
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటనలోనే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ముంబైలోని తన కమర్షియల్ ఆస్తుల ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తాజాగా అంధేరి వెస్ట్లోని ఓ వాణిజ్య భవనంలోని మూడు అంతస్తులను ఓ ప్రముఖ కంపెనీకి లీజుకు ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ ఒప్పందం ద్వారా ఆయనకు నెలకు రూ. 33 లక్షల అద్దె రానుంది.ముంబై అంధేరిలోని ఓషివారా లింక్ రోడ్లో ఉన్న 'సిగ్నేచర్' భవనంలో అమితాబ్కు చెందిన ఆఫీస్ స్పేస్ ఉంది. దీనిలోని మూడు పై అంతస్తులను న్యూట్రిషన్ ఉత్పత్తుల సంస్థ 'ట్రూనేటివ్ ఎఫ్&బి ప్రైవేట్ లిమిటెడ్'కు లీజుకు ఇచ్చారు. ఈ ఒప్పందం ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చింది. మొత్తం 8,428 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ స్థలానికి ఐదేళ్ల పాటు లీజు కుదిరింది. ఈ ఐదేళ్ల కాలంలో అమితాబ్కు అద్దె రూపంలో మొత్తం రూ. 21.88 కోట్ల ఆదాయం లభించనుంది. ఒప్పందంలో భాగంగా ట్రూనేటివ్ సంస్థ రూ. 1.98 కోట్లను సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించింది. ఏటా అద్దెను 5 శాతం పెంచేలా నిబంధన చేర్చారు. దీంతో పాటు 9 కార్ల కోసం ప్రత్యేక పార్కింగ్ హక్కులను కూడా కల్పించారు.గతేడాది కూడా ఇదే 'సిగ్నేచర్' భవనంలోని నాలుగు ఆఫీస్ యూనిట్లను వార్నర్ మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్కు అమితాబ్ లీజుకు ఇచ్చారు. ఆ ఒప్పందం ద్వారా నెలకు రూ. 17.30 లక్షల అద్దె వస్తోంది.ముంబైలో అమితాబ్కు విలువైన ఆస్తులు అనేకం ఉన్నాయి. ఆయన కుటుంబంతో నివసించే