మాస్ మహారాజా రవితేజ , శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘ ఇరుముడి ’. ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. పోస్టర్స్, టీజర్, ట్రైలర్లతో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం రవితేజ్ కెరీర్లో ల్యాండ్ మార్క్ అవుతుందని చిత్ర యూనిట్తో పాటు ఆయన అభిమానులు సైతం ధీమాగా ఉన్నారు. ఈ మూవీకి సంబంధించి కొద్దిరోజులుగా ఓ ఆసక్తికరమైన అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలోని అయ్యప్ప పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్లో మెరవనున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ వార్తలపై రామ్ చరణ్ టీమ్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.* ‘ఫౌజీ’లో ప్రభాస్ రౌద్రరూపం… ఒళ్లంతా చందనంతో అప్పన్నని తలపించేలా భారీ యాక్షన్ ఫైట్అయ్యప్ప పాటతో ఊహాగానాలుప్రమోషన్స్లో భాగంగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్బంగా ‘మల్లెపూల పల్లకి’ అనే అయ్యప్ప భక్తి గీతాన్ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ.. థియేటర్లలో ఈ పాట వచ్చే సమయంలో ప్రేక్షకులకు వెండితెరపై ఒక ఊహించని సర్ప్రైజ్ ఉండబోతోందని వ్యాఖ్యానించారు. దీంతో సహజంగానే ఏటా అయ్యప్ప మాలధారణను నిష్టగా ఆచరించే రామ్ చరణ్, ఈ పాటలో అయ్యప్ప భక్తుడిగా ప్రత్యేక క్యామియో రోల్లో దర్శనమివ్వనున్నారనే వార్త నెట్టింట వైరల్గా మారింది. రవితేజ, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఆయా హీరోల అభిమానులు భావించారు.రూమర్స్కి చరణ్ టీమ్ చెక్సోషల్ మీడియాలో ఈ ప్రచారం ఊపందుకోవడంతో రామ్ చరణ్ పీఆర్ టీమ్ రంగంలోకి దిగింది. ‘ఇరుముడి’ చిత్రంలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ గానీ, స్పెషల్ అప్పియరెన్స్ గానీ చేయడం లేదని స్పష్టం చేసింది. ‘మల్లెపూల పల్లకి’ పాటలో చరణ్ నటిస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, అవి పూర్తిగా నిరాధారమైన ప్రచారం మాత్రమేనని తేల్చిచెప్పింది. ఇలాంటి అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని, సోషల్ మీడియాలోనూ షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. దీంతో ఈ క్రేజీ క్యామియో వార్తలకు చెక్ పడింది.* ఇరగదీశావ్ కదయ్యా... 'అగధ'లో విభిన్న కోణాల్లో మెస్మరైజ్ చేసిన శ్రవణ్ రెడ్డి ప్రమోషన్ల జోరురిలీజ్కి టైమ్ దగ్గర పడుతుండటంతో ‘ఇరుముడి’ టీమ్ ప్రమోషన్స్ వేగం పెంచింది. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఎమోషన్స్, అయ్యప్ప దీక్ష నేపథ్యంలోని ఆధ్యాత్మిక కలబోతగా దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని మలిచారు. ఈ మూవీలో రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా, బేబీ నక్షత్ర, సీనియర్ నటుడు సాయికుమార్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.





