
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

బెంగళూరులోని పరప్పన అగ్రహారం సెంట్రల్ జైలులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈ సందర్బంగా జేడీ ఎస్ మాజీ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మరోసారి అడ్డంగా దొరికిపోయారు. బెంగళూరు, ఆగస్టు 12: అత్యాచారం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెల్ ఫోన్తోపాటు పెన్ డ్రైవ్ వాడుతున్నట్లు సెంట్రల్ క్రైమ్ బృందం గుర్తించింది. బెంగళూరులోని పరప్పరన అగ్రహారం సెంట్రల్ జైలులో ఈ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రజ్వల్ రేవణ్ణ సెల్ ఫోన్తోపాటు పెన్ డ్రైవ్ వినియోగిస్తున్నట్లు కనుగొంది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది. అతడికి ఇవి ఎలా అందాయనే అంశంపై విచారణకు ఆదేశించింది. మరో వైపు జైలు అధికారులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఈరన్న రంగాపూర్పై సస్పెన్షన్ వేటు వేసింది. సదరు జైలులో లోపాలపై వివరణ ఇవ్వాలంటూ జైలు సూపరింటెండెంట్ అనుష్కు కుమార్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది