
Vishwanath And Sons Closing collections: విశ్వనాథ్ అండ్ సన్స్క్లోజింగ్ కలెక్షన్లు..సూర్య మూవీకి లాభమా? న
Vishwanath And Sons Closing collections: విశ్వనాథ్ అండ్ సన్స్ క్లోజింగ్ కలెక్షన్లు..సూర్య మూవీకి లాభమా? న
© 2026 nimisham.in

Vishwanath And Sons Closing collections: విశ్వనాథ్ అండ్ సన్స్ క్లోజింగ్ కలెక్షన్లు..సూర్య మూవీకి లాభమా? న

Vishwanath and Sons OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Jason Sanjay | 'సిగ్మా' ఈవెంట్లో సీఎం విజయ్ కొడుకుకి గ్రాండ్ వెల్కమ్.. 'టీవీకే.. టీవీకే' నినాదాలతో హోరెత్తిన వేదిక!

Personal Finance: EMI కేవలం 1000 రూపాయలే.. రేపు చూద్దాంలే.. ఇలా అనుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
Vishwanath and Sons OTT: ఓటీటీలోకి రూ.260 కోట్ల సినిమా.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Folk Song : ఈపాట డీజేలో వింటే ఉంటది రా చారి.. యూట్యూబ్ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
Vishwanath And Sons Collections: సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ కలెక్షన్స్.. 25 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Personal Finance: మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి? ఎవ్వరు చెప్పని ప్లాన్ మీ కోసం..!

ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో విరుచుకుపడిన తీవ్రమైన ఫ్లాష్ ఫ్లడ్స్ ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. అక్కడ సంభవించిన ఐస్, రాక్ కొండచరియల విరిగిపాటు కారణంగా కొండప్రాంతాలు తీవ్రంగా ఊడ్చిపెట్టుకుపోయాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు మృతుల సంఖ్య ఏకంగా 1,127కి చేరినట్లు అధికారులు అధికారికంగా నిర్ధారించారు. వేలాది మంది ప్రజలు తమ నివాసాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ భారీ ప్రమాదం తర్వాత ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ తీవ్ర విపత్తు సమయాన రియల్ హీరో, సినీ నటుడు సోనూ సూద్ స్వయంగా రంగానికి దిగి నేపాల్ ప్రజలకు అండగా నిలిచారు. ఆయన సెప్టెంబర్ 1న కాఠ్మండు చేరుకుని, ఆ తర్వాత సెప్టెంబర్ 2న అత్యంత ప్రభావిత ప్రాంతాలైన త్రిశూలి బజార్, నువాకోట్ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయికి వెళ్లిన సోనూ సూద్ అక్కడ సర్వస్వం కోల్పోయిన వరద బాధితులను స్వయంగా కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అవసరమైన తక్షణ ఉపశమనాన్ని అందించేందుకు ఆయన ముందుకొచ్చారు. సూద్ చారిటీ ఫౌండేషన్ ద్వారా వరద బాధితులకు అవసరమైన ఆహారం, దుప్పట్లు, ఇతర అత్యవసర సహాయ సామగ్రిని ఆయన పంపిణీ చేశారు. దీంతో అక్కడ నిరాశ్రయులైన వేలాది మందికి తక్షణ ఉపశమనం లభించినట్లయింది. ఇదిలా ఉండగా, బాధితులతో మాట్లాడే సమయంలో సోనూ సూద్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా వరదల్లో సర్వస్వం కోల్పోయిన 8 ఏళ్ల చిన్నారి క్రిస్టినాను కలిసి ఆయన ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె పడిన బాధను చూసి కలచివేతకు గురైనట్లు ఆయన చెప్పారు. ఈ కష్టసమయంలో బాధితులను ఆదుకునేందుకు అందరూ కలిసి రావాలని సోనూ సూద్ పిలుపునిచ్చారు. ఫలితంగా అంతర్జాతీయ సమాజం కూడా నేపాల్ వైపు చూడాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, నేపాల్ ప్రజలు తమ ఇళ్లు, కుటుంబాలు, చివరకు పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Dr Subhash Chandra Case: తుది లీగల్ ఆర్డర్ లేకుండా పదిహేను రోజులుగా సాగుతున్న మీడియా ట్రయల్పై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) దృష్టికి ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర తీసుకువెళ్లారు. అదేవిధంగా ఈ కేసును మళ్లీ మొదటి నుంచి ఏకంగా ఐదుగురు సభ్యుల ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దీనిపై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు సుభాష్ చంద్ర తరుఫున న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు. NCLAT తాత్కాలిక ఛైర్మన్ జస్టిస్ యోగేష్ ఖన్నా, సాంకేతిక సభ్యులు బరుణ్ మిత్రా, అజయ్ దాస్ మెహ్రోత్రాలతో కూడిన ధర్మాసనం ముందు బుధవారం ఈ పిటిషన్లపై విచారణ జరిగింది. సుభాష్ చంద్ర తరఫున సీనియర్ న్యాయవాది సస్మిత్ పాత్ర వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం ఈ కేసులో ఎలాంటి అధికారిక తుది ఉత్తర్వు అమల్లో లేదని స్పష్టం చేశారు. అయినా.. రూ.22,006 కోట్ల మేర ఉన్న క్లెయిమ్లకు బదులుగా ఆయన కేవలం రూ.6.5 కోట్లు మాత్రమే చెల్లిస్తున్నారంటూ ఆయన ప్రతిష్టను దిగజార్చేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ఈ రూ.22,006 కోట్ల రుణం సుభాష్ చంద్ర వ్యక్తిగతంగా తీసుకున్నది కాదని.. ఎస్సెల్ గ్రూప్ కంపెనీలు తీసుకున్న రుణాలకు ఆయన గ్యారెంటర్గా మాత్రమే ఉన్నారని చెప్పారు. ఆయన వ్యక్తిగత ఆస్తుల నికర విలువ రూ.31.79 కోట్లు ఉండగా.. దాని ఆధారంగానే నిబంధనల ప్రకారం రూ.6.25 కోట్లు రుణదాతలకు, మరో రూ.25 లక్షలు న్యాయ ప్రక్రియ ఖర్చుల కోసం రీపేమెంట్ ప్లాన్ను రూపొందించారని వివరించారు. రీపేమెంట్ ప్లాన్ను ఆమోదిస్తూ ఎలాంటి

హీరో నాని తన కొడుకు అర్జున్తో కలిసి దిగిన క్యూట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జిమ్లో వర్కౌట్ చేస్తూనే కొడుకుతో కుస్తీ పడుతూ కనిపించిన నాని.. ‘మై లిటిల్ ప్యారడైజ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు, అర్జున్ గీసిన బొమ్మలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాలోని ‘జడల్’ పాత్రకు సంబంధించిన డ్రాయింగ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. తండ్రీకొడుకుల ఈ క్యూట్ మూమెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే snake plant ఈ మొక్కలని కిచెన్లో పెట్టుకుంటే.. మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

మీరు ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఇంట్లోంచి బయటకు వెళితే చాలు స్కూల్ పిల్లలు కనిపిస్తారు. ఈ సమయంలో వాళ్ల యూనిఫామ్స్ గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి స్కూల్కు సొంత యూనిఫామ్ ఉంటుంది… ఆ డిజైన్లు చాలా విభిన్నంగా ఉంటాయి. ఒక స్కూల్లో షర్ట్-ప్యాంట్ ఉంటే, మరో స్కూల్లో కుర్తా లేదా బ్లేజర్ ఉండొచ్చు. మరి దేశమంతటికీ ఒకే యూనిఫామ్ ఎందుకు లేదు? దీనికి ఒకటి కాదు చాలా కారణాలున్నాయి. యూనిఫామ్ డిజైన్ను వాతావరణం బాగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు వేడి ప్రాంతాల్లోని స్కూళ్లు తేలికైన, గాలి ఆడే దుస్తులను ఎంచుకుంటాయి. అదే చల్లని ప్రాంతాల్లోని స్కూళ్లలో స్వెటర్లు, బ్లేజర్లు ధరిస్తారు. యూనిఫామ్ ఎంపికలో వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని NCF కూడా చెబుతోంది. స్కూళ్లలో యూనిఫామ్స్ పెట్టడానికి చాలా కారణాలున్నాయి. పరిశోధనల ప్రకారం, యూనిఫామ్ ధరించడం వల్ల విద్యార్థుల మధ్య బట్టల విషయంలో కనిపించే వ్యత్యాసాలు తగ్గుతాయి. పేద, ధనిక అనే తేడా కనిపించకుండా అందరూ సమానమనే భావన కలుగుతుంది. ప్రతి స్కూల్కు దాని సొంత చరిత్ర, సంప్రదాయాలు ఉంటాయి. ఇవి యూనిఫామ్ డిజైన్పై ప్రభావం చూపుతాయి. కొన్ని స్కూళ్లు ఏళ్ల తరబడి తమ పాత యూనిఫామ్ డిజైన్నే కొనసాగిస్తాయి. మరికొన్ని స్కూళ్లు కాలానుగుణంగా డిజైన్లను మారుస్తూ సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి. యూనిఫామ్ ఫ్యాబ్రిక్, డిజైన్ ఎంపికలో ప్రాక్టికాలిటీ కూడా ఒక ముఖ్యమైన అంశం. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ యూనిఫామ్ను కొనుగోలు చేయగలగాలి. అలాగే విద్యార్థులు రోజంతా దాన్ని సౌకర్యవంతంగా ధరించగలగాలి

ఎమర్జెన్సీ సమయాల్లో డబ్బు అవసరమైనప్పుడు మొబైల్ లోన్ యాప్స్ ఎంతో సులభంగా లోన్స్ అందిస్తుననట్లు కనిపిస్తాయి. కొన్ని క్లిక్స్, ప్రాథమిక వ్యక్తిగత వివరాలు అందించగానే నిమిషాల్లో నగదు జమ చేస్తామనే ఆకర్షణీయమైన ఆఫర్లు చాలా మందిని ప్రశ్నలు అడగకుండా అప్పు తీసుకునేలా చేశాయి. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ప్రస్తుతం అనేక లోన్ యాప్స్ తక్షణ ఆమోదం, తక్కువ వడ్డీ రేట్లు, ఎలాంటి కాగిత పత్రాలు అవసరం లేదనే ప్రచారాలతో వినియోగదారులను వలలో వేసుకుంటున్నాయి. దీని వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా పర్సనల్ ఇన్ఫర్మేషన్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.కడప రైతు కిరాక్ ప్లాన్! యూట్యూబ్ చూసి లక్షల లాభాలు.. ప్రధాని ప్రశంసలుఅప్పు కాదు.. ముందు అప్పు ఇచ్చే సంస్థ గురించి తెలుసుకోండి.. రుణం ఎంత త్వరగా వస్తుందనే దానికంటే అసలు మీకు రుణం ఇస్తున్నది ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. స్పష్టత లేని రుణదాత వివరాలు, వడ్డీ రేట్లు, చార్జీలపై సమాచారం లేకపోవడం, ఫోన్ లోని అనవసరమైన సమాచారానికి అనుమతులు అడగడం, ఎటువంటి క్రెడిట్ పరిశీలన లేకుండా తక్షణ ఆమోదం తెలపడం వంటివి నకిలీ యాప్స్ ప్రధాన లక్షణాలు. అద్భుతమైన డిజైన్ లేదా తక్షణ రుణం అని చెప్పినంత మాత్రాన ఆ సంస్థ నిజమైనదని నమ్మకూడదు.యాప్ స్టోర్ వివరాలను సరిచూసుకోండి.. ఏదైనా యాప్ గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ లో లభ్యమైనంత మాత్రాన దానిని వెంటనే నమ్మలేం. యాప్ను డౌన్లోడ్ చేసే ముందు దాని డెవలపర్ పేరు, వివరణ, ప్రైవసీ పాలసీ, కస్టమర్ కేర్ వివరాలు, వినియోగదారుల రివ్యూలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా ఈ వివరాలన్నీ ఆ రుణదాత అధికారిక వెబ్సైట్లోని వివరాలతో సరిపోలుతున్నాయో లేదా చూసుకోవాలి. యాప్ డెవలపర్ వివరాలకు, అధికారిక వెబ్సైట్ కు తేడా ఉంటే ఈ యాప్కు దూరంగా ఉండటమే మంచిది.నియంత్రణ సంస్థల అనుమతులు ఉన్నాయా?మీకు రుణం

ICC Test Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానాలు దిగజారడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అదే సమయంలో ఇంగ్లాండ్ బౌలర్ ఆలీ రాబిన్సన్ అనూహ్యంగా టాప్-5లోకి దూసుకొచ్చాడు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వరుసగా రెండో వారం కూడా ఒక స్థానాన్ని కోల్పోయాడు. గత మూడు టెస్టు మ్యాచ్లకు దూరంగా ఉండటంతో ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్లో బుమ్రా మూడో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ.. బుమ్రాను అధిగమించి రెండో స్థానానికి చేరుకున్నాడు. మైదానంలోకి దిగకపోవడం వల్ల పాయింట్లు కోల్పోయి బుమ్రా ఈ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ర్యాంకింగ్స్లో ప్రతికూల ఫలితాన్ని ఎదుర్కొన్నాడు. సిరీస్లోని మూడు ఇన్నింగ్స్ల్లో కలిపి కేవలం 74 పరుగులు మాత్రమే సాధించడంతో గిల్ రెండు స్థానాలు దిగజారి తొమ్మిదో ర్యాంక్కు పడిపోయాడు. ప్రస్తుతం టెస్టు బ్యాటింగ్ విభాగంలో ఏడో స్థానంలో ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మాత్రమే భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ ఆలీ రాబిన్సన్ సంచలన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 8 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో సుదీర్ఘ దూకుడు ప్రదర్శిస్తూ ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్లో నేరుగా ఐదో స్థానానికి చేరుకున్నాడు. భారత్పై టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీలంక ఆటగాడు సోనాల్ దినుషా బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఏకంగా 29 స్థానాలు ఎగబాకి 25వ ర్యాంక్ను కైవసం చేసుకున్నాడు. భారత్పై 140 సగటుతో 420 పరుగులు చేసి అతడు ఈ అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున

ఒకప్పుడు సమాజంలో గౌరవ మర్యాదలు అందుకున్న న్యాయవాదులకు (Lawyers) ఇప్పుడు దాడులు స్వాగతం పలుకుతున్నాయి. వారు వాదిస్తున్న కేసుల్లో ప్రతివాదులుగా ఉన్న వారు, విచారణలను తప్పుదోవ పట్టించేలా లాయర్లపై ఒత్తిళ్లు తీసుకోవడం, కుదరకపోతే దాడులకు దిగడం చూస్తూనే ఉన్నాం. వీటిని అరికట్టేందుకు కఠిన చట్టాల అవసరం ఉందని న్యాయస్థానాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో లాయర్లపై దాడులకు దిగితే ఏడేళ్ల జైలు శిక్ష విధించేలా గోవా ప్రభుత్వం అసెంబ్లీలో ఓ బిల్లు ప్రవేశపెట్టింది.ఏపీ మద్యం స్కాం- సిట్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం- రెండేళ్లయినా ఏమీ దొరకలేదు..!విధి నిర్వహణలో ఉన్న లాయర్లపై దాడి చేసిన వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానాతో సహా కఠినమైన శిక్షలను నిర్దేశించే బిల్లుకు ఇవాళ గోవా అసెంబ్లీ ఆమోదించింది. గోవా న్యాయవాదుల రక్షణ బిల్లు 2026పేరుతో తెచ్చిన ఈ బిల్లులో బెదిరింపులు ఎదుర్కొంటున్న న్యాయవాదులకు పోలీసు రక్షణ కల్పించడం, దుర్వినియోగానికి వ్యతిరేకంగా రక్షణ చర్యలు కూడా ఉన్నాయి. లాయర్లపై తప్పుడు లేదా దురుద్దేశపూర్వక ఫిర్యాదులు చేసిన వారికి ఏడాది వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చని ఈ బిల్లు చెబుతోంది. సుప్రీం సాక్షిగా కేంద్రంతో డీల్ ఓకే ..! కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..!న్యాయ, చట్ట, న్యాయవ్యవస్థ శాఖను కూడా నిర్వహిస్తున్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఇది ఆమోదం పొందింది.లాయర్లు తమ వృత్తిపరమైన విధులను నిర్వర్తిస్తున్నప్పుడు వారిపై హింస, బెదిరింపులు, వేధింపులు, తప్పుడు ఆరోపణలు, ఆస్తి నష్టం వంటి ఘటనలు పెరుగుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు న్యాయవాద వృత్తి యొక్క స్వాతంత్రాన్ని, నిర్భయ పనితీరును ప్రభావితం చేస్తాయని, కక్షిదారుల న్యాయ ప్రాతినిధ్య హక్కును, న్యాయం పొందే అవకాశాన్ని దెబ్బతీస్తాయని ఆయన తెలిపారు. ఈ చట్టం ప్రకారం న్యాయవాదిపై దాడి చేసినా లేదా నేరపూరిత బలప్రయోగం చేసినా రెండు సంవత్సరాల

భారతీయులు రెగ్యులర్ గా ఇష్టంగా తినే బ్రేక్ ఫాస్ట్ లలో దోశ ఒకటి. దోశలు ఇంట్లో చేసుకోవడం కూడా చాలా సులువు. కానీ, హోటల్ లో తిన్న ఫీలింగ్ ఇంట్లో తింటే రాదు. హోటల్ మాదిరిగా మంచి షేప్, రంగు, రుచి ఇంట్లో చేసినప్పుడు రావు. అంతేకాదు, ఎప్పుడు దోశ వేద్దామని చూసినా.. పెనానికి అతుక్కుపోతూ ఉంటుంది. మీరు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? అయితే.. పెనానికి అతుక్కోకుండా.. దోశ హోటల్ స్టైల్ లో మంచిగా రావాలి అంటే.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది. దోశ పెనానికి అతుక్కోకుండా మంచిగా రావాలంటే.. పిండిలో స్పెషల్ గా ఏమీ కలపాల్సిన అవసరం లేదు. చిన్న ఉల్లిపాయతో మీరు మ్యాజిక్ చేసేయచ్చు. మీ ఇంట్లో ఉన్న ఐరన్ పెనాన్ని.. ఈ ఉల్లిపాయతో నాన్ స్టిక్ పెన్ లా మార్చేయచ్చు. అసలు దోశలు వేయడం రానివారు కూడా చాలా ఈజీగా దోశలు వేసేసుకోవచ్చు. అయితే, అలా ఉల్లిపాయను ఎలా వాడాలో చూద్దాం... ఉల్లిపాయను ముందుగా సగానికి కోయాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయకు ఫోర్క్ గుచ్చి, దానికి 2 నుంచి 3 చుక్కల నూనె రాయాలి. తర్వాత.. ఐరన్ పెనాన్ని వేడి చేయాలి. పెనం బాగా వేడిగా మారిన తర్వాత నూనె రాసిన ఉల్లిపాయను పెనం మొత్తం సర్కిల్ షేప్ లో రుద్దాలి. ఉల్లిపాయలోని సహజ రసాలు, నూనె కలిసి ఇనుప నేలపై ఒక కోటింగ్ లా ఏర్పడతాయి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు చల్లి శుభ్రమైన గుడ్డతో తుడిచి పిండి వేయండి. దోశ రవ్వల్లా పరుచుకుని, అస్సలు అంటుకోకుండా లేచి వస్తుంది. ఒకవేళ ఉల్లిపాయ అందుబాటులో లేకపోతే, గ్లాసు నీళ్లలో అరస్పూన్ ఉప్పు కలిపి ఆ నీటిని పెనంపై చల్లి తుడిచినా దోశలు అంటుకోవు. పిండి పెనంపై రుద్దేటప్పుడు మంట ఎప్పుడూ సిమ్లో ఉండాలి. రుద్దడం పూర్తయ్యాక మంటను మీడియం-హైకి పెంచితేనే దోశ కరకరలాడుతుంది. ఐరన్

శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడు. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన వారిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు పండితులు. కాగా, ఇప్పుడు మనం శ్రీ కృష్ణుడు జన్మించిన నక్షత్రంలో జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారిపై చంద్రుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరు చాలా ఆకర్షణీయంగా, అందంగా, భావోద్వేగ పరంగా అన్ని విధాలుగా చాలా సృజనాత్మకతను కలిగి ఉంటారు. అంతే కాకుండా వీరికి కళలు, సంగీతం, వంటి వాటిపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వీరు వారి చుట్టూ ఉన్నవారి కంటే కాస్త భిన్నంగా కనిపించడమే కాకుండా అనర్గళంగా మాట్లాడుతారు. అందుకే 27 నక్షత్రాలలో రోహిణి నక్షత్రం చాలా ప్రత్యేకమైనది. అంతే కాకుండా పవిత్రమైనది అంటారు. అంతే కాకుండా ఈ నక్షత్రంలో జన్మించిన వారు మాట్లాడే విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందంట. మర్యాదపూర్వకంగా, మృదువుగా మాట్లాడుతుంటారు. అంతే కాకుండా వీరికి అందరినీ ఆకట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి కళ్లలో ప్రత్యేకమైన మెరుపు కనిపిస్తుంది. అంతే కాకుండా వీరు మాట్లాడే విధానం కూడా అందరికంటే భిన్నంగా చాలా అందంగా ఉంటుంది. వీరు అందరిపై ఎక్కువ ప్రేమను కురిపిస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు కళాత్మకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అంతే కాకుండా అందరి దృష్ణిని కూడా ఆకర్షిస్తారు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. వీటిలో మరీ అంతగా అనే పాట ఒకటి. శ్రీరామచంద్ర ఆలపించిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా, మిక్కీ జే. మేయర్ సంగీతం సమకూర్చారు. ఈ పాట కేవలం వినడానికి ఆహ్లాదంగా ఉండడమే కాకుండా. జీవితంపై మన ఆలోచనా విధానాన్ని మార్చేంత గొప్ప సందేశం ఇందులో ఉంది. కష్టం వచ్చిన ప్రతిసారీ కుంగిపోవడం కంటే దాన్ని ఎదుర్కొని ముందుకు సాగాలని చెబుతుంది. అందుకే ఈ పాటను ఒక్కసారి శ్రద్ధగా వింటే చాలు.. మనసులోని భారాన్ని కొంతైనా దించుకున్న అనుభూతి కలుగుతుంది. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మొదట మనసులో కలిగేది బాధ. ఆ బాధ క్రమంగా ఆందోళనగా మారుతుంది. ఆ తర్వాత అదే సమస్య గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మనల్ని మనమే మరింత బాధ పెట్టుకుంటాం. కానీ సమస్య గురించి ఆలోచిస్తూ ఏడవడం వల్ల సమస్య పరిష్కారం కాదు. జరిగింది జరిగిపోయింది. దాన్ని మార్చలేం. అయితే దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇక ముందు అదే పరిస్థితి రాకుండా ఏం చేయాలి? అనే దానిపై దృష్టి పెట్టగలం. ఈ పాట మొదటి నుంచే ఇదే విషయాన్ని గుర్తుచేస్తుంది. బాధను అతిగా పెంచుకోవద్దని, మనసును అనవసరంగా కలవరపెట్టుకోవద్దని చెబుతుంది. కష్టం మన జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే.. అదే మన జీవితమంతా కాదు. ఈ ఒక్క ఆలోచన మనలో బలాన్ని నింపుతుంది. మనకు ఎదురైన సమస్యను చూసి భయపడటం సహజం. కానీ ఆ భయంతోనే ఆగిపోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగం పోయిందనుకోండి. మొదట బాధ కలుగుతుంది. భవిష్యత్తు గురించి భయం ఉంటుంది. కానీ అదే విషయాన్ని రోజంతా ఆలోచిస్తూ కూర్చుంటే కొత్త ఉద్యోగం రాదు. దాని బదులు కొత్త అవకాశాలను వెతకడం ప్రారంభిస్తే పరిస్థితి మారే అవకాశం ఉంటుంది. అలాగే
2.5/5Rating: 2.5 --సూర్య ప్రకాష్ జోశ్యుల మిడిల్ క్లాస్ కుర్రాడు సీతాకృష్ణ (పరి ఎలవళగన్)గత కొంతకాలంగా అంటే సినిమా ప్రారంభం అయ్యేసరికే 'మ్యాజిక్' (రమ్య రంగనాథన్)తో ప్రేమలో ఉంటాడు. అయితే ఆమె సగటు తమిళ అమ్మాయి కాదు. ఓ ఆంగ్లో ఇండియన్. దాంతో ఆమె కుటుంబ పద్దతులు వేరు. ఆమె జీవితం కూడా వేరు అన్నట్లుగా ఉంటుంది. అయితే మనవాడు పట్టువదలని ప్రేమ మార్కుడు. ఆమె వెనకాలే పడి..ఆమె తమ్ముడుకి స్పోర్ట్స్ లో తన దగ్గరే కోచింగ్ ఇచ్చి మరీ ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తూంటాడు. ఇక ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. ఆమె ఒప్పుకున్నా తన ఇంట్రో తన తల్లి తల్లి సరళ (రోజా) ని ఒప్పించటం కష్టమనే విషయం సీతాకృష్ణకు తెలుసు.ఎందుకంటే సరళ స్కూలే వేరు. ఆవిడ ఓ పిండిమర నడుపుతూ కుటుంబాన్ని ఒంటి చేత్తో లాగుతుంది. భర్త ఉద్యోగం చేస్తున్నా ఆ డబ్బులు ఇంటికి రావు అని తెలిసే ఈ పిండిమిల్లు పెట్టుకుంది. అలాగే ఆమెకు కొన్ని రూల్స్ ఉన్నాయి.తన కులం, తన మతం దాటి వెళ్ళటానికి ఇష్టపడదు. కాబట్టి ఆంగ్లో ఇండియన్ ని తన కోడలు గా ఒప్పుకోవటం కష్టమే. అయినా ఎవరి నమ్మకాలు, భ్రమలు వారికుంటాయి కదా. అలాగే సీతాకృష్ణకు కూడా తన తల్లిని ఒప్పించగలననే నమ్మకం. ఈలోగా ఆ అమ్మాయి ఒప్పుకోవాలి కదా అనుకుంటాడు. దాంతో తన తల్లికి ఈ విషయాలు ఏమీ చెప్పడు. ఈలోగా ఆ తల్లి తన కొడుక్కి తన తమ్ముడు కూతురు 'తనీషా'తో పెళ్లి మాటలు మాట్లాడేస్తుంది. తన కొడుకు తన మాట జవదాడటమే పిచ్చి నమ్మకంతో. ఇలా ఎవరి వెర్షన్స్ వాళ్లు వేసుకుని కథను ముందుకు నడుపుతూంటారు. ఈలోగా మ్యాజిక్ కు మన హీరోపై ప్రేమ పుడుతుంది. అదే సమయంలో కృష్ణలో కొన్ని సందేహాలు మొదలవుతాయి. మ్యాజిక్ అందంగా ఉంది కాబట్టి ప్రేమించాడు. కానీ ఆమె స్వేచ్ఛగా ఉన్నదున్నట్లు

సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ జైలర్ 2 రిలీజ్ పై గత కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ చాలా సైలెంట్ గా సాగుతుండటం, రీషూట్స్ జరుగుతున్నాయనే పుకార్లు రావడంతో పాటు దసరా రేసులో తెలుగు సినిమాలు కూడా పోటీ పడుతుండటంతో జైలర్ 2 వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ పై చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. సినిమా పోస్ట్పోన్ అవుతుందంటూ జరుగుతున్న అసత్య ప్రచారాలకు సన్ పిక్చర్స్ తమదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టింది. చిత్ర యూనిట్ అఫిషియల్ గా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ, సినిమాను 2026 అక్టోబర్ 15నే గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ విడుదల చేసిన లేటెస్ట్ పిక్చర్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. టైగర్ ముత్తువేల్ పాండియన్ లుక్ లో రజనీకాంత్ చేతిలో తుపాకీ పట్టుకుని చాలా మాస్ గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ పై మొదటి భాగంలోని సూపర్ హిట్ డైలాగ్ 'అలప్పారై సెలబ్రేషన్స్' లైన్ తో పాటు అక్టోబర్ 15 రిలీజ్ డేట్ ను స్పష్టంగా మెన్షన్ చేశారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను నెల్సన్ దిలీప్కుమార్ డైరెక్ట్ చేస్తుండగా, రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మొదటి భాగాన్ని మించేలా పార్ట్ 2 ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ, యోగి బాబు, మిర్నా నటిస్తుండగా, శివ రాజ్కుమార్, మోహన్లాల్, ఎస్. జె. సూర్య కీలక పాత్రల్లో

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Pawan Kalyan Flop Movies List: ఉస్తాద్ భగత్ సింగ్:‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా అందరి అంచనాలను తలకిందలు చేస్తూ డిజాస్టర్గా నిలిచింది. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో అత్యధిక రోజులు షూటింగ్ జరుపుకున్న చిత్రంగా రికార్డులకు ఎక్కింది. గతేడాది రిలీజైన ఈ పవన్ కళ్యాణ్ కెరీర్ లో డిజాస్టర్గా నిలిచింది. ఖుషీ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ మెగాఫోన్ పట్టుకొని తెరకెక్కించిన చిత్రం‘జానీ’. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా..అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అజ్ఞాతవాసి.. త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా ‘అజ్ఞాతవాసి’. వీళ్ల కలయికలో వచ్చిన మూడో సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో అన్న నాగబాబు నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘గుడుంబా శంకర్’. వీర శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. తొలి ప్రేమ తర్వాత డైరెక్టర్ ఏ.కరుణా కరణ్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘బాలు’. ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై టాప్ డిజాస్టర్ మూవీగా నిలిచింది. ‘ఖుషీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎస్.జే.సూర్య కాంబినేషన్లో పవన్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Folk dancer Eshwar sai filed bail petition in telangana high court: ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి, మాధురీ రాథోడ్ ల వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాధురీ రాథోడ్ ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడని మాధురి రాథోడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించి తన పరువుకు భంగం కలిగించేలా ఫేక్ వీడియోలు సృష్టించి డిజిటల్ వేధింపులకు గురిచేశాడని కూడా మాధురీ రాథోడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాధురీ రాథోడ్ ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈశ్వర్ సాయి తాజాగా.. తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని భావించి ఈశ్వర్ సాయి తన లాయర్లతో ఈ బెయిల్ పిటిషన్ వేసుకున్నట్లు తెలుస్తొంది. మరోవైపు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈశ్వర్ సాయి, మాధురీ రాథోడ్ లు ఒకే గదిలో అడ్డంగా దొరికిపోయారు. వీరి బండారాన్ని ఈశ్వర్ సాయి శరణ్య బైటపెట్టింది. అప్పట్లో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. తొలుత మాధురీ రాథోడ్ ది తప్పని ప్రచారం జరిగింది. ఇక ఈశ్వర్ సాయి సైతం పదే పదే వీడియోలు రిలీజ్ చేయడంతో మాధురీ రాథోడ్ కూడా అసలు విషయాన్ని బైటపెట్టింది. Read more: Disha Salian Death Case: దిశా
Gold Price Fall : గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ఒక్కసారిగా పతనమవుతున్నాయి. బులియన్ మార్కెట్లో వరుసగా 4 రోజుల్లో తులం బంగారం (24 క్యారెట్లు) ధర ఏకంగా రూ.9110 మేర పడిపోయింది. ఆగస్టు 29వ తేదీన దాదాపు రూ.3 వేలు దిగొచ్చిన బంగారం ధర ఆ తర్వాత వరుస సెషన్లలో భారీగా పడిపోతూ వస్తోంది. దేశంలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న తరుణంలో బంగారం ధరలు ఇలా భారీగా తగ్గుతుండడం కొనుగోలుదారులకు ఊరటగా చెప్పవచ్చు. వెండి రేటు రూ.10 వేలు తగ్గి రూ.2.50 లక్షల స్థాయికి మళ్లీ దిగివచ్చింది. అయితే, బంగారం ధరలు భారీగా పడిపోయేందుకు గల కారణాలేంటి? ఇంకా తగ్గుతాయా? బులియన్ మార్కెట్ విశ్లేషకులు ఏం చెబుతున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.నేటి బంగారం ధరలు ఇలాదేశీయ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా నాలుగో రోజూ తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ ఒక్కరోజే రూ.2070 మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్లో తులం బంగారం ధర రూ.1,52,020 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల నగల తయారీ బంగారం రేటు ఈరోజు రూ.1900 మేర పడిపోయింది. దీంతో తులం రేటు రూ.1,39,350 వద్దకు పడిపోయింది. ఇక కిలో వెండి ధర రూ.10 వేలు తగ్గడంతో రూ.2,50,000 వద్ద ట్రేడవుతోంది.ఆ ఒక్క కారణంతోనే భారీ పతనంఇరాన్పై అమెరికా భీకర దాడులు చేపడుతుండడంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. దీంతో మార్కెట్లు ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఒక వైపు ముడి చమురు ధరలు పెరుగుతుండగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు డిమాండ్ తగ్గుతోంది. దీంతో పసిడి ధరలు భారీగా దిగివస్తున్నాయి. సాధారణంగా యుద్ధం జరిగితే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ, పశ్చిమాసియా యుద్ధం విషయంలో క్రూడ్ ఆయిల్ ప్రధాన పాత్ర పోషించడంతో రివర్స్ జరుగుతోంది. బంగారం, వెండి వండి విలువైన ఖనిజాల ధరలు

