
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

ఒకప్పుడు బస్తర్ అడవులు అంటేనే ఎదురుకాల్పులు, తుపాకుల మోతలు, మావోయిస్టుల అంబూష్లే గుర్తుకువచ్చేవి. కానీ ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాయ్పూర్లోని దీన్దయాళ్ ఉపాధ్యాయ్ ఆడిటోరియంలో దృశ్యం పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు ఆకుపచ్చ యూనిఫామ్ వేసుకుని భుజాన తుపాకులు మోసిన మాజీ మహిళా మావోయిస్టులు, ఇప్పుడు బస్తర్ సంప్రదాయ చేనేత, కోసా సిల్క్ దుస్తులు ధరించి రంగురంగుల వెలుగుల్లో ర్యాంప్ వాక్ చేశారు. స్వదేశీ ఫ్యాషన్ షోలో భాగంగా జరిగిన ఈ ఈవెంట్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బస్తర్ లోని పునరావాస కేంద్రాల నుంచి వచ్చిన ఈ మహిళలకు రాయ్పూర్లో ప్రత్యేకంగా వారం రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. ముంబైకి చెందిన ఒక ప్రొఫెషనల్ మోడలింగ్ ట్రెయినర్ వీరికి ర్యాంప్పై ఎలా నడవాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, కాన్ఫిడెన్స్తో ఎలా ప్రెజెంట్ చేయాలనే విషయాలపై శిక్షణ ఇచ్చారు. పాల్గొన్న వారిలో మాద్వి మల్లే అనే మహిళ మాట్లాడుతూ.. ప్రారంభంలో భయపడ్డాననీ, కానీ ప్రాక్టీస్ చేశాక కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పారు. ఇంత పెద్ద క్రౌడ్ ముందు ర్యాంప్ వాక్ చేస్తానని కలలు కూడా కనలేదని పూనం దేవీ సంతోషం వ్యక్తం చేశారు. వీరిలో చాలామందికి రాయ్పూర్ నగరాన్ని సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ కూడా పాల్గొని వారితో ముచ్చటించారు. మావోయిస్టు బాట వీడిన వారికి లోంగుబాటు అనేది సివిలియన్ లైఫ్లోకి రావడానికి పడే మొదటి అడుగు మాత్రమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతా బలగాల ఆపరేషన్లతో పాటు లోంగుబాటు, పునరావాసం, వృత్తి విద్యా శిక్షణ, ఆర్థిక సహాయం అందిస్తూ వారిని సమాజంలోకి కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రాయ్పూర్ ఫ్యాషన్ షో అనేది ఈ రీ-ఇంటిగ్రేషన్ ప్రసారంలో ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రాణాలమీదికి తెచ్చే అడవి పోరాటాల నుంచి బయటపడి, తమ

Chhattisgarh | ఇంటర్నెట్ డెస్క్: సివిల్ సర్వీసెస్ అభ్యర్థిగా ఉన్నప్పుడు రూ.500 లంచం ఇవ్వాల్సి వచ్చిందని బాధపడిన వ్యక్తి.. ఉద్యోగం సాధించాక రూ.కోటి లంచం తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఛత్తీస్గఢ్ (Chhattisgarh) క్యాడర్కు చెందిన ట్రైనీ ఐపీఎస్ అధికారి రాహుల్ బన్సాల్ (Rahul Bansal)పై ఈ ఆరోపణలు వచ్చాయి. బాధితులు ఇందుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం దిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానికి చేరింది. ఐపీఎస్గా ఎంపికైన తర్వాత రాహుల్ బన్సాల్ ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లాలో సీఎస్పీగా విధుల్లో చేరారు. ఆ సమయంలో ఓ సైబర్ నేరానికి సంబంధించిన సెటిల్మెంట్లో భాగంగా ఆయన రూ.కోటి లంచం తీసుకున్నట్లు బాధితులు పేర్కొన్నారు. రెండు దఫాలు ఈ మొత్తాన్ని ఆయనకు బదిలీ చేసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వాట్సప్ రికార్డులు, ఇతర డిజిటల్ ఆధారాలను వారు సమర్పించారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం.. ఘటనపై నివేదిక ఇవ్వాలని ఛత్తీస్గఢ్ పోలీసులను ఆదేశించింది. కాగా.. సివిల్ సర్వీసెస్లో చేరకముందు రాహుల్ ఇచ్చిన మాక్ ఇంటర్వ్యూ వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘‘నా సోదరుడు అమెరికా వెళ్లేందుకు జనన ధ్రువీకరణ పత్రం అత్యవసరంగా అవసరమైంది. దాన్ని త్వరగా ఇచ్చేందుకు పంచాయతీ అధికారి రూ.500 లంచం అడిగారు. ఆ మొత్తం చెల్లించడం నాకు చాలా బాధగా అనిపించింది’’ అని బన్సాల్ చెప్పినట్లు ఆ వీడియోలో ఉంది. అదే ఇంటర్వ్యూలో అవినీతి, అసమర్థతపై బన్సాల్ మాట్లాడారు. కొందరు అధికారులు చేసే తప్పులకు అందరినీ బాధ్యులను చేయడం సరికాదన్నారు. ఇప్పుడు ఆయనపై రూ.కోటి లంచం ఆరోపణలు రావడంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, రాహుల్పై వచ్చిన ఆరోపణలపై ఛత్తీస్గఢ్ పోలీసుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు