రత్యక్ష రోడ్డు కనెక్టివిటీ లేదు. మలాడ్ క్రీక్ ఈ రెండు ప్రాంతాలను వేరు చేస్తోంది. దీంతో రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే సుమారు 18 నుంచి 20 కిలోమీటర్ల దూరం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ట్రాఫిక్ను బట్టి ఈ ప్రయాణానికి గంట నుంచి గంటన్నర సమయం పడుతోంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణికుల కోసం జెట్టీ సర్వీసు అందుబాటులో ఉన్నప్పటికీ, అది పూర్తిస్థాయి పరిష్కారం చూపడం లేదు. 'ది ఇండియన్ ఎక్స్ప్రెస్' కథనం ప్రకారం.. ఈ జెట్టీ సర్వీసు ఏడాదిలో కేవలం ఎనిమిది నెలలు మాత్రమే పనిచేస్తుంది. వర్షాకాలంలో భద్రతా కారణాల దృష్ట్యా దీనిని నిలిపివేస్తారు. పరిమిత వేళల్లో మాత్రమే నడిచే ఈ సర్వీసు రోజువారీ ప్రయాణికుల అవసరాలను తీర్చలేకపోతోంది. ఈ నేపథ్యంలో కొత్త వంతెన నిర్మాణం ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలలను నెరవేర్చనుంది.వంతెన స్వరూపం.. ప్రయోజనాలుబీఎంసీ ప్రణాళికల ప్రకారం..