Sonu Sood: నేపాల్లో ప్రకృతి సృష్టించిన విధ్వంసం ఇంకా కళ్లముందే కనిపిస్తోంది. ఎటు చూసినా శిథిలాలు, వరద నీటి ఆనవాళ్లు, దెబ్బతిన్న ఇళ్లు, కనిపించకుండా పోయిన వారి కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు కనిపిస్తున్నాయి. విపత్తు జరిగి రోజులు గడుస్తున్నా అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోలేదు. ఈ దారుణ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తీవ్రంగా చలించిపోయారు. పరిస్థితిని అంచనా వేసేందుకు స్వయంగా నేపాల్కు వెళ్లిన ఆయన, బాధితులకు అండగా నిలవడానికి పిలుపునిచ్చారు. అంతేకాదు అందరం కలిసి నేపాల్ను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. విపత్తు ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన సోనూ సూద్ అక్కడి పరిస్థితులను చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లను కోల్పోయిన ప్రజల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో వివరించారు. బయట నుంచి చూస్తే విపత్తు తీవ్రతను పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టమని, కానీ దగ్గర నుంచి చూస్తే జరిగిన నష్టం ఎంత భారీగా ఉందో తెలుస్తుందని అన్నారు. అందుకే ఈ సమయంలో నేపాల్ ప్రజలకు సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. విపత్తు జరిగిన ప్రాంతంలో నీటి ప్రవాహం ఎంత దూరం వరకు చేరిందో ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తోందని సోనూ సూద్ తెలిపారు. తాను నిలబడి ఉన్న ప్రాంతం కూడా అప్పట్లో పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉండొచ్చని అన్నారు. నీరు, శిథిలాలు భారీగా ప్రవహించడంతో ప్రజలు ఎత్తైన ప్రాంతాల్లోని శిథిలాల వద్దకు చేరుకోవాల్సి వచ్చిందని, వారం రోజులు దాటినా ఆ ప్రాంతంలో విధ్వంసపు ఆనవాళ్లు అలాగే ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందన్నారు. బాధితులకు ఎలాంటి సహాయం అందించబోతున్నారనే ప్రశ్నకు కూడా సోనూ సూద్ స్పందించారు. తన స్నేహితులు, బృందంలోని సభ్యులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం అక్కడి ప్రజలకు అత్యవసరంగా ఏం అవసరమో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తమను సంప్రదిస్తున్న

అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్కు భారత స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులోకి వచ్చాడు. అటు యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా చోటు దక్కించుకున్నాడు. దీంతో ఓపెనింగ్ జోడీపై ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల ఈ యువ సంచలనం బ్యాటింగ్ చూడటానికి రెండు కళ్లు సరిపోవు. భారీ షాట్లతో బౌలర్లను బెంబేలెత్తించే వైభవ్.. అత్యంత పిన్న వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 13 నుంచి టీమిండియా.. అఫ్గానిస్థాన్లో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించిన జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అటు వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో ఉన్నాడు. దీంతో అఫ్గానిస్థాన్తో సిరీస్లో భారత ఓపెనింగ్ జోడీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన సంజును జట్టు నుంచి తప్పించి వైభవ్కు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు అభిషేక్ శర్మ-వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఇంగ్లండ్పై నిరాశపరిచిన వైభవ్.. జింబాబ్వేపై చెలరేగాడు. అయితే అఫ్గాన్ సిరీస్లో సంజు రాకతో వైభవ్ సూర్యవంశీకి షాక్ తగిలే అవకాశం ఉంది. ఎప్పటిలాగే సీనియర్ ప్లేయర్లు సంజు శాంసన్-అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తే.. వైభవ్ సూర్యవంశీ బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది. అక్కడ సంజు లేదా అభిషేక్ విఫలమైతేనే వైభవ్కు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు, దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున వైభవ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6 నుంచి ఫైనల్ మ్యాచ్లో ఆడనున్నారు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. ఆ వెంటనే అఫ్గానిస్తాన్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇషాన్ కిషన్ ఈస్ట్ జోన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ ఇద్దరూ అఫ్గాన్ సిరీస్ కల్లా సిద్ధంగా ఉంటారా? లేదా? అనేది

వర్షాకాలంలో లభించే అతి ముఖ్యమైన కూరగాయల్లో బోడ కాకరకాయ ఒకటి.. దీనిని అడవి కాకరకాయ అని కూడా పిలుస్తారు. ఈ సీజనల్ కూరగాయ జూన్ నుండి సెప్టెంబర్ మాసం వరకు ఎక్కువగా లభిస్తుంది. నగర మార్కెట్లలో, ముఖ్యంగా రైతు బజార్లలో బోడ కాకరకాయలు విస్తృతంగా విక్రయిస్తారు. ఈ కూరగాయకు ప్రస్తుతం అసాధారణమైన డిమాండ్ ఉంది.. ప్రధానంగా దాని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల వల్ల ఎంతో మంది దీనిని తినేందుకు ఇష్టపడతారు. బోడ కాకరకాయలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ (కరోటిన్), విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్ తోపాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్ లభిస్తాయి. దీనిలోని డైటరీ ఫైబర్ (ఫైబర్) జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. బోడ కాకరకాయలో అనేక పోషక విలువలు దాగి ఉన్నాయి. ఇది ముఖ్యంగా షుగర్ (మధుమేహం) స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే షుగర్ వ్యాధితో బాధపడేవారు దీన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉండటం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు బోడ కాకరకాయలో పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల ఇది బరువు తగ్గాలనుకునే వారికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఎంపిక. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పండే బోడ కాకరకాయ ఇప్పుడు నగర ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తోంది. రైతులు తమ పొలాల నుండి తాజా బోడ కాకరకాయలను నేరుగా రైతు బజార్లకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఈ కాయలు చాలా తాజాగా, మంచి ఆకృతితో కనిపిస్తాయి. ఇవి కొంత బొడిపెలుగా, గుండ్రంగా ఉంటాయి. బోడ కాకరకాయ రుచి కూడా ఎంతో బాగుంటుంది. దీన్ని కూరగా వండుకోవచ్చు

మాస్ మహారాజ రవితేజ, నక్షత్ర, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్, హరిహర సుతుడు అయ్యప్ప ల 'ఇరుముడి' 200 కోట్ల రూపాయిలు చేరుకోవడానికి రెడీ అవుతుంది. తాజాగా ఇరుముడి నుంచి సరికొత్త డివోషనల్ వీడియో సాంగ్ 'కార్తీక మాసం' విడుదలై అభిమానులని ప్రేక్షకులని ఎంతోగానో ఆకట్టుకుంటోంది. స్వామి అయ్యప్ప భక్తి పారవశ్యాన్ని, మండల దీక్షా నియమాలను ఎంతో లోతుగా ఆవిష్కరించిన ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉంది. ఈ అద్భుతమైన గీతానికి దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా సాహిత్యాన్ని అందించగా, జి. వి. ప్రకాష్ కుమార్ తో కలిసి శివ నిర్వాణ ఆలపించాడు 4 నిమిషాల 5 సెకన్ల నిడివితో ఉండగా నేరుగా శబరిమల భక్తి లోకంలోకి తీసుకెళ్తుంది. "ఇది మరి కార్తీక మాసం స్వామి... తలపై చన్నీళ్ల స్నానం కాని మనసే మరింత భద్రం స్వామి" అంటూ సాగే లిరిక్స్ దీక్షా ధారుల జీవితాన్ని, శారీరక కష్టాలను దాటి పొందే ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రతిబింబిస్తాయి. భక్తులు పడే తపన, చలిలో ఉదయాన్నే చేసే స్నానాలు, కటిక నేలపై పడుకునే నిరాడంబరమైన జీవనశైలిని చాలా సహజంగా ఈ పాటలో వర్ణించారు. పాటలోని అతి ముఖ్యమైన అంతరార్థం ఏమిటంటే— "కనిపించని శత్రువు కాదు, యుద్ధం కాదీ మండల దీక్ష... నాతోటి నేనే చేసే యుద్ధమే ఈ దీక్ష". బయటి సమాజంతో లేదా శత్రువులతో చేసే పోరాటం కాదు మండల దీక్ష, మనలోని అహంకారాలు, ద్వేషాలు, కామక్రోధాలపై మనతో మనమే చేసే అంతర్యుద్ధం అనే గొప్ప సందేశాన్ని ఈ పాటకు శివ నిర్వాణ అందించారు. అలాగే "నేను అంటే నువ్వే అంటూ స్వామి పదవి ఇచ్చావు... ద్వేషాల్ని దూరం చేసి వర్ణాన్ని ఒక్కటి చేసి" అని అయ్యప్ప దీక్షలోని సమభావనను ఎత్తిచూపారు. కులమతాల భేదం లేకుండా, చిన్నపెద్ద తారతమ్యం లేకుండా నల్లటి దుస్తులు ధరించి ప్రతి ఒక్కరినీ 'స్వామి' అని పిలుచుకునే ఆచారాన్ని

ప్రకృతి కంటికి కనిపించని రౌద్రరూపం దాల్చితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో నేపాల్లో వచ్చిన వరదలే నిదర్శనంగా నిలిచాయి. వరదల ధాటికి అతలాకుతలమైన పొరుగు దేశం నేపాల్లో బాధితులను పరామర్శించేందుకు రియల్ హీరో, బాలీవుడ్ నటుడు సోనూసూద్ నేరుగా రంగంలోకి దిగారు. అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న త్రిశూలి బజార్ ప్రాంతాన్ని ఆయన పర్యటించి, క్షేత్రస్థాయిలో పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. బాధితులను కలిసిన ఆయన వారి కష్టాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. కష్టకాలంలో పొరుగు దేశానికి అండగా నిలుస్తూ భారత్ అందిస్తున్న సహాయాన్ని సోనూసూద్ మనస్ఫూర్తిగా కొనియాడారు.మనసారా మెచ్చుకున్న సోనూసూద్నేపాల్లో విపత్తు తీవ్రత ఊహించని స్థాయిలో ఉందని, అక్కడి ప్రజలు మళ్లీ సాధారణ జీవితానికి రావడానికి చాలా సమయం పడుతుందని సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్కి అందిస్తున్న సహాయం నిజంగా అభినందనీయం. నేపాల్ మళ్లీ సొంత కాళ్లపై నిలబడాలంటే ఈ సహాయం ఇలాగే కొనసాగాలి. నేను స్వయంగా ఇక్కడి కుటుంబాలను కలిసిన తర్వాత అర్థమైంది ఏమిటంటే.. ఈ సమస్య కొద్ది వారాల్లోనో, నెలల్లోనో తీరేది కాదు. మనం నిరంతరం అండగా ఉంటేనే వాళ్లు కోలుకోగలరు అని మీడియా ముఖంగా వ్యాఖ్యానించారు. Nepal flash floods: దేవుడిలా వచ్చి 1,643 మంది పిల్లల్ని కాపాడి.. రియల్ హీరో1,127కు చేరిన మృతుల సంఖ్యనేపాల్లో సంభవించిన ఈ జలప్రళయంలో ప్రాణనష్టం ఊహించని రీతిలో ఉంది. నేపాల్ పోలీసుల సమాచారం ప్రకారం ఇప్పటివరకు మృతుల సంఖ్య ఏకంగా 1,127కు చేరింది. రసువా, నువాకోట్, ధాడింగ్, చిత్వాన్, గోర్ఖా, తనహున్, నావల్పరాసి ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మృతదేహాలను వెలికితీశారు. దొరికిన మృతదేహాల్లో ఇప్పటివరకు కేవలం 95 మృతదేహాలను మాత్రమే గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించగలిగారు. మరికొన్ని మృతదేహాలు సరిహద్దులు దాటి భారత్లో కూడా లభ్యమవడం విపత్తు తీవ్రతకు అద్దం పడుతోంది.మృత్యువుకు 30 సెకన్ల దూరం! ఒకే ఒక్క మెసేజ్ 8

కొన్నిసార్లు జీవితంలో పెద్ద సమస్య ఏదీ ఉండదు. ఉద్యోగం ఉంటుంది. కుటుంబం ఉంటుంది. స్నేహితులు ఉంటారు. బాధ్యతలన్నీ సక్రమంగానే సాగుతుంటాయి. అయినా మనసులో మాత్రం ఏదో వెలితి. ‘ఇది నేను కోరుకున్న జీవితం కాదు’ అనే భావన వెంటాడుతుంది. ఇలాంటి సమయంలో వెంటనే జీవితాన్ని మార్చేయాలని నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా మనల్ని మనమే కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి.నిజంగా అసంతృప్తిగా ఉన్నారా?ప్రస్తుతం ఉన్న జీవితం నచ్చడం లేదా? లేక మనలో వచ్చిన మార్పులకు తగ్గట్లుగా అది లేకపోవడమా? ఒకప్పుడు ఎంతో ఇష్టంగా అనిపించిన ఉద్యోగం, లక్ష్యం, సంబంధం ఇప్పుడు సాధారణంగా అనిపించొచ్చు. ఇది తప్పు నిర్ణయం తీసుకున్నామని అర్థం కాదు. మన అవసరాలు, ప్రాధాన్యాలు మారాయని సూచన కావచ్చు.ఎవరూ అడ్డుకోకపోతే ఏం చేస్తారు?ఇతరులు ఏమనుకుంటారో ఆలోచించకుండా నిర్ణయం తీసుకునే అవకాశం వస్తే ఏం ఎంచుకుంటారు? కొత్త పని నేర్చుకోవాలనుకుంటున్నారా? ప్రశాంతమైన జీవితం కోరుకుంటున్నారా? మరో చోటుకు వెళ్లాలనుకుంటున్నారా? ఈ సమాధానం మనసులో దాగున్న అసలు కోరికను బయటపెట్టొచ్చు.మార్పు అంటే ఎందుకు భయపడుతున్నారు?మారితే డబ్బు సమస్యలు వస్తాయా? ఎవరికైనా నిరాశ కలిగిస్తామా? తీసుకున్న నిర్ణయం తప్పవుతుందా? ఇలా భయాలు మనల్ని ఒకే చోట నిలిపేస్తాయి. అయితే ‘మారితే ఏం కోల్పోతాను?’ అన్న ప్రశ్నతో పాటు ‘ఇలాగే ఉంటే ఏం కోల్పోతాను?’ అని కూడా ఆలోచించాలి.చివరిసారి మీలా ఎప్పుడు అనిపించింది?ఎలాంటి ప్రశంసలు, విజయాలు అవసరం లేకుండా మనస్ఫూర్తిగా ఆనందించిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రయాణం, పుస్తకం, ప్రకృతి, సృజనాత్మక పని, ఆత్మీయులతో గడిపిన సమయం.. ఏదైనా కావచ్చు. అప్పట్లో మనలో

మొన్నటి దాకా కాక్రోచ్ జనత పార్టీ ఆందోళనలతో అట్టుడికిపోయింది.. యావత్ దేశం. ఈ ఉద్యమాల ధాటికి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా సైతం చేయాల్సి వచ్చింది. ఇది ఇక్కడితో ఆగట్లేదు. మరో నూతన సామాజిక ఉద్యమం పురుడుపోసుకుంది. ఏకంగా ఏడాదిపాటు కొనసాగబోతోంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 80వ సంవత్సరంలో అడుగు పెట్టినందున దీనికి ఇండియా @ 80 అని పేరు పెట్టారు.మాన్యువల్ స్కావెంజింగ్ వ్యవస్థకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఉద్యమం ఇది. దేశ రాజధానిలో సఫాయి కర్మాచారి ఆందోళన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సభలో ఈ మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మనుషుల మలాన్ని చేతులతో ఎత్తే ఈ అనాచారం పూర్తిగా అంతరించిపోయిందంటూ పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రకటనలపై క్షేత్రస్థాయి నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయనడానికి ఇది.. తాజా నిదర్శనం.ఈ సభలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, జమ్మూ కాశ్మీర్ కు చెందిన మహిళా స్కావెంజర్లు హాజరయ్యారు. తమ నిత్య జీవితంలో నేటికీ ఎదుర్కొంటున్న చేదు వాస్తవాలను వెల్లడించారు. ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ ఈ బానిసత్వం నుండి తమకు ఎప్పుడు విముక్తి లభిస్తుందని వారు నిలదీశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు పూర్తి కాబోతున్న తరుణంలో కూడా ఈ సామాజిక వివక్ష నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న పేద ప్రజలకు విముక్తి లభించకపోవడంపై సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు.పసిడి రేట్లల్లో తీవ్ర ఒడిదొడుకులు.. మరోసారి మార్జినల్ పతనందేశంలో మాన్యువల్ స్కావెంజింగ్ వ్యవస్థ పూర్తిగా తొలగిపోయిందంటూ కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే చేసిన ప్రకటనలను సఫాయి కర్మచారి ఆందోళన్ ఖండించింది. పార్లమెంట్ సాక్షిగా ఆయన అబద్ధాలు చెప్పారంటూ మండిపడింది. ఈ నేపథ్యంలో మాన్యువల్ స్కావెంజర్ వ్యవస్థ నుంచి దేశానికి శాశ్వతంగా విముక్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా సఫాయి కర్మాచారి ఆందోళన్ సంఘ్.. ఈ ఉద్యమానికి రూపకల్పన చేసింది. ఇండియా @ 80 పేరిట ఓ సంవత్సరం పాటు సాగే సుదీర్ఘ నిరసన ఉద్యమాన్ని

Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మరో నాలుగు రోజుల్లో మొదలు కాబోతుంది. దీంతో ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే స్టార్స్ ఎవరు అని చర్చ జరుగుతుంది. ఇప్పటికే అగ్నిపరీక్షతో నాలుగు సామాన్యులను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇక సెలబ్రిటీలలో సీరియల్ నటీమణులు పల్లవి గౌడ, తేజస్విని, కావ్యశ్రీ, కమెడియన్ ఎక్స్ప్రెస్ హరి, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, రాకింగ్ రాకేశ్, డ్యాన్సర్ ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబర్ నందూ, రచయిత కడలి సత్యనారాయణ వెళ్తారని టాక్ నడుస్తుంది. తాజాగా మరో పేరు కూడా వినిపిస్తుంది. ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి ఫేమ్ తెచ్చుకున్న టెంపర్ వంశీ కూడా ఈసారి బిగ్ బాస్ లోకి వెళ్తాడని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. వంశీ అసలు పేరు అజయ్ అని సమాచారం. ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నాడు వంశీ. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి, నెగిటివ్ రోల్స్ చేస్తూ వచ్చాడు. ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో నెగిటివ్ రోల్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడా విలన్ గా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు వంశీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. మరి బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఎవరెవరు వెళ్తారో తెలియాలంటే ఇంకో నాలుగు రోజులు ఎదురు చూడాల్సిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6 నుంచి స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అవ్వనుంది. మొదటి రోజు సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంచ్ మొదలు అవ్వనుంది

చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాధాన్యం గురించి మనకు తెలిసిందే. అయినా సరే- కొంతమంది ఈ విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో అలా పైపైన చేతులు కడుక్కుంటారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాధాన్యం గురించి మనకు తెలిసిందే. అయినా సరే- కొంతమంది ఈ విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో అలా పైపైన చేతులు కడుక్కుంటారు. ఫలితంగా చేతులకు అంటుకున్న క్రిములు, బ్యాక్టీరియా తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి చేరతాయి. సమస్త ఆరోగ్య సమస్యలకు ఇక్కడే బీజం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చేతుల శుభ్రత విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికి రాదని సూచిస్తున్నారు. ⚛ చేతులు శుభ్రం చేసుకోకపోతే చేతిపై ఉన్న వ్యాధికారక క్రిములన్నీ మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి వెడతాయి. ఇక అపరిశుభ్ర చేతులతో ఇతరులను తాకితే వారి చేతులకు కూడా ఆ క్రిములన్నీ అంటుకుంటాయి. ⚛ చేతులు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల డయేరియా, హెపటైటిస్, జలుబు.. వంటి వివిధ రకాల అనారోగ్యాలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. ఒక టాయిలెడ్ కమోడ్ పైనే లక్షల సంఖ్యలో క్రిములు దాగి ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి తరచూ చేతులు శుభ్రం చేసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు అంటున్నారు నిపుణులు. ⚛ చేతులు అపరిశుభ్రంగా ఉండడం వల్ల కంటి సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి సబ్బు, హ్యాండ్వాష్, శానిటైజర్తో కనీసం 20 సెకన్ల పాటు చేతులు శుభ్రం చేసుకుంటే వివిధ అనారోగ్యాలకు దూరంగా ఉండచ్చని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేకించి పిల్లలకు కూడా చేతులు చక్కగా శుభ్రం చేసుకునేలా చిన్నప్పటి నుంచే శిక్షణ ఇవ్వాలి అని చెబుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి

అమెరికాలోని న్యూజెర్సీలో ఓ మహిళ తన భూమిని కాపాడుకునేందుకు ప్రభుత్వంతో న్యాయపోరాటానికి దిగారు. ఒక ప్రైవేట్ డెవలపర్ చేపట్టే భారీ హౌసింగ్ ప్రాజెక్ట్ కోసం తన 2.4 ఎకరాల స్థలాన్ని 'ఎమినెంట్ డొమైన్' చట్టం కింద బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని మిడిల్ టౌన్షిప్ ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, డాన్ రాబిన్సన్ అనే మహిళ దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.సుమారు 23 ఏళ్ల క్రితం రాబిన్సన్ 40,000 డాలర్లకు ఈ భూమిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం కేవలం 47,000 డాలర్లు పరిహారాన్ని ఆఫర్ చేస్తూ భూమిని అప్పగించాలని కోరుతోంది. అయితే, ఈ భూమిని తన పిల్లల భవిష్యత్తు కోసం కేటాయించానని, దానిపై ఎలాంటి అప్పులు లేవని, విక్రయించే ఉద్దేశం అంతకన్నా లేదని రాబిన్సన్ స్పష్టం చేస్తున్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టుకు తన భూమి ఒక చివరన ఉందని, దానిని మినహాయించి కూడా ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం ఉందని ఆమె వాదిస్తున్నారు.'ఇండియన్ ట్రెయిల్ రీడెవలప్మెంట్' పేరుతో ఒక ప్రైవేట్ సంస్థ సుమారు 340 ఇళ్లను నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల సరసమైన ధరలకే ఇళ్లు లభిస్తాయని, ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతుందని మిడిల్ టౌన్షిప్ మేయర్ క్రిస్టోఫర్ లూస్నర్ పేర్కొన్నారు. అయితే, కేవలం ఒక ప్రైవేట్ లాభాపేక్ష సంస్థ కోసం భూమిని బలవంతంగా సేకరించడం ప్రజా ప్రయోజనం కిందకు ఎలా వస్తుందని రాబిన్సన్, ఆమె మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ డెవలపర్ల ప్రయోజనం కోసం భూసేకరణ చేపట్టడం చెల్లదని ఇటీవలే న్యూజెర్సీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా వారు గుర్తు

