
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

గ్లోబల్ ఇన్వెస్టర్లు తిరిగి భారత మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త ఎఫ్పీఐల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. రెండు నెలల్లోనే ఏకంగా 49 కొత్త ఎఫ్పీఐలు సెబీలో నమోదు కావడం విశేషం. ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 2: భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (FPI) కొనుగోళ్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లు పకడ్బందీ వ్యూహంతో తిరిగి భారత మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త ఎఫ్పీఐల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. రెండు నెలల్లోనే(జూలై-ఆగస్టు) ఏకంగా 49 కొత్త ఎఫ్పీఐలు సెబీ(SEBI)లో నమోదు కావడం విశేషం. పెరిగిన ఎఫ్పీఐల సంఖ్య: 2026 మొదటి ఆరు నెలల్లో (జనవరి-జూన్) 52 ఎఫ్పీఐలు మాత్రమే నమోదవగా, జులై, ఆగస్టు నెలల్లో ఆ సంఖ్య 49కి చేరింది. దీంతో భారత మార్కెట్లలో మొత్తం ఎఫ్పీఐల సంఖ్య 12,243కి పెరిగింది. మళ్లీ నెట్ బైయర్లు: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రూ. 2 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించిన విదేశీ పెట్టుబడిదారులు, జులై, ఆగస్టు నెలల్లో భారీగా కొనుగోళ్లు జరిపారు. జులైలో రూ.40,031 కోట్లు, ఆగస్టులో రూ.25,492 కోట్ల విలువైన సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. నెలవారీ సగటు: ఈ ఏడాది ఆరంభంలో నెలకు సగటున కేవలం 8 కొత్త ఎఫ్పీఐలు నమోదు కాగా, గత రెండు నెలల్లో ఆ వేగం పెరిగి నెలకు 25 కొత్త ఫండ్లు నమోదు కావడం గమనార్హం. విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో పలు కీలక సడలింపులు, నిర్ణయాలు ప్రకటించింది. 1. పన్ను మినహాయింపులు(Tax Exemptions): జూన్ 5న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సెక్యూరిటీలలో(G-Secs) పెట్టుబడి పెట్టే ఎఫ్పీఐలకు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్, వడ్డీ ఆదాయంపై పూర్తి పన్ను మినహాయింపును ప్రకటించింది. 2. FAR రూట్ విస్తరణ: లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు, గ్లోబల్ పెన్షన్ ఫండ్లు, సోవరిన్ వెల్త్ ఫండ్లను ఆకర్షించడానికి 15, 30, 40 ఏళ్ల జారీలతో

హత్యాయత్నం కేసు నమోదు చేయడంలో జాప్యం వహించిన పోలీసులపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వీఆర్కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి, సెప్టెంబర్ 01: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసులపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వీఆర్కు పంపుతూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి శివారులోని కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల మహిళపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనపై నాలుగు రోజులు ఆలస్యంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అవి జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లాయి. దాంతో ఈ కేసు నమోదు వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ నరసింహ కిషోర్ నిర్ణయించారు. అందులో భాగంగా వారిని వీఆర్కు పంపారు. కోరుకొండ ఎస్ఐ రమేశ్, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ పోస్ట్ ఏఎస్ఐ శ్రీదేవితోపాటు హెడ్ కానిస్టేబుళ్లు లక్ష్మణ్, నాగమల్లేశ్వరరావును వీఆర్కు పంపుతూ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ప్రేమ పేరుతో మోసం.. బలవంతంగా పెళ్లి: కాకినాడ ఎస్పీకి మహిళ ఫిర్యాదు తిరుపతి విమానాశ్రయంలో విమాన వేళల్లో మార్పులు.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్

రైతులకు ప్రభుత్వం నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ ఏడాది వాతావరణంలో వస్తున్న విపరీతమైన మార్పులు, ఎల్ నినో భయాల నేపథ్యంలో పంటలకు బీమా చేయించుకోవడం చాలా అవసరమని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద ప్రీమియం చెల్లించేందుకు ఆగస్టు 15వ తేదీతోనే గడువు ముగిసింది. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. అందుకే అన్నదాతల క్షేమం కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీమా నమోదు గడువును ఈ నెలాఖరు వరకు, అంటే ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ క్షణంలో వాతావరణం మారిపోతుందో, అకాల వర్షాలు ముంచెత్తుతాయో లేదా కరవు తాండవిస్తుందో చెప్పడం కష్టం. అసెంబ్లీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రైతులెవరూ రిస్క్ తీసుకోవద్దని, వెంటనే బీమా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు. పంట చేతికి వచ్చే వరకు ఏ గ్యారెంటీ లేని ఈ రోజుల్లో పంటల బీమా అనేది రైతుకు ఒక సురక్షితమైన కవచంలా పనిచేస్తుందని స్పష్టం చేశారు. చాలామంది రైతులు ఇన్సూరెన్స్ అంటే వేలల్లో ఖర్చవుతుందని భయపడుతుంటారు. కానీ ఫసల్ బీమా యోజనలో రైతు చెల్లించాల్సిన ప్రీమియం చాలా చాలా తక్కువ. ఖరీఫ్ పంటలకు కేవలం 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు రైతు వాటా అత్యంత స్వల్పంగా ఉంటే, మిగిలిన ప్రధానమైన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. రూపాయి ఖర్చు పెద్దగా లేకుండా వేల రూపాయల నష్టపరిహారం పొందే అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని అధికారులు చెబుతున్నారు. రైతులు తమ సమీపంలోని సీఎస్ఈ (CSC) సెంటర్లు లేదా మీ సేవా

తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలు, రాహుల్ గాంధీకి రాసిన లేఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని పేర్కొనడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీనికి ఘాటుగా బదులిచ్చారు. హరీష్ రావు ని టార్గెట్ చేశారు.హరీష్ రావుకు పొంగులేటి ఘాటు కౌంటర్తెలంగాణలో సెక్షన్ 22ఏ నిషేధిత భూముల వివాదం పైన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు, రాహుల్ గాంధీకి రాసిన లేఖకు స్పందిస్తూ మంత్రి పొంగులేటి ఎక్స్ వేదికగా ఘాటు కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అబద్ధాలు చెబుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చడం లేదని మండిపడ్డారు.ఆ మంత్రిని తప్పించండి, ఇదిగో ఆధారాలు - రాహుల్ గాంధీకి హరీష్ లేఖ..!!అవినీతి, కమీషన్ల గురించి మీరే మాట్లాడాలిఅవినీతి, కమీషన్ల గురించి హరీశ్ రావు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, హంతకుడే సంతాపం తెలిపినట్లు ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత స్వయంగా వెల్లడించిన విషయాలను గుర్తు చేశారు. హరీష్ రావు చేసిన అవినీతి పైన కవితే స్వయంగా అనేక విషయాలు మాట్లాడారని గుర్తు చేశారు.కాళేశ్వరం, ధరణి నుంచి మెడికల్ కాలేజీల వరకు మీ దోపిడీ తెలియదాబీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్న సమయంలో హరీష్ రావు ఎలా సంపాదించారో, ఏం వ్యాపారం చేశారో, తక్కువ సమయంలో బాగా ఆర్థికంగా ఎదగడానికి కారణం ఏమిటో ప్రజలకు వివరించాలని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. అగ్గిపెట్టె రావు అని సెటైర్లు వేస్తూ, అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం, ధరణి నుంచి మెడికల్ కాలేజీల వరకు అన్నింటిలోనూ దోచుకున్న వారు ఇప్పుడు కమీషన్ల ప్రభుత్వమని మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నిషేధిత జాబితాలో చేరినవి ఎన్ని? లెక్కలు తేల్చండి.. వివరాలు ఇవ్వండి! 22ఏ సెక్షన్ నేపథ్యంలో తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశాలు సబ్ రిజిస్ర్టార్లతో సంప్రదింపులు జరపాలని సూచన జిల్లాలో రోజువారీ రిజిస్ర్టేషన్ల ప్రక్రియపై ఆరా హైదరాబాద్ సిటీ: 22ఏ కింద నిషేధిత జాబితాలో చూపుతున్న లక్షలాది మంది నిరుపేదల నివాసాలు, ఖాళీ స్థలాలతో పాటు పెద్ద పెద్ద భవనాలను ఆ జాబితా నుంచి బయటపడేసేందుకు జిల్లా రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో చర్చిస్తూ, రికార్డులను సరిచూస్తున్నారు. ప్రధానంగా రిజిస్ర్టేషన్ ఆఫీసుల్లో సబ్ రిజిస్ర్టార్లు తిరస్కరిస్తున్న సర్వే నంబర్లలో ఉన్న మొత్తం భూమి ఎంత.. అందులో ఎంతవరకు ప్రైవేట్ పట్టా స్థలాలు ఉన్నాయి.. వాటి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో ఎన్ని కోర్టు కేసులు నడుస్తున్నాయి.. అనే వివరాలను ఆరా తీస్తున్నారు. అధికారుల తప్పిదంతో నిషేధిత జాబితాలోకి.. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నెలలుగా 22ఏ సెక్షన్ తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టంతో 50 ఏళ్లకు పైబడిన ప్రైవేట్ పట్టా భూములు, ఇళ్లు సైతం అనుకోకుండా ప్రోహిబిటెడ్ లిస్టులోకి వెళ్లాయి. అయితే కొంతమంది రెవెన్యూ అధికారుల తప్పిదంతోనే ఈ పొరపాట్లు చోటుచేసుకున్నాయని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులుగా దిద్దుబాటు చర్యలకు దిగింది. రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో ఈ సమస్య తక్కువగా ఉన్నప్పటికీ, గ్రేటర్లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లో ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నివేదిక ఇచ్చేందుకు హడావుడి వాస్తవంగా జిల్లాలో 12 లక్షలకు పైగా భూములు వివిధ కోర్టు కేసుల్లో ఉన్నాయి. ఏళ్ల తరబడి ఇవి కోర్టుల్లో నడుస్తూనే ఉన్నాయి. కౌంటర్లు దాఖలు చేయడంలో కొంతమంది తహసీల్దార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మగ్గుతున్నాయి. దీంతో కొంత మంది వాటిని ఆక్రమించుకుని పట్టాలు సైతం పొందుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ

అనకాపల్లి జిల్లాలో చేపట్టనున్న BARC ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రాజెక్టు కోసం భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అమరావతి, ఆగస్టు 20: అనకాపల్లి జిల్లాలో చేపట్టనున్న BARC ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రాజెక్టు కోసం భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అనకాపల్లిలో 4,950 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్కు ఫీజులను మినహాయిస్తూ సర్కార్ జీవో జారీ చేసింది. తొలి దశలో అచ్చుతాపురం, మునగపాక మండలాల్లోని 1,947.225 ఎకరాల భూములకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు వర్తించనుంది. అనంతరం మిగిలిన భూములకు కూడా దశలవారీగా ఈ రాయితీని రెవెన్యూ శాఖ వర్తింపజేయనుంది. అచ్చుతాపురం ప్రాంతంలో క్లీన్ ఎనర్జీ, అణు పరిశోధన, రేడియేషన్ సాంకేతికతపై పరిశోధనలు నిర్వహించే కేంద్రాన్ని BARC ఏర్పాటు చేయనుంది. దేశ రక్షణ, ఇంధనం, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో పరిశోధనల కోసం బీఏఆర్సీ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది. భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఫీజుల మినహాయింపుపై భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 285(1) నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయనున్న కొండా సురేఖ.. కూతురిని సమర్ధిస్తారా? అయ్యో పాపం.. ఫ్లోర్, లిఫ్ట్కి మధ్యలో ఇరుక్కుని

తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్లో వేలాది మంది ప్రైవేట్ ఆస్తుల యజమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి ఇళ్లు, స్థలాలు, అపార్ట్మెంట్లు ఉన్నట్టుండి రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో చేరడంతో అమ్మకాలు, తనఖాలు, బదిలీలు నిలిచిపోయాయి. రెవెన్యూ రికార్డుల నవీకరణలో జరిగిన పరిపాలనా లోపాలే ఈ సంక్షోభానికి కారణమని తేలడంతో ప్రభుత్వం క్షమాపణలు చెప్పి, తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరోవైపు, ఈ అంశంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.అసలేంటి సెక్షన్ 22ఏ? పొరపాటు ఎలా జరిగింది?రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22ఏ ప్రకారం ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్ ఆస్తులు, అసైన్డ్ భూములు, భూదాన భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వ ఆస్తులను అక్రమ బదిలీల నుంచి కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం. అయితే, ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 'భూ భారతి' విధానంలోకి మారే క్రమంలో, 2026 ఏప్రిల్లో రెవెన్యూ శాఖ నిషేధిత ఆస్తుల జాబితాను నవీకరించింది. ఈ ప్రక్రియలో అధికారులు సరైన పరిశీలన లేకుండానే జాబితాలను సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపారు. ఒకే సర్వే నంబర్లో కొంత భాగం ప్రభుత్వ భూమి ఉంటే, ఆ సర్వే నంబర్లోని మొత్తం ప్రైవేట్ పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడంతో ఈ గందరగోళం తలెత్తింది.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాలతో పాటు, దశాబ్దాల

CM Revanth Reddy: తెలంగాణలో 22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల సమస్యలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో మంగళవారం సమావేశమైన సీఎం.. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రైవేట్ భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న వారి భూమి 22-ఏ జాబితాలో ఉన్నట్లయితే, రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లోగా ఆ భూమిని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. పరిశీలనలో అది ప్రైవేట్ భూమిగా తేలితే వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా 22-ఏ జాబితాలో ఉన్న భూములను జిల్లా కలెక్టర్లు క్షుణ్నంగా పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా సరైన జాబితాను రూపొందించాలని సీఎం ఆదేశించారు. నిషేధిత భూముల కొత్త జాబితాలో ఎలాంటి తప్పులు, పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భూముల వడపోత, తప్పుల సవరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ ఆస్తుల్లో ఒక్క అంగుళం భూమికి కూడా సమస్య రానివ్వబోమని స్పష్టం చేశారు. భూ యజమానుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 22-ఏ భూముల విషయంలో ప్రజలు దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని సీఎం సూచించారు. ఎలాంటి పుకార్లు, కట్టుకథలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అధికారిక ప్రక్రియ ద్వారానే భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

భారత రిజిస్ట్రేషన్ చట్టం–1908లోని సెక్షన్ 22A కింద ప్రజా ప్రయోజనాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు సంబంధించిన కొన్ని రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్ను ప్రభుత్వం నిలిపివేయవచ్చు. ఈ నిబంధన ఆధారంగా రిజిస్ట్రేషన్ శాఖ ప్రొబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ (PPL)ను నిర్వహిస్తుంది. సాధారణంగా దీనినే 22A నిషేధిత జాబితాగా వ్యవహరిస్తారు. ఈ జాబితాలో ఉన్న ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ను సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో సాధారణంగా పూర్తి చేయలేరు. సిస్టమ్లో సంబంధిత సర్వే నంబర్ లేదా ఆస్తి వివరాలు నిషేధితంగా నమోదై ఉంటే విక్రయం, బదలాయింపు వంటి లావాదేవీలకు అడ్డంకి ఏర్పడుతుంది. 22A పరిధిలో ప్రధానంగా వివిధ రకాల ప్రభుత్వ లేదా పరిరక్షణ అవసరమున్న భూములు ఉంటాయి. వీటిలో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ ఆస్తులు, వక్ఫ్ ఆస్తులు, భూ పరిమితి చట్టాల కింద మిగులు భూములు, కొన్ని ప్రభుత్వ ప్రయోజనాలకు సంబంధించిన భూములు, కోర్టు ఆదేశాల పరిధిలో ఉన్న ఆస్తులు వంటి కేటగిరీలు ఉన్నాయి. అంటే ప్రతి 22A భూమి తప్పనిసరిగా వివాదాస్పదమైనదని అర్థం కాదు. చట్టపరంగా నిషేధించాల్సిన కేటగిరీలో ఉన్న ఆస్తులను అక్రమంగా చేతులు మారకుండా అడ్డుకోవడమే ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఒక భూమికి సంబంధించిన పాత రికార్డులో ఉన్న వివరాలు, ప్రస్తుత యాజమాన్య హక్కులు, భూమి వర్గీకరణ మధ్య తేడాలు ఏర్పడితే.. చట్టబద్ధమైన ప్రైవేట్ ఆస్తి కూడా నిషేధిత జాబితాలో కనిపించే పరిస్థితి ఏర్పడవచ్చు. ఒక ఆస్తి 22A నిషేధిత జాబితాలో నమోదైతే దాని యజమానికి మొదటి సమస్య రిజిస్ట్రేషన్ వద్ద ఎదురవుతుంది. భూమిని విక్రయించేందుకు కొనుగోలుదారుడితో ఒప్పందం చేసుకున్నా, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆస్తి నిషేధిత జాబితాలో ఉందని తేలితే డాక్యుమెంట్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఇప్పటికే అడ్వాన్స్ తీసుకున్నవారు, అమ్మకానికి ఒప్పందం చేసుకున్నవారు ఇబ్బందుల్లో పడుతున్నారు. ఆస్తిని విక్రయించలేకపోవడంతో అత్యవసర ఆర్థిక అవసరాలకు దాన్ని వినియోగించుకోవడం కష్టమవుతోంది. ఇదే సమయంలో బ్యాంకు

