
భూములు అట్రాసిటీ కేసులపై కలెక్టర్ సత్య శారద సమీక్ష
Warangal: 22A భూములు అట్రాసిటీ కేసులపై కలెక్టర్ సత్య శారద సమీక్ష! ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Warangal: 22A భూములు అట్రాసిటీ కేసులపై కలెక్టర్ సత్య శారద సమీక్ష! ఈ వార్తకు సంబంధించిన

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. 22A Land Complaints Call Center: 22ఏ నిషేధిత భూముల అంశంలో ప్రజలకు పూర్తి భరోసా కల్పించే దిశగా రెవెన్యూ శాఖ చర్యలను మరింత వేగవంతం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాల్ సెంటర్కు వచ్చే ప్రతి దరఖాస్తును కేవలం ఒక ఫిర్యాదుగా కాకుండా.. ఒక బాధ్యతగా తీసుకోవాలని, సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలు ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. నిజమైన హక్కుదారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుదారుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 22A సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కాల్ సెంటర్ పనితీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. నాలుగు జిల్లాల పరిధిలో ఇప్పటివరకు అందిన సుమారు 400 కాల్స్ వివరాలు, వస్తున్న ప్రధాన సమస్యలు, ప్రజలకు అందిస్తున్న సమాచారాన్ని అధికారులు మంత్రికి వివరించారు. కాల్ సెంటర్కు వచ్చే దరఖాస్తులను కేవలం నమోదు చేయడంతో సరిపెట్టకుండా, పూర్తి వివరాలను తక్షణమే సంబంధిత తహసీల్దార్, ఆర్డీవో, సబ్రిజిస్ట్రార్లకు చేరవేయాలని మంత్రి చెప్పారు. సమస్య కొలిక్కి వచ్చేంతవరకు పురోగతిని నిరంతరం ట్రాక్ చేయాలన్నారు. "ఆన్లైన్ ద్వారా అందిన ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించాలి. సదరు భూమి 22A పరిధిలోకి ఎలా వచ్చింది..? దరఖాస్తుదారుడి క్లెయిమ్ సరైనదేనా అనే అంశాలను క్షేత్రస్థాయిలో విచారించి, స్పష్టమైన ఆధారాలతో నిర్ణయం తీసుకోవాలి. ఒక్కసారి ఫిర్యాదు చేసిన బాధితులు పరిష్కారం కోసం మళ్లీ మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి