
ACB Raids | మెడికల్ రీయింబర్స్మెంట్ చెక్ మంజూరు కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఉద్యోగులు
ACB Raids | మెడికల్ రీయింబర్స్మెంట్ చెక్ మంజూరు కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఉద్యోగులు
© 2026 nimisham.in

ACB Raids | మెడికల్ రీయింబర్స్మెంట్ చెక్ మంజూరు కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఉద్యోగులు

టీటీడీలో అవినీతి ఆరోపణలు కలకలం రేపాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈవో) ఎం. లోకనాథం నివాసం, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. తిరుపతి, తిరుమలతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఏడు బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ఈరోజు ఉదయం 6 గంటలకే అధికారులు తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్లో ఉన్న లోకనాథం నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉండగా తనిఖీలు ప్రారంభించారు. అదే సమయంలో తిరుమలలోని ఆయన కార్యాలయంలో మరో బృందం సోదాలు చేపట్టింది. ఈ దాడులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా జరుగుతున్నాయని ఏసీబీ వర్గాలు తెలిపాయి.ఈ సోదాలను అధికారులు బహుళ ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. తిరుపతిలో లోకనాథం ఇద్దరు బావమరుదుల ఇళ్లలో, యెర్పేడు మండలం చెల్లూరులో ఉన్న ఆయన సోదరి నివాసంలోనూ తనిఖీలు చేపట్టారు. తిరుమలలో లోకనాథంకు సంబంధం ఉందని భావిస్తున్న ఒక గెస్ట్ హౌస్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. విచారణలో భాగంగా తిరుపతి ఎస్టీవీ నగర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలో ఉన్న లోకనాథం బ్యాంక్ లాకర్లను కూడా అధికారులు తెరిచి పరిశీలిస్తున్నారు. లోకనాథం ప్రస్తుతం శ్రీవారి ఆలయం టెంపుల్ డిప్యూటీ ఈవోగా కీలక బాధ్యతల్లో ఉండగా, గతంలో టీటీడీలో వివిధ హోదాల్లో పనిచేశారు.గత దశాబ్ద కాలంలో ఒక టీటీడీ ఉన్నతాధికారిపై ఏసీబీ సోదాలు నిర్వహించడం ఇది రెండోసారి

తిరుమల డిప్యూటీ ఈవోపై సోదాలు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఐదు చోట్ల ఏసీబీ తనిఖీలు ACB Raids: తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదుకావడంతో, అవినీతి నిరోధక శాఖ (ACB Raids) అధికారులు ఆయన ఇల్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచే ఏకకాలంలో ఐదు చోట్ల విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒక టీటీడీ ఉన్నతాధికారి నివాసంలో ఏసీబీ దాడులు జరగడం ప్రస్తుతం ఐటీ కారిడార్, తిరుపతి వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. Gold Silver Price Today: బంగారం కొనేవారికి భారీ ఊరట.. తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే? ఐదు చోట్ల ఏకకాలంలో తనిఖీలు: తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్లో ఉన్న లోకనాథం నివాసంతో పాటు ఆయన ఇద్దరు బావమరుదుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. అలాగే ఏర్పేడు మండలం చెల్లూరులోని ఆయన సోదరుడి నివాసంలో, తిరుమలలోని ఆయన డిప్యూటీ ఈవో కార్యాలయంలో ఏసీబీ బృందాలు రికార్డులను జల్లెడ పడుతున్నాయి. ఆయన ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లు సమాచారం. శ్రీవారి విధుల్లో ఉండగానే సోదాలు: ఏసీబీ దాడులు జరిగే సమయంలో లోకనాథం తిరుమల శ్రీవారి ఆలయంలో విధుల్లో ఉండటం విశేషం. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు తిరుమల క్వార్టర్స్ ముందు వేచి ఉన్నారు. గతంలో 2011లో అప్పటి డిప్యూటీ ఈవో భూపతి రెడ్డిపై ఏసీబీ రైడ్స్ జరగ్గా, మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత లోకనాథంపైనే ఈ స్థాయిలో చర్యలు చేపట్టారు. సోదాలు పూర్తయిన తర్వాత స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, ఆస్తుల లెక్కింపుపై అధికారిక ప్రకటన వెలువడనుంది

