
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని మీర్జాగాలిబ్ వీధిలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో... కోల్కతా, ఆగస్టు 19: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని మీర్జాగాలిబ్ వీధిలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో నాలుగేళ్ల చిన్నారి, ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బంగ్లాదేశ్ పౌరులు కూడా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. సుమారు 80మందిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రతి అంతస్తులో నాలుగైదు హోటళ్లు నడుస్తున్నాయని.. గాలి, వెలుతురు లేని ఇరుకైన గదులే ప్రాణ నష్టానికి ప్రధాన కారణమని అగ్నిమాపక శాఖ మంత్రి కౌశిక్ చౌదరి పేర్కొన్నారు. ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు
కోల్కతాలో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ హోటల్లో ఏసీ పేలుడు కారణంగా మంటలు చెలరేగి చిన్నారి సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున 2 గంటల ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడటంతో అనేక మంది లోపల చిక్కుకున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో మృతిచెందినవారిని బంగ్లాదేశ్ పౌరులుగా గుర్తించారు. వీరు వైద్య చికిత్స కోసం కోల్కతాకు వచ్చినట్టు అధికారులు తెలిపారు.ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఎయిర్ కండిషనర్ పేలుడు కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. అయితే కచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. నగరంలో అత్యంత రద్దీగా, జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాలలో ఒకటైన న్యూ మార్కెట్ సమీపంలోని ఫ్రీ స్కూల్ స్ట్రీట్లో ఉన్న హోటల్లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విపత్తు నిర్వహణ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలలో పాలుపంచుకుంది.అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి, చివరకు మంటలను అదుపులోకి తెచ్చారు. ‘‘దట్టమైన పొగ కారణంగా అగ్నిమాపక సిబ్బంది మెట్లు ఎక్కి పై అంతస్తులకు చేరుకోవడం కష్టమైంది... తొమ్మిది మంది మరణించగా, ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని భయపడుతున్నాం’’ అని ఒక పోలీసు అధికారి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ‘‘లోపల చిక్కుకున్న వారిని రక్షించడం, మాదానికి గల కారణాలను కనుక్కోవడం మా ప్రాధాన్యత. మంటలను అదుపుచేశాం.. చల్లార్చే ప్రక్రియ కొనసాగుతోంది’’ అని ఆయన తెలిపారు.బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో హోటల్లో ఘోర అగ్నిప్రమాదం జరిగిన రెండు రోజుల్లోనే ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆగస్టు 17 తెల్లవారుజామున తారాపీఠ్లోని హోటల్ బిదేశినిలో జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం ఎనిమిది మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఐదంతస్తుల ఈ హోటల్లోని గ్రౌండ్ ఫ్లోర్లో తెల్లవారుజామున 4:30