
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

హైదరాబాద్లో గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న మహిళా డ్రగ్ సప్లయర్ను ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి ఎల్బీనగర్ పరిసరాల్లో విక్రయిస్తున్న సునీతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన బంధువు లక్కన్తో కలిసి సునీత గంజాయి సిండికేట్ నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. లక్కన్ వద్ద కిలో గంజాయిని రూ.3,500కు కొనుగోలు చేస్తున్న సునీత.. ఎల్బీనగర్కు చెందిన మరో సప్లయర్ సత్యకు అదే గంజాయిని కిలో రూ.14 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఎల్బీనగర్లో గంజాయి డ్రాప్ చేసేందుకు సునీత వచ్చిన సమయంలో ఈగల్ టీమ్ పక్కా సమాచారంతో దాడి చేసి ఆమెను పట్టుకుంది. ఈ కేసులో సునీతతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్లోకి సరఫరా చేస్తున్న నెట్వర్క్పై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈగల్ టీమ్ విచారణలో గంజాయి సరఫరా చేసే ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి తక్కువ ధరకు గంజాయిని తీసుకొచ్చి.. హైదరాబాద్లోని డ్రగ్ సప్లయర్లకు అధిక ధరకు విక్రయిస్తూ సునీత, లక్కన్లు డబ్బులు సంపాదిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ముందుగా ఒడిస్సా నుండి ఆటోలో భద్రాచలం వరకు వచ్చి అక్కడి నుండి బస్సులో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ చేరుకుంటుంది.. అయితే.. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గంజాయి సరఫరా కోసం నిందితులు ప్రత్యేకంగా డ్రాప్ పాయింట్లను ఎంచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎల్బీనగర్లో సత్యకు గంజాయి అందించేందుకు సునీత వచ్చిన సమయంలో ఈగల్ టీమ్ పక్కా సమాచారంతో నిఘా పెట్టి పట్టుకుంది. ఆమెతో పాటు ఉన్న మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని

హ్యాష్ ఆయిల్ స్వాధీనం స్నాప్చాట్ ద్వారా దందా పెడ్లర్ నరేంద్ర శ్రీనివాస్ అరెస్ట్ Hash Oil Seized: రాజధాని హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ ముఠా కలకలం సృష్టించింది. ఎంతమందిని అరెస్టు చేస్తున్నా, కొత్త దారుల్లో ఈ దందాను విస్తరిస్తూ యువతను నాశనం చేసేందుకు పెడ్లర్లు యత్నిస్తున్నారు. తాజాగా పోలీసుల కన్నుగప్పి డ్రగ్స్ అమ్ముతున్న ఓ పాత నేరస్థుడిని ఈగల్ ఫోర్స్, అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ ద్వారా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి భారీ మొత్తంలో హ్యాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, అతడి నేర పథకాన్ని భగ్నం చేశారు. Rain Alert: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు స్నాప్చాట్ వేదికగా రూ. 2.5 లక్షల హ్యాష్ ఆయిల్ దందా: ప్రకాశం జిల్లాకు చెందిన బూర్సె నరేంద్ర శ్రీనివాస్ (30) డ్రైవర్గా పనిచేస్తూనే డ్రగ్స్ విక్రయాలకు అలవాటు పడ్డాడు. గతంలో ఎన్డీపీఎస్ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన అతడు, ఆగస్టు 2న ఒడిశా వెళ్లి రూ.9,000కు హ్యాష్ ఆయిల్(Hash Oil Seized) కొనుగోలు చేశాడు. పోలీసులకు చిక్కకుండా స్నాప్చాట్ ద్వారా సరఫరాదారుడితో మాట్లాడటంతో పాటు, ముందస్తు టికెట్ లేకుండా నడుస్తున్న బస్సుల్లో ప్రయాణించాడు. హైదరాబాద్లో 10 మి.లీటర్లను రూ. 1,200 చొప్పున అమ్మి లాభ పడాలని ప్లాన్ చేశాడు. పోలీసులు వేసిన పక్కా స్కెచ్: విశ్వసనీయ సమాచారంతో ఆగస్టు 8న విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ORR వద్ద పోలీసులు నిఘా పెట్టారు. బస్సు దిగిన వెంటనే శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని, రూ. 2.5 లక్షల విలువైన 200 మి.లీ (330 గ్రాములు) హ్యాష్ ఆయిల్ను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ముఖ్య సరఫరాదారు హరి కోసం గాలిస్తున్నారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లల అలవాట్లపై కన్నువేసి ఉంచాలని అధికారులు హెచ్చరించారు

హైదరాబాద్ శివారులో ఓ ల్యాబ్ను అద్దెకు తీసుకొని గుట్టుగా డ్రగ్స్ తయారు చేస్తున్న నాగ్పూర్కు చెందిన ఓ ముఠా గుట్టును యాదాద్రి భువనగరి జిల్లా పోలీసులు రట్టు చేశారు. రూ.54 కోట్ల విలువైన 27కిలోల డ్రగ్స్ స్వాధీనం కొండమడుగులో ల్యాబ్ అద్దెకు తీసుకొని మెఫిడ్రిన్ తయారీ నాగ్పూర్ ముఠా దందా.. నలుగురి అరెస్టు, నలుగురు పరార్ యాదాద్రి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ శివారులో ఓ ల్యాబ్ను అద్దెకు తీసుకొని గుట్టుగా డ్రగ్స్ తయారు చేస్తున్న నాగ్పూర్కు చెందిన ఓ ముఠా గుట్టును యాదాద్రి భువనగరి జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా నాగ్పూర్కు తరలిస్తున్న సుమారు రూ.54 కోట్ల విలువైన 27కిలోల మెఫిడ్రిన్ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఆదివారం విలేకరులకు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. డ్రగ్స్ రవాణాపై సమాచారంతో హైదరాబాద్ శివారు, బీబీనగర్ మండలం కొండమడుగు శివారులో పోలీసులు శనివారం సాయంత్రం తనిఖీలు చేశారు. ఓ కారులో 27కిలోల మెఫిడ్రిన్తోపాటు మెఫిడ్రిన్ తయారీకి ఉపయోగించే 40 కిలోల అసిటోన్ రసాయనాన్ని గుర్తించారు. కారులోని నిందితులను విచారించగా.. నాగ్పూర్కు చెందినముఠా కొండమడుగులో ఓ ల్యాబ్ను అద్దెకు తీసుకొని అక్కడ మెఫిడ్రిన్ తయారు చేసి రవాణా చేస్తున్నట్టు తేలింది. నాగ్పూర్కు చెందిన చేతన్ మధుకర్ మెష్రామ్.. వేటుకూరి ల్యాబ్స్ను అద్దెకు తీసుకున్నాడు. అసోంకు చెందిన ఎండీ అయూబ్ అలీ.. ల్యాబ్ ఏర్పాటు, ముడిపదార్థాల సమీకరణ, కెమి్స్టల ఏర్పాటు వంటి పనులు చేపట్టాడు. మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడిన వీరు ఈ నెల 5-7 తేదీల్లో ఆ ల్యాబ్లో మెఫిడ్రిన్ తయారు చేశారు. దానిని కారులో తరలిస్తుండగా పట్టుబడ్డారు. ఈ కేసులో 8 మంది పాత్రను గుర్తించిన పోలీసులు.. చేతన్ మధుకర్ మెష్రామ్ (49), అసోంకు చెందిన ముజమల్ హక్(25), నాగపూర్కు చెందిన ఆకాశ్ అశోక్ గవాండే(31), వేటుకూరి