
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. శక్తి పథకం, జీవో నంబర్ 97ను వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్నారు. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేసేలా ఇచ్చిన జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా.. మహబూబాబాద్ పట్టణ సీఐ రఘుపతి రెడ్డి నేతృత్వంలో పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు.సుస్మితా.. రేవంత్ రెడ్డి కాలిగోటికి సరిపోవు.. డైపర్లు ఎవరు వేసుకుంటారో అందరికీ తెలుసు!పోలీసుల సంఖ్య తక్కువగా ఉండడంతో విద్యార్థులను నిలవరించే యత్నంలో ఇరువర్గాల మధ్య కొంత సేపు తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు విద్యార్థులను ఈడ్చుకుంటూ బయటకు పంపారు. సీఐ రఘుపతి రెడ్డి ఒకరిద్దరు విద్యార్థుల గొంతు పట్టుకొని వెనక్కి నెట్టుకుంటూ వెళ్లడంతో కలెక్టరేట్ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఐ రఘుపతి రెడ్డి తీరును నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనలను ముమ్మరం చేశారు. అనంతరం కాసేపటి తర్వాత అదనపు పోలీసు బలగాలను రప్పించి విద్యార్థులందరినీ బయటకు తీసుకెళ్లి గేటును మూసివేశారు. ఈ క్రమంలో పోలీసులు కలెక్టరేట్ గేట్లు బంద్ చేసి భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు కలెక్టరేట్ గేటు బయట రెండు గంటలపాటు బైఠాయించి నినాదాలు చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.విద్యార్థుల ఆవేదనడిప్లొమా చేసే విద్యార్థులు మధ్యతరగతి వాళ్ళే ఉంటారని.. ఇప్పుడు దీన్ని శక్తి స్కీంలోకి తెస్తే మేం ఏమైపోవాలంటూ పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. రెండు, మూడు రోజుల నుంచిధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం నుంచి స్పందన లేదని.. ఒక్కరూ మమ్మల్ని పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయని అంటున్నారే తప్ప మా భవిష్యత్తు