బిగ్ బాస్ ని వదిలి పెట్టను.. మళ్లీ వస్తానంటూ ఉప్పల్ బాలు శపథం.. కండలవీరుడికి, రైతు బిడ్డకు పడిన
బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్ శనివారం నాడు లాంచ్ అయింది. టీవీల్లో రాత్రి ప్రసారం అయ్యే ఈ ఎపిసోడ్ జియో హాట్ స్టార్లో ఆల్రెడీ వచ్చేసింది. ఈ ఫస్ట్ ఎపిసోడ్లో పది మంది కంటెస్టెంట్లను పిలిచారు. ఇందులో ఒక్కడికి మాత్రమే మూడు గ్రీన్స్ వచ్చాయి. షాలిని దామెరకి, సింగర్ ఝాన్సీకి రెండేసి గ్రీన్ ఓట్లు వచ్చాయి. ఇక వారిని హోల్డ్లో పెట్టారు. అభి సాంగర్, అంజలి, అర్జున్, శ్రీవాణి, దెబోరా, రన్నింగ్ రాజా అంటూ ఇలా కొంత మంది వచ్చారు. కానీ వారు ఏ మాత్రం జడ్జ్లను ఇంప్రెస్ చేయలేకపోయారు. అందుకే వారికి మూడు రెడ్ ఫ్లాగ్స్ చూపించి రిజెక్ట్ చేసేశారు.కరీంనగర్కు చెందిన షాలినీ ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తుందట. బిగ్ బాస్ కోసం మళ్లీ అక్కడి నుంచి ఇక్కడకు వచ్చిందట. గతంలో ఒక రిలేషన్ ఉండేదని, ఇద్దరికీ సెట్ కావడం లేదని పరస్పర అంగీకారంతోనే విడిపోయాం అని చెప్పింది. నీ ఫోన్ని మేం చెక్ చేయొచ్చా? అని బిందు అడుగుతుంది. సరే కానీ స్నాప్ చాట్ మాత్రం చూడొద్దు, ఎవరికైనా పర్సనల్ ఉంటుంది కదా.. నేను కూడా మీలానే మీ ఫోన్ చూస్తానంటే ఒప్పుకుంటారా? అని రివర్స్లో అడుగుతుంది. అవునా సరే అయితే మీ ఫోన్ను పగలగొట్టండి అని నవదీప్ అంటాడు. ఇక ఆమె ఆ ఫోన్ను పగలగొడుతుంది.వాష్ రూం క్లీన్ చేయడం నచ్చదు అని అప్లికేషన్లో ఉంది కదా.. ఇప్పుడు షూ క్లీన్ చేయండి అని టాస్క్ ఇస్తారు. షూని అయిష్టంగానే క్లీన్ చేస్తుంటుంది షాలిని. అంతలో ఇంకో కంటెస్టెంట్ అభి సాంగర్ను శ్రీముఖి పిలుస్తుంది. ఎంట్రీలోనే అతడ్ని రోస్ట్ చేసేస్తుంది శ్రీముఖి. 23 ఏళ్లు అని చెప్పడం, బిజినెస్ మెన్, ఫ్యాషన్ డిజైనర్ అని చెప్పడం ఇవన్నీ కూడా జడ్జ్లకు ఎక్కదు. సరే ఆ షాలినీ అవుట్ ఫిట్ ఎలా ఉంది.. ఆమె ఎలా ఉంది చెప్పు అని టాస్క్