తిరుమల తిరుపతి దేవస్థానం వర్గాల్లో ఉదయాన్నే ఒక వార్త పిడుగులా పడింది. టీటీడీ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే బలమైన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేయడమే కాకుండా, తిరుపతితో పాటు వివిధ ప్రాంతాల్లోని ఆయన నివాసాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. శనివారం తెల్లవారుజామున 6 గంటలకే రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు ఒకేసారి పలు చోట్ల తనిఖీలు చేపట్టడంతో తిరుమలలో తీవ్ర సంచలనం వ్యక్తమవుతోంది.ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో మొత్తం 7 ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు ఈ దాడులను అత్యంత రహస్యంగా నిర్వహించారు. తిరుపతిలోని పెదకాపు లేఅవుట్లో ఉన్న లోకనాథం ప్రధాన నివాసంలో సోదాలు చేస్తున్న సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. దీంతో పాటు తిరుపతి ఎస్టీవీ నగర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఉన్న ఆయన లాకర్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం ఆయన ఇల్లే కాకుండా.. తిరుమలలోని ఆయన డిప్యూటీ ఈవో ఆఫీస్, వసతిగృహంతో పాటు బంధువుల ఇళ్లను కూడా ఏసీబీ వదల్లేదు. అవినీతి ముత్యం @రూ.200 కోట్లు.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 14రోజుల రిమాండ్ బంధువుల ఇళ్లపైనా విరుచుకుపడ్డ బృందాలులోకనాథంకు చెందిన బినామీ ఆస్తులు, కీలక పత్రాల అన్వేషణలో భాగంగా ఆయన నెట్వర్క్పై ఏసీబీ నిఘా పెట్టింది. తిరుపతిలోని ఆయన ఇద్దరు బావమరుదుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా.. ఏర్పేడు మండలం చెల్లూరులోని ఆయన సోదరుడి ఇంట్లో కూడా ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. కీలక ఆధారాలు, నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి పాస్తుల డాక్యుమెంట్లను సీజ్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.డీఎస్పీ భీంరెడ్డి ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే షాక్.. తొలిరోజే రూ.200 కోట్లకు పైనే 15 ఏళ్ల తర్వాత టీటీడీలో మళ్లీ ఏసీబీ ప్రకంపనలు!తిరుమల శ్రీవారి దేవస్థానంలో దాదాపు 15 సంవత్సరాల సుదీర్ఘ

ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy)కి విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. అనారోగ్య సమస్యల నిమిత్తం వైద్య చికిత్స కోసం అమెరికా (America) వెళ్లేందుకు కోర్టు ఆయనకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఆయన అమెరికాలో పర్యటించుకోవచ్చని న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో కూడా వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లోచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తాజాగా మరోసారి అదే కారణంతో విదేశీ ప్రయాణానికి అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court)లో ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరువైపుల వాదనలను పరిశీలించి, ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటూ పర్యటనకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికా పర్యటనకు కోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ, కొన్ని కఠినమైన షరతులను చెవిరెడ్డికి విధించింది. విదేశాల్లో బస చేసే సమయంలో అక్కడి పూర్తి చిరునామా, ఫోన్ నంబరు మరియు ఈ-మెయిల్ వివరాలను ముందస్తుగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ప్రయాణానికి ముందే తగిన సెక్యూరిటీ బాండ్లు లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు కోర్టులో జమ చేయాలని స్పష్టం చేసింది. పర్యటన ముగిసిన వెంటనే తిరిగి వచ్చి తన పాస్పోర్టు (Passport)ను యథావిధిగా న్యాయస్థానానికి అప్పగించాలని నిబంధన విధించింది

