
ట్రైన్ లోప్రయాణిస్తున్నారా? బెడ్ రోల్ గురించి ఈ రూల్స్ తెలుసా
Train Bed roll| ఇంటర్నెట్ డెస్క్: ఏసీ కోచ్లలో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ రైల్వే నిబంధనల ప్రకారం బెడ్రోల్ ఇస్తారు. ఇందులో దుప్పటి, బెడ్షీట్, దిండు, టవల్ ఉంటాయి. సాధారణంగా ఏసీ బోగీలో టికెట్ బుక్ చేసినప్పుడే టికెట్ ధరలోనే ఈ బెడ్రోల్ ఛార్జీలు ఇమిడి ఉంటాయి. తీరా ట్రైన్ ఎక్కాక బెడ్రోల్ సప్లయ్ చేయకపోతే ఏం చేయాలి? ఆర్ఏసీ ప్రయాణికులకు బెడ్రోల్ నిరాకరించొచ్చా? ఇంతకీ రైల్వే రూల్స్ ఏం చెప్తున్నాయ్..? భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. 1 ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ ప్రయాణికులందరికీ బెడ్రోల్ (Train Bed roll) ఇవ్వాల్సిందే. అదే స్లీపర్ క్లాస్లో ప్రయాణించే వారైతే డబ్బులు చెల్లించి (ఎంపిక చేసిన రైళ్లలో/అందుబాటును బట్టి) బెడ్రోల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏసీ బోగీలో మీకు బెడ్రోల్ అందకపోతే ప్రతిగా పరిహారం పొందే హక్కు ఉంటుంది. ఇందుకోసం ముందుగా బెడ్రోల్ కోసం కోచ్ అటెండెంట్ను సంప్రదించాలి. అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే రైల్వే కేటాయించిన నిర్ణీత గడువులోపు ఫిర్యాదు నమోదు చేయాలి. నిబంధనల ప్రకారం.. గమ్యస్థాన స్టేషన్ వద్ద రూ.20 రిఫండ్ పొందేందుకు అర్హత ఉంటుంది. చిన్న మొత్తమే అయినా ప్రయాణికుడిగా మీకున్న హక్కు కింద మీ నగదును పొందేందుకు రైల్వే నిబంధనలు వీలు కల్పిస్తున్నాయి. రైల్వే నిబంధనల ప్రకారం.. చైర్కార్ మినహా ఏసీ బోగీల్లో ప్రయాణించేవారందరికీ పూర్తి బెడ్రోల్ కిట్ (Train Bed roll)ను అందించాలి. అయితే, రిజర్వేషన్ అగనిస్ట్ క్యాన్సిలేషన్ (RAC) ప్రయాణికులకు బెడ్రోల్ నిరాకరిస్తున్నట్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో రైల్వే బోర్డు అన్ని జోన్లకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరలోనే బెడ్రోల్ ఛార్జీలు కూడా కలిసి ఉన్నందున కన్ఫామ్ టికెట్ ప్రయాణికులతో సమానంగా పూర్తి కిట్ను అందించాలని సూచించింది. ఈ ఆదేశాలను అన్ని జోన్లూ పాటించాలని తన ఆదేశాల్లో పేర్కొంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల