
Samantha: ఏది ముఖ్యమో దానికేప్రాధాన్యం.. సమంతలో ఇంత మార్పా?
Samantha: ఏది ముఖ్యమో దానికే ప్రాధాన్యం.. సమంతలో ఇంత మార్పా?

Samantha: ఏది ముఖ్యమో దానికే ప్రాధాన్యం.. సమంతలో ఇంత మార్పా?

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Mandaadi Day 3 Collection: మండాడి వసూళ్ల జాతర.. సూరి- సుహాస్ల మూవీకి ఎన్ని కోట్లంటే?

హీరోయిన్ సమంత (Samantha) లేటెస్టుగా బేబీ బంప్తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Mandaadi | ‘మండాడి’కి పెరుగుతున్న ఆదరణ.. రెండో రోజు రెట్టింపైన టికెట్ బుకింగ్స్

నటి మంచు లక్ష్మి తాజాగా ముంబై లో జరిగిన ఓ ఈవెంట్లో ఇలా మోడ్రన్ డ్రెస్ లో పాల్గొని సందడి చేసింది. ఈ డ్రెస్ లో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Mandaadi Day 2 Collection: మండాడికి డీసెంట్ కలెక్షన్స్.. రెండో రోజూ సుహాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?

Samantha | ఒకప్పుడు నటన వదిలేయాలనుకున్నా.. ఇప్పుడు నా శాంతి, ఆనందమే ముఖ్యం: సమంత


Mahendragiri Varahi Movie Review: మహేంద్రగిరి వారాహి ట్రైలర్ బాగుండటం, సిద్ధూ జొన్నలగడ్డ ఈ సినిమాలో ఉన్నాడు అని తెలియడం, ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

Samantha: ఒక దశలో నటనను వదిలేయాలనుకున్నా.. సమంత సంచలన వ్యాఖ్యలు..

Bigg Boss 10 Telugu Day 4 Full Episode : మొదటి ఎలిమినేషన్ లో భాగంగా చరణ్, రామ్ ప్రసాద్ లో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని బిగ్ బాస్ చెప్పాడు.

Epic Movie Review: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా వచ్చిన బేబీ సెన్సేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

Mandaadi Movie Review: సూరి vs సుహాస్.. ‘మండాడి’ సినిమా మెప్పించిందా?

Mandaadi Review: సూరి, సుహాస్ నటించిన ‘మండాడి’ ఎలా ఉందంటే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫొటోలు ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంచు లక్ష్మి కూడా AIతో తన ఫోటోలను ఇలా 80s స్పెషల్ గా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Mandaadi Day 1 Collection: సూరి- సుహాస్ల మేజిక్.. సర్దార్ 2కి పోటీ, మండాడికి తొలిరోజు ఎన్ని కోట్లంటే?
Mandaadi Review in Telugu: మండాడి మూవీ రివ్యూ

MANDAADI Review: సముద్రంలో సూరి వర్సెస్ సుహాస్.. ‘మండాడి’ మూవీ ఎలా ఉందంటే?

Mandaadi Movie Review: మండాడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Mandaadi Movie Review: టాలీవుడ్ స్టార్ సుహాస్ తమిళ్ సినిమాలో మెయిన్ విలన్ చేస్తున్నాడు అని ప్రకటించిన దగ్గర్నుంచి ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.

Mandaadi Review: మండాడి’ మూవీ రివ్యూ.. సూరి, సుహాస్ స్పోర్ట్స్ డ్రామా ఎలా ఉంది..?
Mandaadi Twitter Review: ‘మండాడి’ ట్విట్టర్ రివ్యూ.. సుహాస్ విలనిజం ఎలా ఉంది?

Samantha | సమంత జీవితంలో కొత్త అధ్యాయం.. ‘తల్లి కావడం పూర్తిగా మార్చేస్తుంది’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు!

Mandaadi Twitter Review: మండాడి మూవీ ట్విట్టర్ రివ్యూ.. సూరీ,సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

I Love You Text Mesage to Woman | మహిళకు ‘ఐ లవ్ యు’ మెసేజ్ పంపిన రాపిడో రైడర్.. ఫిర్యాదు చేసుకోమని సవాల్

Mandaadi | సెన్సార్ పూర్తి చేసుకున్న సుహాస్ 'మండాడి'.. రేపే గ్రాండ్ రిలీజ్!

