
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

హైదరాబాద్లోని మియాపూర్లో ఏటీఎంను లూటీ చేయడానికి దుండగులు విఫల యత్నం చేశారు. మియాపూర్ ఎక్స్ రోడ్డులోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎంను టార్గెట్ చేసిన ముగ్గురు వ్యక్తుల ముఠా, రాడ్లు మరియు రాళ్లతో యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు దోచుకునేందుకు యత్నించింది. కానీ వారు ఎంత ప్రయత్నించినా క్యాష్ బాక్స్ ఓపెన్ కాలేదు. వారి ప్రయత్నం బెడిసికొట్టడంతో చేసేది లేక దొంగలు అక్కడ ఉన్న బ్యాకప్ బ్యాటరీలను ఎత్తుకొని పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తెల్లవారుజామున ఏటీఎం వద్దకు చేరుకున్న నిందితులు పక్కా ప్లాన్తో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఒకరు బయట కాపలాగా ఉండగా, మరో ఇద్దరు లోపలికి వెళ్లి ఇనుప రాడ్లతో ఏటీఎంను పగులగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు, సీసీటీవీ పుటేజ్ ఆధారంగా ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు సంజీవ్ జాదవ్, రాపాక సూర్య ప్రకాశ్ రావులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు వాదిత్య కార్తిక్ పరారీలో ఉన్నాడు. సులభంగా డబ్బు కొట్టేయాలనే దుర్బుద్ధితోనే వీరు ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితుల నుంచి ఒక ఇనుప రాడ్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఏటీఎంల భద్రత పట్ల బ్యాంకులు మరింత అప్రమత్తంగా ఉండాలని, తగిన వెలుతురుతో పాటు అలారం వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు! మీ ఇంట సిరులు కురిపించే మొక్క! ఈ రోజులు, దిశలో నాటాలి గుర్తుంచుకోండి వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్! ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? అయితే ఈ డేంజర్ బెల్స్ మోగినట్టే! వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు.. ఈ

Tirupati: సూళ్ళూరుపేటలో దోపిడీ దొంగల అరెస్ట్ గంజాయి మత్తులో నేరాలు! Tirupati: తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట డీఎస్పీ జీ.చెంచుబాబు ఆధ్వర్యంలో,సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.మురళీకృష్ణ పర్యవేక్షణలో సూళ్ళూరుపేట ఎస్సై గంటా అజయ్ కుమార్ నేరస్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. సూళ్ళూరుపేట పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 169/2026 U/s 309(4) BNS Robbery కేసులో ఈ దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై అజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. పట్టణంలో కలకలం సృష్టించిన దోపిడీ కేసును స్థానిక పోలీసులు విజయవంతంగా ఛేదించారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళ్తున్న వారిని కత్తితో బెదిరించి నగదు, సెల్ఫోన్లు దోచుకుంటున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 22 అంగుళాల పెద్ద కత్తి, వివో ఆండ్రోయిడ్ సెల్ఫోన్, రూ. 200 నగదును మధ్యవర్తులు స్వాధీనం చేసుకున్నారు.స్థానిక పోలీసుల వివరాల ప్రకారం...NH-16 జాతీయ రహదారిపై శ్రీచెంగాళమ్మ గుడి ఆర్చ్ సమీపంలో ఎస్సై అజయ్ కుమార్ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో సదరు క్రైమ్ కేసు ముద్దాయిల గురించి సమాచారం ఉండటంతో తనిఖీలు ముమ్మరం చేశారు. అటుగా వచ్చిన ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా, సిబ్బంది వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు 1) కిలివేటి జగదీష్ @ జగన్ (కోటపోలూరు), 2) ముటుకు దిలీప్ @ ఢిల్లీ (వట్రపాలెం), 3) కొల్లచెరువు లోకేష్ @ లోకి (వట్రపాలెం)లుగా తేలింది. ఈ నిందితులకు గంజాయి, మద్యం త్రాగే అలవాటు ఉంది. కూలి పనులు చేసుకునే వీరు సంపాదించే డబ్బు జల్సాలకు, మత్తు పదార్థాలకు సరిపోక సులువుగా డబ్బు సంపాదించాలనినిర్ణయించుకున్నారుఈ నెల 7వ తేదీ రాత్రి వట్రపాలెం మొదటి వీధిలో నడిచి వెళ్తున్న వ్యక్తిని ఈ ముగ్గురు మరియు పరారీలో ఉన్న అఫ్రిద్ కలిసి కత్తితో బెదిరించి సెల్ఫోన్, రూ. 1,000 దోచుకెళ్లారు. ఆ డబ్బుతో మద్యం