Sanju Samson: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 13 నుంచి 3 మ్యాచ్ల టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు దాదాపు మెయిన్ ప్లేయర్లతో కూడిన 15 మంది సభ్యుల పవర్ఫుల్ జట్టును ఎంపిక చేశారు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్న ఈ జట్టులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సంజూ శామ్సన్ మళ్లీ స్థానం సంపాదించుకోవడం. ఈశాన్ కిషన్తో పాటు ఆయనను స్పెషలిస్ట్ వికెట్ కీపర్గా జట్టులోకి తీసుకున్నారు. జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో సంజూ శామ్సన్ పేరు లేకపోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సంజూ పట్ల జట్టు యాజమాన్యం అన్యాయంగా వ్యవహరిస్తోందని, ఆయనను జట్టు నుంచి తొలగించారని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆరోపణలు చేశారు. అయితే ఆ సమయంలోనే బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ ఆయనను జట్టు నుంచి తప్పించలేదని, బిజీ షెడ్యూల్ కారణంగా పనిభారాన్ని తగ్గించేందుకే విశ్రాంతినిచ్చామని స్పష్టం చేశాయి. ఇప్పుడు అఫ్గానిస్థాన్ సిరీస్కు ఆయనను నేరుగా ఎంపిక చేయడంతో బోర్డు చెప్పిన మాట నిజమేనని రుజువైంది. జింబాబ్వే పర్యటన నుంచి శామ్సన్కు విశ్రాంతి ఇవ్వడానికి ఆయన పాత యూకే టూర్ ప్రదర్శన కూడా ఒక కారణంగా నిలిచింది. ఐర్లాండ్తో జరిగిన 2 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆయన కేవలం 5 పరుగులు మాత్రమే చేశారు. అందులో ఒక ఇన్నింగ్స్లో పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యారు. ఇక ఇంగ్లండ్ పర్యటనలోని 5 మ్యాచ్ల టి20 సిరీస్లో ఆయనకు కేవలం 2 మ్యాచ్లలోనే అవకాశం లభించగా, మొదటి మ్యాచ్లో 1 పరుగు, చివరి మ్యాచ్లో 27 పరుగులు మాత్రమే చేయగలిగారు. మిగిలిన మ్యాచ్లలో ఆయన స్థానంలో యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకున్నారు. నిరాశపరిచిన యూకే పర్యటన తర్వాత లభించిన చిన్నపాటి విరామం సంజూ శామ్సన్కు మానసికంగా రీఛార్జ్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడింది. ఆ విరామం తర్వాత ఇప్పుడు

సూపర్స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ కాంబినేషన్లో వస్తున్న జైలర్ 2 పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన జైలర్ భారీ విజయాన్ని అందుకుంది. సూపర్స్టార్ రజనీకాంత్ (Rajinikanth), దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ కాంబినేషన్లో వస్తున్న జైలర్ 2 (Jailer 2) పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన జైలర్ భారీ విజయాన్ని అందుకుంది. ఇక జైలర్ 2 అంతకుమించి ఉండనుందని తెలియడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ కానుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 15 న రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే.. జైలర్ 2 అనుకున్న సమయానికి వచ్చేలా కనిపించడం లేదని తమిళ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జైలర్ 2 వాయిదా పడడానికి ప్రధాన కారణం తమిళనాడు సీఎం విజయ్ అని కోలీవుడ్ కోడై కూస్తోంది. అదేంటీ.. ఆయనకు, జైలర్ 2 కి సంబంధం ఏంటి అంటే.. ఈ సినిమాలో మొదట విజయ్ రాజకీయాల్లో గెలవరు అనుకోని రజనీ ప్రభుత్వం, రాజకీయ పనితీరుపై కొన్ని ఘాటు డైలాగ్స్ చెప్పాడట. కానీ, విజయ్ గెలిచి సీఎం కూడా అయ్యారు. ఇప్పుడు ఆ డైలాగ్స్ ని విజయ్ ఫ్యాన్స్ అపార్థం చేసుకుంటే సినిమాకి డ్యామేజ్ జరుగుతుందనే ఉద్దేశంతో డైరెక్టర్ నెల్సన్ కీలక మార్పులు చేయడం మొదలుపెట్టాడట. దీనికోసమే కొత్తగా డైలాగ్స్ రాసి.. రీషూట్ చేస్తున్నారట. ఈ షూట్ కాకుండా ఇంకా ఈ సినిమాకు బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ కాలేదని టాక్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేకర్స్.. అక్టోబర్ 15 న కాకుండా కొత్త తేదీని వెతికే పనిలో పడ్డారట. ఇక ఈ రేసులో జైలర్ 2 వెనక్కి తగ్గితే ఆ స్లాట్ను మైత్రీ మూవీ మేకర్స్ వారి

అరవింద సమేత చిత్రంలో 5 రూపాయల కారణంగా ఎంత హింస జరిగిందో అందరికి తెలుసు. అయితే ఈ కథలో 5 నిమిషాలు వల్ల ఓ వ్యక్తి మహా కుబేరుడిగా మారారు. ఏకంగా 5 లక్షల కోట్ల రూపాయలను ఆయన సంపాదించేశారు. ఇంటర్నెట్ డెస్క్: రోజుకు 5 నిమిషాలే పని చేయాలి.. నెలకు 10 వేల డాలర్లు ( దాదాపు 9 లక్షల రూపాయలు) సంపాదించాలి. ఇది కొంచెం అతిగా అనిపిస్తోందా.. కానీ ఓ వ్యక్తి ఇది సాధ్యమని భావించారు. ప్రతిరోజూ 5 నిమిషాల పనితో నెలకు లక్షలు గడించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఆయనను చూసి తోటి వారే నవ్వుకున్నారు. ఇవేమీ పట్టించుకోని ఆయన డబ్బు సంపాదించడం కోసం రోజులో 5 నిమిషాలు ఆలోచించేవారు. అలా ఓ రోజు ఒక కొత్త పరికరం కనిపెట్టాలన్న ఆలోచన ఆయనకు తట్టింది. ఆయనే మసయోషి సన్. సాఫ్ట్బ్యాంక్ వ్యవస్థాపకుడిగా టెక్నాలజీ రంగానికి ఆయన సుపరిచితులు. 2026 సెప్టెంబరు నాటికి ఆయన సంపద అక్షరాల 5.3 లక్షల కోట్లు. తాను యువకుడిగా ఉన్నప్పుడు ఈ 5 నిమిషాల సవాలును ఆయనకు ఆయనే విసురుకున్నారు. ఇలా నిర్ణీత సమయంలోనే ఓ ఆవిష్కరణ చేయాలని పూనుకున్నారు. మసయోషి.. కొందరు పరిశోధకులు, ప్రొఫెసర్ల సహాయంతో ఎలక్ట్రానిక్ ట్రాన్స్లేటర్ పరికరాన్ని కనిపెట్టారు. ఆ పరికరాన్ని జపాన్కు చెందిన ఓ సంస్థకు 1.7 మిలియన్ డాలర్లకు విక్రయించారు. ఈ విధంగా సన్ ప్రయాణానికి తొలి అడుగు పడింది. ఆ తరువాత ఆయన జపాన్ నుంచి వీడియో గేమ్ యంత్రాలను అమెరికాకు తీసుకొచ్చి రెస్టారెంట్లకు అమ్మేవారు. ఈ వ్యాపారంలో ఆయనకు 1.5 మిలియన్ డాలర్ల లాభం వచ్చింది. 5 నిమిషాల ఆలోచన వచ్చిన 18 నెలల్లోనే 3.2 మిలియన్ డాలర్లు ఆర్జించారు. జపాన్లో ఉంటున్న సన్కు అమెరికా వెళ్లాలని ఓ సన్నిహితుడు సలహా ఇచ్చారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలని, కంప్యూటర్లపై పట్టు తెచ్చుకోవాలని ప్రోత్సహించారు. దీంతో అమెరికా వచ్చిన సన్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ కోసం బుల్లితెర ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆదివారమే (సెప్టెంబర్ 06) బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ ఉండనుది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి ఈ రియాలిటీ షోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే నిర్వహించిన ' అగ్ని పరీక్ష సీజన్ 2' కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ కాంటెస్ట్ లో సత్తా చాటిన పలువురు సామాన్యులు ఇప్పుడు నేరుగా బిగ్ బాస్ హౌస్ లోనే అదృష్టం పరీక్షించుకున్నారు. ఇక వీరిని ఎదుర్కొనేందుకు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కూడా రెడీ అవుతున్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సోషల్ మీడియాలో అయితే చాలా పేర్లే వినిపిస్తున్నాయి. పల్లవి గౌడ, కావ్యశ్రీ, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్ జబర్దస్త్ ఫేమ్ ఎక్స్ప్రెస్ హరి, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి, నందూస్ వరల్డ్ నందూ, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ ఇలా చాలా మంది పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే ఒక లేడీ సెలబ్రిటీని హౌస్ లోకి రప్పించేందుకు బిగ్ బాస్ తెలుగు 10 టీమ్ విశ్వ ప్రయత్నాలు చేస్తోందట. మరోవైపు ఆమె మాత్రం బిగ్ బాస్ లోకి వచ్చేందుకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఆమె ఎంత అడిగినా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట. ఆమె మరెవరో కాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రన్నరప్ అమర్ దీప్ భార్య సతీమణి, ప్రముఖ సీరియల్ నటి తేజస్విని గౌడ. ప్రస్తుతం తేజస్విని గౌడ సీరియల్స్ , టీవీ షోలతో బిజీ బిజీగా ఉంటోంది. ముఖ్యంగా ప్రస్తుతం ఆమె తమిళంలో నటిస్తోన్న ‘ఆయాలి’ అనే సీరియల్ టీఆర్పీ

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అత్యంత పాపులర్ రియాలిటీ షోల్లో ‘బిగ్బాస్ తెలుగు’ ఒకటి. ఇప్పటికే తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. పదో సీజన్కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తొలి సీజన్ నుంచి తొమ్మిదో సీజన్ వరకు టైటిల్ గెలిచిన విజేతలు ఎవరు? బిగ్బాస్ హౌస్లో 100 రోజులు గడిపిన తర్వాత వారి జీవితాలు, కెరీర్లు ఎలా మారాయి? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఓసారి చూద్దాం. శివ బాలాజీ ‘బిగ్బాస్ తెలుగు’ తొలి సీజన్ విజేత శివ బాలాజీ. షోకు ముందు నుంచే సినీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. టైటిల్ గెలిచిన తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతున్నారు. ‘సింధూరం’, ‘కాలింగ్ సహస్ర’ వంటి చిత్రాల్లో నటించిన శివ బాలాజీ.. ఇటీవల ‘కన్నప్ప’లోనూ కీలక పాత్రలో కనిపించారు. తెలుగు సినిమాలతో పాటు తమిళంలోనూ నటించిన ఆయన.. ఇప్పటికీ సినీ పరిశ్రమలో యాక్టివ్గా ఉన్నారు. కౌశల్ మండా రెండో సీజన్ విజేత కౌశల్ మండా. బిగ్బాస్ హౌస్లో తన ఆటతీరుతో భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. ‘కౌశల్ ఆర్మీ’ పేరుతో అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతమైన సందడి కనిపించింది. అయితే టైటిల్ గెలిచిన తర్వాత ఆశించిన స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు దక్కలేదని కౌశల్ స్వయంగా వెల్లడించారు. సినిమాలు, టెలివిజన్లో కొనసాగుతూనే వ్యక్తిగత జీవితం, కుటుంబంపై కూడా దృష్టి సారించారు. ఇదీ చదవండి: ఒకేసారి ఐదు భాషల్లో ‘బిగ్బాస్’.. ఎవరు ఎక్కడ హోస్ట్! రాహుల్ సిప్లిగంజ్: మూడో సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్. బిగ్బాస్ టైటిల్ తర్వాత ఆయన కెరీర్లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటను పాడిన గాయకుల్లో రాహుల్ కూడా ఉన్నారు. ఈ పాటకు ఆస్కార్ రావడంతో ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కాగా ఇటీవల ఓ యువతి ఫిర్యాదుతో తనపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు వార్తలు వచ్చిన సమయంలో రాహుల్ ఆరోపణలను ఖండిస్తూ తన వాదనను వెల్లడించారు