తాజాగా రష్మిక మందన్న తన టీమ్ గతంలో తీసిన పలు పాత క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Mandaadi First Review: సముద్రంలో స్పోర్ట్స్ యాక్షన్ మెప్పించిందా..?

Manchu Manoj | అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తీ?.. సర్దార్ 2 ప్రమోషన్స్లో మంచు మనోజ్!

Shubman Gill: 27వ ఏట అడుగుపెట్టిన గిల్.. వరల్డ్ రికార్డులు, డబుల్ సెంచరీల రారాజు గురించి ఈ నిజాలు తెలుసా?

Manchu Manoj | బాలయ్యకు విలన్గా మంచు మనోజ్.. ‘దాదా’లో ఇప్పటివరకు చూడని భయంకరమైన అవతారం!

Woman Held With 75 Litres Liquor | ట్రైన్ ఏసీ కోచ్లో.. 75 లీటర్ల మద్యంతో పట్టుబడిన మహిళ

Balka Suman | నిరుద్యోగులను నట్టేట ముంచి.. తన ఇంట్లో మూడు పదవులు దక్కించుకున్నారు.. మంత్రి వివేక్పై బాల్క సుమన్ ఫైర్

Womens Asia Cup 2026 : మహిళల ఆసియాకప్ 2026లో భాగంగా దుబాయ్ వేదికగా హాంగ్కాంగ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత ఓపెనర్ స్మృతి మంధాన (124 ; 64 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో చెలరేగింది. ఈ క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. దీంతో హాంగ్కాంగ్ ముందు 194 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. HUNDRED! 💯 Vice-Smriti Mandhana brings up her second T20I century 🥳 Updates ▶️ | #INDvHK — BCCI Women (@BCCIWomen) September 3, 2026 Rohit Sharma : మీటింగ్కు రాని అజిత్ అగార్కర్.. రోహిత్ శర్మ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక వ్యాఖ్యలు.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ (28; 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు తొలి వికెట్కు శుభారంభాన్ని అందించారు. 7.6 ఓవర్లలో 74 పరుగులు జోడించారు. వేగంగా ఆడే క్రమంలో షఫాలీ ఔటైంది. వన్డౌన్లో వచ్చిన ప్రతీకా రావల్ (10), రిచా ఘోష్ (11), హర్మన్ప్రీత్ కౌర్(10) విఫలమైనప్పటికి కూడా మరో ఎండ్ స్మృతి మంధాన తనదైన శైలిలో దూకుడుగా ఆడింది. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బౌండరీ వరద పారించింది. 57 బంతుల్లోనే సెంచరీ సాధించింది. టీ20ల్లో మంధానకు ఇది రెండో శతకం. సెంచరీ తరువాత కూడా స్మృతి దూకుడుగా ఆడింది. ఆఖరి ఓవర్లో రనౌట్ అయింది. స్మృతి రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. హాంగ్ కాంగ్ బౌలర్లలో మరీనా లాంప్లో రెండు వికెట్లు తీసింది. రుచిత వెంకటేష్, జోయిలీన్ కౌర్లు చెరో ఓ వికెట్ సాధించారు

ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టుకు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నారు. ఐచి-నగోయా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్కు భారత బృందాన్ని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. మొత్తం 768 మంది సభ్యులతో కూడిన భారత బృందంలో 503 మంది క్రీడాకారులు, 246 మంది అధికారులు, సహాయక సిబ్బంది, 19 మంది కంటింజెంట్ సిబ్బంది ఉన్నారు.ఆసియా గేమ్స్ సమయంలో రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు విశ్రాంతి ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్తో భారత్ వైట్బాల్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గంభీర్కు విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో లక్ష్మణ్ భారత పురుషుల జట్టు బాధ్యతలు చేపట్టనున్నారు.లక్ష్మణ్కు సునీల్ జోషి, హృషీకేశ్ కనిత్కర్, శుభదీప్ ఘోష్ సహాయకులుగా వ్యవహరిస్తారు. మహిళల జట్టుకు అమోల్ ముజుందార్ హెడ్ కోచ్గా వ్యవహరించనున్నారు.ఇటీవలే జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లోనూ లక్ష్మణ్ భారత జట్టుకు కోచ్గా వ్యవహరించారు. ఇంగ్లాండ్తో వైట్బాల్ సిరీస్ తర్వాత గంభీర్కు విశ్రాంతి ఇచ్చిన సమయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.ఆసియా గేమ్స్లో భారత పురుషుల, మహిళల జట్లు డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగనున్నాయి. 2022 హాంగ్జౌ ఆసియా గేమ్స్లో రెండు జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. అప్పుడు పురుషుల జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహించగా.. మహిళల జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యం వహించారు.మరోవైపు ఆసియా గేమ్స్లో క్రికెట్ జట్లకు వసతి ఏర్పాట్లపై ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో జపాన్ క్రికెట్ సంఘం సీఈవో నవోకి అలెక్స్ మియాజీ కీలక

న్యాయం కోసమే హైకమాండ్ను ఆశ్రయించానని కొండా సురేఖ వెల్లడి సీఎంవో నుంచే నేరుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫిర్యాదు బీసీ మహిళా నాయకురాలిననే టార్గెట్ చేస్తున్నారని ఆవేదన Konda Surekha : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. కొండా సురేఖపై వేటు పడింది. ఆమెను మంత్రివర్గం నుంచి రేవంత్ సర్కార్ బర్తరఫ్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ను ఆశ్రయిస్తూ తనకు ఎదురవుతున్న రాజకీయ, పరిపాలనా సమస్యలను వివరిస్తూ లేఖలో ఫిర్యాదు చేశారు. మంత్రి పదవి ఉన్నప్పటికీ తన అధికారాలను తగ్గిస్తున్నారని, కీలక నిర్ణయాలు సీఎంవో నుంచే నేరుగా తీసుకుంటున్నారని ఆమె లేఖలో ఆరోపించారు. తన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన నిర్ణయాల్లో కూడా తనను భాగస్వామ్యం చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు సమయంలో కూడా తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. అందులో నా ఫొటోను తొలగించారు : సమ్మక్క–సారలమ్మ ఆలయ నిధులను ఆర్అండ్బీకి బదిలీ చేసిన వ్యవహారంలోనూ తన అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వలేదని ఆమె లేఖలో పేర్కొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన ప్రభుత్వ ప్రకటనల్లో తన ఫొటోను తొలగించారనే విషయాన్ని కూడా ఆమె లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. Read Also : Konda Surekha : కొండా సురేఖ బర్తరఫ్.. హైకమాండ్ సంచలన నిర్ణయం మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో కూడా తనను అవమానించారని వాపోయారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి నిధుల విడుదలలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంపై వివక్ష చూపడమే కాకుండా కడియం శ్రీహరి తన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అంశాన్ని కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయంగా ఒంటరి చేయాలనే.. : అదేవిధంగా, వరంగల్లో కొండా కుటుంబాన్ని రాజకీయంగా ఒంటరి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. కొందరు నేతలకు రాజకీయంగా ప్రోత్సాహం అందిస్తున్నారని విమర్శించారు

