
మహారాష్ట్రలో జీపు బోల్తా ప్రమాదం నిర్మల్ జిల్లా వాసులు నలుగురు మృతి శివయ్య దర్శనం ముగించుకుని వస్తుండగా విషాదం Maharashtra Jeep Accident: శ్రావణ సోమవారం నాడు దైవదర్శనానికి వెళ్లిన నిర్మల్ జిల్లా వాసుల ప్రయాణం విషాదాంతమైంది. మహారాష్ట్ర (Maharashtra Jeep Accident)సరిహద్దు ప్రాంతంలో జీపు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల సరిహద్దులోని తొటాంబ గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని శివాలయానికి వెళ్లిన వీరంతా, తిరుగుప్రయాణంలో మహారాష్ట్రలోని సాసర్ కొండ జలపాతాన్ని సందర్శించి వస్తుండగా ఈ విషాదం జరిగింది. BC Dedicated Commission: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. బీసీ డెడికేటెడ్ కమిషన్ గడువు పెంపు.. కొత్త డెడ్లైన్ ఎప్పుడంటే? భైంసా ఆసుపత్రికి క్షతగాత్రులు తరలింపు: ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతులలో ముగ్గురిని కుబీర్ మండలం పార్డి (బి) గ్రామానికి చెందిన తులసీరామ్, గంగన్న, గంగాబాయిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద వార్త తెలియగానే గ్రామంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వెంటనే భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.