అఫ్గానిస్థాన్తో జరగనున్న టీ20 సిరీస్కు బీసీసీఐ ఇవాళ భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా ఉండనున్నాడు. స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు బీసీసీఐ ఇవాళ(మంగళవారం) భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా ఉండనున్నాడు. ఇక వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్లను ఎంపిక చేసింది. జింబాబ్వేతో సిరీస్కు దూరమైన సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్కు వైభవ్ సూర్వవంశీ కూడా ఎంపికయ్యాడు. అయితే స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు. ఇక బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలను ఎంపిక చేసినప్పటికీ వారు కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక అఫ్గానిస్థాన్తో భారత్ సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 13న, రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 17న జరగనున్నాయి. ఈ మూడు టీ20లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఈ సిరీస్ ద్వారా అఫ్గానిస్థాన్ భారత్ లో టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం. శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్*, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా*, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా* గమనిక: స్టార్ గుర్తు ఉన్నవాళ్లు జట్టులోకి ఎంపికైనప్పటికీ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్తోనే పాండ్య.. కానీ, కెప్టెన్గా కాదు! ఆ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ను నమ్మోచ్చు: హర్షా భోగ్లే

10,000mAh బ్యాటరీతో రెడ్మి K100 సిరీస్ వస్తోంది భారత మార్కెట్లో పోకో X8 పవర్ రీబ్రాండెడ్ వెర్షన్ 6.59-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, 185Hz రిఫ్రెష్ రేట్ Redmi K100 Leak : రెడ్మి K100 ప్రో, రెడ్మి K100 ప్రో మ్యాక్స్ ఉండనున్నాయి. ఈ సిరీస్లో ఒక స్టాండర్డ్ మోడల్ కూడా లాంచ్ కానుంది. ఈ రెడ్మి ఫోన్ పవర్ఫుల్ 10,000mAh బ్యాటరీతో వస్తుందని అంచనా. భారత మార్కెట్లో పోకో X8 పవర్ రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు. ఈ ఫోన్ డిజైన్ రెడ్మి K100 ప్రో సిరీస్ మాదిరిగా ఉండొచ్చు. 10000mAh బ్యాటరీనా? : టిప్స్టర్ ప్రకారం.. రెడ్మి K100కు సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. ఈ ఫోన్ 10,000mAh బ్యాటరీతో రావచ్చు. అదనంగా, 165Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్లో 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ప్రింట్ సెన్సార్ ఉండొచ్చు. ఈ ఫోన్ IP68 రేటింగ్తో వస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ అందిస్తుంది. ఈ రెడ్మి ఫోన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ 5V చిప్సెట్తో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ ఇతర ఫీచర్లపై ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. ఇటీవల లాంచ్ అయిన రెడ్మి K100 ప్రోలో 185Hz రిఫ్రెష్ రేట్కు సపోర్టు ఇచ్చే 6.59-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ కూడా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ 5V చిప్సెట్తో రన్ అవుతుంది. Read Also : Gold Price Consolidation : గోల్డ్పై గందరగోళం వద్దు.. అమ్మేయాలా? కొనాలా? రూ.2 లక్షల దిశగా బంగారం.. ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారంటే? ఈ ఫోన్ 16GB వరకు ర్యామ్, 512GB స్టోరేజ్కు సపోర్ట్ చేస్తుంది. ప్రో మోడల్లో 8580mAh బ్యాటరీ ఉంది. 100W వైర్డ్, 50W వైర్లెస్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 200MP ప్రైమరీ కెమెరా, 50MP సెకండరీ కెమెరా, 8MP టెర్షియరీ కెమెరా

హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఔటర్ రింగ్ రోడ్డు రోటరీ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో బిహార్కు చెందిన నందులాల్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే జైద్ షా ఖాద్రీ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాగా ఈ ఘటనకు కారణమైన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు మెంబర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గం పోలీసుల సమాచారం ప్రకారం.. రాయదుర్గం ప్రధాన రహదారిపై నందులాల్ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందులాల్ తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డుపై తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న అతనిని గమనించిన జైద్ షా ఖాద్రీ అనే విద్యార్థి వెంటనే స్పందించాడు. నందూలాల్ ను ఆస్పత్రికి తరలించేందుకు తన వాహనంలో ఎక్కించుకున్నాడు. అయితే ఇదే క్రమంలో మరో అనూహ్య ప్రమాదం చోటు చేసుకుంది. వెనుక నుంచి వేగంగా వచ్చిన మహీంద్రా కారు.. వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో అప్పటికే తీవ్రంగా గాయపడిన నందులాల్ ప్రాణాలు కోల్పోయాడు. జైద్ షా ఖాద్రీకి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం తర్వాత మహీంద్రా కారు కూడా అక్కడ ఆగకుండా వెళ్లిపోయింది.దీంతో స్థానికులు అక్కడికి చేరుకుని.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన సీసీ కెమెరా పుటేజీని పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా నందులాల్ను ఢీకొట్టిన ఇన్నోవా కారును గుర్తించిన పోలీసులు.. ఆ వాహనం సందీప్కు సంబంధించినదిగా ధ్రువీకరించారు. అనంతరం సందీప్ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే నందూలాల్ ను రెండోసారి

హైదరాబాద్ రాయదుర్గంలో సోమవారం తెల్లవారుజామున ఒక ఘోరమైన హిట్ అండ్ రన్ ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఇన్నోవా కారు కాలినడకన వెళ్తున్న నందులాల్ అనే వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్రమైన ఘటనలో నందులాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ప్రమాదాన్ని చూసి సహాయం చేయడానికి పరుగెత్తుకు వచ్చిన జైద్ షా కాద్రి అనే విద్యార్థి కూడా అదే వాహనం తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి కారును నిలపకుండా అక్కడి నుండి వేగంగా పరారయ్యాడు. ఈ హిట్ అండ్ రన్ ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు వెంటనే దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా వాహనాన్ని నడిపినది ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్గా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో పోలీసులు వేగంగా స్పందించి సందీప్ను అరెస్ట్ చేసి, ప్రమాదానికి వాడిన కారును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆనంద్ సాయి తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్గా గుర్తింపు పొందడమే కాకుండా యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. 2024 లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ ట్రస్ట్ బోర్డులో జనసేన నామినీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రమాద సమయంలో వాహనం ఏ వేగంతో వెళ్తోంది, డ్రైవర్ మద్యం సేవించి ఉన్నారా లేదా అనే అంశాలపై పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, గాయపడిన విద్యార్థి జైద్ షా కాద్రిని స్థానికులు తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అతని ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది. మరోవైపు ప్రాణాలు కోల్పోయిన నందులాల్ కుటుంబ నేపథ్యం, ఇతర వివరాలను సేకరించే పనిలో పోలీసులు

హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 1: ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న ప్రస్థానం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 12వ తేదీన హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ‘సిల్వర్ జూబ్లీ పాటల పోరాటం’ పేరిట ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న తెలిపారు. మంగళవారం హనుమకొండ ప్రెస్క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణవ్యాప్తంగా ఉన్న కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థిలోకం పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ‘నా పేరే ఏపూరి -పోరాటమే నా దారి’ అని స్పష్టం చేశారు. తెలంగాణ సమాజంలో కవులకు, కళాకారులకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించడానికి, వారి పక్షాన నిలబడి ఎదిరించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ప్రకటించారు. పస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో యువత పెడదోవ పడుతూ మాదకద్రవ్యాలు(డ్రగ్స్) బారిన పడుతుండటంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యువతను జాగృతం చేసి సరైన మార్గంలో నడిపించేందుకు అక్టోబర్ నెల నుంచి తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా పర్యటనలు, చైతన్య కార్యక్రమాలు చేపడతానని సోమన్న వెల్లడించారు

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల ప్రేమ కథలు, పెళ్లి ముచ్చట్లు వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే రీల్ లైఫ్లో తమ్ముడికి రోమాంక్ చేసి, రియల్ లైఫ్లో అన్నయ్యను వివాహం చేసుకున్న హీరోయిన్ల ముచ్చట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల ప్రేమ కథలు, పెళ్లి ముచ్చట్లు వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే రీల్ లైఫ్లో తమ్ముడికి రోమాంక్ చేసి, రియల్ లైఫ్లో అన్నయ్యను వివాహం చేసుకున్న హీరోయిన్ల ముచ్చట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తాజాగా నటి కావ్య కళ్యాణ్ రామ్, సంగీత దర్శకుడు కాల భైరవ తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఈ ఆసక్తికరమైన అంశం మరోసారి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కావ్య కళ్యాణ్ రామ్, కాల భైరవ తమ్ముడైన యంగ్ హీరో శ్రీసింహా కోడూరి సరసన ఉస్తాద్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం, ఆ తర్వాత కాల భైరవతో ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటల వరకు వెళ్తోంది. ఇక గతంలోనూ ఇలాంటి ఆసక్తికరమైన జంటలు టాలీవుడ్, కోలీవుడ్లలో వార్తల్లో నిలిచాయి. దివంగత అతిలోక సుందరి శ్రీదేవి, ప్రముఖ నటుడు అనిల్ కపూర్ సరసన మిస్టర్ ఇండియా వంటి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఆయన అన్నయ్య, నిర్మాత బోనీ కపూర్ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఇదే వరుసలో నటి శ్రియా రెడ్డి కూడా విశాల్ సరసన పొగరు చిత్రంలో పవర్ఫుల్ పాత్రలో నటించింది. ఈ చిత్రంలో విశాల్ - శ్రియా రెడ్డి రొమాంటిక్ సాంగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఆ సెట్ లో శ్రియాకు విశాల్ అన్నయ్య, నిర్మాత విక్రమ్ కృష్ణ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. అలాగే సోనియా అగర్వాల్, ధనుష్ సరసన కాదల్ కొండేన్ చిత్రంలో నటించి
5/5సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ప్రముఖ గ్లోబల్ మూవీ రివ్యూయింగ్ ప్లాట్ఫామ్ 'లెటర్బాక్స్' (Letterboxd) ప్రొఫైల్ ద్వారా ఇచ్చే సినిమా రేటింగ్లు బయటకు రావడంతో ఇంటర్నెట్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కంటెంట్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని నిర్భయంగా ఇచ్చే ఈ రేటింగ్లు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా టాక్సిక్ పై ఇచ్చిన రేటింగ్ వైరల్ గా మారింది. టాక్సిక్ కి గౌతమ్ అర నక్షత్రం రేటింగ్ ఇచ్చాడు. ఇప్పటివరకు వివిధ భాషలు, వివిధ జోనర్లకి చెందిన 400లకి పైగా సినిమాలని గౌతమ్ వీక్షించినట్లు అతని ప్రొఫైల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఈ రివ్యూల సమాహారంలో అందరినీ విపరీతంగా ఆకట్టుకున్న అంశం ఏమిటంటే, గౌతమ్ తన తండ్రి మహేష్ బాబు నటించిన కల్ట్ క్లాసిక్ సినిమాలైన 'పోకిరి', '1: నేనొక్కడినే' చిత్రాలకు ఏకంగా పూర్తిస్థాయి 5/5 నక్షత్రాల రేటింగ్ ఇచ్చాడు. తన తండ్రి కెరీర్లోనే ఎంతో వైవిధ్యమైన, సాహసోపేతమైన ప్రయోగాత్మక పాత్రలను గౌతమ్ ఎంతగా అభినందిస్తాడో ఈ రేటింగ్స్ నిరూపిస్తున్నాయి. అయితే అదే సమయంలో, నెగెటివ్ టాక్ తెచ్చుకున్న మహేష్ బాబు సినిమా 'బ్రహ్మోత్సవం' చిత్రానికి గౌతమ్ కేవలం 1 స్టార్ మాత్రమే ఇచ్చి సరిపెట్టుకోవడం విశేషం. అంతేకాదు, మహేష్ బాబు నటించిన 'నిజం', 'వంశీ' చిత్రాలకు కూడా కేవలం 2 స్టార్ల చొప్పున మాత్రమే రేటింగ్ కేటాయించి తన స్వతంత్ర అభిప్రాయాన్ని ఏమాత్రం దాచుకోలేదు. టాలీవుడ్తో పాటు ఇతర ఇండస్ట్రీల పాన్-ఇండియా, హాలీవుడ్ చిత్రాల విషయంలోనూ గౌతమ్ తన సమీక్షా ముద్రను స్పష్టంగా వేశాడు. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన దృశ్య కావ్యం 'బాహుబలి 2' చిత్రానికి గౌతమ్ సంపూర్ణంగా 5 నక్షత్రాలు అందించగా, క్లాసిక్ లవ్ అండ్ యూత్ ఫుల్ డ్రామాలైన 'పెళ్లిచూపులు', 'సీతారామం' సినిమాలకు 4.5 రేటింగ్ ఇచ్చి తన సినిమా అభిరుచి ఎంత పరిణతి చెందిందో చాటిచెప్పాడు. ప్రతికూల వైపు చూస్తే, యశ్ నటించిన