బర్తరఫ్పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు నా కుమార్తె వ్యాఖ్యలకు నన్నెలా బాధ్యురాలిని చేస్తారు? మంత్రి పదవి నుంచి తొలగింపుపై రేవంత్కు సూటి ప్రశ్న నేను ఎమ్మెల్యే గా కొనసాగుతా.. నియోజకవర్గం ప్రజలకు సేవ చేస్తా Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తనను కేబినెట్ నుంచి తొలగించాలన్న సీఎం రేవంత్రెడ్డి నిర్ణయాన్ని కొండా సురేఖ తీవ్రంగా తప్పుబట్టారు. అసలు నిర్ణయం తీసుకునే ముందు కనీసం తన వివరణ తీసుకోవాల్సిందని అన్నారు. ముఖ్యంగా తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడాన్ని ఆమె సూటిగా ప్రశ్నించారు. మంత్రి పదవి నుంచి తొలగింపుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. కూతురు వ్యాఖ్యలకు తనను శిక్షించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజీనామా చేయమంటే నేనే చేసేదాన్ని : “రాజీనామా చేయమంటే నేనే చేసేదాన్ని.. నేను తప్పు చేసి ఉంటే బర్తరఫ్ చేసినా బాగుండేది. కానీ, ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తొలగించడం బాధాకరం” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి ఒక ఆభరణం మాత్రమేనని, గతంలోనూ పదవికి తన చేతులతోనే రాజీనామా చేసిన సందర్భం ఉందని కొండా సురేఖ గుర్తుచేశారు. తాను పార్టీని కానీ, ప్రభుత్వాన్ని కానీ విమర్శించలేదని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్లోనే పలువురు నేతలు పార్టీపై, అగ్రనేతలపై విమర్శలు చేసిన సందర్భాలను ప్రస్తావించారు. తన విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించారని విమర్శించారు. Read Also : Konda Surekha : పదవి ఉంది.. పవర్ లేదు! హైకమాండ్కు కొండా సురేఖ సంచలన లేఖ ఆ నేత వ్యాఖ్యలపై చర్యలేంటి? : మరోవైపు, పార్టీలో ఇతర నేతల వివాదాస్పద వ్యాఖ్యలపై అధిష్ఠానం తీసుకున్న చర్యలపై కూడా కొండా సురేఖ ప్రశ్నించారు. ప్రభుత్వ పనితీరుపైనా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు సంతోషంగా ఉన్నారా అనే విషయాన్ని

‘రోమాంచకం’ మూవీ రివ్యూ.. Romanchakam Movie Review 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సంచలన చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). తాను సమర్పకుడిగా వ్యవహరిస్తూ తమ భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్పై అన్నయ్య ప్రణవ్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం 'రోమాంచకం' (Romanchakam). ఈ మూవీతో వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యారు. 'మేమ్ ఫేమస్'తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas), '8 వసంతాలు' ఫేమ్ అనంతిక (Ananthika) ఇందులో జంటగా నటించారు. సినిమా ప్రకటన నుంచే మంచి హైప్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఆపై విడుదలైన పాటలతో యూత్కు కూడా చేరువయింది. అలాంటి ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ బుధవారం రాత్రి వేయగా గురువారం థియేటర్లకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఆడియన్స్ను మెప్పించిందా లేదా అన్నది రివ్యూలో చూద్దాం కథ విషయానికొస్తే.. అన్వేష్ (సుమంత్ ప్రభాస్) ఇంజినీరింగ్ పూర్తి చేసి తన నలుగురి ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అయితే ఎప్పటికైనా రోమాంచకం పేరుతో నేటి జెన్ జీ యూత్కు ఫ్లెక్సిబుల్గా ఉండే విధంగా డేటింగ్ యాప్ ని పెట్టాలని ఫ్రెండ్స్తో కలిసి ప్రయత్నాలు చేస్తాడు. అందు కోసం అమ్మాయిలను అర్ధం చేసుకోవాలని ఓ డేటింగ్ యాప్లో చెన్నైకి చెందిన అమ్మాయి మైథిలి (అనంతిక సనీల్ కుమార్)ని పరిచయం చేసుకొని ఆపై క్లోజ్ అవుతాడు. మైథిలీ పుట్టినరోజున ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెన్నై వెళ్లిన అన్వేష్కు ఊహించని షాక్ తగులుతుంది. మైథిలి అతడిని పూర్తిగా బ్లాక్ చేస్తుంది. అయితే కొంతకాలం తర్వాత మళ్లీ ఫోన్ చేసి హైదరాబాద్ వస్తానని చెబుతుంది. హైదరాబాద్ వచ్చిన మైథిలీని అన్వేష్ తన ఫ్రెండ్ ఫ్లాట్ తనది అని చెప్పి అందులో ఉంచి ఫ్రెండ్ను కలవడానికి వెళతాడు. అయితే.. కాసేపటి తర్వాత అన్వేష్ తిరిగి వచ్చేటప్పటికీ