22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల అంశంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. ముఖ్యాంశాలు.. * రిజిస్ట్రేషన్ల కోసం ఆన్లైన్లో స్లాట్ తీసుకొన్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే, రెవెన్యూ అధికారులు 2 రోజుల్లో పరిశీలించి అది ప్రైవేటు భూమి అయితే రిజిస్ట్రేషన్ వెంటనే చేస్తారు. * జిల్లా కలెక్టర్లు 22-ఏ జాబితా భూములను క్షుణ్నంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి సరైన జాబితాను రూపొందిస్తారు. అందులో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని ఆదేశించాను. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించాను. * ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రైవేటు భూములకు సంబంధించి ఒక్క అంగుళానికి కూడా ఇబ్బంది రానివ్వం. * 22-ఏ భూముల విషయంలో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. ఎటువంటి పుకార్లు, కట్టు కథలను విశ్వసించవద్దు

CM Revanth Reddy : ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. 22ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల అంశంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. రిజిస్ట్రేషన్ల కోసం ఆన్లైన్లో స్లాట్ తీసుకొన్న వారి ఆస్తులు 22ఏ జాబితాలో ఉంటే, రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లో పరిశీలించి, అది ప్రైవేటు భూమి అయితే రిజిస్ట్రేషన్ వెంటనే చేయాలి.. జిల్లా కలెక్టర్లు 22ఏ జాబితా భూములను క్షుణ్ణంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి సరైన జాబితాను రూపొందించాలని.. అందులో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రైవేటు భూములకు సంబంధించి ఒక్క అంగుళం భూమికి కూడా ఇబ్బంది రానివ్వమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 22ఏ భూముల విషయంలో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని, ఎటువంటి పుకార్లు, కట్టు కథలను విశ్వసించవద్దని సీఎం రేవంత్ ప్రజలకు సూచించారు
తెలంగాణలో నిషేధిత22ఏ భూముల జాబితా వ్యవహారం హాట్ టాఫిక్గా మారింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రైవేటు భూములు నిషేదిత 22ఏ జాబితాలోకి చేరటం, వాటి రిజిస్ట్రేషన్లు నిలిచిపోవటంతో భూ యజమానులు, ప్లాట్ల యజమానులు, రియల్ ఎస్టేట్ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ వ్యవహారం కీలక కామెంట్స్ చేశారు. హైదరాబాద్లోని ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 22ఏ జాబితాలో చోటుచేసుకున్న లొసుగుల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంటే.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే దురుద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.22ఏ జాబితా అంశంపై ప్రభుత్వం త్వరలోనే సమగ్ర విచారణ చేపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఉన్నా సరే.. ఎంతటి స్థాయిలో ఉన్న వ్యక్తులైనా కఠిన చర్యలు తప్పవని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భూములను నిషేదిత జాబితాలో చేర్చే ప్రక్రియలో ఎక్కడ లోపాలు జరిగాయి..? ఎవరి ఆదేశాలతో మార్పులు చోటు చేసుకున్నాయి..? ఏ స్థాయిలో అధికారుల ప్రమేయం ఉంది..? అనే పూర్తి అంశాలు విచారణలో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయంలో కీలక బాధ్యతలు నిర్వహించిన కొందరు అధికారుల పాత్ర కూడా ఈ వ్యవహారం వెనుక ఉండి ఉండొచ్చునని తాను బలంగా అనుమానిస్తున్నట్లు కోమటిరెడ్డి వెల్లడించారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. కాగా, ప్రభుత్వ విచారణలో అధికారులు, రికార్డులు, భూముల వర్గీకరణ, డిజిటల్ డేటాలో జరిగిన మార్పులు వంటి అంశాలు పరిశీలించే అవకాశం ఉంది.రాష్ట్రంలో హాట్టాపిక్గా 22Aరెవెన్యూ నిబంధనల ప్రకారం కొన్ని రకాల భూములను నిషేధిత జాబితాలో చేర్చి వాటి రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు విధిస్తారు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. extend EV commercial vehicle age limit: దేశంలో గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయానికి రెడీ అయ్యింది. ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ ఫ్యూయల్ సీఎన్జీతో నడిచే కమర్షియల్ వెహికల్స్ లైఫ్ లిమిట్ ను మరో 5 ఏళ్లు పెంచాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర మోటార్ వెహికల్స్ రూల్స్ 1989కి సవరణలు చేస్తూ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ కీలక ముసాదాయిను రిలీజ్ చేసింది. దీని ద్వారా గ్రీన్ ఎనర్జీతో నడిచే వెహికల్స్ యజమానులకు పెద్దపీట వేయాలన్నలక్ష్యంతోనే సర్కార్ ఈ ప్రణాళికను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నేషనల్ పర్మిట్ వ్యవస్థలో కొన్ని రకాల కమర్షియ్ వెహికల్స్ కు ఉన్న 12,15ఏళ్ల గడువును .. ఈ కొత్త సవరణ ద్వారా 17,20 ఏళ్లకు పెంచనున్నారు. అయితే ఈ మినహాయింపు అన్నిరకాల వాణిజ్య వెహికల్స్ వర్తించదని కేవలం బ్యాటరీతో నడిచేవి, హైడ్రోజన్ అండ్ నేచురల్ గ్యాస్ ఆధారంగా నడిచే వెహికల్స్ కు మాత్రమే పరిమితం చేయనున్నట్లు స్పష్టం చేసింది. కమర్షియల్ రంగంలో క్లీన్ ఎనర్జీ వెహికల్స్ వినియోగాన్ని పెంచాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మార్పుల ద్వారా వెహికల్స్ నేషనల్ పర్మిట్ ప్రక్రియను మరింత ఈజీగా చేయడంతోపాటు ఆన్ లైన్ డాక్యుమెంటేషన్ ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దరఖాస్తుదారులు కోరుకుంటే నేషనల్ పర్మిట్ ఆథరైజేషన్ ను ఒకేసారీ 5ఏండ్ల వరకు ఎలక్ట్రానిక్ విధానంలో పొందే వెసులుబాటు కల్పిస్తున్నారు. దీనికోసం ఏడాదికి 16వేల 500 చొప్పున ఐదేళ్లకు 82వేల ఫీజు చెల్లించేలా నిర్ణయించారు. అలాగే వాహన్ పోర్టల్ వినియోగాన్ని మరింత విస్త్రుతం చేసి డీలర్లు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. 22A Dispute : తెలుగు రాష్ట్రాల్లో 22 ఏ ( నిషేధిత భూముల జాబితా) వివాదం రచ్చలేపుతోంది. లక్షలాది మంది రైతులు, ఆస్తి యజమానుల పాలిట శాపంగా మారింది సెక్షన్ 22ఏ. తమ కష్టార్జితంతో కొనుగోలు చేసి.. పక్కగా సేల్ డీడ్ ద్వారా చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రైవేట్ భూములు కూడా ఆకస్మాత్తుగా ఈ 22 ఏ జాబితాలో చేరడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ గందరగోళానికి ప్రధాన కారణం ప్రభుత్వ రికార్డుల ప్రక్షాళన విధానంలోని లోపమే అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. రెవెన్యూ రికార్డులను డిజిటలైజ్ చేసే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కేవలం బ్రిటిష్ కాలం పాత పత్రాలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంది. ఆ తర్వాత దశాబ్దాల పాటు జరిగిన చట్టబద్ధమైన క్రయవిక్రయాలను, యాజమాన్య బదిలీలను పూర్తిగా విస్మరించింది. ఫలితంగా ఏళ్ల తరబడి రైతుల చేతుల్లో ఉన్న లక్షల ఎకరాల వ్యవసాయ పట్టాభూములు రికార్డుల్లో రాత్రికి రాత్రే ప్రభుత్వ ఖాతాల్లోకి చేరిపోయాయి. ప్రభుత్వ సాంకేతిక తప్పిదం వల్ల ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న భూములపై క్రయవిక్రయాల హక్కులు కోల్పోయి యజమానులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీనిపై సెంటర్ ఫర్ లిబర్టీ అనలిస్ట్ నల్లమోతు చక్రవర్తి విశ్లేషించారు. రికార్డుల అప్ డేట్ లో భాగంగా జరిగిన ఈ చారిత్రక తప్పిదం వల్లే ఈ ప్రస్తుత గందరగోళానికి మూలకారణమని స్పష్టం చేశారు. కింది స్థాయిలోని లావాదేవీల చరిత్రను పరిగణలోనికి తీసుకోకుండా.. ఏకపక్షంగా సామాన్య భూములను 22ఏ జాబితాలో చేర్చడం వారి ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని నల్లమోతుల వివరించారు. ఈ అన్యాయంపై ముఖ్యంగా ఏపీలో బాధితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు

తెలంగాణలో 22A సెక్షన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల భూములను అడ్డగోలుగా నిషేధిత జాబితాలో చేరుస్తోందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆగస్టు 17న తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్లోని లక్షలాది ఆస్తులను రాత్రికి రాత్రి ఈ జాబితాలోకి చేర్చడం దారుణమని విమర్శించారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న సామాన్యుల ఆస్తులను కూడా 22A పరిధిలోకి తెచ్చి ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా 1999లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం రద్దయినప్పటికీ, తెలంగాణలో 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి దీనిని పూర్తిగా ఎత్తివేశారు. అయితే, ఇప్పుడు పాత సీలింగ్ పరిధిలోని భూములను మళ్లీ 22Aలో చేర్చి రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం ఏకపక్షమని హరీశ్ రావు పేర్కొన్నారు. శ్రీనగర్ కాలనీ వంటి ప్రాంతాల్లో 30 ఏళ్లుగా ఉన్న ఫ్లాట్లు, 20 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లను కూడా ఈ జాబితాలో చేర్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం చలాన్ డబ్బులు చెల్లించిన సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వ అనుమతి (NOC) పొంది బ్యాంక్ రుణాలు తీసుకున్న ఆస్తులు కూడా ఇప్పుడు 22A జాబితాలో ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. ఇదిలా ఉండగా, బంజారాహిల్స్ హౌసింగ్ సొసైటీతో పాటు ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు వంటి కీలక ప్రభుత్వ భూములు కూడా ఈ జాబితాలో ఉండటం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. రెవెన్యూ శాఖలో ఏ పని జరగాలన్నా 30% కమీషన్ ఇవ్వాల్సి వస్తోందని హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కూడా ఇదే 22A జాబితాలో ఉందని, తనకు సెగ తగిలితేనే ప్రభుత్వం స్పందిస్తుందని ఆయన విమర్శించారు. ఫలితంగా అవినీతి అక్రమార్కులకు ఈ సెక్షన్ ఒక ఆయుధంగా మారిందని, ప్రజల సొమ్మును ప్రభుత్వం నిలువునా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందని, దానిని ఆ జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం తెరవెనుక ప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి, తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.సోమవారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి నివాసానికే ఈ పరిస్థితి ఎదురైతే, ఇక సామాన్య ప్రజల గతి ఏమిటి?" అని ప్రశ్నించారు. అసలు ఏ ప్రాతిపదికన ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చారో విచారణ జరపాలని, ఆ జాబితాలో ఉన్న ఆస్తులు పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రావడం లేదని ఆయన విమర్శించారు

22ఏ నిషేధిత భూముల జాబితాలో ప్రైవేటు భూములు చేరుతున్న అంశంపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. 22ఏను అడ్డుపెట్టుకుని ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని స్పష్టం చేశారు. దరఖాస్తులను జాప్యం లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు.22ఏ జాబితాలో భూమి ఉందనే కారణంతోనే దరఖాస్తును తిరస్కరించవద్దని మంత్రి సూచించారు. అసలు ఆ భూమి నిషేధిత జాబితాలోకి ఎలా వచ్చిందో పరిశీలించాలని చెప్పారు. సంబంధిత రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిజమైన భూ హక్కుదారులకు న్యాయం చేస్తూనే ప్రభుత్వ భూములను కాపాడాలని సూచించారు.నిషేధిత భూముల అంశంపై రాష్ట్ర సచివాలయంలో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సబ్ రిజిస్ట్రార్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులు, ఫిర్యాదులపై అధికారులను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.భూ సమస్యలపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు త్వరలో టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. 22ఏ భూముల విషయంలో నిబంధనల పేరుతో ప్రజలకు అనవసర ఇబ్బందులు కలిగించకుండా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు
తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితాలో ప్రైవేటు ఆస్తులు, హక్కులు ఉన్నపట్టా భూములు చేరడం వల్ల వేలాది మంది భూ యజమానులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమ పేర్లతో స్పష్టమైన చట్టబద్ధమైన హక్కులు, పత్రాలు ఉన్నప్పటికీ, అత్యవసర సమయాల్లో భూములను అమ్మాలన్నా లేదా బ్యాంకు రుణాలు పొందేందుకు తాకట్టు పెట్టాలన్నా రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో యజమానులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ సరిహద్దు జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి ప్రాంతాల్లో ఈ రకమైన భూములు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి.గతంలో ప్రభుత్వ భూములు అక్రమంగా ఆక్రమణలకు గురై లావాదేవీలు జరిగిన ఘటనలను పరిశీలించిన హైకోర్టు, 2015, 2024లలో నిషేధిత భూముల జాబితాను సమగ్రంగా నవీకరించాలని రవాణా, రెవెన్యూ శాఖలను ఆదేశించింది. దీని ప్రకారం 2025 చివర్లో రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయి రికార్డులను సమకూర్చి కొత్త జాబితాలను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ప్రక్రియలో ప్రాథమిక మూల సర్వే నంబర్ల ఆధారంగా డేటాను సేకరించడం వల్ల సమస్య జటిలంగా మారింది. ప్రభుత్వ వేలం ద్వారా, జీవోల ద్వారా క్రమబద్ధీకరణ పొందిన స్థలాలు, ప్లాట్లు రికార్డుల్లో ప్రైవేటు ఆస్తులుగా ఉన్నప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో వాటి మూల సర్వే నంబర్లు ఇప్పటికీ ప్రభుత్వ భూములుగానే కొనసాగుతున్నాయి. ఫలితంగా మూల సర్వే నంబర్ను 22ఏలో చేర్చగానే అందులో ఉన్న సబ్-డివిజన్లు, లేఅవుట్లు, ప్రైవేటు ప్లాట్లు కూడా ఆటోమేటిక్గా నిషేధిత పరిధిలోకి వెళ్లిపోతున్నాయి.దీనికితోడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ , ఇనాం, అసైన్డ్, భూదాన్ భూములు, చెరువు శిఖం, బఫర్ జోన్లకు సంబంధించిన సర్వే నంబర్లలో ప్రైవేటు పట్టా భూములు కలిసిపోవడం మరొక కారణం. కోర్టు ఉత్తర్వులతో రిజిస్ట్రేషన్లు పొందిన ఆస్తులు సైతం రెవెన్యూ రికార్డుల్లో సవరణలు జరగకపోవడం వల్ల ఇప్పటికీ నిషేధిత జాబితాలోనే దర్శనమిస్తున్నాయి. ప్రైవేటు ఆస్తుల యజమానులకు ఊరట కలిగించేందుకు జిల్లాల వారీగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలు సంయుక్తంగా గ్రామాల స్థాయిలో జాబితాలను సరూర్నగర్, ఉప్పల్

సొంత ఇల్లు లేదా స్థలానికి సంబంధించిన ఒరిజినల్ సేల్ డీడ్ (రిజిస్ట్రేషన్ కాగితాలు) పొరపాటున పోగొట్టుకోవడం లేదా ప్రమాదవశాత్తు పాడైపోవడం ఆస్తిదారులకు తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించే అంశమే. అయితే, ఒరిజినల్ డాక్యుమెంట్లు చేజారినంత మాత్రాన ఆస్తిపై యాజమాన్య హక్కులు కోల్పోతారని భావించడం పూర్తిగా అపోహ మాత్రమే. భారతీయ రిజిస్ట్రేషన్ చట్టం-1908 ప్రకారం సరైన న్యాయపరమైన ప్రక్రియను పాటించడం ద్వారా మీ హక్కులను సమర్థవంతంగా పరిరక్షించుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దస్తావేజులు పోయినట్లు గుర్తించిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నాన్-ట్రేసబుల్ సర్టిఫికేట్ పొందాలి. భవిష్యత్తులో ఈ పత్రాలు దుర్వినియోగం కాకుండా, ఫోర్జరీకి గురికాకుండా ఇది ప్రాథమిక చట్టపరమైన రక్షణగా పనిచేస్తుంది. ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో పాటు స్థానిక ప్రాంతీయ (తెలుగు) దినపత్రికలో ఆస్తి వివరాలు, సర్వే నంబర్లు, పోయిన పత్రాల సమాచారాన్ని పేర్కొంటూ పబ్లిక్ నోటీసు ఇవ్వాలి. 15-21 రోజుల గడువులో ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే ఆ పత్రికా నోటీసు కాపీ స్పష్టమైన ఆధారంగా ఉపయోగపడుతుంది. పత్రాలు పోయిన తీరును వివరిస్తూ నోటరీ సమక్షంలో అఫిడవిట్ రాయించుకోవాలి. భవిష్యత్తులో ఆస్తి అమ్మకం సమయంలో కొనుగోలుదారులు లేదా బ్యాంకుల సందేహాలను నివృత్తి చేయడానికి ఇండెమ్నిటీ బాండ్ ఎంతో దోహదపడుతుంది. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సర్టిఫైడ్ కాపీ రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 57 ప్రకారం ప్రభుత్వ రికార్డులలో ప్రతి ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రతి శాశ్వతంగా భద్రపరుస్తారు. కాబట్టి సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని చట్టబద్ధమైన సర్టిఫైడ్ కాపీ (ధ్రువీకృత నకలు) పొందవచ్చు. ఇది ఒరిజినల్ పత్రంతో సమానమైన న్యాయపరమైన విలువను కలిగి ఉంటుంది. బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే పరిహారం తప్పనిసరి ఒకవేళ హోమ్ లోన్ కోసం బ్యాంకులో కుదువబెట్టిన ఒరిజినల్ పత్రాలను బ్యాంకే పోగొడితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం సదరు బ్యాంకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. బాధితుడికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు సొంత ఖర్చులతో