వైఎస్సార్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, మాజీ గవర్నమెంట్ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏపీలోని విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న ఆయన వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లేందుకు న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విదేశీ ప్రయాణానికి అనుమతి కోరుతూ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కూడా ఆయన వైద్యం కోసం అమెరికా వెళ్లిన విషయాన్ని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి, ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని అమెరికా వెళ్లేందుకు పచ్చజెండా ఊపారు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఆయన అమెరికాలో ఉండేందుకు కోర్టు కాలపరిమితిని నిర్దేశించింది. దీంతో భాస్కర్ రెడ్డి తన వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఇదిలా ఉండగా, విదేశీ పర్యటనకు సంబంధించి కోర్టు కొన్ని కఠినమైన షరతులను విదేశీ పర్యటన కోసం విధించింది. అమెరికా పర్యటన సమయంలో తాను ఉండే చిరునామా, ఫోన్ నంబరు, ఈమెయిల్ వివరాలను కోర్టుకు తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశించింది. ప్రయాణానికి ముందే నిర్ణీత ఫిక్స్డ్ డిపాజిట్లు, సెక్యూరిటీలను కోర్టులో డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. ఫలితంగా, అమెరికా నుంచి తిరిగొచ్చిన వెంటనే పాస్పోర్టును తిరిగి కోర్టుకు అప్పగించాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఇదే కేసులో ఉన్న మరో నిందితుడు కారుమూరి సునీల్ రిమాండ్ను కోర్టు పొడిగించింది. గతంలో కూడా అనగా జూలై నెలలో ఏసీబీ కోర్టు జడ్జి ఎల్. తేజోవతి చెవిరెడ్డికి విదేశీ ప్రయాణ అనుమతి ఇచ్చారు. జూలై 27 నుంచి ఆగస్టు 4 మధ్య అమెరికా వెళ్లేందుకు అప్పట్లో అవకాశం కల్పించారు. ఆగస్టు 7వ తేదీ లోపు కోర్టులో

భారత్-అఫ్గానిస్థాన్ మధ్య వచ్చే నెల జరగాల్సిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్ల తేదీలను కొన్ని రోజులు ముందుకు జరపాలని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) ప్రతిపాదించినట్లు సమాచారం. ఇంటర్నెట్ డెస్క్: భారత్-అఫ్గానిస్థాన్ మధ్య వచ్చే నెల జరగాల్సిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్ల తేదీలను కొన్ని రోజులు ముందుకు జరపాలని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) ప్రతిపాదించినట్లు సమాచారం. దీనిపై ఏసీబీ, బీసీసీఐ మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఇప్పటివరకు అధికారిక నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఈ మూడు టీ20 మ్యాచ్లు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే వీటిని సెప్టెంబర్ 11, 13, 14 తేదీలకు మార్చాలని ఏసీబీ నుంచి బీసీసీఐకి ప్రతిపాదన వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో సెప్టెంబర్ 14న గణేశ్ చతుర్థి రోజున ఓ మ్యాచ్ నిర్వహించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. పండగ రోజున మ్యాచ్.. వ్యూయర్షిప్పై కన్ను గణేశ్ చతుర్థి సందర్భంగా మ్యాచ్ నిర్వహిస్తే టీవీ వ్యూయర్షిప్తో పాటు స్టేడియంలో ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే షెడ్యూల్ను ముందుకు జరపాలని కోరినట్లు తెలుస్తోంది. మూడు మ్యాచ్లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అఫ్గానిస్థాన్ తొలిసారి భారత్తో ద్వైపాక్షిక సిరీస్కు ఆతిథ్యం ఇస్తుండటం ఈ సిరీస్ ప్రత్యేకత. అయితే మ్యాచ్లన్నీ భారత్లోనే జరగనున్నాయి. భారత్కు శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆగస్టు 27న ముగియనుంది. సెప్టెంబర్ 24న ఆసియా క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యలో భారత జట్టుకు ఖాళీ సమయం ఉంది. బంగ్లాదేశ్తో సిరీస్ కూడా జరిగే అవకాశం లేనందున.. అఫ్గానిస్థాన్ సిరీస్ను ముందుకు జరపడం సాధ్యమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే షెడ్యూల్ మార్పుపై బీసీసీఐ, ఏసీబీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కుల్దీప్ యాదవ్పై వారికి

కేవలం రూ.20 లంచం తీసుకున్నారనే ఆరోపణతో గత మూడు దశాబ్దాలుగా సాగుతున్న సుదీర్ఘ న్యాయపోరాటానికి తెరపడింది. గుజరాత్ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు ఉద్యోగులపై ఉన్న నేరారోపణలను కొట్టివేస్తూ.. వారిని పూర్తి నిర్దోషులుగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేనప్పుడు కేవలం రికవరీని ప్రాతిపదికగా తీసుకుని శిక్ష విధించడం చట్టరీత్యా చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.పంచదారపై కేంద్రం కొత్త రూల్స్, ఇకపై 15 రోజులే ఛాన్స్.. 1996 నాటి ఘటనఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. ఫిబ్రవరి 1996లో గుజరాత్లోని ఆనంద్ జిల్లా, బెచారి గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఓ విద్యార్థి ఆదాయ ధ్రువీకరణ పత్రం(ఇన్కమ్ సర్టిఫికేట్) కోసం వెళ్లాడు. సర్టిఫికేట్ ఇచ్చేందుకు క్లర్క్ రూ.120 లంచం డిమాండ్ చేశాడని(అందులో క్లర్క్కు రూ.100, అటెండర్కు రూ.20) ఆరోపిస్తూ సదరు విద్యార్థి అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాడు. అధికారులు రంగంలోకి దిగి గుర్తులు ఉన్న రూ.120 నోట్లను ఇచ్చి ఏసీబీ ట్రాఫ్ నిర్వహించారు.విచారణలో తేలిన విషయాలు ఏసీబీ సోదాల సమయంలో విద్యార్థి వద్ద ఉన్న రూ.20 నోటును అటెండర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే క్లర్క్ వద్ద నుంచి ఎలాంటి సొమ్ము లభించలేదు. విచారణ క్రమంలో సదరు విద్యార్థి ఇచ్చిన వాంగ్మూలంలో తీవ్ర వైరుధ్యాలు వెలుగు చూశాయి. క్లర్క్ పక్కనే ఉన్నప్పటికీ మొత్తం రూ.120 ఇవ్వకుండా కేవలం రూ.20 మాత్రమే ఎందుకు ఇచ్చాడనే దానికి స్పష్టత లేదు. అంతేకాకుండా అటెండర్ తనను నేరుగా ఎలాంటి లంచం డిమాండ్ చేయలేదని విద్యార్థి క్రాస్ ఎగ్జామినేషన్లో అంగీకరించాడు. మరుసటి రోజు ఈద్ పండుగ ఉన్నందున విద్యార్థి సంతోషంతో ఇచ్చి ఉండవచ్చన్న అటెండర్ వివరణను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.కుప్పకూలిన హెలికాప్టర్: ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం! దిగువ కోర్టుల తీర్పులు రద్దు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్.చందూర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 20 ప్రకారం

మద్యం రవాణా టెండర్లలో జరిగిన అవకతవకల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) చుక్కెదురైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కాసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డిలపై సిట్ అధికారులు దాఖలు చేసిన ప్రొడక్షన్ కమ్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్ను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది.ఈ కేసులో కాసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి, కారుమూరి సునీల్ను సిట్ నిందితులుగా చేర్చింది. అయితే, వీరిని అంతకుముందే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. గతంలో సిట్ అధికారులు వీరిని పీటీ వారెంట్పై విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అయితే, తమ రిమాండ్ చెల్లదంటూ రాజశేఖర్ రెడ్డి, వాసుదేవ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది.ఈ నేపథ్యంలో, రెండు రోజుల క్రితం సిట్ అధికారులు మళ్లీ కొత్తగా పీటీ వారెంట్ను దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన ఏసీబీ కోర్టు, ఆ వారెంట్ను తిరస్కరిస్తూ వెనక్కి పంపింది.ఇదే కేసుకు సంబంధించి మరో ముగ్గురు నిందితులు కె. ధనుంజయ రెడ్డి, పి. కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప బుధవారం విజయవాడ ఏసీబీ కోర్టు ఎదుట హాజరయ్యారు. సమన్లు అందిన తర్వాతే విచారణకు హాజరు కావాలని జ్యుడీషియల్ అధికారి ఎల్. తేజోవతి వారికి సూచించారు
ఏసీబీకి మరో అవినీతి చేప చిక్కింది. భవన నిర్మాణ అనుమతి ఫైల్ను ప్రాసెస్ చేసి, బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్, వర్క్ కమెన్స్మెంట్ లెటర్ జారీ చేసేందుకు రూ.20 వేల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చార్మినార్ జోన్కు చెందిన ఈ మేరకు సంతోష్నగర్ సర్కిల్-25 అధికారిణి సీహెచ్ ప్రభావతిని ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భవన నిర్మాణ అనుమతి కోసం ఓ వ్యక్తి ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు. ఆ ఫైల్ను ప్రాసెస్ చేసి, సంబంధిత భవన నిర్మాణ అనుమతి ఉత్తర్వుతో పాటు పని ప్రారంభ లెటర్ అందించాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్ విభాగానికి ఉంది. అయితే ఈ పని పూర్తి చేసేందుకు ప్రభావతి సదరు వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది.లంచం డిమాండ్ ఫిర్యాదు అందటంతో ఏసీబీ అధికారులు పక్కా స్కెచ్వేశారు. బిల్డింగ్ పర్మిషన్ కోసం వచ్చిన వ్యక్తి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్గా ప్రభావతిని పట్టుకున్నారు. ఆమె వద్ద ఉన్న లంచం మెత్తాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగినిగా తన అధికారిక విధులను నిష్పక్షపాతంగా నిర్వర్త్తించాల్సిన ఆమె ఇలా అడ్డదారులు తొక్కుతూ డబ్బులు డిమాండ్ చేసినట్లు ఏసీబీ పేర్కొంది. ఈ మేరకు ఆమెను నాంపల్లిలోని ఏసీబీ కేసుల అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.ఇదిలా ఉండగా.. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. అలాగే వాట్సాప్ నెంబర్ 9440446106కు కాల్ చేయాలని సూచించారు. ఫేస్బుక్ పేజీలో Telangana ACB , ట్విట్టర్ ఎక్స్లో @Telangana ACB ద్వారా