అయోధ్యలోని రామమందిర పరిపాలన, నిర్వహణ బాధ్యతలను ఇకపై భారత వైమానిక దళ మాజీ అధికారి పర్యవేక్షించనున్నారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రామ్ మందిర్ మొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను నియమించింది. ట్రస్ట్ నిర్వహించిన సమావేశంలో అందరి అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జితేంద్ర మిశ్రాను 3 సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులో నియమించారు. రామ మందిరం సీఈఓగా జితేంద్ర మిశ్రా ఆలయ పరిపాలన, రోజువారీ కార్యకలాపాలను పూర్తిగా పర్యవేక్షిస్తారు. మందిరానికి వచ్చే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, వసతుల ఏర్పాటు ఆయన చూసుకుంటారు. అలాగే వివిధ విభాగాల బృందాల మధ్య సమన్వయం సాధించడం, ఆలయ ఆపరేషన్లకు సంబంధించిన పనులను నిర్వహించడం ఆయన బాధ్యతల్లో భాగం. భారత వైమానిక దళంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఈ కొత్త బాధ్యతలను సజావుగా నిర్వర్తించడానికి ఆయనకు ఎంతో ఉపయోగపడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. రామ్ మందిర్ సీఈఓ పదవికి లభించే ఖచ్చితమైన జీతం వివరాలను ట్రస్ట్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ పోస్టు కోసం దరఖాస్తులను ఆహ్వానించిన సమయంలోనే, ఎంపికైన అధికారి వేతనం, ఇతర భత్యాలు పరస్పర ఒప్పందం ప్రకారం నిర్ణయిస్తామని ట్రస్ట్ తెలిపింది. అందువల్ల జితేంద్ర మిశ్రా నెలవారీ జీతం ఎంత అనే విషయమై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. సీఈఓగా బాధ్యతలు చేపట్టిన జితేంద్ర మిశ్రాకు అయోధ్యలో నివసించడానికి అధికారిక నివాస సౌకర్యం లభిస్తుంది. అయోధ్యలోనే ఉంటూ ఆలయ రోజువారీ పనులు, పరిపాలనపై దృష్టి పెట్టడానికి ఈ వసతి సహాయపడుతుంది. అయితే ఆయనకు ఎలాంటి నివాసం కేటాయిస్తారు, దాని వివరాలు ఏంటి అనే విషయాలు ట్రస్ట్ ఇంకా బయటపెట్టలేదు. దీనితో పాటు జితేంద్ర మిశ్రాకు ప్రభుత్వ వాహనం, భద్రతా సిబ్బంది సదుపాయం కూడా ఉంటాయి. ప్రభుత్వ ఉన్నతాధికారికి లభించే విధంగానే ఆయనకు కొన్ని ప్రత్యేక వీఐపీ సౌకర్యాలు లభిస్తాయి. ఈ సౌకర్యాలకయ్యే ఖర్చునంతా రామ్ మందిర్

రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. భారత వాయుసేన (ఐఏఎఫ్), పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'ఖగంతక్-243' అనే లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబు (ఎల్ఆర్జీబీ) డ్రాప్ ట్రయల్ను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షతో సుదూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యం భారత వాయుసేనకు మరింత పెరిగింది.ఈ పరీక్ష నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ అందుకుందని, 'ఆత్మనిర్భర్ భారత్', 'మేకిన్ ఇండియా' స్ఫూర్తితో రక్షణ రంగంలో సరికొత్త శిఖరాలను అధిరోహించామని సెప్టెంబర్ 2న 'ఎక్స్' సోషల్ మీడియా వేదికగా ఐఏఎఫ్ ప్రకటించింది. ఇది భారత వాయుసేనతో పాటు దేశీయ రక్షణ పరిశ్రమకు కూడా ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొంది.ఖగంతక్-243 ప్రత్యేకతలునాగ్పూర్కు చెందిన జేఎస్ఆర్ డైనమిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) సంయుక్తంగా ఈ బాంబును అభివృద్ధి చేశాయి. 300 కిలోల తరగతికి చెందిన ఈ బాంబులో 125 కిలోల శక్తివంతమైన వార్హెడ్ ఉంటుంది. సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి పొఖ్రాన్లో దీనిని పరీక్షించారు.ఈ గ్లైడ్ బాంబును సుమారు 12 కిలోమీటర్ల ఎత్తు నుంచి జారవిడిచినప్పుడు, తనకున్న రెక్కల సహాయంతో గాలిలో తేలుతూ 180 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా కచ్చితత్వంతో ఛేదించగలదు. దీనివల్ల, శత్రుదేశాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పరిధిలోకి వెళ్లకుండానే మన ఫైటర్ జెట్లు లోతైన ప్రాంతాల్లోని రన్వేలు, కమాండ్ సెంటర్లు వంటి వ్యూహాత్మక టార్గెట్లపై దాడి చేయవచ్చు.భవిష్యత్తులో మిగ్-29కె, మిరాజ్-2000 వంటి ఇతర విమానాల్లోనూ దీనిని అనుసంధానించనున్నారు. ఇప్పటికే పరిమిత సంఖ్యలో వీటి ఉత్పత్తి కోసం బీఈఎల్కు

