కేక్ లో చనిపోయిన బల్లి.. పుట్టినరోజు వేడుకల్లో ఏడుగురు చిన్నారులు సహా 11 మందికి అస్వస్థత
పుట్టినరోజు అంటే అందరూ ఎంతో ఆసక్తిగా చూసేది కేక్ కోసమే. అతిథుల నుంచి పుట్టినరోజు జరుపుకునే వారి వరకు, ప్రతి ఒక్కరూ ఎప్పుడు కట్ చేస్తారా? ఎప్పుడెప్పుడు తింటామా? అని ఆశగా ఎదురుచూస్తారు. కానీ, ఆ కేక్ కారణంగా ఆసుపత్రి పాలైతే? మహారాష్ట్రలోని నలసోపారాలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. చనిపోయిన బల్లి ఉన్న పుట్టినరోజు కేక్ను తిని 11 మంది అస్వస్థతకు గురయ్యారు. కేక్ తిన్న కొద్దిసేపటికే పుట్టినరోజుకు వచ్చిన ఏడుగురు చిన్నారులు, మరో నలుగురు మహిళలు కడుపు, ఛాతి నొప్పితో బాధపడ్డారు. దీంతో వారిని సమీపంలోని విజయలక్ష్మి ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుండగా.. వీరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.ఈ ఘటనతో బేకరీ ఉత్పత్తుల ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నలసోపొరా తాకిపాడ ప్రాంతంలోని నీలకంఠేశ్వర్ బిల్డింగులో ఓ 25 ఏళ్ల మహిళ శనివారం పుట్టిన రోజు జరుపుకుంది. సాయంత్రం 6 గంటల సమయంలో ఇరుగుపొరుగున ఉండే పిల్లలు, మహిళలు వచ్చారు. కేక్ కట్ చేసిన తర్వాత వారికి సర్వ్ చేశారు. తిన్న కొద్దిసేపటికే గుండెల్లో మంటలా అనిపించి వాంతులు చేసుకున్నారు. దీంతో హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే తులంజ్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితుల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆ కేకును తకిపాడలోని చాముండ కేక్ షాప్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిసింది. పోలీసులు దాని నమూనాలను స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం పంపారు. పరీక్ష నివేదికలు అందిన తర్వాత, అనుమానిత ఫుడ్ పాయిజనింగ్కు గల కచ్చితమైన కారణం నిర్ధారణ అవుతుందని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, రెండు రోజుల కిందట కళ్యాణిలోని గోద్రేజ్ హిల్ ప్రాంతంలోని బ్లింకిట్ స్టోర్ ఐస్ క్రీమ్ ఫ్రీజర్ లోపల ఎలుక