
బంగాళాఖాతంలో ఒక్కసారిగా మారిన సీన్.. ఏపీ, తెలంగాణకు తుపాను ముప్పు.. భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి, ఆపై వాయుగుండంగా పరిణామం చెందింది. ఇది రాత్రి సమయంలో బెంగాల్ వద్ద తీరాన్ని దాటింది. తీరం దాటిన ఈ వాయుగుండం ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం సుడి ప్రభావం కొద్దిగా ఏపీ, తెలంగాణ సరిహద్దుల వరకు విస్తరించి ఉంది. అయితే తెలుగు రాష్ట్రాలపై ఈ వాయుగుండం ప్రభావం నేరుగా ఉండదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ, దీని వల్ల ఆగస్టు 13న ఇరు రాష్ట్రాల్లోనూ సుడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే, వర్షాలు కురుస్తాయని తెలిపారు. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన సమాచారం ప్రకారం, ఆగస్టు 13 నుండి 18 వరకు తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే, కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ: ఆగస్టు 13, 14 తేదీల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. అలాగే ఆగస్టు 15, 16 తేదీల్లో గంటకు 30 నుండి 40 కిమీ వేగంతో గాలులు వీస్తాయి. తెలంగాణ: ఆగస్టు 13 నుండి 16 మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆగస్టు 12 నుండి 16 వరకు రెండు రాష్ట్రాల్లో ఉపరితల గాలులు చాలా బలంగా వీచే అవకాశం ఉందని ఇదివరకు హెచ్చరించింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు కొనసాగుతుండటంతో చాలా జిల్లాల్లో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంది. హైదరాబాద్ లో కనిష్ఠ