Telangana Govt : తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. నిషేధిత జాబితాలో ఉన్న భూములపై సమగ్ర పరిశీలన చేసిన తరువాత.. అర్హత ఉన్న వాటిని జాబితా నుంచి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను 45 రోజుల్లో పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 93 లక్షల ఎకరాల భూములు 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో సుమారు 66 లక్షల ఎకరాలు అటవీ భూములు, 24 లక్షల ఎకరాలు అసైన్డ్ భూములతోపాటు దేవాదాయ తదితర కేటగిరీల భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు.. కొన్ని ప్రైవేటు భూములు కూడా 22ఏ జాబితాలోకి వెళ్లడంతో వాటి యజమానులు ఏళ్లుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే రికార్డుల్లో జరిగిన పొరపాట్లు, గతంలో చేపట్టిన సర్వేల్లో తలెత్తిన సమస్యల కారణంగా ఇలా జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. 22ఏ జాబితాలో భూములు ఉండటంతో వాటిని విక్రయించలేక, రిజిస్ట్రేషన్లు చేసుకోలేక కొందరు భూ యజమానులు అష్టకష్టాలు పడుతున్నారు. బ్యాంకు రుణాలు పొందడంలోనూ వారికి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్హత ఉన్న భూములను గుర్తించి నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో.. ప్రత్యేకంగా హైదరాబాద్ పరిసర జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లో 22ఏ భూములపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాలని నిర్ణయించినట్లు తెలిసింది. 45 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసి అర్హులైన భూ యజమానులకు ఊరట కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. How To Start Railway Station Business: సొంత బిజినెస్ ప్రారంభించాలని ఈ కాలంలో చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే ప్రైవేటు జాబ్లు ఎప్పుడు ఉంటాయో? ఎప్పుడు ఊడతాయో కూడా తెలీదు. అయితే, మీరు కూడా బిజినెస్ రైల్వేస్టేషన్లో ప్రారంభించాలనుకుంటున్నారా? ప్రక్రియ ఏంటో తెలీదా? రైల్వే ప్లాట్ఫామ్పై వ్యాపారం ఎలా స్టార్ట్ చేయాలి? ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది తెలుసా? రైల్వేస్టేషన్లో వ్యాపారం ప్రారంభించడం.. రైల్వేస్టేషన్ ప్లాట్ఫామ్పై చిన్న షాపు సులభంగా ఓపెప్ చేయడం సులభమే. దీనికి టెండర్ ప్రక్రియ ఉంటుంది. ముందుగా రైల్వేస్టేషన్ అధికారుల పర్మిషన్ కూడా అవసరం. ఈ టెండర్ ప్రక్రియ అనేది ఐఆర్సీటీసీ ఆధారంగా జరుగుతుంది. విజయవంతంగా టెండర్ పూర్తి చేసిన వారికి లైసెన్స్ ఇస్తారు. రైల్వే రూల్స్ ప్రకారం వ్యాపారం ప్రారంభించవచ్చు. రైల్వేస్టేషన్ సంబంధిత అధికారులు టెండర్ విధానం ద్వారా ఈ దుకాణాలు ప్రారంభించవచ్చు. ఐఆర్సీటీసీ నిర్ణీత సమయాల్లో టెండర్లకు ఆహ్వానిస్తుంది. ఎప్పటికప్పుడు టెండర్స్ ఉన్నాయా? లేదా? చెక్ చేసుకోవాలి. ఆ స్టేషన్, మీకు ఆ టెండర్ సెట్ అవుతుందా? చెక్ చేసుకుని ఆ తర్వాత అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. టెండర్ లిస్ట్.. రైల్వే స్టేషన్లో షాప్ సరైన ప్రదేశంలో ఉందా? లేదా? లొకేషన్ చెక్ చేయండి. దీంతోపాటు దుకాణం సైజు, బిజినెస్ యాక్టివిటీకి పర్మిషన్, లైసెన్స్ గడువు, సెక్యూరిటీ డిపాజిట్, బిడ్డింగ్ డెడ్లైన్ కూడా చెక్ చేసుకోండి. మీ వద్ద ఈ టెండర్కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఉండాలి. సాధారణంగా రైల్వేకు సంబంధించిన టెండర్స్ ఇండియన్ రైల్వేస్ ఇప్రోక్యూర్మెంట్ సిస్టమ్ (IREPS) పోర్టల్ ద్వారానే జరుగుతాయి. ఈ ఆన్లైన్ బిడ్డింగ్ ప్రక్రియకు డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పంటల బీమా పోర్టల్స్ గత వారం రోజులుగా మొరాయిస్తున్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో నమోదు చేసుకోవటానికి రాష్ట్రంలోని వరి రైతులు ప్రయత్నిస్తుండగా, పోర్టల్స్ ఓపెన్ కావట్లేదు. నేషనల్ క్రాప్ ఇన్యూరెన్స్ పోర్టల్, పీఎంఎ్ఫబీవై పోర్టల్.. ఏదీ ఓపెన్ కావట్లేదని రైతులు వాపోతున్నారు. అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పంటల బీమా పోర్టల్స్ గత వారం రోజులుగా మొరాయిస్తున్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో నమోదు చేసుకోవటానికి రాష్ట్రంలోని వరి రైతులు ప్రయత్నిస్తుండగా, పోర్టల్స్ ఓపెన్ కావట్లేదు. నేషనల్ క్రాప్ ఇన్యూరెన్స్ పోర్టల్, పీఎంఎఫ్బీవై పోర్టల్.. ఏదీ ఓపెన్ కావట్లేదని రైతులు వాపోతున్నారు. వరి రైతులకు ఈ నెల 15వ తేదీతో బీమా గడువు ముస్తుండగా, పోర్టల్స్ మొరాయించడంతో బీమా చేసుకోలేకపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో రైతులు ముందుగా స్వీయ ధ్రువీకరణ పత్రం (సెల్ఫ్ డిక్లరేషన్) ఇచ్చి, బీమా ప్రీమియం చెల్లించవచ్చని వ్యవసాయ శాఖ చెప్తోంది. కానీ స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని కూడా బీమా పోర్టల్స్లోనే అప్లోడ్ చేయాలి. పోర్టల్స్ ఓపెన్ కావట్లేదని రైతులు వాపోతున్నారు. ఈ-క్రాప్ చేయించకోకపోయినా.. స్వీయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని చెప్తున్న అధికారులు.. బీమా పోర్టల్స్ ఓపెన్ కాకపోవడంపై స్పందించడం లేదని రైతులు అంటున్నారు. ఇప్పటికే వరికి మినహా ఇతర ఖరీఫ్ పంటలకు గడువు ముగిసిపోయింది. వరికి మాత్రం మరో మూడు రోజులే గడువు ఉంది. వాస్తవంగా దేశవ్యాప్తంగా ఈ పోర్టల్స్ స్తంభించాయి. దీంతో బీమా పోర్టల్స్ ఓపెన్ అయ్యేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, బీమా గడువు పెంచాలని వరి సాగుదారులు కోరుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం

Vehicle RC card : వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) కార్డుల్లో యజమాని ఫొటో కనిపించకుండా పోయింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, పాత వాహనాల బదిలీ, యాజమాన్య మార్పు వంటి సేవల్లో గతంలో వాహన యజమాని ఫొటోను తప్పనిసరిగా నమోదు చేసేవారు. ఇప్పుడు కొత్తగా జారీ అవుతున్న స్మార్ట్ కార్డుల్లో మాత్రం చిరునామా, వాహన వివరాలు మాత్రమే ఉండటంతో వాహనదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 ఏళ్ల క్రితమే వాహన యజమాని ఫొటో గుర్తింపు విధానం అమల్లోకి వచ్చింది. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో యజమాని డిజిటల్ ఫొటో, సంతకాన్ని రవాణాశాఖ అధికారులు నమోదు చేసేవారు. వాహనం విక్రయం లేదా యాజమాన్య బదిలీ సమయంలో సంబంధిత వ్యక్తి వివరాలను ధ్రువీకరించేందుకు ఈ ఫొటో గుర్తింపు ఉపయోగపడేది. వాహనాన్ని ఒకరి నుంచి మరొకరికి అక్రమంగా బదిలీ చేయకుండా నియంత్రించేందుకు కూడా ఇది దోహదపడుతుందని అధికారులు భావించేవారు. దేశవ్యాప్తంగా వాహన రిజిస్ట్రేషన్, యాజమాన్య మార్పు వంటి సేవలను ఒకే విధానంలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ‘వాహన్’ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్సీ స్మార్ట్ కార్డుల్లో యజమాని ఫొటోను ముద్రించే పద్ధతి తొలగిపోయింది. దీంతో ప్రస్తుతం వాహనదారులకు గతంలో మాదిరిగానే స్మార్ట్ కార్డులు అందుతున్నప్పటికీ.. వాటిపై యజమాని ఫొటో మాత్రం ఉండటం లేదు. పాత ఆర్సీ కార్డుల్లో ఫొటో ఉండగా, కొత్త కార్డుల్లో లేకపోవడంతో వాహనదారులు తేడాను గుర్తిస్తున్నారు. వాహన ఆర్సీల్లో యజమాని ఫొటో లేకపోవడంకు కారణం ‘వాహన్’ పోర్టల్ ఆధారంగా దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేయడమేనని తెలుస్తోంది. అయితే, ఫొటో గుర్తింపు తొలగింపుతో వాహన యాజమాన్య బదిలీల్లో మోసాలకు అవకాశం ఉందా? అనే సందేహాలు వాహనదారుల్లో వ్యక్తమవుతున్నాయి. సెకండ్ హ్యాండ్ వ్యక్తిగత, వాణిజ్య వాహనా ల విక్రయ సమయంలో విక్రేత, కొనుగోలుదారు ఆర్టీఏ అధికారి సమక్షంలో వివిధ పత్రాలపై సంత కాలు చేయాల్సి
తెలంగాణలో 22ఏ లేదా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న భూములు, ఆస్తుల విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. చట్టబద్ధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న సాంకేతిక, చట్టపరమైన సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కొత్తగా తమ ప్రభుత్వం ఎలాంటి భూములను నిషేధిత జాబితాలో చేర్చలేదని వెల్లడించారు. 22ఏ, పీఓబీ అంశంపై మంగళవారం సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు.. జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను జిల్లాల వారీగా పరిశీలించారు. అర్హులైన బాధితులకు వీలైనంత త్వరగా ఊరట కల్పించాలని అధికారులను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. భూముల రెగ్యులరైజేషన్కు సంబంధించిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లేఅవుట్ అనుమతులు సహా అన్ని రికార్డులను ఈనెల 14వ తేదీలోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.ఈ విధానం ద్వారా బోగస్ లేదా ఫోర్జరీ పత్రాలను గుర్తించడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకురావచ్చని మంత్రి చెప్పారు. పహానీలను కూడా సబ్ రిజిస్ట్రార్లకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నిషేధిత జాబితాలోని ఆస్తుల రిజిస్ట్రేషన్ దరఖాస్తులను సబ్ రిజిస్ట్రార్లు గుడ్డిగా తిరస్కరించకూడదని పొంగులేటి స్పష్టం చేశారు. ఏదైనా దరఖాస్తును తిరస్కరించాల్సిన పరిస్థితి ఉంటే కారణాలను పరిశీలించేందుకు 3 రోజుల సమయం తీసుకుని.. స్పష్టమైన వివరణ ఇవ్వాలని సూచించారు. ప్రతి కేసును విడివిడిగా పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని ఆదేశించారు.ఇకపై నిషేధిత జాబితాకు సంబంధించిన దరఖాస్తులను తహసీల్దార్లకు పంపకుండా నేరుగా జిల్లా కలెక్టర్లకు పంపించాలని మంత్రి పొంగులేటి నిర్ణయించారు. కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్ స్థాయిలోనే సంబంధిత వ్యవహారాలను సమన్వయం చేయాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్ల

నిషేధిత భూములపై ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని మాటిచ్చారు. హైదరాబాద్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): నిషేధిత భూములపై ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Telangana Minister Ponguleti Srinivas Reddy) వ్యాఖ్యానించారు. చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని మాటిచ్చారు. ఈరోజు (మంగళవారం) హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టర్లతో మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. కొత్తగా ఎలాంటి భూములను నిషేధిత జాబితాలో చేర్చలేదని స్పష్టం చేశారు. POB దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలి.. 22ఏ/POB దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. భూ రెగ్యులరైజేషన్కు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ నెల 14వ తేదీలోగా అన్ని డాక్యుమెంట్లను ఆన్లైన్లో పెట్టాలని దిశానిర్దేశం చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లకు చెక్ పెట్టేందుకే ఆన్లైన్ విధానం అమల్లోకి తీసుకువచ్చామని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ల విచక్షణాధికారాలకు చెక్ పెడుతున్నామని వెల్లడించారు. ఆన్లైన్లో ఉన్న వివరాల ఆధారంగానే రిజిస్ట్రేషన్లపై నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. POB దరఖాస్తులను నేరుగా కలెక్టర్లకు పంపాలి.. POB దరఖాస్తులను ఇక తహసీల్దార్లకు కాకుండా నేరుగా కలెక్టర్లకు పంపాలని మంత్రి పొంగులేటి సూచించారు. POB రిజిస్ట్రేషన్లను గుడ్డిగా తిరస్కరించొద్దని ఆదేశించారు. తిరస్కరణకు కారణాలు తెలిపేందుకు మూడు రోజుల సమయం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో రాజీ లేదని స్పష్టం చేశారు. అర్హులకు అన్యాయం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్లకు ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్గదర్శకాలు జారీ చేశారు. 'హర్ ఘర్ తిరంగా' అభియాన్లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి: బండి సంజయ్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు

ఆక్వా రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆక్వా రైతన్నలకు విద్యుత్ రాయితీ కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఆక్వా రైతులకు (Aqua Farmers) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) శుభవార్త తెలిపింది. ఆక్వా రైతన్నలకు విద్యుత్ రాయితీ కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్నదాతలకు యూనిట్ విద్యుత్ను రూ.1.50లకే అందించనుంది. ఈ మేరకు ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీపై ఈరోజు (మంగళవారం) ఎనర్జీ శాఖ జీవో ఆర్టీ నంబర్- 57 జారీ చేసింది. కొత్తగా ప్రకటించిన ఆక్వా జోన్లలోని అర్హత కలిగిన అన్ని ఆక్వా ఫారాలకు రూ.1.50 యూనిట్ రాయితీని ఏపీ సర్కార్ కల్పించనుంది. APSADA, CAA చట్టాల కింద రిజిస్టరైన అన్ని అర్హత కలిగిన ఆక్వా ఫారాలకు కూడా రూ.1.50 యూనిట్ విద్యుత్ అందించనుంది. సుమారు 6,500 రిజిస్టర్డ్ ఆక్వా ఫారాలకు ఈ రాయితీ వర్తించనుంది. భవిష్యత్తులో APSADA/CAA రిజిస్ట్రేషన్ పొందే అర్హత కలిగిన ఆక్వా ఫారాలకు కూడా రిజిస్ట్రేషన్ తేదీ నుంచి రాయితీ కల్పించనుంది. 2026 జూన్ 1వ తేదీ నుంచి రూ.1.50 యూనిట్ రాయితీ అమలు చేయనుంది. ఆక్వా ఉత్పత్తి వ్యయంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతన్నలకు ఊరట కలిగింది. ప్రపంచ ఆక్వా ఎగుమతుల మార్కెట్లో పోటీ ధర, నాణ్యతతో నిలదొక్కుకునేందుకు విద్యుత్ రాయితీ అందించనుంది. ఆక్వా రైతుల వివరాలను మత్స్యశాఖ DISCOMలకు అందించనుంది. మత్స్యశాఖ ప్రతిపాదనను పరిశీలించిన అనంతరం రాయితీ విస్తరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రౌడీలను, గంజాయి బ్యాచ్లను అణిచివేస్తాం.. సీఎం వార్నింగ్ గుడ్న్యూస్.. పొగాకు రైతులకు రూ.50 వేల వడ్డీలేని రుణం వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోంది.. మంత్రి టీజీ భరత్ ధ్వజం
ప్రజల్లో ఆరోగ్యం మీద అవగాహన కల్పించేందుకు చాలా మంది ఎన్నోరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వైజాగ్ రన్నర్స్ సొసైటీ కూడా మారథన్ నిర్వహించేందుకు తలపెట్టింది. ఇప్పటి వరకు నాలుగు సార్లు మారథాన్ నిర్వహించిన సొసైటీ ఇప్పుడు ఐదో ఎడిషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. సంధ్యా మెరైన్ వైజాగ్ మారథాన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవ్వగా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై రిజిస్ట్రేషన్ పోస్టర్ను ఆవిష్కరించారు. నవంబర్ 29వ తేదీన మారథాన్ జరుగుతుందని వైజాగ్ రన్నర్స్ సొసైటీ పేర్కొంది. మొత్తం నాలుగు విభాగాల్లో ఈ మారథాన్ జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. 32, 21, 10, 5 కిలోమీటర్ల విభాగాల్లో ఈ మారథాన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం కొందరికే కాకుండా ఈ మారథాన్ అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలని నిర్ణయించారు. మురికివాడల్లో ప్రజలు కూడా మారథాన్లో పాల్గొనేలా విస్తృత ప్రచారం చేయాలని పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఇలా చేస్తేనే మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తారని చెప్పారు.READ ALSO గుంటూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు.. రూ. 3 కోట్లతో ప్లాన్, ఎలక్ట్రికల్ వెహికల్స్కి పండగే!ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలన్నదే తమ ఉద్దేశమని మారథాన్ నిర్వాహకులు చెప్పారు. అప్పుడప్పుడు ఇలాంటి మారథాన్లు ఏర్పాటు చేస్తే ప్రాక్టీస్ కోసమైనా వ్యాయామం చేస్తారని, అది అలవాటుగా మారిపోతుందని నిర్వాహకులు చెబుతున్నారు. కనీసం రోజులో ఒక గంటపాటు అయినా శరీరానికి వ్యాయామం అవసరమని చెబుతున్నారు. పోటీలు నిర్వహించి ప్రైజ్మని ప్రకటిస్తే వీటిపై అవగాహన పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.ఈ మారథాన్లో గెలుపొందిన విజేతలకు ప్రైజ్మనీ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. విజేతలకు రూ. 12 లక్షల నగదు బహుమతులు అందించినున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సంధ్యా మెరైన్స్ లిమిటెడ్ డైరెక్టర్ అరుణ్ కొర్రగుంట, అపోలో హాస్పిటల్స్ ఆరిలోవ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణప్రసాద్, ఫైజర్ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సైట్ హెడ్ రవిచందర్ కట్టా, శ్రీకన్యా

