
ఇంటర్నెట్ డెస్క్: తన కుమార్తె వివాహ బంధానికి సంబంధించి ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ భాజపా ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేశారు. అనేక మంది మహిళలను మోసం చేసిన వ్యక్తితో తన కుమార్తెకు వివాహం జరిపించారని (Marriage Fraud) అన్నారు. నకిలీ గుర్తింపు కార్డులతో అనేక పెళ్లిళ్లు చేసుకొని డబ్బులు దండుకున్నట్లు తెలిసిందని ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
యూపీలోని సేవతా నియోజకవర్గ ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ (MLA Gyan Tiwari) కుమార్తె ప్రజ్ఞాకు సీతాపుర్ జిల్లాకు చెందిన అనూజ్ త్రివేది కుమారుడు ప్రఖార్ త్రివేదితో 2024లో వివాహం జరిగింది. ముంబయిలో పేరొందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అనూజ్ పరిచయం చేసుకోవడం, ఆ కుటుంబానికి స్థానికంగా మంచి పేరుందని తెలియడంతో జ్ఞాన్ తివారీ ఈ సంబంధానికి అప్పట్లో ఓకే చెప్పారు.
12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఎన్కౌంటర్లో నిందితుడు హతం
కానీ, ఇటీవల అల్లుడి కార్యకలాపాలు, మోసాలకు సంబంధించిన కేసులు వెలుగులోకి రావడంతో అతడి చరిత్రపై ఎమ్మెల్యే ఆరా తీశారు. తప్పుడు ఐడీ కార్డులతో మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో అనేక మంది మహిళలను ప్రలోభపెట్టి కోట్లాది రూపాయలు కాజేసినట్లు తెలుసుకున్నారు. అంతేకాదు.. ఇప్పటికే తన అల్లుడు దాదాపు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడని తెలియడంతో కంగుతిన్నారు. ఈ విషయాలు తెలిసిన వెంటనే నిందితుడి కుటుంబంతో సంబంధాలు తెంచుకొని తన కుమార్తెను తమ ఇంటికి తీసుకువచ్చామని వెల్లడించారు.
ప్రఖార్ నేర చరిత్ర, కేసుల వివరాలను దాచిపెట్టి వివాహం జరిపించారని, దీంతో తన కుటుంబం తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తోందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఓ ప్రజాప్రతినిధిగా తన పరువుకూ నష్టం కలిగిందన్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుతో ప చీటింగ్ కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు..తండ్రీకొడుకులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇదిలాఉంటే, ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో మహారాష్ట్రలోనూ వారిపై కేసు నమోదైనట్లు తెలిసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
పశ్చిమ కనుమలు, కేరళ, మహారాష్ట్రల్లో నిరవధికంగా కురుస్తున్న వర్షాలతో కావేరి నది ఉద్ధృతంగా మారింది.





