
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

‘హుషార్ పిట్టలు’ టీంని చూస్తే ఎంతో గర్వంగా ఉంది.. విజయోత్సవ వేడుకలో ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్ష్, వాసవి గణేషన్ జంటగా రూపొందిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషార్ పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించిన ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఆగస్ట్ 15న భారీ ఎత్తున విడుదలైంది. గత నాలుగైదు రోజులుగా వేస్తున్న ప్రీమియర్లకు ఆల్రెడీ అద్భతమైన స్పందన వచ్చింది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ ఫుల్గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు సక్సెస్ మీట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు, బెక్కం వేణుగోపాల్ గార్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు మాట్లాడుతూ .. ‘‘హుషార్ పిట్టలు’ సినిమాని ఇప్పటి వరకు లక్ష మంది చూశారు. దాదాపు కోటి ముప్పై లక్షల గ్రాస్ వచ్చింది. కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ సినిమాని చూస్తారు. ప్రీమియర్ల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. టీజర్, ట్రైలర్ ద్వారా మంచి బజ్ ఏర్పడింది. సక్సెస్ అవ్వడంతో టీం అంతా సంతోషంగా ఉంది. చాలా ఏళ్లకి మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్కి బ్రేక్ వచ్చింది. ఇంకా పది, ఇరవై లక్షల మంది సినిమాని చూస్తే టీంకు లాభాలు వస్తాయి. కంటిన్యూగా పబ్లిసిటీ చేయండి. కోరుకున్న విజయం దక్కుతుంది. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ .. ‘ఎన్నో చిన్న చిత్రాలు తీసి సక్సెస్ను చూశాను. మళ్లీ ఈ ‘హుషార్ పిట్టలు’ మూవీని అందరితో కలిసి థియేటర్లో చూసి, ఆ సక్సెస్ను చూడటం ఆనందంగా అనిపించింది. అన్ని థియేటర్లు హౌస్ ఫుల్స్ అయ్యాయి. కంటెంట్ బాగుంటే కచ్చితంగా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలో స్టార్స్ లేకపోయినా.. స్టార్ హీరో