Rajahmundry: రాజమండ్రిలో 29,880 మంది ఓటర్లకు బీఎల్ఓల నోటీసులు కమిషనర్! Rajahmundry: పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీలో సూపర్ వైజర్లు, బూత్ లెవల్ అధికారులు(బి.ఎల్.ఓ.లు) జాగ్రత్తగా వ్యవహరించాలని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్ నందు ఏఈఆర్ఓలు, బి.ఎల్.ఓ.లు, సూపర్వైజర్లకు డ్రాఫ్ట్ రోల్ తరువాత చేయు కార్యాచరణపై సోమవారం ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముసాయిదాకు ముందు కాలంలో, 2025 తుది ఓటర్ల జాబితాలోని ఓటర్లను 2002 ఓటర్ల జాబితాతో మ్యాప్ చేయడం జరిగిందని తెలిపారు. మ్యాపింగ్ కాని మరియు తార్కిక వ్యత్యాసాల వర్గం (Logical Discrepancies) కిందకు వచ్చే ఓటర్లు అర్బన్ పరిధిలో 29,880 మందిని గుర్తించటం జరిగిందన్నారు. వీరందరికీ ఇంటింటికి వెళ్లి బీఎల్ఓలు నోటీసులు ఇవ్వవలసి ఉంటుందన్నారు. అలాగే విచారణల కోసం వేర్వేరు షెడ్యూల్ తేదీలను నిర్ణయించామని తెలిపారు. నోటీసులను జారీ చేయడం, ఓటర్ల వ్యక్తిగత హాజరు కోసం విచారణలను షెడ్యూల్ చేయడం మరియు అవసరమైన పత్రాలను అందించడం గురించి వివరించారు. పలు సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, ఎమ్మార్వో రంజిత్ కుమార్, ఇతర ఏఈఆర్ఓలు, సూపర్ వైజర్లు, బీఎల్ఓలు పాల్గొన్నారు

రాష్ట్రంలో దాదాపు 73 లక్షల ఓట్లు గల్లంతు కానున్నాయా!? వీరిలో చనిపోయినవారు, రెండుచోట్ల ఓట్లు ఉన్నవారితోపాటు ఓటు హక్కు కోసం ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని వారూ... వీరిలో చనిపోయినవారు, రెండు చోట్ల ఓట్లున్న వారు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించనివారు కూడా.. 3,38,26,448 మంది ఓటర్లలో 2,64,73,616 మంది వివరాలు డిజిటైజ్.. ఇది మొత్తం ఓటర్లలో 78.26 శాతం 94.31 శాతంతో భువనగిరి టాప్.. హైదరాబాద్ లాస్ట్ రాజధానిలో ఏకంగా 20 లక్షల ఓట్లు ఏఎ్సడీ జాబితాలో 17న ముసాయిదా.. లిస్టులో పేరు లేకపోతే మళ్లీ చాన్స్ అప్పటికీ ఫారాలు, ఆధారాలు ఇవ్వకపోతే ఓటు ఔట్ హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దాదాపు 73 లక్షల ఓట్లు గల్లంతు కానున్నాయా!? వీరిలో చనిపోయినవారు, రెండుచోట్ల ఓట్లు ఉన్నవారితోపాటు ఓటు హక్కు కోసం ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని వారూ ఉన్నారా!? ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించకపోతే వారి ఓట్లు జాబితా నుంచి పోనున్నాయా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే సమాధానమే వస్తోంది! ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) ముగిసింది. ఎన్నికల ప్రధాన అధికారి సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. వాటి డిజిటైజేషన్ ప్రక్రియ 78.26 (2,64,73,616 మంది) శాతమే పూర్తయింది. మిగిలిన 73,52,832 మంది ఓటర్లకు సంబంధించిన వివరాలను నమోదు చేయలేదు. వీరిని ఏఎ్సడీ (ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్) జాబితాలో చేర్చారు. అంటే, చనిపోయిన వారు, రెండుచోట్ల ఓట్లు ఉన్నవారు, ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోనివారు ఉన్నారు. ఒక్క హైదరాబాద్ జిల్లా పరిధిలోనే దాదాపు 20 లక్షల మంది ఈ జాబితాలో ఉండడం గమనార్హం. జిల్లా పరిధిలో 27.89 లక్షల (58.89 శాతం) ఓటర్ల వివరాలు డిజిటలైజ్ చేశారు. 19.46 లక్షల (41.11 శాతం) ఏఎ్సడీ జాబితాలో చేర్చారు. అలాగే, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియలో యాదాద్రి భువనగిరి అగ్రస్థానంలో ఉంటే, హైదరాబాద్ చివర్లో ఉంది

జనన, మరణ ధ్రువపత్రాల జారీలో జాప్యాన్ని నివారించి, ఆ ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సిద్ధమవుతోంది. నగరవాసుల సౌకర్యార్థం 'సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్' (సీఆర్ఎస్) పేరుతో సరికొత్త ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీని ద్వారా ప్రజలు ఆన్లైన్లోనే జనన, మరణాలను సులువుగా నమోదు చేసుకుని, వేగంగా ధ్రువపత్రాలను పొందే వీలుంటుంది.జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఇటీవల అధికారులతో ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. జనన, మరణాల నమోదు, సకాలంలో ధ్రువపత్రాల జారీ అనేది జీహెచ్ఎంసీ ప్రాథమిక బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. రాబోయే కొత్త పోర్టల్ పనితీరుతో పాటు జనన, మరణాల నమోదు చట్టంపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ నూతన డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఇటీవల పార్లమెంట్ ఆమోదించి, రాష్ట్రపతి సంతకంతో అమల్లోకి వచ్చిన జనన, మరణాల నమోదు (సవరణ) చట్టం-2026 నేపథ్యంలో జీహెచ్ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. నూతన చట్టం ప్రకారం, జనన లేదా మరణాల నమోదులో జాప్యం జరిగితే కఠినమైన నిబంధనలు వర్తిస్తాయి.ఒకటి నుంచి రెండేళ్లలోపు జాప్యం జరిగితే జిల్లా మేజిస్ట్రేట్ లేదా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ నుంచి అనుమతి పొందడం తప్పనిసరి. ఒకవేళ రెండేళ్లు దాటితే మాత్రం ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నుంచి మాత్రమే ఉత్తర్వులు పొందాల్సి ఉంటుంది. ఈ కఠిన నిబంధనల దృష్ట్యా, పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సకాలంలో రిజిస్ట్రేషన్