నేచురల్ స్టార్ నాని తన కొడుకు అర్జున్తో కలిసి జిమ్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుని అభిమానులను ఆకట్టుకున్నారు. సెప్టెంబర్ 1న తన అలవాటు ప్రకారం ఒక ప్రత్యేకమైన ఫోటోను పోస్ట్ చేసిన ఆయన, దీనికి మై లిటిల్ ప్యారడైజ్ అనే క్యాప్షన్ జత చేశారు. సాధారణంగా ప్రతినెల మొదటి రోజున ఒక ఫోటోను షేర్ చేసే నాని, ఈసారి తన అప్కమింగ్ సినిమా పేరు ఆధారంగా ఈ క్యాప్షన్ ఎంచుకున్నారు. ఆ ఫోటోల్లో నాని తన కొడుకుతో కలిసి హోమ్ జిమ్ సెటప్లో చాలా క్యాజువల్గా కనిపించారు. నాని తన కొడుకు అర్జున్ను అభిమానులు ప్రేమగా జున్ను అని పిలుస్తుంటారు, అతనికి మార్చిలో 9 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ సమయంలో కూడా నాని ఇంటి వద్ద తీసిన సింపుల్ ఫోటోలను షేర్ చేసి అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నారు. గతంలో భార్య అంజన మరియు కొడుకుతో కలిసి తిరుమల దర్శనం, స్కూల్ ఈవెంట్లు, పండుగల ఫోటోలు కూడా నెట్టింట బాగా ప్రాచుర్యం పొందాయి. నాని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను తరచుగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ కొత్త ఫోటోలలో సినిమా ప్రమోషన్స్ కోసం కాకుండా సాధారణ తండ్రి పాత్రలో నాని కనిపించడం విశేషం. దీంతో నాని జిమ్ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా షేర్ అవుతూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉండగా, తన కొత్త చిత్రం ది ప్యారడైజ్ పేరును కాస్త తిప్పి కొడుకును మై లిటిల్ ప్యారడైజ్ అని పిలవడం పట్ల నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు కూడా అర్జున్ను జూనియర్ నేచురల్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ల హడావుడి లేకుండా నాని పంచుకున్న ఈ ఫ్యామిలీ మూమెంట్స్ అందరినీ అలరిస్తున్నాయి. ఫలితంగా నాని జిమ్ ఫోటోలు అభిమానుల్లో ఒక కొత్త రకమైన పాజిటివ్ వైబ్ను క్రియేట్ చేశాయని చెప్పవచ్చు

రోజుకు ఐదు నిమిషాలు.. అంతే పని. కానీ నెలకు 10 వేల డాలర్లు సంపాదించాలి! ఈ మాట వింటే ఎవరికైనా నవ్వొస్తుంది. కాలేజీ రోజుల్లో ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నాడు ఓ యువకుడు. స్నేహితులు కూడా అతడిని చూసి ఆశ్చర్యపోయారు. కానీ అతడు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఐదు నిమిషాల పని అంటే ఐదు నిమిషాలే.. ఆ సమయంలో ఏం ఆలోచించాలో నిర్ణయించుకున్నాడు. ఆ ఆలోచన ఓ చిన్న పరికరానికి దారి తీసింది. అదే అతడి జీవితాన్ని మార్చేసింది.ఆ యువకుడే మసయోషి సన్. నేడు సాఫ్ట్బ్యాంక్ వ్యవస్థాపకుడిగా ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన పెట్టుబడిదారుల్లో ఒకరు. 2026 సెప్టెంబరు 1 నాటికి ఫోర్బ్స్ అంచనా ప్రకారం ఆయన సంపద 63.2 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.5.3 లక్షల కోట్లు. కానీ ఈ స్థాయికి ఆయన ప్రయాణం మాత్రం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బెర్క్లీలో ఓ విద్యార్థిగా ఉన్నప్పుడే మొదలైంది.ఐదు నిమిషాల ఆలోచన..1970ల చివర్లో బెర్క్లీలో ఆర్థికశాస్త్రం చదువుతున్న సన్ తనకు తానే ఓ సవాల్ విసిరుకున్నారు. రోజుకు ఐదు నిమిషాలు మాత్రమే కేటాయించి నెలకు 10 వేల డాలర్లు సంపాదించాలి. ఉద్యోగం చేస్తే అది సాధ్యం కాదని ఆయనకు తెలుసు. అందుకే ఓ వినూత్న ఆదాయ మార్గం కోసం ఆలోచించారు.ఆ ఐదు నిమిషాల్లో ఓ ఆవిష్కరణ చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఎలక్ట్రానిక్ ట్రాన్స్లేటర్ ఆలోచన వచ్చింది. బెర్క్లీలోని పరిశోధకులు, ప్రొఫెసర్ ఫారెస్ట్ మోజర్ సహకారంతో దాన్ని అభివృద్ధి చేశారు. చివరకు ఆ పరికరాన్ని జపాన్కు

ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి కుమారుడు సందీప్ పై హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఈ రోజు తెల్లవారుజామున గచ్చిబౌలి ఓఆర్ ఆర్ నుంచి ఖాజాగూడ వైపు వస్తున్న ఒక ఇన్నోవా కారు ఒక వ్యక్తిని ఢీ కొట్టింది. దీంతో ఇన్నోవా కారు డ్రైవర్ గాయపడిన వ్యక్తిని తన చేతుల మీదుగా హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాడు. సందీప్ కాజాగూడ నుంచి నానక్ రామ్ గూడ వైపు వెళ్తున్నాడు.ఆ క్రమంలోనే సందీప్ కారు ఆ ఇద్దరి వ్యక్తులని ఢీ కొట్టింది. దీంతో ఇన్నోవా డ్రైవర్ ప్రాణాపాయం నుంచి బయటపడగా గాయాలపాలైన వ్యక్తి మాత్రం చనిపోయాడు. ఘటనా సమయంలో సందీప్ సందీప్ కారు నడిపినట్టుగా తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. సిసి టివి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు సందీప్ ని మరింతగా విచారిస్తున్నారు. సందీప్ తల్లి ప్రముఖ నటి వాసుకి. తొలిప్రేమలో పవన్ కళ్యాణ్ కి సోదరురాలిగా చేసింది. రీసెంట్ గా ఘట్టమనేని జై కృష్ణ శ్రీనివాస మంగాపురంలో చేసి మెప్పించింది. ఆనంద సాయి అయితే పవన్ కళ్యాణ్ కి బెస్ట్ ఫ్రెండ్ తో పాటు చిన్న నాటి స్నేహితుడు. తెలుగు చిత్ర సీమలో ఎన్నో హిట్ సినిమాలకి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసాడు. ప్రీవియస్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఇది కిక్ అంటే: సంక్రాంతి బరిలో విజయ్ సేతుపతి, సాయిపల్లవి
యూట్యూబ్లో జానపద గీతాలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ‘ప్రమీల ఓ ప్రమీల’, ‘బాసింగ బలాలే’ వంటి పాపులర్ ఫోక్ సాంగ్స్తో గుర్తింపు పొందిన ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ తోటి డ్యాన్సర్ మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ వివాదం కొద్దిరోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మొదలైంది. ఇప్పటికే వివాహమై ఒక బాబు ఉన్న ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్తో కలిసి వేములవాడలోని ఒక హోటల్ గదిలో ఉండగా.. ఆయన భార్య శరణ్య అక్కడికి చేరుకుని వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం, గొడవకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత యూట్యూబ్ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ వివరణలు ఇచ్చే ప్రయత్నం చేశారు.* నా కెరీర్లో 'మోస్ట్ ఆల్ఫా' మూమెంట్ అదే... 'పుష్ప 2'లో లేడీ గెటప్పై బన్నీ ఓపెన్ కామెంట్స్ఇటీవల ఈ వివాదం మరింత ముదిరి నార్సింగి పోలీస్ స్టేషన్కు చేరింది. ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, నమ్మించి మోసం చేశాడని మాధురి రాథోడ్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మార్ఫింగ్ చేసిన నకిలీ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాడని, డిజిటల్ వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆరోపించారు.* వెండితెరపై తమ్ముళ్లతో రొమాన్స్.. నిజ జీవితంలో అన్నలకు జోడీగా... హీరోయిన్ల క్రేజీ లవ్ స్టోరీస్మాధురి రాథోడ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును

రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. హిట్ అండ్ రన్ కేసులో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్, సెప్టెంబర్ 1: రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. హిట్ అండ్ రన్ కేసులో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నడుచుకుంటూ వెళ్తున్న నందులాలను ఇన్నోవా కార్ బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని విద్యార్థి జైద్షా కద్రీ ఆస్పత్రికి తీసుకెళ్తుండా మరో ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న విద్యార్థిని మహేంద్ర కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో నందులాల అక్కడికక్కడే మృతిచెందగా.. విద్యార్థి జైద్షా కద్రీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత కారు యాజమాని వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు.. విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు.. మహేంద్ర కార్ యాజమానిని గుర్తించారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్.. కారు నడిపి ఒకరి మృతికి కారణమైనట్లు విచారణలో తేలింది. దీంతో కారును సీజ్ చేసిన పోలీసులు.. సందీప్ను అదుపులోకి తీసుకున్నారు. పోలవరం నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. చంద్రబాబు చేతుల మీదుగా విడుదల మూడు పోలవరాలు కట్టేంత మొత్తాన్ని పెన్షన్లకు ఖర్చు చేశాం: సీఎం చంద్రబాబు