
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
Varanasi Story Line:ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా..వారణాసి సినిమా గురించి వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. 2027లో ప్రపంచం ఓ భారీ ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. ‘శాంభవి’ అనే భారీ ఉల్క భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా పవిత్ర నగరం వారణాసికి ఈ ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ ప్రమాదాన్ని ఆపడానికి హీరో రుద్ర రంగంలోకి దిగుతాడట.
మహేశ్ బాబు ఈ సినిమాలో రుద్ర అనే పురావస్తు పరిశోధకుడు, సాహసికుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రయాణిస్తూ ఓ పురాతన రహస్య వస్తువు కోసం అతడు అన్వేషణ చేస్తాడని చెబుతున్నారు. ఈ మిషన్లో అతనికి మందాకిని అనే చరిత్ర పరిశోధకురాలు సహాయం చేస్తుందట. ఈ పాత్రను ప్రియాంక చోప్రా జోనాస్ పోషిస్తున్నారు. ఆమె పాత్ర చాలా ధైర్యంగా, యాక్షన్ సన్నివేశాల్లో కూడా కనిపించేలా ఉంటుందని సమాచారం.
అదే సమయంలో రుద్ర, మందాకినిలను ఓ తెలివైన విలన్ వెంటాడుతుంటాడట. కుంభ అనే ఈ పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నాడు. కథలో భాగంగా ఆఫ్రికా అడవులు, అంటార్కిటికా మంచు ప్రాంతాలు, యూరప్ వంటి అనేక ప్రదేశాలు కనిపిస్తాయని ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు, ఈ కథలో టైమ్ ట్రావెల్, పురాణాలు, ఆధునిక సైన్స్ వంటి అంశాలు కూడా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. గత కాలానికి, భవిష్యత్తుకు మధ్య జరిగే సంఘటనలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది.
ఇటీవల మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘వారణాసి’ నుంచి రుద్ర పాత్రకు సంబంధించిన రెండు పోస్టర్లు విడుదలయ్యాయి. పొడవాటి జుట్టు, గడ్డంతో మహేశ్ కనిపించిన ఈ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పోస్టర్లు విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.
అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న కథ నిజమైనదా, లేక చిత్రంపై ఆసక్తిని పెంచేందుకు వచ్చిన ప్రచారమా అనేది స్పష్టంగా తెలియదు. రాజమౌళి సినిమాల్లో కథను చివరి వరకు సస్పెన్స్గా ఉంచడం సాధారణమే. కాబట్టి ‘వారణాసి’ అసలు కథ ఏమిటో తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