ప్రపంచీకరణ పెరిగిన ఈ రోజుల్లో ఒక దేశం నుంచి మరో దేశానికి సమాచారం, సాంకేతికత, ఆస్తులతో పాటు ఆర్థిక వనరులు సులభంగా మారుతున్నాయి. విద్య, వైద్యం, విపత్తు సహాయం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలలో పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు (NGOలు) విదేశీ విరాళాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. భారత్లో కూడా అనేక సంస్థలు ఈ విదేశీ నిధులతో సామాజిక అభివృద్ధి పనులు చేపడుతున్నాయి. అయితే, విదేశాల నుంచి వచ్చే డబ్బు ఏ పనులకు ఖర్చు అవుతోంది? దానివల్ల దేశ భద్రతకు, ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఏమైనా ప్రమాదం ఉందా? అని చూడటం ప్రభుత్వాల బాధ్యత. అందుకే ఈ విదేశీ నిధులను క్రమబద్ధీకరించడానికి మన దేశంలో 'ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్' (FCRA) అమల్లో ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ' ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు 2026' ప్రవేశపెట్టడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ, రగడ జరుగుతోంది. ఎఫ్సీఆర్ఏ అనేది భారత్లోని వ్యక్తులు, సంస్థలు, ఎన్జీవోలు, ట్రస్టులు విదేశాల నుంచి విరాళాలు లేదా నిధులు స్వీకరించడాన్ని నియంత్రించే ఒక కేంద్ర చట్టం. దీనిని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. ఈ చట్టం ఎవరెవరు విదేశీ నిధులు తీసుకోవచ్చు, ఏ నిబంధనలు పాటించాలి, ఆ డబ్బును ఎలా ఖర్చు చేయాలో స్పష్టంగా చెబుతుంది. • పారదర్శకత: విదేశీ విరాళాలు పొందే ప్రతి సంస్థ ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి. నిర్దేశిత బ్యాంకు ఖాతా ద్వారానే డబ్బులు తీసుకోవాలి. • జవాబుదారీతనం: ప్రతి ఏటా వార్షిక ఆడిట్ రిపోర్టులను ఆన్లైన్లో సమర్పించాలి. ఎంత డబ్బు వచ్చింది, ఎవరు ఇచ్చారు, దేనికి ఖర్చు చేశారో పూర్తి వివరాలు వెల్లడించాలి. • సార్వభౌమాధికార రక్షణ: దేశ భద్రతకు, ప్రజాస్వామ్య ప్రక్రియలకు భంగం కలిగించేలా విదేశీ నిధులు వాడకుండా నిరోధించడం. • పరిమితులు: రాజకీయనాయకులు, ఎన్నికల అభ్యర్థులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, పత్రికా సంపాదకులు విదేశీ నిధులు తీసుకోకూడదు. ఎఫ్సీఆర్ఏ చట్టం

రాజధాని హైదరాబాద్లో ఇదీ పరిస్థితి మొత్తం ప్రభుత్వ స్థలాలు 21.74 లక్షల చదరపు గజాలు.. దాంట్లో సగానికిపైగా న్యాయపరమైన చిక్కుల్లోనే! వాటి సమీప ఇళ్ల యజమానులకు తిప్పలు నిషేధిత జాబితాలో పెట్టడంతో క్రయవిక్రయాలకు ఆటంకం 22ఏతో హడలిపోతున్న బాధితులు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి దృష్టి సారించిన కలెక్టర్.. వివరాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు ఆదేశం ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం హైదరాబాద్ సిటీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాలో దాదాపు 12 లక్షల చదరపు గజాల ప్రభుత్వ స్థలాలు కోర్టు కేసుల్లో ఉన్నాయి. మొత్తం ప్రభుత్వ భూమి 21.74 లక్షల చదరపు గజాల స్థలాలుండగా.. అందులో సగానికిపైగా న్యాయపరమైన వివాదాల్లోనే చిక్కుకోవటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ అంశంపై హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలా దృష్టి సారించారు. ‘కోర్టు కేసుల్లో ఎన్ని సర్కారు స్థలాలు ఉన్నాయి? రెవెన్యూ తరఫున కౌంటర్లు సరిగా దాఖలు చేస్తున్నారా? లేదా? వాటి తాజా పరిస్థితి ఏమిటి?’ తదితర అంశాలపై సమగ్ర వివరాలను 2-3 రోజుల్లో తనకు సమర్పించాలని రెవెన్యూ పరిధిలోని వివిధ విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో తహసీల్దార్లు, అధికారులు అప్రమత్తమయ్యారు. వివిధ కోర్టుల్లో 238 కేసులు హైదరాబాద్ జిల్లాలోని 16 మండలాల పరిధిలో 1139 ప్రభుత్వ ల్యాండ్ బ్యాంకు పార్సిళ్లు ఉన్నాయి (ఏదైనా ప్రాంతంలోని మొత్తం భూమిని ఒక పార్సిల్గా పరిగణిస్తారు). మొత్తం ప్రభుత్వ ల్యాండ్ పార్సిళ్లలో 21,74,479.68 చదరపు గజాల స్థలాలుండగా.. అందులో 169 ల్యాండ్ పార్సిళ్లలోని సుమారు 11,93,595.12 చదరపు గజాల ఖాళీ స్థలం కోర్టు కేసుల్లో ఉంది. ఇందులో షేక్పేట్ మండలంలో అత్యధికంగా 50 కేసులు ఉన్నాయి. ముషీరాబాద్లో 19, ఆసి్ఫనగర్లో 23, గోల్కొండలో 18, సైదాబాద్లో 16, మారెడ్పల్లిలో 16, ఖైరతాబాద్లో 16, నాంపల్లిలో 9, సికింద్రాబాద్లో 12, అమీర్పేట్లో 13, అంబర్పేట్లో 12, బహదూర్పురాలో 3, బండ్లగూడలో 9, చార్మినార్లో 3

తహసీల్దార్ నుంచి కలెక్టర్ దాకా గతంలో ఎన్వోసీలు జారీ చేసిన అధికారులు రికార్డుల్లో కనిపించని ఆ వివరాలు ఫోర్జరీ సంతకాలతోనూ ఎన్వోసీలు ప్రస్తుతం నిషేధిత జాబితాలోకి భూములు.. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితులు గత ప్రభుత్వ హయాంలో ఎక్కువగా ఈ తరహా ఎన్వోసీలు హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా (22ఏ)పై నెలకొన్న వివాదానికి నకిలీ ఎన్వోసీల వ్యవహారం కూడా సమస్యగా మారింది. గతంలో భూముల రిజిస్ట్రేషన్కు అనుమతించాలంటూ అధికారులు జారీ చేసిన నిరభ్యంతర పత్రాలు (ఎన్వోసీలు) రికార్డుల్లో ఉండకపోవడంతో.. ఆ భూములను ప్రస్తుతం నిషేధిత జాబితాలో చేర్చారు. అయితే అప్పట్లో ఎన్వోసీలు పొందిన బాధితులు మాత్రం వాటినే పట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఏవి నిజమైన ఎన్వోసీలో, ఏవి నకిలీవో తెలియక అధికారులు తలపట్టుకుంటున్నారు. ఉదాహరణకు.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మేడ్చల్ మండలం దబీర్పూర్ గ్రామంలో సర్వే నంబరు 67/ఏ, 67/ఏఏ పరిధిలో 10 ఎకరాల భూమిని 22ఏ జాబితా నుంచి తొలగించాలంటూ 2023 సెప్టెంబరు 13న అప్పటి కలెక్టర్ డి.అమోయ్కుమార్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి సిఫారసు చేశారు. కానీ, సిఫారసులకు సంబంధించిన ఫైలు మాత్రం కలెక్టరేట్లో లేదు. దీంతో 2025 డిసెంబరు 31న మేడ్చల్ జిల్లా అధికారులు తయారు చేసిన 22ఏ జాబితాలో ఈ సర్వే నంబరులో ఉన్న భూమిని కూడా చేర్చారు. ఒకవేళ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రిజిస్ట్రేషన్ శాఖ అప్పట్లో రిజిస్ట్రేషన్కు అనుమతించి ఉంటే ఆ భూములు ఇప్పుడు నిషేధిత జాబితాలో ఉండేవికావు. బాధితులు మాత్రం ‘కలెక్టర్ అనుమతించారు.. నిషేధిత జాబితా నుంచి తొలగించండి’ అంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ తరహా కేసులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా రాజధాని పరిధిలో ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఎవరి స్థాయిలో వారు సిఫారసులు.. జిల్లా కలెక్టర్, ఆర్డీవో, అదనపు కలెక్టర్, తహసీల్దార్.. ఇలా ఎవరి స్థాయిలో వారు, ఏదో ఒక