కాళేశ్వరం, ధరణి, మెడికల్ కాలేజీల్లో దోచుకున్నారు.. హరీష్ రావువ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి ఘాటు కౌంటర్
తెలంగాణ రాజకీయాల్లో 22ఏ నిషేధిత భూముల వ్యవహారం మరోసారి హీట్ పెంచింది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.కమీషన్లు, అవినీతి గురించి హరీశ్ రావు మాట్లాడటం చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్లు ఉంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీగా కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయిందని ఆరోపించారు. 22ఏ నిషేధిత భూముల వ్యవహారంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలని హరీష్ రావు డిమాండ్చేసిన నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్ష హోదాలో ఉండి పదేపదే అబద్ధాలు చెబుతూ ప్రజల్లో ఆందోళన రేకెత్తించడం తప్ప బీఆర్ఎస్ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు.కమీషన్లు, అవినీతి గురించి హరీశ్ రావు మాట్లాడుతుంటే బీఆర్ఎస్ నేతలు కూడా నవ్వుకుంటున్నారని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై ఆ పార్టీకి చెందిన నాయకులు, మరీ ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, కల్వకుంట్ల కవిత గతంలో చేసిన వ్యాఖ్యలను హరీశ్ రావు మర్చిపోవద్దని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో హరీశ్ రావు ఎలా సంపాదించారో, ఏ వ్యాపారం చేశారో, తక్కువ సమయంలో భారీగా ఆర్థికంగా ఎదగడానికి కారణమేంటో ప్రజలకు వివరించాలని పొంగులేటి ప్రశ్నించారు.కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి పోర్టల్, మెడికల్ కాలేజీల వరకు బీఆర్ఎస్ హయాంలో భారీ అవినీతి జరిగిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. తమ పాలనలో కమీషన్ల మీద పనులు జరిగాయని.. అదే విధానం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొనసాగుతుందని బీఆర్ఎస్ భావించడం కేవలం భ్రమేనని అన్నారు. మీ భ్రమను ప్రజలపై రుద్దకండి అంటూ హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలకు మంత్రి పొంగులేటి హితవు పలికారు. గతంలో అధికారంలో ఉండి పరిపాలనలో విఫలమైన బీఆర్ఎస్.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నిర్మాణాత్మకంగా వ్యవహరించడం