
గిగ్ వర్కర్లకు శుభవార్త.. రూ.99తోనే ఎన్ పీఎస్ లో పెన్షన్ పొదుపు
జొమాటో, స్విగ్గీ, ఓలా, ఉబర్, బ్లింకిట్ వంటి సంస్థలలో సేవలందిస్తున్న గిగ్ వర్కర్లు (ప్లాట్ఫామ్ వర్కర్లు) ఇకపై తమ పదవీ విరమణ అవసరాల కోసం సులభంగా పొదుపు చేసుకోవచ్చు. కేవలం రూ. 99 కనీస మొత్తంతో జాతీయ పింఛను పథకంలో (ఎన్పీఎస్) చేరే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) బుధవారం వెల్లడించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.'మీ పని తర్వాతి బుకింగ్పై ఆధారపడి ఉండవచ్చు, కానీ మీ రిటైర్మెంట్ అలా కాదు' అని పీఎఫ్ఆర్డీఏ పేర్కొంది. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఎన్పీఎస్ విధానంలో, కనీస లేదా గరిష్ఠ పరిమితుల నిబంధనలు లేకుండా తమ వెసులుబాటును బట్టి పొదుపు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.గతేడాది అక్టోబర్ 29న పీఎఫ్ఆర్డీఏ జారీ చేసిన సర్క్యులర్ ద్వారా 'ఎన్పీఎస్ ఈ-శ్రామిక్ (ప్లాట్ఫామ్ సర్వీస్ పార్ట్నర్) మోడల్'ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా సేవలు అందించే గిగ్ వర్కర్లు ఈ పథకంలో చేరవచ్చు. ఇందులో వర్కర్, యాజమాన్యం కలిసి లేదా విడివిడిగా తమ వాటాలను చెల్లించవచ్చు. ప్లాట్ఫామ్ కంపెనీలు నేరుగా పీఎఫ్ఆర్డీఏలో నమోదు కాకుండా, పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ (PoPs) సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని తమ వర్కర్లను ఎన్పీఎస్లో చేర్పించవచ్చు.ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ద్వారా వర్కర్ వివరాలను సేకరించి, వారి అనుమతితో పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (ప్రాన్) కేటాయిస్తారు. ప్రారంభంలో ప్లాట్ఫామ్ కంపెనీయే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్, పెన్షన్ ఫండ్ను ఎంపిక