దేశవ్యాప్తంగా చేపట్టే ప్రతి జల సంరక్షణ పనిని ఒకే సమగ్ర ప్రణాళిక పరిధిలోకి తీసుకురావాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా చేపట్టే ప్రతి జల సంరక్షణ పనిని ఒకే సమగ్ర ప్రణాళిక పరిధిలోకి తీసుకురావాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన జల్ సంచయ్.. జన్ భాగీదారీ సదస్సులో ఆయన ప్రసంగించారు. నీటి సంరక్షణను కేవలం ఇంజినీరింగ్ కార్యక్రమంగా కాకుండా, ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. తాగునీరు, వ్యవసాయ స్థిరత్వం, గ్రామీణ జీవనోపాఽధి, పర్యావరణ పరిరక్షణకు జలభద్రతే అత్యంత కీలకమని పేర్కొన్నారు. వాన నీటి సంరక్షణకు ప్రతి ఇంట్లో సదుపాయం, ప్రతి గ్రామానికీ విశ్వసనీయమైన సామూహిక జలవనరు ఉండాలని సూచించారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ పథకాలతోపాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎ్సఆర్) నిధుల ద్వారా జలసంరక్షణ పనులు జరుగుతున్నాయని.. వీటి మధ్య సరైన సమన్వయం లేకపోతే ఆశించిన ఫలితాలు పొందలేమన్నారు. ప్రతి జలసంరక్షణ ఆస్తిని (చెక్డ్యామ్లు, చెరువులు తదితర) జియో ట్యాగింగ్ చేసి, ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించాలని ప్రతిపాదించారు. కల్యాణ లక్ష్మి దరఖాస్తులు వేగంగా పరిష్కరించండి ఉద్వాసన ఖాయం!.. కొండా సురేఖను పట్టించుకోని అధిష్ఠానం

Disha Salian Case : దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలిమాన్ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ సారంగ్ కొత్వాల్, జస్టిస్ రంజిత్ సిన్హా రాజా భోంస్లే ధర్మాసనం 44 పేజీల తీర్పును వెలువరించింది. కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకు కోర్టు అప్పగించింది. 2020 జూన్ 8న ముంబయిలోని మలాడ్లో ఓ భవనం 14వ అంతస్తు నుంచి దిశా సాలియన్ కిందపడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ తరువాత వారం రోజులకే సుశాంత్ సింగ్ రాజ్పుత్ తన ఇంట్లో మరణించడంతో ఈ రెండు ఘటనల మధ్య ఏదో సంబంధం ఉందంటూ తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే, దిశా సాలియన్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె తండ్రి సతీశ్ సాలియన్ గత ఏడాది బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానం ఉందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు.. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరారు. దిశా సాలియన్ మృతి కేసుపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోర్టు సూచించింది. దర్యాప్తులో తగిన ఆధారాలు లభించే వరకు ఎవరినీ నిందితుడిగా పరిగణించరాదని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సతీశ్ సాలియాన్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని.. గత ఆరేళ్లుగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని ప్రమాదవశాత్తు

ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) చైర్మన్గా మోహిత్ జైన్ ఎన్నికయ్యారు. బెన్నెట్ కోల్మన్ అండ్ కో లిమిటెడ్ (బీసీసీఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పబ్లిషింగ్), బోర్డు... న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) చైర్మన్గా మోహిత్ జైన్ ఎన్నికయ్యారు. బెన్నెట్ కోల్మన్ అండ్ కో లిమిటెడ్ (బీసీసీఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పబ్లిషింగ్), బోర్డు సభ్యుడిగా ఉన్న మోహిత్ జైన్ 2026-27 సంవత్సరానికి గాను ఏబీసీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 43 ఏళ్ల తర్వాత బీసీసీఎల్కు చెందిన ప్రతినిధి మరోసారి ఏబీసీ చైర్మన్ పదవిని చేపట్టినట్లయింది. ప్రింట్ మీడియా రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న మోహిత్ జైన్.. ప్రచురణ, వ్యాపార కార్యకలాపాలు, పరిశ్రమ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కెమికల్ ఇంజనీరింగ్తో పాటు ఎంబీఏ చదివిన జైన్.. 2021-22లో ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) అధ్యక్షుడిగా సేవలందించారు. రెండు దశాబ్దాలకు పైగా ఐఎన్ఎ్సతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రపంచ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ గ్లోబల్ సూపర్వైజరీ బోర్డులోనూ మోహిత్ జైన్ మూడేళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ దక్షిణాసియా విభాగం బోర్డు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కాగా, ఏబీసీ డిప్యూటీ చైర్మన్గా విక్రమ్ సఖుజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉక్రెయిన్పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

నటీనటులు : సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్కుమార్, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి ఏగుర్ల, సాయి సోహన్, ఉపేంద్ర లిమాయే తదితరులు దర్శకత్వం : వేణుగోపాల్ రెడ్డి సమర్పణ : సందీప్ రెడ్డి వంగా సంగీతం : వాసుకి వైభవ్ ఛాయాగ్రహణం : పవన్ పప్పుల కూర్పు : వేణుగోపాల్ రెడ్డి ‘మేమ్ ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వచ్చిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘రోమాంచకం’. నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు నవ్వించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. అన్వేష్ (సుమంత్ ప్రభాస్) ఒక స్టార్టప్ నడుపుతుంటాడు. అతడు చెన్నైకి చెందిన మైథిలి (అనంతిక సనీల్కుమార్)తో ప్రేమలో పడతాడు. అన్వేష్ను కలిసేందుకు మైథిలి హైదరాబాద్ వచ్చిన క్రమంలో అనూహ్య సమస్యలు మొదలవుతాయి. ఆమె రాకతో అన్వేష్, అతని స్నేహితుల బృందం ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అసలు మైథిలికి ఏమైంది? ఆ సమస్యల వలయం నుంచి అన్వేష్ అండ్ గ్యాంగ్ ఎలా బయటపడ్డారు? అన్నదే ఈ సినిమా కథ. ‘రోమాంచకం’ సినిమా పెద్దగా కథాబలంపై కాకుండా, సిట్యువేషనల్, సిల్లీ కామెడీపైనే ఎక్కువగా ఆధారపడి సాగుతుంది. చాలావరకు ‘జాతిరత్నాలు’ జోన్ను తలపించేలా సాగే ఈ చిత్రంలో వినోదానికి లోటు లేకుండా చూసుకున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఫన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ను బాగా నవ్విస్తాయి. క్లైమాక్స్ సీన్ను గందరగోళం (కన్ఫ్యూజన్) కామెడీతో డిజైన్ చేసిన విధానం సినిమాకు హైలైట్గా నిలిచింది. సుమంత్ ప్రభాస్ తన కేర్ఫ్రీ యువకుడి పాత్రలో ఎంతో ఈజ్తో నటించి మెప్పించాడు. ఫన్ సీన్లలో చలాకీగా కనిపిస్తూనే, హీరోయిన్ అనంతికతో మంచి కెమిస్ట్రీ పండించాడు. అనంతిక కూడా తన పాత్ర పరిధి మేరకు చక్కటి స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకుంది. ఇక హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్గా కనిపించిన వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి ఏగుర్ల, సాయి సోహన్ పాత్రలు