
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

హైదరాబాద్ శివారులో ఓ ల్యాబ్ను అద్దెకు తీసుకొని గుట్టుగా డ్రగ్స్ తయారు చేస్తున్న నాగ్పూర్కు చెందిన ఓ ముఠా గుట్టును యాదాద్రి భువనగరి జిల్లా పోలీసులు రట్టు చేశారు. రూ.54 కోట్ల విలువైన 27కిలోల డ్రగ్స్ స్వాధీనం కొండమడుగులో ల్యాబ్ అద్దెకు తీసుకొని మెఫిడ్రిన్ తయారీ నాగ్పూర్ ముఠా దందా.. నలుగురి అరెస్టు, నలుగురు పరార్ యాదాద్రి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ శివారులో ఓ ల్యాబ్ను అద్దెకు తీసుకొని గుట్టుగా డ్రగ్స్ తయారు చేస్తున్న నాగ్పూర్కు చెందిన ఓ ముఠా గుట్టును యాదాద్రి భువనగరి జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా నాగ్పూర్కు తరలిస్తున్న సుమారు రూ.54 కోట్ల విలువైన 27కిలోల మెఫిడ్రిన్ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఆదివారం విలేకరులకు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. డ్రగ్స్ రవాణాపై సమాచారంతో హైదరాబాద్ శివారు, బీబీనగర్ మండలం కొండమడుగు శివారులో పోలీసులు శనివారం సాయంత్రం తనిఖీలు చేశారు. ఓ కారులో 27కిలోల మెఫిడ్రిన్తోపాటు మెఫిడ్రిన్ తయారీకి ఉపయోగించే 40 కిలోల అసిటోన్ రసాయనాన్ని గుర్తించారు. కారులోని నిందితులను విచారించగా.. నాగ్పూర్కు చెందినముఠా కొండమడుగులో ఓ ల్యాబ్ను అద్దెకు తీసుకొని అక్కడ మెఫిడ్రిన్ తయారు చేసి రవాణా చేస్తున్నట్టు తేలింది. నాగ్పూర్కు చెందిన చేతన్ మధుకర్ మెష్రామ్.. వేటుకూరి ల్యాబ్స్ను అద్దెకు తీసుకున్నాడు. అసోంకు చెందిన ఎండీ అయూబ్ అలీ.. ల్యాబ్ ఏర్పాటు, ముడిపదార్థాల సమీకరణ, కెమి్స్టల ఏర్పాటు వంటి పనులు చేపట్టాడు. మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడిన వీరు ఈ నెల 5-7 తేదీల్లో ఆ ల్యాబ్లో మెఫిడ్రిన్ తయారు చేశారు. దానిని కారులో తరలిస్తుండగా పట్టుబడ్డారు. ఈ కేసులో 8 మంది పాత్రను గుర్తించిన పోలీసులు.. చేతన్ మధుకర్ మెష్రామ్ (49), అసోంకు చెందిన ముజమల్ హక్(25), నాగపూర్కు చెందిన ఆకాశ్ అశోక్ గవాండే(31), వేటుకూరి