హైదరాబాద్లోని పూల్బాగ్లో జీహెచ్ఎంసీ కార్యాలయంలో అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ కార్యాలయంలో ఏసీబీ ఆధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, ఆగస్టు18: నగరంలోని ఫూల్బాగ్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ కార్యాలయంలో ఏసీబీ ఆధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ప్రభావతి.. రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడింది. దీంతో ఆమెను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రభావతిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే.. తమకు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు ఏసీబీ అధికారులు సూచించారు. మరో వైపు అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ సిబ్బందిలో ఎటువంటి మార్పు రావడం లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. తరచూ ఎప్పుడో అక్కడ.. ఎప్పుడో అప్పుడు లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. తాజాగా ఫూల్బాగ్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో అటువంటి ఘటనే చోటు చేసుకుంది. బీజేపీకి అనుబంధ సంస్థగా మారిన ఎన్నికల సంఘం: టీపీసీసీ చీఫ్ వన్ వే కి సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదములు: సీపీ సజ్జనార్

అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) టీమిండియాతో టీ20 సిరీస్ను ఖరారు చేసింది. ఇందులో భాగంగా భారత జట్టుతో మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. అయితే, అఫ్గాన్ భారత్లోనే టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం. కాగా అఫ్గానిస్తాన్లో మ్యాచ్లు నిర్వహించే పరిస్థితి లేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ భారత్ లేదంటే యూఏఈలలో పలు సిరీస్లకు ఆతిథ్యమిస్తోంది. ఈ క్రమంలో తాజాగా టీమిండియాతో భారత్లో తలపడేందుకు సిద్ధమైంది. షెడ్యూల్ ఖరారు ఇందులో భాగంగా ఢిల్లీ వేదికగా టీమిండియా- అఫ్గానిస్తాన్ మధ్య సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మూడు మ్యాచ్లు నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గతంలో ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లకు అఫ్గానిస్తాన్ భారత్లో ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. 2017లో ఐర్లాండ్తో వైట్బాల్ సిరీస్ ఆడిన అఫ్గాన్ జట్టు.. 2017లో విండీస్తో ఆల్ ఫార్మాట్ సిరీస్ ఆడింది. టెస్టు, వన్డేలలో ఓటమి ఇక ఇటీవల అఫ్గానిస్తాన్ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో జూన్లో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడింది. న్యూ చండీగఢ్లోని ముల్లన్పూర్ స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత్.. అఫ్గాన్ను ఏకంగా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇక మూడు వన్డేల సిరీస్లోనూ ఆతిథ్య భారత జట్టు.. అఫ్గాన్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. తాజాగా మరోసారి అఫ్గాన్ టీమిండియాతో తలపడేందుకు సిద్ధమైంది. ఈసారి భారత్లో ఆతిథ్య దేశంగా అఫ్గాన్.. శ్రేయస్ అయ్యర్ సేనతో టీ20 సిరీస్ ఆడుతుంది. పరాభవాల తర్వాత గెలుపు బాట పట్టిన భారత టీ20 జట్టు ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లో భారత్ను చాంపియన్గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించిన బీసీసీఐ.. శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించింది. అయితే, యూకే టూర్లో భాగంగా అతడికి ఆదిలోనే చేదు అనుభవం